చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో తెలుసా!

 చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో తెలుసా! ఆహారం అందరికీ అవసరమే. మొక్కలు కూడా వాటి ఆహారాన్ని నేలలో ఉన్న ఖనిజాల రూపంలో తీసుకుంటాయి. ఇక జంతువులు, మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? అయితే  పెద్దలు తీసుకునే ఆహారానికి పిల్లలు తీసుకునే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిపాలు లేదా వైద్యులు సూచించిన పాలే ఆహారం. దాదాపు 6నెలల వరకు పిల్లలకు పాలే ఇవ్వాలి. ఆ తరువాత నుండి పిల్లలకు క్రమంగా ఇతర ఆహారాలు అలవాటు చేస్తుంటారు. అయితే కొంతమంది తల్లులకు తమ పిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం ఇవ్వాలో సరిగ్గా తెలియదు. అలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం పిల్లల వయసును బట్టి ఇవ్వాల్సిన ఆహారం గురించి చిన్న పిల్లల వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పిల్లలు పెరిగే కొద్దీ ఆహార క్రమం మారుతుంది. ద్రవాల నుండి మెల్లిగా వారు నమిలి తినే ఘనాహారాల వైపుగా వారి ఆహారపు అలవాట్లు మారుతాయి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆహారంలో పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, పాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే పిల్లలలో జ్ఞాపకశక్తిని ప్రోత్సహించడానికి బ్రెయిన్ ఫుడ్, పిల్లలకు కావసిన ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేసే ఆహారం, కాల్షియం లోపం ఉండకుండా, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారం ఇవ్వాలి. గుడ్లు ఇవ్వాలి.. ఏడాది దాటిన తరువాత పిల్లలకు గుడ్లు ఇవ్వాలి. గుడ్లలో విటమిన్-డి, విటమిన్-బి12, కాల్షియం, ఐరన్, ఒమెగా-3 యాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్లలకు శారీరక  బలాన్ని ఇవ్వడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా సహాయపడుతాయి. చిలగడ దుంపలు.. ఆరు నెలలు దాటిన తరువాత చిన్నపిల్లల ఆహారంలో చిలగడ దుంపలు చేర్చవచ్చు. చిలగడ దుంపలో విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. బీటా కెరోటిన్ తయారీకి పొటాషియం చాలా అవసరం.  చిలగడ దుంపను మెత్తగా ఉడికించి పెట్టడం మంచిది. పాలు.. తల్లిపాల తరువాత పిల్లలకు సాధారణ పాలు కూడా ఇస్తుంటారు. అయితే ఏడాది వయసు లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం నిషేదం. ఆవు పాలు తొందరగా జీర్ణం కావు. ఈ కారణంగా ఆవు పాలు ఇవ్వకూడదు. ఇక ఫార్ములా పాలు లేదా గేదె పాలు ఇవ్వవచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకు 200 మి.లీ కంటే ఎక్కువ పాలు ఇవ్వకూడదు. పాలుకూడా విటమిన్-సి, విటమిన్-డి, కాల్షియం వంటివి అందిస్తాయి. కాబట్టి పిల్లలకు పాలు మంచి ఆహారం.                                                                                                         *నిశ్శబ్ద.

ఏడాదిలోపు పిల్లలకు ఈ ఆహారాలు ఇవ్వకూడదు!

ఏడాదిలోపు పిల్లలకు ఈ ఆహారాలు ఇవ్వకూడదు..!! 12 నెలల లోపు శిశువు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. ఇది పిల్లల ఎదుగుదల లేదా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బాల్యంలో పిల్లలు ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాటిలో ఎక్కువ కేలరీలు ఉండవచ్చు. అయితే ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. చక్కెర: 24 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చక్కెర జోడించిన ఆహారాన్ని నివారించాలని శిశువైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పిల్లలు చక్కెర రుచిని ఇష్టపడతారు. అదనంగా, ఇది అదనపు కేలరీలను జోడిస్తుంది. ఇది కాలక్రమేణా దంత క్షయానికి దారితీస్తుంది. చాలా మంది తల్లులు తమ బిడ్డ పాలలో శుద్ధి చేసిన చక్కెరను కలుపుతారు. అలాగే పిల్లలు పంచదారతో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. తేనె: ఆయుర్వేదంలో తనదైన స్థానాన్ని పొందిన తేనె అద్భుతమైన తీపి పదార్థం మాత్రమే కాదు అద్భుత ఔషధం కూడా. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చక్కెరకు తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అయితే, శిశువులు అంటే 12 నెలల లోపు పిల్లలు తేనె తినకూడదు. తేనె యొక్క అధిక వినియోగం శుద్ధి చేసిన చక్కెరతో సమానమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందువల్ల, 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు తేనె ఇవ్వకూడదు. ఉప్పు: 7 నుంచి 12 నెలల మధ్య పిల్లలకు రోజుకు 0.37 గ్రాముల సోడియం అవసరం. మీరు మీ బిడ్డకు ఎక్కువ ఉప్పు ఇవ్వకూడదు.అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు ఇచ్చినప్పుడు పిల్లవాడు సోడియంకు గురవుతాడు. ఇది వారి అపరిపక్వ మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఉప్పు, చక్కెరను మితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఆవు పాలు: తల్లులు తమ బిడ్డలకు తమ తల్లి పాలకు బదులుగా ఆవు పాలను ఇస్తారు . దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.ఆవు పాలు అనేక పోషకాలను అందిస్తుంది. కానీ 12 నెలల లోపు పిల్లలకు ఇది పనికిరాదని చెబుతున్నారు. శిశువు యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, అభివృద్ధికి అవసరమైన విటమిన్ E, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను ఆవు పాలలో ఉండవు. పిల్లలకి అలెర్జీలు ఉండవచ్చు. ఆవు పాలలో భారీ ప్రోటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శిశువు యొక్క ఇంకా అభివృద్ధి చెందుతున్న మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. పండ్ల రసాలు: 12 నెలల లోపు పిల్లలకు పండ్ల రసాలు ఇవ్వకూడదని మీకు తెలుసా ? అవును, పండ్ల రసాలు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎటువంటి పోషక విలువలను అందించవు. ఎటువంటి పోషకాహార ప్రయోజనం లేకుండా పిల్లల ఆహారంలో చక్కెర ఉంటుంది.  ఇది పిల్లల దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. బదులుగా, తాజా పండ్లను కట్ చేసి తినిపించండి.

పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు!

పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్  వంటివి చేతిలో పెట్టి వారిని  కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

పిల్లలు పుస్తకాలు చదవట్లేదా... అయితే ఇలా చేయండి!

పిల్లలు పుస్తకాలు చదవట్లేదా... అయితే ఇలా చేయండి! ఏ ఇద్దరు వ్యక్తుల చేతివేలి ముద్రలు ఒకేలా ఎలా ఉండవో.. ఏ ఇద్దరు వ్యక్తుల రుచి మొగ్గలు ఓకేవిధంగా ఎలా ఉండవో.. అలాగే ఏ ఇద్దరు పిల్లల ఆలోచనలు ఒకేలా ఉండవు. పిల్లలు జీవితంలో గొప్పవాళ్లుగా మారడానికి పెద్దవాళ్ళు ఎన్నో మార్గాలు ఫాలో అవుతారు. అయితే  ఒకరికి పని చేసేది మరొకరికి పని చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు ఓపికపట్టాలి.  ముందు మీ పిల్లలకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో కనుగొనే వరకు విభిన్న విధానాలను ప్రయత్నిస్తూ ఉండాలి.  పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది పిల్లల్లో విభిన్న కోణాలను బయటకు తెస్తుంది, ఆత్మను సుసంపన్నం చేస్తుంది జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో  పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి  అందుకోసం కొన్ని చిట్కాలు ఇవిగో.. వయస్సుకి తగిన పుస్తకాలతో ప్రారంభించండి:  మీ పిల్లల వయస్సు మరియు పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోండి. మీరు చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలతో ప్రారంభించవచ్చు వారు పెద్దయ్యాక చాప్టర్స్ ఉన్న పుస్తకాలకు వెళ్లవచ్చు. వారి దృష్టిని ఆకర్షించే ప్రకాశవంతమైన, రంగురంగుల దృష్టాంతాలతో పుస్తకాలను ఎంచుకోండి. పఠనాన్ని రొటీన్‌గా చేసుకోండి:  నిద్రవేళకు ముందు లేదా రాత్రి భోజనం తర్వాత పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. ఇది వారి దినచర్యలో పఠనాన్ని ఒక క్రమమైన భాగంగా చేయడానికి వారిలో పఠనాభిమానాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఆసక్తి కలిగించే విషయాలపై పుస్తకాలను ఎంచుకోండి: పిల్లలు ఆసక్తిని కలిగించే అంశంగా ఉన్నప్పుడు చదవడానికి ఇష్టపడతారు. మీ పిల్లలు డైనోసార్‌లను ఇష్టపడితే, వాటి గురించిన పుస్తకాలను కనుగొనండి. వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్ గురించి పుస్తకాలను వెతికి తెచ్చివ్వండి. ఇలాగే వారికి ఏది ఇష్టమైతే ఆ మార్గంలోనే పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి. కలిసి చదవండి: నన్ను చదవమని చెబుతూ నువ్వు మొబైల్ చూసుకుంటావా?? టీవీ చూస్తావా?? ఇలా పిల్లలు ముక్కుసూటిగా ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పలేక వారిని పెద్దరికం అనే ట్యాగ్ తో మందలిస్తారు పెద్దలు. కాబట్టి  కుటుంబంలో ఎవరో ఒకరు పిల్లలతో కలిసి చదవడానికి సమయాన్ని వెచ్చించండి. కథను బిగ్గరగా చదవడం,  కథ గురించి చర్చించడం వంటివి చేయండి. ఇది వారి పఠన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా మీకు మరియు మీ పిల్లల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. బహుమతులు ఇవ్వండి: పిల్లలు చదువుతున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహం తెచ్చుకుంటారు. వారు చదివే పుస్తకంలో ఒక చాప్టర్ పూర్తి చేసినప్పుడు, దానిగురించి మీతో సమర్థవంతంగా చర్చించినప్పుడు, పుస్తకాన్ని విజవంతంగా పూర్తి చేసినప్పుడు వారికి బహుమతులు ఇవ్వడం. వారికి ఇష్టమైన ప్రదేశాలకు వారిని తీసుకెళ్లడం. మరొక అద్భుతమైన పుస్తకాన్ని వారికి ఇవ్వడం చేస్తే.. వారు ఎంతో సంతోషిస్తారు.                                   ◆నిశ్శబ్ద.

