English | Telugu

Karthika Deepam 2 : సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్.. షాక్ లో కార్తీక్!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -557 లో... దీప తులసి చెట్టుకి దీపం పెడితే అది ఆరిపోతుంది. దాంతో దీప కంగారుపడుతుంది. అప్పుడే కార్తీక్ వచ్చి మాట్లాడతాడు. దశరథ్ వచ్చి.. ఒరేయ్ కార్తీక్ హాస్పిటల్ కి వెళదాం.. ఈ రోజు రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ ఒక్కడినే రమ్మంది కానీ నాకు భయంగా ఉంది. అందుకే నిన్ను రమ్మంటున్నానని అనగానే కార్తీక్ సరే మావయ్య అని దశరథ్ వెంట వెళ్తాడు.

దశరథ్ టెన్షన్ పడుతూ సుమిత్రకి ఏం ప్రాబ్లమ్ లేదు కదా అని అడుగుతాడు. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు. డాక్టర్ మీరు అతనికి బీపీ చెక్ చెయ్యండి అని డాక్టర్ తో దశరథ్ ని వెళ్ళమని ఇంకొక డాక్టర్ చెప్తుంది. దశరత్ తో కార్తీక్ వెళ్తుంటే.. మీరు ఆగండి అని డాక్టర్ చెప్తుంది. మా అత్తకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని కార్తీక్ అడుగుతాడు. ఉందని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. మరొకవైపు పారిజాతం హాల్లో కూర్చొని దీపని కాఫీ తీసుకొని రమ్మంటుంది. దీప కాఫీ తీసుకొని రాగానే కావాలనే కాఫీ కప్పు కిందపడేస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి కోప్పడతాడు. ఆ కాఫీ నువ్వే క్లీన్ చెయ్యమని చెప్తాడు. దాంతో తప్పక పారిజాతం క్లీన్ చేస్తుంది. ఆ దీప ఎందుకే ఏడుస్తుంది. ఎందుకంటావ్.. ఏదో జరుగుతుందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.


మరొకవైపు మీ అత్తకి ప్రాబ్లమ్ ఉంది. అది మీ మావయ్యకి చెప్తే తట్టుకోలేడని పంపించాను. మీ అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. రెండు రోజుల్లో అడ్మిట్ కావాలి.. ఇంకా టెస్ట్ లు ఉన్నాయి. అవి చేసాక ఏం చెయ్యాలో చెప్తానని డాక్టర్ చెప్తాడు. మీరు పేషేంట్ కి ఈ విషయం చెప్తే భయపడుతుంది. తనకి తెలియకుండా చూడండి అని డాక్టర్ చెప్తుంది. అప్పుడే దశరథ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు మావయ్య చిన్న ప్రాబ్లమ్ అని చెప్పి దశరథ్ ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.