కాశ్మీర్ వేర్పాటువాదం : మంచు మాటున వంచన పర్వం!
కొన్నాళ్ల కింద కాశ్మీర్ అట్టుడికిపోయింది. ఆర్మీపైన అక్కడి అల్లరి మూకలు రాళ్ల వర్షం కురిపించాయి. బుర్హాన్ అనే ఉగ్రవాదిని ఎన్ కౌంటర్లో చంపినందుకు నిరసనగా రోడ్లపైకి వచ్చి వేర్పాటు వాదులు అరాచకం సృష్టించారు. ఆర్మీ కూడా ఆత్మరక్షణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించింది. ఈ మొత్తం గొడవలో చాలా మందే మరణించారు. కాని, నిజంగా కాశ్మీర్ వేర్పాటు వాదం వెనుక నమ్మలేని నిజాలు మీకు తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు!
కాశ్మీర్ విషయంలో మన శత్రువులు కేవలం పాకిస్థాన్ లో లేరు. అంతర్గతంగానే ఎక్కువ వున్నారు. అభ్యుదయవాదులుగా, మేధావులుగా, జర్నలిస్టులుగా చలామణి అవుతూ 'కాశ్మీరియత్' అనే కొత్త పదాలు ప్రయోగిస్తూ యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నారు. కాశ్మీర్ లో అసలు ఇండియాతో కలిసి వుండేందుకు ఇష్టపడే జనమే లేరన్నట్టు కొన్ని లెఫ్ట్ భావజాలం ముదిరిన న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాని, సత్యం మరోలా వుంది!
కాశ్మీర్ కి ఇండియా జెండా కాకుండా తనదైన ప్రత్యేక జెండా వుంది. ఈ విషయం మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కాని, అక్కడి వేర్పాటు వాదులు తమ నిరసనల్లో భాగంగా కాశ్మీర్ జెండా ఎగురవేయరు. పాకిస్తాన్ జెండా రెపరెపలాడిస్తుంటారు. ఇది దేనికి సంకేతం? కాశ్మీర్ లో వేర్పాటువాదం వినిపిస్తోన్న అరాచక వర్గం నిజంగా స్వేఛ్ఛ కోరుకోవటం లేదు. పాకిస్తాన్ కాసులకు ఆశపడి అమ్ముడుపోతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ఏదో ఒక రోజు మొత్తం కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ధారదత్తం చేయాలని కుట్రపన్నుతున్నారు. అందుకే, రకరకాలుగా కాశ్మీరీ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా కూడా ఇలా స్వతంత్ర కాశ్మీర్ కావాలని కోరుకుంటున్న జనం ఎంతో తెలుసా? జస్ట్ పదిహేను శాతం! అదెలాగో చూద్దం రండి...
భారతదేశం ఆధీనంలో వున్న జమ్మూ, కాశ్మీర్ మొత్తం విస్త్రీర్ణం 101380 చ.కి. అందులో 15శాతం మాత్రమే వేర్పాటు వాదం వున్న కాశ్మీర్ ప్రాంతం. మిగతా 85శాతం జమ్మూ, లద్ధాఖ్ ప్రాంతాలు. ఇక్కడ ఇండియాకి వ్యతిరేకమైన సెంటిమెంట్ అస్సలు వుండదు.
భారతదేశంలో ఇప్పటి వరకూ హిందూ ముఖ్యమంత్రే లేని రాష్ట్రం జమ్మూ, కాశ్మీర్. కాని, నిజానికి అంతా అనుకున్నట్టు జె అండ్ కే ముస్లిమ్ మెజార్టీ రాష్ట్రం కాదు. అక్కడి 85శాతం ప్రాంతంలో ముస్లిమ్ లు మైనార్టీలే. జమ్మూ, లద్ధాఖ్ లాంటి చోట్లలో హిందువులు, ఇతర వర్గాలే అత్యధికులు. మొత్తం 1.25కోట్లున్న జనాభాలో 69లక్షలు కాశ్మీర్లో, 53లక్షలు జమ్మూలో, 3లక్షలు లద్ధాఖ్ లో వుంటారు. మరో 7.5లక్షలు మంది జమ్మూ, కాశ్మీర్ పౌరసత్వం లేని సెటిలర్స్.