బొజ్జలో బుజ్జాయికి బోలెడు కబుర్లు చెప్పండి!

బొజ్జలో బుజ్జాయికి బోలెడు కబుర్లు చెప్పండి! ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నారదుడు చెప్పినవన్నీ విన్నాడంటే, అభిమన్యుడు పద్మవ్యూహం మెళకువలు అమ్మ కడుపులో ఉన్నప్పుడే విని నేర్చుకున్నాడంటే అవి పురాణ కథలు అనుకుంటాం. కానీ, బొజ్జలో పాపాయి కదలికల్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే, మన అనుభూతులకి, మాటలకి పాపాయి స్పందనని చూస్తుంటే అవన్నీ నిజమని నమ్మక తప్పదు. బుజ్జి పాపాయి పుట్టాక మాత్రమే భయం, ఆనందం వంటివి తెలుస్తాయని అనుకుంటాం కదా మనం. కానీ, అమ్మ బొజ్జలో ఉన్న పాపాయి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తే ఉలిక్కిపడుతుందట. భయంతో అటూ ఇటూ తిరుగుతుందట. ఈమధ్యకాలంలో శిశువు గర్భంలో వున్నప్పుడు తన స్పందన తీరుని పరిశీలించే ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నాయి. అమ్మ భావావేశాలు కడుపులో బిడ్డకి ఎంచక్కా అర్థమవుతాయిట. అమ్మ కోపంగా వున్నా, బాధగా వున్నా ఇట్టే తెలిసిపోతుందట. అందుకేనేమో మన పెద్దవాళ్ళు కడుపుతో వున్నవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా వుండాలని చెప్తారు. సరే, కేవలం ఆ ఎమోషన్స్.ని అర్థం చేసుకోవడమే కాదు, వాటి ప్రభావం ఆ బిడ్డపై వుండటం కూడా గమనించారు శాస్త్రవేత్తలు. బిడ్డ ఎదుగుదల, తన ఎమోషన్స్ కూడా ప్రభావితమవడం గుర్తించారు. ఓ విషయం తెలుసా? కడుపుతో వున్న తల్లి ఇష్టాయిష్టాలు బిడ్డపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిని ఆమె ఎక్కువగా ద్వేషించినా, కోపగించుకున్నా, భయపడినా కడుపులో వున్న బిడ్డ ఆ వ్యక్తి గొంతు గుర్తుపెట్టుకుంటాడట. పుట్టాక తిరిగి ఆ వ్యక్తి గొంతు విన్నప్పుడు గుర్తించి ఏడుస్తాడట. ఇది ప్రయోగాత్మకంగా నిపుణులు గుర్తించిన సత్యం. ఇష్టమైన మ్యూజిక్ వినడం, మంచి పుస్తకాలు చదవడం, ఇష్టమైన ప్రదేశాలలో గడపటం, ఎప్పుడూ ఆనందంగా వుండటం ఇవన్నీ కడుపుతో వున్నవారికి అందరూ సాధారణంగా చెప్పే విషయాలు. దీనివెనుక కారణం, అమ్మ సంతోషంగా వుంటే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడని. ఈ విషయంలో ఎందుకు? ఎలా? అన్న అనుమానాలతో కొందరు శాస్త్రవేత్తలు  కొందరు గర్భిణులని తొమ్మిది నెలలపాటు గమనించినప్పుడు తల్లి ఆనందంగా వున్నప్పుడు గర్భసంచి చుట్టూ రక్త ప్రసరణ చక్కగా జరగడం గమనించారు. తల్లి ఆనందం ఆమె శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తే అవి బిడ్డ ఎదుగుదలకి తోడ్పడే హార్మోన్లని ప్రేరేపించడం గుర్తించారు. దాంతో ఎప్పుడూ సంతోషంగా వుండే తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిస్తుంది అని నిరూపించబడినట్టే. పిల్లలకి కథలంటే ఇష్టం కదా. ఓ మూడు నాలుగేళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లలకి కథలు చెబుతాం.. అవునా? కానీ, అమ్మకి మూడో నెల దాటిన దగ్గర్నుంచి బొజ్జలో పాపాయికి కమ్మని కథలు  చెప్పాలట. రోజూ ఓ నిర్దిష్ట సమయం పెట్టుకుని బిడ్డతో మాట్లాడ్డం, కథలు చెప్పడం, లాలిపాటలు పాడటం చెయ్యాలిట. కొన్ని రోజులకి ఆ సమయానికల్లా బిడ్డ మన కబుర్ల కోసం ఎదురుచూస్తాడట. బిడ్డ కదలికలతో అమ్మ ఈ విషయాన్ని గుర్తించవచ్చు అంటున్నారు ఈ విషయంపై అధ్యయనం చేసినవారు. అంతేకాదు ఏ కథలు, పాటలు అయితే వీరు కడుపులో వున్న బిడ్డకి వినిపించారో, బిడ్డ పుట్టాక వాటిని విన్నప్పుడు అవేవో తనకి ముందే తెలిసినవి అన్నట్టు ఆనందంతో స్పందించడం గుర్తించారు ఆ అధ్యయనంలో. చూశారా పాపాయి పారాడే వయసు దాకా అక్కరలేదు. కడుపులో పడినప్పటి నుంచి తనతో అనుబంధానికి దారులు వేయొచ్చు అమ్మ. కడుపులో బిడ్డ ఊపిరి పోసుకున్న క్షణం నుంచి అమ్మ తనతో అనుబంధానికి ప్రయత్నించవచ్చు అని చెప్పుకున్నాం కదా! ఇక్కడో విషయం చెప్పాలి. ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలన్నా, ఆ తర్వాత పెరిగి పెద్దయి మంచి వ్యక్తిత్వంతో మెలగాలన్నా అందుకు పునాది అమ్మ కడుపులో వున్నప్పుడే పడుతుంది అని గట్టిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరి ఈ విషయంలో కాబోయే అమ్మలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాల్సిందే. చిట్టిపొట్టి కథలు, లాలిపాటలు, కమ్మటి కబుర్లు కడుపులోని పాపాయితో పంచుకోవాల్సిందే.. ఏమంటారు? - రమ ఇరగవరపు

పొరపాటున కూడా పిల్లలను ఈ మాటలు అనకూడదు..

