భారత్-ఇంగ్లండ్... తుది పోరు..
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నెలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. 4-0తో సిరీస్ను గెలుచుకోవాలని భారత్ చూస్తుండగా.. ఈ ఒక్క మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు.
ఇండియా : మురళీ విజయ్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, కెకె నాయర్, పార్ధీవ్ పటేల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్
ఇంగ్లండ్: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, రూట్, అలీ, బారిస్టో, స్టోక్స్, బట్లర్, డాసన్, రషీద్, బ్రాడ్, బాల్