స్పెషల్ ప్యాకేజీపై పవన్ సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తున్న సినీనటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్, తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా అంశంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేవలం కంటితుడుపు చర్య. బీజేపీ చెబుతున్న స్పెషల్ ప్యాకేజ్లో "స్పెషల్" అనే పదం తప్ప ఎటువంటి ప్రత్యేకత లేదు. ఆంధ్రా ప్రజలను వెన్నెముక లేని వారిగా, లెక్కలేని మనుషులుగా బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్రులను అవమానపరుస్తూ, బాధకు గురిచేస్తూ, కనీసం రాజధాని లేకుండా కట్టుబట్టలతో వెళ్లగొట్టారు. జైఆంధ్ర ఉద్యమంలో బలిదానం చేసిన 400 మందికి పైగా విద్యార్థులపై మేము ప్రమాణం చేసి చెబుతున్నాం..ఏపీకి పత్యేకహోదా ఇస్తామని హామి ఇచ్చిన బీజేపీ, అందుకు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టం అని జనసేనాని హెచ్చరించారు.