పొరపాటున కూడా పిల్లలను ఈ మాటలు అనకూడదు..   పిల్లల పెంపకం చాలా కష్టమైన పని. పిల్లలను బుజ్జగించడం, వారికి క్రమశిక్షణ నేర్పడం వంటి ఎన్నో  సందర్బాలలో చాలా  విషయాలను గుర్తుపెట్టుకోవాలి. తమ చుట్టూ ఉన్న వాతావరణం పిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చాలాసార్లు వారే ఇలాంటి తప్పులకు పాల్పడి పిల్లలు గాడి తప్పడానికి కారణం అవుతారు. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లలను అనే కొన్ని మాటలు వారి మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. అందుకే కోపం వచ్చినా, విసుగు చెందినా.. పొరపాటున కూడా పిల్లలను కొన్ని మాటలు అనకూడదు. పొరపాటున అన్నారంటే అవి   పిల్లల హృదయాలలో లోతైన గాయాలను మిగులుస్తాయి. వారు పెరిగే కొద్దీ ఆ విషయాలు కూడా వారిలో బలంగా తయారవుతూ వస్తాయి. అవే పిల్లలు గాడి తప్పేలానూ, పిల్లల దృష్టిలో పెద్దలు విలువ కోల్పోయేలానూ చేస్తాయి. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను అనకూడని విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని తెలుసుకంటే.. నీకేమీ తెలియదు అని అనకండి.. తల్లిదండ్రులు  పిల్లలకు తాము ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో తెలియదని చెప్పినప్పుడల్లా వారికేమీ తెలియడం లేదనే ఆత్మన్యూనతలో పడిపోతారు. నీకేమీ తెలీదు నువ్వు  సరైన నిర్ణయం తీసుకోలేవు అని పెద్దలు అంటూ ఉంటారు. దీని వల్ల జరిగేది ఏంటంటే పిల్లలు నా అభిప్రాయం ఎవరికీ పట్టదు, అంతా వారికి నచ్చినట్టే జరగాలా అని ఒకానొక వ్యతిరేక భావన   పిల్లల మనసులో నాటుకుపోతుంది. ఎప్పుడూ ఏడుస్తావెందుకు అనకూడదు..  తరచుగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ తరహా మాట అంటూ ఉంటారు. ఎప్పుడూ ఏడుస్తావెందుకు  అని విసుక్కోవడం, కోప్పడటం చేస్తారు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టం అనిపించినప్పుడు ఏడుస్తూనే తమ బాధను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్బాలలో పిల్లలను విసుక్కోవడం వల్ల వారు తమ బాధను తల్లిదండ్రులతో పంచుకునే విషయంలో వెనకడుగు వేస్తారు.  పిల్లలు ఏదైనా చెప్పగలిగే వాతావరణం తల్లితండ్రులే కల్పించాలి. తోబుట్టువులతోనూ, ఇతరులతోనూ పోల్చకండిి.. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మెదడు, ప్రతి వ్యక్తి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పడు పిల్లలను తొబుట్టువులతోనూ, ఇరుగు పొరుగు పిల్లలతోనూ, క్లాస్ మేట్స్ తోనూ పోల్చకూడదు. ఇది పిల్లలను ఎక్కువగా బాధించే విషయం.  ఈ విషయంలో పిల్లలు కుంగుబాటుకు లోనై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. పదే పదే పెద్దరికాన్ని ప్రదర్శించవద్దు.. పెద్దలు కొన్నేళ్లు జీవించేశామని, తమకు అనుభవాలు ఉన్నాయని, మంచేదో, చెడు ఏదో తమకు బాగా తెలుసని పెద్దలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పిల్లల మీద రుద్దడం, పిల్లల విషయంలో నిర్ణయాలు తామే తీసుకోవడం మానేయాలి.  పిల్లలకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. అవసరమైతేనే పెద్దల  సలహాలు ఇవ్వాలి. పెద్దరికాన్ని పదే పదే పిల్లల మీద చూపిస్తే పెద్దలు ఏం చేసినా కరెక్ట్ అని, పిల్లలు ఏదీ చేయకూడదు అనే ఆలోచన వారిలో నాటుకుపోతుంది. దీని కారణంగా జీవితంలో చాలా లాస్ అవుతారు. అమ్మాయిల  విషయంలో ఇలా వద్దు.. ప్రపంచం అభివృద్ది చెందుతోంది కానీ నేటికీ  చాలా మంది తల్లిదండ్రులు తమ అబ్బాయిలు,  అమ్మాయిల మధ్య వివక్ష చూపుతున్నారు.  బిడ్డ మగపిల్లాడా లేక ఆడపిల్లా అన్నది ముఖ్యం కాదు. వారి లింగాన్ని బట్టి వారి సామర్థ్యాలను అంచనా వేయకూడదు. అమ్మాయిలు ఇలా చేయకూడదు, మగపిల్లలు ఇలాగే ఉండాలి, అబ్బాయిలతో నీకు కంపేర్ ఏంటి? వాడు నువ్వూ ఒకటేనా లాంటి మాటలు అంటూ ఉంటారు. ఎప్పుడైనా అమ్మాయిలు కాస్త ఎదురు మాట్లాడినా 'అబ్బాయిలంటే గోచి పెట్టుకుని బయటకు వెళ్లగలరు, నువ్వు అలా వెళతావా ఏంటి?' లాంటి జెండర్ డామినేషన్ మాటలు మాట్లడుతుంటారు. ఇలాంటి మాటతీరు మార్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలను తల్లులు అర్థం చేసుకోవాలి. ఆహారం.. అధిక బరువు.. సహజంగానే పిల్లలకు జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. తల్లిదండ్రులుగాబిడ్డకు ఆరోగ్యం,   ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిందే. కానీ  ఎలా పిల్లలు జంక్ ఫుడ్ తిన్నప్పుడు జంక్ ఫుడ్ తినవద్దు లావైపోతావ్ అని, బరువు పెరుగుతున్నావు చూడు అని నేరుగా పిల్లల ముందు అనడం పూర్తీగా తప్పు.   జంక్ ఫుడ్ గూర్చి, బరువు గూర్చి మాట్లాడటానికి బదులు,  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని వారికి  చెప్పడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంకరేజ్ చేయాలి.  ఇవన్నీ చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.                                                                *నిశ్శబ్ద

పిల్లల కోసం ఇలాంటి ఫోటోషూట్ సూపర్!

పిల్లల కోసం ఇలాంటి ఫోటోషూట్ సూపర్! ఫొటో షూట్...ఫొటో షూట్...పసి పిల్లల మీద కెమెరా ఫోకస్ పడకూడదని కొందరు అంటుంటారు. అలాంటిదేం లేదంటూ కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చంటి పిల్లల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. జీవితంలో కొన్ని మధురక్షణాలను కెమెరాల్లో బంధించి...ఆ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ, బిడ్డ పుట్టిన తర్వాత ఫొటోషూట్‌లు చేయడం కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్‌గా మారింది. మీరు మీ పిల్లల చిన్ననాటి జ్ఞాపకార్థం ఫోటోను సేవ్ చేయాలనుకుంటున్నారా?.ఇంట్లో  స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి సాధారణ ఫోటోషూట్ చేయండి. అవుట్‌డోర్ ఫోటోషూట్: మీరు రిసార్ట్ లేదా ఏదైనా పార్కుకు వెళ్లినప్పుడు మీరు ఫోటోను సులభంగా క్లిక్ చేయవచ్చు. స్టైలిష్ హెయిర్ స్టైల్, కలర్ ఫుల్ డ్రెస్, అందమైన బూట్లు ధరించండి. మీ బాబును కానీ పాపను కానీ సురక్షితమైన ప్రదేశంలో కూర్చోబెట్టి ఫొటోను క్లిక్ చేయండి. ఫాంటసీ ఫోటోషూట్: నెలల బిడ్డ అయితే, పిల్లల పక్కన సంగీత వస్తువులు లేదా ఇతర అలంకరణ వస్తువులను ఉంచవచ్చు. ఫాంటసీ ఫోటోను క్లిక్ చేయండి. ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది.ఈ ఫొటో చాలా ఫన్నీగా ఉంటుంది. థీమ్ ఫోటోషూట్: ఇప్పటికే చెప్పినట్లుగా.. కూర్చోలేని పిల్లల ఫోటోషూట్‌ను కూడా క్లిక్ చేయవచ్చు. ఒక థీమ్‌ను సృష్టించండి. తదనుగుణంగా దుస్తులు ధరించండి.  వివిధ ఫోటోలను క్లిక్ చేయండి. బొమ్మ ఫోటో షూట్: బహుశా ఈ ఫోటోలు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇష్టపడతారు. తనకిష్టమైన బొమ్మలతో ఆడుకుంటూ, నవ్వుతూ, అమాయకంగా కనిపిస్తూ ఫోటో క్లిక్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు? అందమైన బట్టలు ధరించండి. పిల్లవాడు ముందు ఇష్టపడే బొమ్మలు ఉంచండి. వారి ఆనందాన్ని క్లిక్ చేస్తూ ఉండండి. శ్రీ కృష్ణుడి ఫోటో షూట్: భారతీయులమైన మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫోటోషూట్‌లలో శ్రీకృష్ణుడు ఒకటి. మగబిడ్డ అయినా, ఆడపిల్ల అయినా తల్లిదండ్రులు తమ బిడ్డలో శ్రీకృష్ణుడు, రాధల అందాలను చూడాలని కోరుకుంటారు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు పిల్లలందరూ శ్రీకృష్ణుడిగా వెలిగిపోతారు. ఆడపిల్ల ఫోటో షూట్: మీ ఆడబిడ్డ ఫోటోషూట్‌ను ఇలా సులభంగా తీసుకోండి. రంగురంగుల ఫ్రాక్ ధరించి పైనుండి క్లిక్ చేసిన ఈ ఫోటో నిజంగా అందంగా ఉంది. ఫీల్డ్‌లో ఫోటోషూట్: పల్లెటూరి అందం వర్ణించలేనిది. అక్కడి నిర్మలమైన వాతావరణం, పచ్చని చెట్ల అందాలు నిజంగానే అబ్బురపరుస్తాయి. ఫీల్డ్ దగ్గర మీ చిన్నారితో ఈ ఫోటోను క్లిక్ చేయండి.

ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఈ పండు ఇవ్వకండి..ఎందుకంటే!

ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఈ పండు ఇవ్వకండి.. ఎందుకంటే! పండ్లు పిల్లలకు,  పెద్దలకు కూడా చక్కని ఆరోగ్యం చేకూరుస్తాయి.  రోజువారి ఆహారంలో పండ్ల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే.   పిల్లలకి చిన్నప్పటి నుండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంటే పిల్లలు పెరిగేకొద్ది బాగుంటారు. అయితే ఆరోగ్యం అనే అపోహలో కొందరు పిల్లలకు ఇవ్వకూడని ఆహారం ఇస్తుంటారు. పండ్లన్నీ ఆరోగ్యకరమైనవని, వాటివల్ల నష్టం ఉండదని అనుకునే అమాయకులు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలకు ఇవ్వకూడని ఆహారాల గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో గ్రేప్ ఫ్రూట్ అని, తెలుగులో పంపరపనస అని అంటారు. బత్తాయిపండులాగా పెద్దగానూ, పనసపండులా లోపన తొనల్లానూ ఉండే ఈ పండు తెలుపు, పింక్ రంగులలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఈ పిల్లలకు ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అసలు పిల్లలకు ఈ పండును ఎప్పుడు, ఎంత ఇవ్వాలనే విషయాన్ని తెలుసుకుంటే.. పంపరపనస ఒక నిమ్మజాతికి చెందిన పండు. సాధారణంగా సిట్రస్ పండ్లను 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తినిపించవద్దని సలహా ఇస్తారు.  ఎందుకంటే అవి ఆమ్లంగా ఉంటాయి.  పిల్లల  చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి వారి చర్మం పై  దద్దుర్లు కలిగిస్తాయి. అయితే, 6 నెలల తర్వాత శిశువైద్యుని సలహా మేరకు పిల్లల  ఆహారంలో పంపరపనసను  చేర్చవచ్చు. పిల్లల వైద్యుల ప్రకారం పిల్లలు  కాల్షియం తీసుకోవడానికి ఇబ్బంది పెడతారు. దీనికారణంగా పిల్లలకు కాల్షియం కోసం  సిసాప్రైడ్,  సైక్లోస్పోరిన్ వంటి కొన్ని మందులు ఇస్తుంటారు. ఈ మందులు పిల్లలకు వాడుతుంటే మాత్రం  పంపరపనస పండు ఇవ్వకూడదు. దీన్ని  తినడం వల్ల ఔషధం శరీరంలో ఇమిడిపోవడం, జీర్ణక్రియ, దానివల్ల కలగాల్సిన ఫలితాలు   ప్రభావితం అవుతాయి.పిల్లలకు ఏ మందు వాడుతున్నా ఈ పండు ఇచ్చేముందు శిశువైద్యుల సలహా తీసుకోవాలి. పంపరపనస గుజ్జులో విటమిన్లు ఎ, సి,  పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అదనంగా ఇది లైకోపీన్,  నరింగిన్ వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కూడా కలిగి ఉంటుంది. తగినంత పోషకాహారం కోసం  పిల్లల సమతుల్య ఆహారంలో ఈ పండును కొద్దిమొత్తంలో వైద్యుల సలహాతో చేర్చవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నీరు,  పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి, ఇవి చిన్నపిల్లలను డీహైడ్రేషన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఈ పండులో గణనీయమైన మొత్తంలో నీరు,  డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది పిల్లల  ప్రేగులను చురుకుగా ఉంచడానికి,  జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఫాలిఫినాల్స్,  ఫ్లేవనోన్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా ఉంటాయి.  ఇవి గట్ మైక్రోబయోటాను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కానీ శిశువైద్యుల ప్రకారం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పండ్ల రసం కూడా  ఇవ్వడం మంచిది కాదు. పంపరపనస పండు రసంతో ఇతర పండ్ల రసాలు ఇవ్వకూడదు. రసం కంటే పండ్లు ఎక్కువ పోషకాహారాన్ని అందిస్తాయి. అంతే కాకుండా జ్యూస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పళ్లలో క్యావిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఇస్తే విరేచనాలు కావచ్చు. కాబట్టి ఒక సంవత్సరం లోపు పిల్లలకు పండ్ల రసాన్ని, పంపరపనసను అస్సలు  ఇవ్వకూడదు.                                                      *నిశ్శబ్ద. 

పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి?

పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? మస్తిష్క పక్షవాతాన్ని సెరిబ్రల్ పాల్సీ అని అంటారు. మస్తిష్క పక్షవాతం   పిల్లలలో నయం చేయలేని వ్యాధి. దీనిలో పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లలలో శారీరక సమస్యలు ఉండవచ్చు. సెరిబ్రల్ పాల్సీ పిల్లలలో  బ్యాలెన్స్ లేకపోవడం, వారు ఉండే భంగిమలో మార్పు.. నడవగల సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం.. ఇవన్నీ మస్కిష్క పక్షవాతంలో సంభవిస్తాయి.  మస్తిష్క పక్షవాతం పిల్లలలో అత్యంత సాధారణంగా వచ్చే  మోటారు వ్యాధి. సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించినది. పక్షవాతం అంటే కండరాలను ఉపయోగించడంలో ఇబ్బంది లేదా బలహీనత. మస్తిష్క పక్షవాతం మెదడు అసాధారణంగా అభివృద్ధి చెందడం వల్ల లేదా మెదడు అభివృద్ధిలో అవరోధం కారణంగా సంభవిస్తుంది. దీని కారణంగా పిల్లలు తమ కండరాలను నియంత్రించుకోలేరు. సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు.. సెరిబ్రల్ పాల్సీ  లక్షణాలు పిల్లలలో  భిన్నంగా ఉంటాయి. తీవ్రమైన మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలకు నడవడానికి ప్రత్యేక పరికరాల సహాయం అవసరం కావచ్చు లేదా అస్సలు నడవలేకపోవచ్చు.  జీవితకాల సంరక్షణ అవసరం కావచ్చు. మరోవైపు తేలికపాటి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పిల్లలు  కొంచెం ఇబ్బందికరంగా నడుస్తారు.  వారికి  ప్రత్యేక సహాయం అవసరం అవుతుంది. మస్తిష్క పక్షవాతం లక్షణాలు కాలక్రమేణా అధ్వాన్నంగా మారకపోయినప్పటికీ పిల్లల జీవితంలో లక్షణాలలో  మార్పులు జరగవచ్చు. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న వారందరికీ నడకలోనూ, వారు కూర్చునే నిలుచునే భంగిమలోనూ సమస్యలు ఉంటాయి. చాలా మంది  పిల్లలు  బుద్దిమాంద్యంతో  కూడా బాధపడవచ్చు. మూర్ఛలు, దృష్టి, మాట్లాడటం,  వినికిడి సమస్యలు వంటివి ఉంటాయి. వెన్నెముకలో మార్పులు (పార్శ్వగూని వంటివి) మరిన్ని శారీరక సమస్యలు ఉంటాయి. సెరెబ్రల్ పాల్సీ రకాలు.. కండరాల దృఢత్వం (స్పాస్టిసిటీ) అనియంత్రిత కదలికలు (డిస్కినియా) సంతులనం,  సమన్వయం కోల్పోవడం (అటాక్సియా) పై లక్షణాలు అన్నీ కలిపి అయినా ఉండొచ్చు. సెరిబ్రల్ పాల్సీ  ప్రారంభ లక్షణాలు.. పిల్లలు విశ్రాంతి స్థితి నుండి పైకి లేచినప్పుడల్లా, తల కదలికలు ఆలస్యం అవుతాయి. శరీరం బిగుసుకుపోతుంది. పిల్లలు  కుంటుతూ నడుస్తారు. ఇలాంటి పిల్లవాడిని చేతుల్లో పట్టుకున్నప్పడు, పట్టుకున్నవారిని నెట్టినట్లుగా తన వెనుక భాగాన్ని,  మెడను సాగదీస్తారు.   కాళ్ళు ఎత్తినప్పుడు గట్టిపడతాయి, తరచుగా  కాళ్ళు కత్తెర ఆకారంలో తిరుగుతాయి. ఇలాంటి పిల్లలకు నడవడం చాలా కష్టం.  ఇక  చేతులు కూడా  కలిపి ఉంచుకోలేరు.  చేతులతో నోట్లో ఏదీ  పెట్టుకోలేరు.  ఒక చేతిని చాచి, మరొకటి గట్టిగా ఉంచుతారు. ఒకే దిశలో తిరగడం వారికి సవాలుగా ఉంటుంది. మస్తిష్క పక్షవాతం చికిత్స.. సెరిబ్రల్ పాల్సీకి ఎటువంటి నివారణ లేదు కానీ తగిన జాగ్రత్తలతో  రోగుల జీవితాలను మెరుగుపరచవచ్చు. సమస్య ఉన్నట్టు తేలిన తరువాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించడం ముఖ్యం. మస్తిష్క పక్షవాతం నిర్ధారణ అయిన తర్వాత, వైద్యుల బృందం పిల్లలతో మరియు వారి కుటుంబంతో కలిసి పని చేస్తుంది.  పిల్లవాడు తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి  ప్రణాళికను రూపొందిస్తారు. సాధారణంగా మందులు, శస్త్రచికిత్స,  శారీరక, వృత్తి,  ప్రసంగ చికిత్స మొదలైనవి  చికిత్సలో ఉపయోగిస్తారు. సెరిబ్రల్ పాల్సీకి కారణాలు తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ పుట్టడం. ప్రసవ సమయానికి ముందే బిడ్డ  పుట్టడం.  గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు, కామెర్లు,  కెర్నిక్టెరస్ జన్యు లోపం. మొదలైనవి కారణాలు.                                            *నిశ్శబ్ద.

చలికాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి!

  చలికాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి! చిన్నపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.  పిల్లలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులకు వారి ఆరోగ్యం చాలా తొందరగా ప్రభావితం అవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కొనసాగుతున్న కారణంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు మరింత ఎక్కువగా ఉండాలి. చిన్న పిల్లలున్న ప్రతి  ఇంట్లో కొన్ని జాగ్రత్తలుతప్పనిసరిగా తీసుకోవాలని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. చల్లని వాతావరణం కొనసాగుతున్న కారణంగా చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. దీనివల్ల  పిల్లలలో  సీజనల్ సమస్యలు ఎప్పటికప్పుడు చెక్ చేసినట్టు అవుతుంది. పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు కాబట్టి అప్పుడప్పుడు  వారిని తాకి ఉష్ణోగ్రత చెక్ చేసుకోవాలి. చలికాలంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతలు చాలా తొందరగా పెరగడం, అంతే తొందరగా పడిపోవడం జరుగుతుంది. చలిని భరించే క్రమంలో పిల్లలలో వేడి ఎక్కువగా, వేగంగా ఉత్పత్తి కావడం వల్ల పిల్లలో అల్పోష్ణస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రత స్థితినుండి పిల్లలను కాపాడుకోవాలి అంటే పిల్లలకు వెచ్చని దుస్తులు వేయాలి. అలగే పిల్లల పాదాలు, చేతులు, తలను కూడా వెచ్చగా ఉండేలా కవర్ చేయాలి. ఒట్టి ఒళ్లుతో పిల్లలను అస్సలు ఉంచకూడదు. పిల్లలకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం . వారిని శుభ్రంగా ఉంచడం, అందంగా తయారుచేయడం తల్లుల అలవాటు. అయితే చలి దృష్ట్యా పిల్లలకు స్నానం చేయించడం తగ్గించాలి. వీలైనంత వరకు పిల్లలను వెచ్చని నీళ్లలో ముంచిన మెత్తని టవల్ లేదా నూలు బట్టతో ఒళ్లంతా తుడవాలి. చలికాలంలో ఇలా చేస్తే సరిపోతుంది. పిల్లలకు స్నానం చేయిస్తే వారిని చల్లని వాతావరణం లేదా చలి గాలులకు శరీరం తగిలేలా ఉంచకూడదు. ఇంటి కిటికీలు. తలుపులు మూసి ఉన్న గదిలో పిల్లలను ఉంచాలి. లేకపోతే చాలా సులువుగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. చలికాలంలో లేత సూర్యకాంతిలో పిల్లలకు ఆవనూనెతో శరీరమంతా బాగా మసాజ్ చేయడం వల్ల పిల్లలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది పిల్లలు చురుగ్గా ఉండేలానూ, రోగనిరోధక శక్తిని పెంచేలానూ చేస్తుంది. పేగా పిల్లలలో కండరాలు బలపడతాయి. బాగా నిద్రపోతారు. పిల్లల శరీరం పొరపాటున కూడా పొడిగా ఉండనివ్వకూడదు. స్నానం చేయించడం లేదా తడిబట్టతో ఒళ్లు తుడిచిన తరువాత  తప్పనిసరిగా పిల్లలకు లోషన్ రాయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికి చర్మం ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది. చిన్న పిల్లలు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి  వారికి లభించే గొప్ప ఆహారం తల్లిపాలు. ఇది పిల్లలకు గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తని పెంచుతుంది. అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది.                                         *నిశ్శబ్ద.

మీ పిల్లలు బాగా ఒత్తిడిగా ఫీలవుతున్నారా?  ఈ పనులు చేయండి!

మీ పిల్లలు బాగా ఒత్తిడిగా ఫీలవుతున్నారా?  ఈ పనులు చేయండి! ఒత్తిడి అనేది కేవలం పెద్దవారిలో మాత్రమే కాదు.. పిల్లలలో కూడా ఉంటోంది. నేటికాలంలో పరీక్షలు, ర్యాంకులు, పెద్ద స్కూళ్లలో సీట్లు, ప్రాజెక్ట్ లు, ఇంకా చిన్న వయసులోనే పెద్ద టార్గెట్లు. ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు.. ఇలా ఒకటనేమిటి చిన్న బుర్రలకు ఉరుకులు పరుగులే సరిపోతున్నాయి. ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లలో  ఈ ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. పిల్లలతో ఏ విషయాన్ని అయినా ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడాలి. దీని వల్ల పిల్లలకు కూడా వారి మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పడం సాధ్యమవుతుంది. పిల్లలలో భయాలు, ఆందోళనలు, మనసులో ఉన్న దిగులు ఇలా అన్నీ పిల్లలు చెప్పగలుగుతారు. కాబట్టి పిల్లలతో ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్లకు ఉన్నట్టుగా పిల్లలు కూడా తమ పనులు చేసుకోవడానికి టైం టేబుల్ ఏర్పాటు చేయాలి. దీన్ని పిల్లల అభిరుచికి తగ్గట్టు వాళ్లతోనే చేయించాలి. భోజనం, హోం వర్క్, ఆడుకునే సమయం, అభిరుచుల కోసం సమయం ఇలా అన్నింటికి సమయం కేటాయించాలి. ఇది పిల్లలకు పనులు సులువుగా సమయానికి పూర్తీ చేసి ఒత్తిడి తగ్గిస్తుంది. పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైల్ అవసరం అవుతుంది. పిల్లు తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం వంటివి పాటిస్తుంటే వారిలో భావోద్వేగాలు కూడా నిలకడగా ఉంటాయి. పెద్దలు చాలామంది మానసికంగా నిలకడగా లేకపోతే కోపం చేసుకోవడం, అరవడం, చికాకు ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఈ మానసిక నిలకడ కోసం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం, గైడెడ్ ఇమేజరీ వంటి మానసికి రిలాక్సేషన్ పద్దతులను పిల్లలతో సాధన చేయించాలి. పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. పిల్లలను ఆడుకోవద్దని తిడితే వారు కోప్పడతారు. అయితే వారు ఆడుకుంటూ ఉంటే సరిగ్గా చదవరని తల్లిదండ్రుల భయం. అందుకే పిల్లల ఆటలకు సమయం కేటాయించాలి. పిల్లలలో ఆటల పట్ల ప్రతిభ కనిపించినట్లైతే ఆ ఆటలలో కూడా పిల్లలను ప్రోత్సహించాలి. ఆటలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపస్తుంది. గెలుపు ఓటమిలను సమానంగా తీసుకునే మెంటాలిటీ అలవాటు అవుతుంది. పిల్లలు మొబైల్ ఫోన్, టీవి, కంప్యూటర్ వంటివి చూడటానికి వారికి ఓ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. దీనివల్ల వారు ఫోన్ కు అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇది వారి కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలు చాలావరకు పెద్దలను చూసి తాము కూడా పనులు చేస్తుంటారు. ఈ అనుకరణ వల్ల పిల్లల విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదు అంటే తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు రోల్ మోడల్స్ లా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారనే భరోసా ఇవ్వాలి. ఇలా ఉంటే పిల్లలు ఒత్తిడి ఫీల్ కారు. ఇంట్లో కూడా పిల్లలకు అనువైన వాతావరణం ఉంచాలి. పిల్లల  భవిష్యత్తు ముఖ్యం కాబట్టి వారి గురించే ఆలోచించాలి. ఏ విషయాన్ని అయినా ఓపికతో పరిష్కరించాలి.          *నిశ్శబ్ద.

