భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ఈరోజు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 26వేల పాయింట్ల కీలక స్థాయిని కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 8వేల కిందకు జారిపోయింది. సెన్సెక్స్ అత్యధికంగా 262.78 పాయింట్లు నష్టపోయి 25,979.60కు చేరింది. నిఫ్టీ అయితే 82.20 పాయింట్ల నష్టంతో 7,979.10 వద్ద స్థిరపడింది. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్ తదితర షేర్లు లాభపడగా, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ మొదలైన షేర్లు నష్టాలు చవి చూశాయి.