ఇకపోతే 22జిల్లాల మొత్తం రాష్ట్రంలో కేవలం 5జిల్లాలు మాత్రమే వేర్పాటు వాదుల ప్రభావంలో వున్నాయి. అవ్వి శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుల్గాం, పుల్వామాలు. ఇవి కాక 17జిల్లాలు ఎలాంటి వేర్పాటువాదంతోనూ లేవు. అంతే మెజార్టీ ప్రాంతం, ప్రజలు ఇండియాతోనే వుండాలని కోరుకుంటున్నారన్నమాట! అలాగే, ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ జపం చేసే వేర్పాటు వాదులున్న 5జిల్లాలు పాక్ సరిహద్దుకి దూరంగా వుంటాయి. నిజంగా ఆ దేశంతో సరిహద్దు పంచుకునే కాశ్మీరీ జిల్లాలు ఎంత మాత్రం వేర్పాటువాదానికి సహకరించవు. ఇండియాతోనే వుండాలని కోరుకుంటాయి.
జమ్మూ, కాశ్మీర్ జనాభాలో 85శాతం రకరకాల మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన వారు. వీళ్లెవరూ భారత్ కు వ్యతిరేకం కాదు. ఇందులో ముస్లిమ్ లే అయిన షియాలు కూడా వుంటారు. వీళ్లు ఇస్లాం అనుసరించినా సున్నీ ప్రాబల్యం వున్న పాకిస్తాన్ అంటే అస్సలు ఇష్టపడరు. ఒకింత భయపడతారు కూడా...
కాశ్మీర్ లో షియా ముస్లిమ్ లు కాకుండా రాజ్ పుత్, బ్రాహ్మణ, మహాజన వర్గాలకు చెందిన డోగ్రాలనే సామాజిక వర్గం వుంటుంది. వీళ్లతో పాటూ దారుణంగా హింసకు గురైన కాశ్మీరీ పండిట్లు కూడా ప్రధానంగా వుంటారు. అంతే కాకుండా ఈ హిమాలయ రాష్ట్రంలో సిక్కులు, బౌద్ధులు, గుజ్జర్లు, బకర్ వాల్స్, పహరీస్, బాల్టీస్, క్రిస్టియన్లు, ఇంకా మైక్రో మైనార్టీ వర్గాలు వుంటారు. వీళ్లెవరూ వేర్పాటు వాదానికి అనుకూలం కాదు.
ఇక మన జాతీయ మీడియాలో ప్రధానంగా వినిపంచే కాశ్మీరియత్ ఒట్టి భ్రమ మాత్రమే. జమ్మూ, కాశ్మీర్లో నిజంగా కాశ్మీరీ భాష మాట్లాడేది 33శాతం జనాబానే. మిగతా వారు డోగ్రీ, గుజ్జరీ, పంజాబీ, లద్దాఖీ లాంటి భాషలు మాట్లాడతారు. కాని, 33శాతం కాశ్మీరీ మాట్లాడేవారే వేర్పాటు వాద హురియత్ ని, ఉగ్రవాద సంస్థల్ని, ఒమర్ అబుద్ధల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ ని, మెహబూబా ముఫ్తీ పీడీపీని కంట్రోల్ చేస్తారు. అంతే కాదు, వ్యాపారాలు, వ్యవసాయం, గవర్నమెంట్లో కీలక పదవులు అన్నీ కూడా ఈ కాశ్మీరీ మాట్లాడే వారి చేతుల్లోనే వుంటున్నాయి. అందుకే, వారి మాటే చెల్లుతూ వస్తోంది.
మొత్తం మీద కాశ్మీర్ లోని సున్నీ ముస్లిమ్ లు తప్ప మిగతా ముస్లిమ్ వర్గాలతో సహా హిందు, సిక్కు, బౌద్ధ మరే ఇతర వర్గం కూడా వేర్పాటు కోరుకోవటం లేదు. అలా కోరుకునే సున్నీ వర్గం కేవలం 15శాతానికే పరిమితం. వాళ్లే పాకిస్తాన్ తో అంటకాగి, ఆర్మీ పై రాళ్లు రువ్వుతూ అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. వాళ్లకే మన మీడియా అభ్యుదయవాదం ముసుగులో చేతనైనంత సాయం చేస్తుంటుంది. మొత్తం జమ్మూ, కాశ్మీర్ ఇండియాకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చేసిందని హడావిడి చేస్తుంటుంది. కాని, గొడవంతా జరిగేది 5జిల్లాల్లో మాత్రమే. మిగతా 17 జిల్లాలు మిగతా భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఎలాగ ఈ దేశంలో అంతర్భాగంగా వుండాలని కోరుకుంటున్నాయో అలాగే భావిస్తున్నాయి. వీటిలో 90శాతం పైగా ముస్లిమ్ జనాభా వున్న సరిహద్దు జిల్లాలైన పూంచ్, కార్గిల్ వంటివి కూడా వున్నాయి!