పిల్లలలో ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ ఇదొక్కటి పెట్టండి చాలు!

పిల్లలలో ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ ఇదొక్కటి పెట్టండి చాలు! పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? ఏం తాగాలి అన్న విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. దానికి తగ్గట్టే ఆహార పానీయాలు తీసుకుంటారు. కానీ చిన్నపిల్లలకు తమ దీమ తమకు ఆరోగ్య అవగాహన ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం ఇవ్వడమంటే పెద్ద టాస్క్ లానే ఉంటుంది.  పిల్లలు ఏదీ సరిగ్గా తినరు, తాగరు. ఏమైనా బలవంతంగా పెట్టాలని చూసినా సగం సగం తిని పారిపోతారు. ఇలాంటి పిల్లలకు పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలకు సరిపడినంత కాల్షియం, ఐరన్ లభించకపోతే చాలా ఇబ్బందులు, పోషకాహార లోపం ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి పిల్లలకు తెలివిగా ఆహారం ఇవ్వాలి. ఒకే ఒక్క ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలలో చాలా పోషకాలు భర్తీ అయ్యేలా ప్లాన్ చెయ్యాలి. దీనికి నువ్వుల లడ్డు బెస్ట్ ఛాయిస్. పిల్లలకు రోజులో ఏదో ఒక సమయంలో నువ్వుల లడ్డు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే.. నువ్వులు చిన్నపిల్లలకు, మహిళలకు చాలా ముఖ్యమైన ఆహారం.   ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగి ఉంటుంది. నువ్వులలో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి పిల్లలలో ఎముకలు, కండరాల పెరుగుదలకు చాలా సహాయపడతాయి.  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. నువ్వుల లడ్డును ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వారిలో జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. నువ్వులలో ఉండే మంచి కొవ్వులు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం  నాడీ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వారికి ఆడుకోవడం అంటే ఇష్టం. కానీ కొంతమంది పిల్లలు కొద్దిసేపు ఆడుకోగానే అలసిపోయి నీరసంగా ఫీలవుతారు. ఇలాంటి పిల్లలకు రోజూ నువ్వుల లడ్డు తినిపిస్తే వారిలో శక్తి పెరుగుతుంది. నువ్వులలో ఉండే పోషకాలు పిల్లలకు గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాయి. పిల్లలు రోజు మొత్తం చురుగ్గా ఉండేలా చేస్తాయి. పిల్లలో ఎక్కువగా కనిపించేది కాల్షియం లోపం. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నువ్వులలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్దకం సమస్య అస్సలు దరిచేరదు.   యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల నువ్వులు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో సీజనల్ సమస్యల నుండి పిల్లలను దూరం ఉంచాలంటే నువ్వుల లడ్డు పర్పెక్ట్.                                                   *నిశ్శబ్ద.  

చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివే!

చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివే! పిల్లలు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి కలలు కంటారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి స్థాయికి చేరాలని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు తమకు తెలియకుండానే కొన్నితప్పులు చేయడం వల్ల పిల్లలు చదువులో వెనుకబడతారు.  కేవలం పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనే కాదు తల్లిదండ్రులు కూడా తగినంత శ్రద్ద తీసుకుంటేనే పిల్లలు చదువులో రాణిస్తారు. లేకపోతే తరగతిలో వెనుకబడి ఉండటం, పరీక్షలలో పేలవమైన మార్కులు. చదువుకోవాలనే ఆసక్తి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకని వాటిని పాటిస్తే  పిల్లలు చదువులో మెరుగవుతారు. పిల్లలు పరీక్షలలో ఒక సబ్జెక్ట్ లేదా అన్ని సబ్జెక్ట్ లలో మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నా,  వారు చదువు పట్ల  నిరాసక్తిగా ఉన్నా దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను చూసి విసుక్కుంటారు. వేలరూపాయలు పోస్తున్నా చదవడం లేదని వేపుకు తింటూంటారు. అందుకే పిల్లలు తమ సమస్యను తల్లిదండ్రులతో చెప్పలేకపోతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూరితంగా మాట్లాడుతూ వారి సమస్య అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం ఆలోచించాలి. పిల్లలు తరగతిలో బోధించే విషయాల మీద శ్రద్ద చూపించకపోతే  తల్లిదండ్రులు పిల్లలో ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నించాలి.  తరగతిలో ఏం చెబుతున్నారు, ఎందుకు అర్థం కావడం లేదు వంటి విషయాలను   తెలుసుకుని వాటికి అనుగుణంగా పిల్లలకు విషయావగాహన పెంచాలి. పిల్లలు చదువులో వెనుకబడటానికి ప్రధాన కారణం వారికి విషయం అర్థం కాకపోవడం. కొందరు పిల్లలు విషయాన్ని రెండు మూడుసార్లు మళ్లీ మళ్లీ రివిజన్ చేస్తే తప్ప పూర్తీగా అర్థం చేసుకోలేరు. ఇంటి దగ్గర పిల్లలతో ఇవన్నీ చేయించే బాధ్యత తల్లిదండ్రులదే. చదువు విషయంలో పిల్లలు బట్టీ పడుతుంటే దాన్ని తల్లిదండ్రులే నివారించాలి. ఇది చాలా చెత్త అలవాటు. ఇంటి దగ్గర పిల్లలన చదివిస్తున్నప్పుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి దాన్ని ఆపు చేయించాలి. విషయాన్ని అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో వివరించి చెప్పాలి. దీని వల్ల పిల్లలకు విషయం మీద స్పష్టత వస్తుంది. చాలామంది ఒంటరిగా చదువుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. పిల్లలను కలసి చదువుకునే ప్రోత్సహిస్తే వారిలో చాలా స్కిల్స్  డవలప్ అవుతాయి. ముఖ్యంగా నలుగురిలో మాట్లాడటం అనే విషయంలో బిడియం పోతుంది. స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంటి దగ్గర పిల్లలకు ఓ ప్రణాళిత ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. దీని వల్ల పిల్లలు ఏ సమయానికి ఏది పూర్తీ చెయ్యాలో స్పష్టతతో ఉంటారు. ఆటల నుండి చదువు వరకు అన్ని విషయాలలో సాటిసిపై అవుతారు.                                                       నిశ్శబ్ద.  

పిల్లలలో అరుదైన వ్యాధి.. ఒక్క ఇంజెక్షన్ 17కోట్లు..

