English | Telugu

అమ్మ బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళళపోయాను..ఏలిమినేట్ ఐన శ్వేత  

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇక 13 వ ఎపిసోడ్ లో శ్వేతా, ప్రసన్న కుమార్ ఏలిమినేట్ ఇపోయారు. అంటే 15 మందిలో ఇప్పుడు కేవలం 13 మంది మాత్రమే మిగిలారు. మూటలను హోల్స్ లో వేసే టాస్క్ లో హరీష్, శ్వేతా జోడి ఆడారు. కానీ ఆ టీమ్ ఓడిపోయింది. దాంతో బిందు రెడ్ కార్డు ఇచ్చింది. ఆల్రెడీ శ్వేతా దగ్గర ఒక ఎల్లో కార్డు ఉంది. ఇప్పుడు ఓడిపోవడంతో ఇక ఏలిమినేట్ చేసేసారు. "బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తోంది అంటే నేను అన్నిటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాను. కానీ నేను చాలా ట్రై చేశాను. నేను బిగ్ బాస్ హౌస్ లోకి మా అమ్మను తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ కుదర్లేదు" అని చెప్పింది శ్వేతా.

ఇక శ్రీముఖి కూడా "మూటలు ఎందుకు మీరు వేయాల్సింది కదా శ్వేతా ఎందుకు వచ్చింది" అని అడిగింది. "నేను వేస్తాను అని చెప్పాను. ఐతే శ్వేతా ఎం అన్నదంటే నేను రిస్క్ లో ఉన్నాను. ఆడి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. తనకంటే నేను బాగా ఆడతాను అని చెప్పాను కానీ తానే వద్దు అంది" చెప్పాడు. "మరి మీరు వేస్తాను అని చెప్పి శ్వేతాను ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు" అంటూ నవదీప్ అడిగాడు. "నేను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నేను వేస్తాను అని చెప్పాను. ఐతే తాను షాట్ ఫుట్ ఆడిన పర్సన్. ఐతే ఇది లైఫ్ అండ్ డెత్ టాస్క్ నేనే ఆడతా అంది. తన లైఫ్ తనకు సంబంధించింది కాబట్టి తనకు ఇచ్చేసాను" అని చెప్పాడు. అలా శ్వేతా కూడా ఏలిమినేట్ ఐపోయింది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.