English | Telugu

Jayam serial: బెస్ట్ ఆర్గనైజ్ అవార్డ్ సొంతం చేసుకున్న పెద్దసారు.. పారు ప్లాన్ అదే!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -157 లో.. పెద్దసారుకి ఎవరో ఒకతను ఫోన్ చేసి ఫుడ్ ఫెస్టివల్ మీరు ఆర్గనైజ్ చేశారు కదా.. దానికి గాను మీకు బెస్ట్ ఆర్గనైజ్ అవార్డ్ వచ్చిందని చెప్పడంతో పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తాడు. అప్పుడే రుద్ర వస్తుంటే అందరు కంగ్రాట్స్ అని చెప్తారు. మీ వల్లే సక్సెస్ అయింది.. మినిస్టర్ గారికి దగ్గర ఉండి మరి అన్ని ఎక్స్ ప్లెయిన్ చేసావ్.. గంగ తన ప్రాణాలు అడ్డుపెట్టి మినిస్టర్ ని కాపాడిందని పెద్దసారు అంటాడు.

ఇషిక, వీరు మీక్కూడా స్పెషల్ థాంక్స్ అని పెద్దసారు చెప్పగానే.. చేసింది ఇషిక, వీరు అయితే వాళ్ళని పొగడడం ఎందుకని శకుంతల అంటుంది. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. వచ్చావా ఇంకా రాలేదేంటి అనుకున్నానని పెద్దసారు అంటాడు. ఒక గుడ్ న్యూ స్ చెప్పడానికి వచ్చాను. నేను రాబోయే ఛాంపియన్ షిప్ లో పార్టీసిపేట్ చేస్తున్నానని పారు చెప్తుంది. నేనే ఎలాగూ గెలుస్తానని పారు పొగరుగా మాట్లాడుతుంటే.. తన పొగరుని తగ్గించడానికి నేను నిన్ను ఓడిస్తానని గంగ చెప్తుంది. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ రోజే రుద్ర, గంగల శోభనం అని పెద్దసారు చెప్తాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ఇందుమతికి పెద్దసారు చెప్తాడు.

ఆ తర్వాత రుద్ర గదిలో ఉండగా గంగ లోపలికి వెళ్తుంది. నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా అని రుద్ర అనగానే తెలుసు సర్ మీ లక్ష్యం నా ద్వారా నెరవేరాలని కోరుకుంటున్నారు.. నాకు తెలుసని గంగ చాప తీసుకొని వచ్చి నేలపై పడుకుంటుంది. థాంక్స్ గంగ అని రుద్ర అంటాడు.

అప్పుడే రుద్రకి పారు ఫోన్ చేసి.. నువ్వు లేకుండా నేను ఉండను చనిపోతున్నానని ఫోన్ కట్ చేస్తుంది. రుద్ర టెన్షన్ గా మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు పారు తన ఫ్రెండ్ ని మాట్లాడమని చెప్తుంది. సర్ పారు డిప్రెషన్ లో ఉందని సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. మీరు ఎక్కడున్నా ఇక్కడికి రండి అని ఆమె అనగానే వస్తున్నానని రుద్ర అంటాడు. ఆమె సిటీ హోటల్ అని తను ఉండే అడ్రెస్ చెప్తుంది. రుద్ర కంగారుగా బయల్దేరతాడు. పారు తన ఫ్రెండ్ కలిసి రుద్రని ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.