పిల్లలలో అరుదైన వ్యాధి.. ఒక్క ఇంజెక్షన్ 17కోట్లు.. ఇంతకూ ఇదేంటంటే.. పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో కొన్నింటికి వైద్యం చేయించాలంటే లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది. కానీ పిల్లలలో వచ్చే ఒక అరుదైన వ్యాధికి  వేసే ఇంజక్షన్ ధర ఏకంగా 17కోట్లని మీకు తెలుసా? ఈ మధ్యనే ఢిల్లీకి చెందిన ఒక పిల్లాడికి ఈ వ్యాధి రావడంతో ఈ వ్యాధి గురించి చర్చ నడుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ పిల్లాడి వైద్యం కోసం ఫండ్స్ సేకరించి మరీ వైద్యానికి సహకారం అందించారు.  సగటు  పౌరుడి ఊహకు కూడా అందని ఇంత మొత్తం డబ్బును ఖర్చు చేయించే  ఈ వ్యాధి ఏంటి? దీనికి అంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? వీటి గురించి  పూర్తీగా తెలుసుకుంటే.. ఢిల్లీకి చెందిన కనవ్ జాంగ్రా అనే 18నెలల పిల్లాడికి చాలా అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్ -1 అనే వ్యాధి వచ్చింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంలో కండరాలు చాలా బలహీనంగా మారిపోతాయి.  శరీరంలో మెదడు, వెన్నెముక, నాడీ కణాలలో లోపాల కారణంగా ఇది వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడం లేదా చనిపోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దీనికి భారతదేశంలో చికిత్సలేదు. ఈ వ్యాధికి మందు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అది  కూడా ఒక ఇంజెక్షన్ రూపంలో దీనికి మందు లభ్యమవుతుంది. కానీ ఈ ఇంజక్షన్ ఖరీదు ఏకంగా 17కోట్లు. ఈ ఇంజెక్షన్  పేరు బోల్జెన్స్మా.   ఈ జబ్బు సాధారణంగా పెద్ద పిల్లలోనూ, చిన్నపిల్లలలో కూడా వస్తుంది. కానీ ఎక్కువ శాతం చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన 18నెలల పిల్లాడికి ఈ వ్యాధి సోకిందని తెలియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు. అయితే ఆయన అంత ప్రయత్నం చేసినా 10కోట్లా  50లక్షలు మాత్రమే పోగయ్యాయి.  కానీ ఈ వ్యాధికి మందు తయారుచేసి అందించే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెద్ద మనసు చాటుకుంది. 17కోట్ల విలువైన మందును కేవలం 10.5కోట్లకే పిల్లాడికి ఇచ్చింది. ఈ వ్యాధి కారణంగా 18నెలల ఈ పిల్లాడు కూర్చోలేడు, నడవలేడు, ఏ పనీ చేయలేడు. పాపం తెలిసీ తెలియని వయసులో తనకేమయ్యిందో అర్థం కాక నరకయాతన అనుభవించాడు. ఆ దేవుడు ఈ పిల్లాడి యాతన చూసి చలించాడో ఏమో కానీ పిల్లాడికి వైద్యం అందేలా చేశాడు. ఇంజెక్షన్ వేసిన తరువాత ఈ పిల్లాడు సాధారణ పిల్లల్లా కూర్చోవడం, నడవడం చేస్తున్నాడు. అన్ని రోజులు పిల్లాడి గురించి తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞత తెలుపుకున్నారు. పిల్లలలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, చిన్నతనంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ఆ వయసులోనే పరిష్కరించడం వల్ల పిల్లలకు ప్రమాదం తప్పినట్టు అవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు.                                                            *నిశ్శబ్ద.  

డ్రీమ్ ఫీడింగ్.. పిల్లలు రాత్రిళ్ళు నిద్రలేవడమనే సమస్యే ఉండదు!

డ్రీమ్ ఫీడింగ్..  పిల్లలు రాత్రిళ్ళు నిద్రలేవడమనే సమస్యే ఉండదు.. ఈ సృష్టిలో తల్లికావడం చాలా గొప్ప  విషయం. చెప్పలేనంత అనుభూతి తల్లుల సొంతం.కొత్త తల్లి మనస్సులో శిశువుకు సంబంధించి అనేక ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. బిడ్డకు స్నానం చేయించడం నుంచి తల్లి పాలివ్వడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి గందరగోళాల మధ్య కొత్త తల్లులకు మరొక సవాల్ రాత్రిపూట ఎదురవుతుంది.  రాత్రిపూట శిశువుకుపాలు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది.నవజాత శిశువులు తరచుగా రాత్రి సమయంలో మేల్కొంటారు.  ఈ సమయంలో బిడ్డకు  తల్లి  పాలు ఇవ్వడం, బిడ్డ నిద్రలోకి జారుకోవడం,  ఆ తరువాత మరికొద్దిసేపటికే  బిడ్డ మేల్కోవడం జరుగుతుంటుంది. దీనివల్ల తల్లికి నిద్రకరువవుతుంది. కానీ 'డ్రీమ్ ఫీడ్' బిడ్డకు మంచి నిద్రను ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఇది మంచి ఎంపిక కూడా. అసలు  డ్రీమ్ ఫీడింగ్ అంటే ఏమిటి?  ఎలా చేయాలి?  ఎప్పుడు చేయాలి?  వీటికి సమాధానం తెలుసుకుంటే ఇవి చంటి బిడ్డలున్న తల్లులకు ఎంతగానో ఉపయోగపడతాయి. డ్రీం ఫీడింగ్ అంటే ఏమిటి? డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలో బిడ్డకు పాలివ్వడం. డ్రీం ఫీడ్ సాధారణంగా రాత్రి 10 లేదా 11 గంటలకు నిద్రపోయే ముందు చేయాలి. ఇది రాత్రంతా శిశువు  కడుపు నిండుగా ఉంచుతుంది. బిడ్డ  చాలా కాలం పాటు ప్రశాంతంగా నిద్రించగలడు. డ్రీమ్ ఫీడింగ్ ఎలా చేయాలి? డ్రీం ఫీడింగ్ కోసం ప్రతిరోజూ ఒకే సమయంలో శిశువును నిద్రపోనివ్వాలి. ఇలా అలవాటు చేస్తే ఈ ఫీడింగ్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది.  అదే సమయంలో రాత్రి 10 లేదా 11 గంటలకు తల్లి పిల్లవాడిని ఎత్తకుండా, నిద్రలేపకుండా మెల్లగా పక్కన పడుకుని బిడ్డ నోటి దగ్గర తల్లి రొమ్మును సున్నితంగా అందివ్వాలి.  బిడ్డ స్వయంచాలకంగా పాలు తాగడం ప్రారంభిస్తాడు.ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి.  ఇలా ఎత్తుకునేటప్పుడు లైట్ ఆన్ చేయవద్దు, తద్వారా అది బిడ్డ నిద్రకు భంగం కలిగించదు.  అంతేకాదు అవసరమనే కారణంతో డైపర్‌ను కూడా మార్చవద్దు. అయితే తల్లులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రీమ్ ఫీడ్ లు ఎప్పుడూ మొదటిసారే విజయవంతం కావు. కాబట్టి కొంత సమయం తీసుకోవాలి.   శిశువు అలవాటు పడే వరకు డ్రీమ్ ఫీడ్‌ని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా సార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో పూర్తిగా పాలు తాగుతారు,  ఉదయం వరకు నిద్రపోతారు.  కానీ కొందరు పిల్లలు డ్రీమ్ ఫీడ్ తర్వాత కూడా చాలా సార్లు రాత్రి మేల్కొంటారు. కొన్నిసార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో మేల్కొంటారు, తర్వాత చాలా సేపు మెలకువగా ఉంటారు. ఇది సక్సెస్ కావాలంటే సమయం పడుతుంది. తల్లులు నిరాశతో దీన్ని ఆపకుండా రోజూ ప్రయత్నిస్తుంటే ఇది సక్సెస్ అవుతారు. లాభాలేంటంటే.. డ్రీమ్ ఫీడ్ తో బిడ్డ ఎక్కువ సేపు నిద్రపోతాడు. ఇది పిల్లలకు అలవాటైతే   పిల్లలు ఉదయం నేరుగా మేల్కొంటారు. ఇదొక మంచి అలవాటుగా మారుతుంది. డ్రీం ఫీడింగ్ తల్లి,  బిడ్డ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి తల్లులు  నిరాశ పడకుండా దీన్ని అలవాటు చేయడం మంచిది.                                                                      *నిశ్శబ్ద.

