కిర్గిస్తాన్ దేశాధ్యక్షుడితో మోడీ భేటీ.. పలు ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోడీ, కిర్గిస్తాన్ దేశాధ్యక్షుడు అల్మజ్బెక్ అతంబయే ఈ రోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. కిర్గిస్తాన్ అధ్యక్షుడి రాక సంతోషం కలిగించిందని.. ఉగ్రవాదం అణిచివేత, తీవ్రవాదం లాంటి సమస్యలపై చర్చించినట్లు మోదీ చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, సాంప్రదాయాల్లో రెండు దేశాలు ఒకటే అని.. కిర్గిస్తాన్లో ప్రజాస్వామ్యానికి గట్టి పునాది వేసిన అల్మజ్బెక్కే క్రెడిట్ దక్కుతుందని అన్నారు. అంతేకాదు రెండు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. రక్షణ రంగం, ఆర్థిక సంబంధాల్లో సహకారం అందించుకోనున్నట్లు తెలిపారు. హెల్త్కేర్, టూరిజం, ఐటీ, వ్యవసాయం, మైనింగ్, ఇంధనం లాంటి అంశాల్లో కిర్గిస్తాన్కు సహకరించనున్నట్లు మోదీ చెప్పారు.