ఇన్ఫ్లుఎంజా వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

ఇన్ఫ్లుఎంజా వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి? ప్రస్తుత కాలంలో ఇన్ఫ్లుఎంజా-ఎ వైరస్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా  మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లోనో,  రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్ఫ్లుఎంజా రూపాంతరం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది, సోకిన వారిలో కొందరు ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని తీవ్రమైన వ్యాధిగా..  ప్రాణాంతకమైన సమస్యగా పరిగణిస్తున్నారు. పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలి నివేదికలలో, ఆరోగ్య నిపుణులు H3N2 ప్రభావం గరిష్టంగా పిల్లలలో కనిపిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా తీవ్రమైన వ్యాధితో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. విచారించాల్సిన విషయమేమిటంటే..  H3N2తో పాటు, అనేక రాష్ట్రాలలో H1N1 కేసుల పెరుగుదల కొనసాగడం. దేశంలో పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ఆరోగ్య నిపుణులు పిల్లల కోసం ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.  ఇదెప్పుడు తగ్గుతుంది? హెచ్‌3ఎన్‌2తో సహా సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా ద్వారా వచ్చే వ్యాధులు మార్చి నెలాఖరు నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. అయితే అప్పటి వరకు దీనిని నివారించేందుకు ప్రజలంతా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం, దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు కూడా నమోదవుతున్నాయి, వీటిలో చాలా లక్షణాలు H3N2 మాదిరిగానే ఉండటం కాస్త గందరగోళ పరిచే విషయం. H3N2 ప్రభావం పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కూడా తీవ్రమైన లక్షణాలు కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో ICUలో ఉంచాల్సి రావచ్చు.  యాంటీ బయటిక్స్ వాడొచ్చా? సాధారణ మందులు వాడటం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా చాలా ఇన్ఫ్లుఎంజా కేసులు నయమవుతాయి, అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ మందులు తీసుకోవడం మంచిది. H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ పని చేయనప్పటికీ, చాలా మంది తమంతట తాముగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్య వచ్చిన పిల్లలకు సొంతంగా యాంటీబయాటిక్స్ ఇవ్వవద్దని వైద్యులు తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. మీకు ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించి, వారు సూచించిన మందులను మాత్రమే వాడాలి. వైద్యులు H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు  సూచించారు, వీటిని అనుసరించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోటిని కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలి.. క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.   కరోనా సమయంలో ఎలాగైతే ఫేస్ మాస్క్ ధరించారో.. అలాగే ఇప్పుడూ జాగ్రత్తగా ఫేస్ మాస్క్ మైంటైన్ చెయ్యాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం ఉత్తమం. చేతులతో ముక్కును నోటిని పడే పడే తాకడం మానుకోవాలి.   శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి, ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి. జ్వరం, ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటే.. పారాసెటమాల్ తీసుకోవచ్చు. ఇవి తప్ప సొంతంగా ఎలాంటి మందులూ వాడకపోవడం ఉత్తమం. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.                                    ◆నిశ్శబ్ద.

పిల్లల పేచీ శాస్త్రం

పిల్లల పేచీ శాస్త్రం ఒకోసారి పిల్లలు పెట్టే పేచీలు అర్థం కావు. ఎందుకు ఇంత చిన్న విషయానికి  పేచీ పెడుతున్నారు అనుకుంటాం.  మొండిగా, ఎదురు సమాధానం చెప్పగానే మనకి కోపం వస్తుంది. కానీ పిల్లలలోని ఇలాంటి పేచీలకి, మొండితనానికి మూలాలు తెలుసుకోకుండా ఆ నిమిషానికి  ఏదో ఒకటి సర్దిచెప్పటమో, లేదా గట్టిగా అరచి ఉరుకోబెట్టటంతోనో  ఎలాంటి లాభం ఉండదు అంటున్నారు నిపుణులు. పదే పదే పిల్లలు పేచీ పెడుతుంటే ఒక్కసారి వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు అని ఆలోచించాలి. కొంతమంది పిల్లలకి అమ్మ వాళ్ళతో సరిగ్గా సమయం గడపకపోతే కోపం, ఉక్రోషం వస్తాయి. అది ఎలా వ్యక్తం చేయాలో తెలియక అమ్మతో ఏదో ఒకరకంగా గొడవకి దిగుతారు.   ఎదురు చెబుతారు. ఏడుస్తారు.  అలాంటప్పుడు అమ్మ వాళ్ళతో ఆడుకోవటం, దగ్గర కూర్చుని చదివించటం, కథలు చెప్పటం వంటివి చేస్తే పిల్లలు ఉషారుగా వుంటారు.  అమ్మ చెప్పినట్టు వినటానికి ప్రయత్నిస్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. కానీ పదే పదే అమ్మ, నాన్న వాళ్ళని ఇలా వుండు, అలా వుండు అని చెబుతుంటే నచ్చక  ఆ చికాకుని  పేచీలుగా బయట పెడతారు. ఒకటి రెండుసార్లు పిల్లలు నాకు తెలుసు అనటం విన్నాక అర్థం చేసుకుని వాళ్ళని డిమాండ్ చేయకుండా, నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడితే పిల్లలు కూడా పంతానికి పోకుండా వుంటారు. అంతే కాకుండా పిల్లలు ఎదురు చెప్పగానే మనం కూడా వెంటనే రియాక్ట్  అవకుండా, చూసి చూడనట్టు వదిలేయాలి. అలా అని వాళ్ళకి మంచి, చెడు చెప్పద్దని కాదు. కానీ పిల్లలకు అర్థం అయ్యేలా ఏదన్నా చెప్పాలంటే దానికి ఎమోషన్స్‌ని చేర్చకూడదు. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మూడ్ చూసి నువ్వు నిన్న చేసింది కరక్టేనా? అలా చేయకూడదు కదా? అని నెమ్మదిగా చెబితే వాళ్ళు ఆలోచనలో పడతారు. ఇంకోసారి వాళ్ళ చికాకుని మీకు ఎలా చెప్పాలో నేర్చుకుంటారు. పిల్లల పేచీలని గమనిస్తూ , వాటికి శాశ్వత పరిష్కారం వెతకటం ఎలా అంటే పిల్లల మానసిక నిపుణులు చెప్పే సమాధానం ఒక్కటే... చిన్నప్పటి ఆ పేచీలే పెరిగి పెద్ద అవుతున్న కొద్ది వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి, మాటవినని దశకి తీసుకువస్తాయి. అందుకే చిన్నగా ఉన్నప్పుడే సమస్య ములాలని గుర్తించి, పిల్లలతో మాట్లాడితే వాళ్ళు క్రమంగా నేర్చుకుంటారు. నచ్చలేదు అన్న విషయాన్నిఎలా చెప్పాలి... మనసులో వున్న బాధని, కోపాన్ని ఎలా ఎదుటివాళ్ళకి చేర్చాలి అన్నది పిల్లల ఎదుగుదలలో నేర్చుకోవలసిన ప్రథమ పాఠం.దానికి టీచర్లం మనమే. కొంచం ఓర్పు, మరికొంచం నేర్పుతోనే అది సాద్యం .

Dealing with Picky Eaters

Dealing with Picky Eaters   Getting kids to eat food is definitely not a joke!,,infact, getting them to try a new veggie or a new dish is so tough. They have issues with foods that look green, that taste sour, which have tomatoes....everything is a problem..i just dont understand why they refuse to try anything..i wonder if the older generations were like this, or is it because i had a picky eater i feel this is the only tough generation ?! They ask for something to eat and by the time we prepare it, they dont want it anymore...ufff, thats it ! We have to do something about changing this frustrating pattern. Lets get started ... To deal with picky eaters, we have to start with very small portions. Use positive words such as 'This is a very small bowl of boiled green peas, it is so easy to eat', instead of threatening the child using words such as 'if you dont finish it faster, i am going to take away your toys'. Once the child finishes the offered peas, give him/her a favorite food. Appreciate even if they try just once or two pieces of a new food or vegetable, though it is frustrating and disappointing that you made it spending your time and they try only a bit. Offer new foods during snack time, incase they dont like it, their mood or after-taste will not spoil their interest to eat a meal. Keep offering a certain new item again and again, instead of asking once and stopping to offer again if they refuse the first time. Offering kids treats and drinks more than healthy foods such as fresh fruits, dairy and vegetables tends to decreas their interest to try the latter ones, as they know they have an alternate choice. You offer only healthier food, they will have no choice but to accept to try it. Spacing snack time and meals is also important..appropriately spaced snack time and meals do more good to them, compared to the too closely spaced schedules that force them to not feel hungry and end up not eating properly and leaving them disinterested to eat well. Making friends with healthy eaters is a smarter option, as kids learn silently and tend to mimic friends most of the time. I understand that a bad company spoils everything, friends of your kids may be good eaters but if their parents dont follow healthy rules, their kids end up eating more of unhealthy foods and then you child goes their for playdates and learns the same stuff...who will you explain ? Will you teach their kids to eat healthy, or will you explain their parents the harm unhealthy foods do to anyone..would they even listen, forget about following you ?! Hence, it is so good important to teach about nutrition and food values to our own children. Parents should be the examples for everything good...you eat fruits and veggies and they will follow...even if you dont like a certain food, kindly dont annouce your disinterest aloud. Also observe if your child has any food allergy or any irritation and if that be the reason he/she is refusing to try a certain food the second time. Go slow and steady with introducing new food. Follow a Step by step speed. Introduce another new food only after the child likes a particular new item she/he has tried and liked and eaten thrice. Eating together at a dining table, as a family brings alot of better change...right from the day of the child's first solid food, if they sit with the family for meals, they observe everyone having the family meals and register that they eat what the family eats. Meal time should be the best family time of the day, every day. Handling picky eaters is easier when we keep our cool, with no frustrations amd jitters. Pediatricians say that most children pass through this stage during their 3-4yrs age. Keep this in mind and dont worry...once this phase fades outs, you will naturally see your child trying new foods and asking for new tastes....very soon your picky eater will be a healthy eater. - Prathyusha