English | Telugu

ఓటిటి కన్నా యూట్యూబ్ చాలా డేంజర్

ఆలీతో సరదాగా షో కొత్త కొత్త అంశాలను బయటికి తెస్తూ ఉంటుంది. ఇక రాబోయే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి అశ్వినీదత్ గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అశ్వనిదత్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఓటిటి వ్యవస్థ కారణంగా థియేటర్లకు ఎవరూ వచ్చే అవకాశం ఉండదు కదా దీనిపై మీ అభిప్రాయం అని ఆలీ అడిగేసరికి ఓటిటి ఎంత మాత్రం ప్రమాదకరం కానీ కాదు యూట్యూబ్ ఈజ్ టూ డేంజరస్ అని చెప్పారు. ఆలీ తో సరదాగా షోకి అశ్వనీదత్ వచ్చి ఇద్దరూ కొట్టుకున్నారు అని యూట్యూబ్ లో పెడితే చాలు అన్ని పనులూ ఆపేసి మరీ ఆ న్యూస్ ని చదివేస్తారు.

ఇటీవలి కాలంలో చూస్తే స్ట్రైక్ అవి ఎక్కువయ్యాయి అని అడిగేసరికి మరి థియేటర్స్ రన్ అవ్వట్లేదు కదా. ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్గురు నలుగురు తమ చేతుల్లో పెట్టుకుని అన్ని థియేటర్స్ ని బ్లాక్ చేసేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ k సినిమా షూటింగ్ మొత్తం ఐపోయినట్టేనా అన్న ప్రశ్నకు చాలా వరకు పూర్తయ్యింది స్ట్రైక్స్ అవీ లేకపోతే షూటింగ్ పూర్తయ్యేది అన్నారు. ఇండస్ట్రీలో భారీ నిర్మాత అంటే అశ్వని దత్ పేరే చెప్తారు మరి మీరెందుకు నిరాశకు గురౌతున్నారు అన్న ప్రశ్నకు శక్తీ మూవీ తన లైఫ్ లో కోలుకోలేని దెబ్బ తీసిందని..ఆ మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళ నాన్న చనిపోవడం, రజనీకాంత్ గారు మాట వినకపోవడం, తన భార్య మాటల్ని లక్ష్య పెట్టకపోవడం అన్ని కలిసి తనని శక్తి హీనుడిని చేశాయని చెప్పుకొచ్చారు. బెస్ట్ ప్రొడ్యూసర్ స్వప్ననా, అశ్విని దత్త అని అడిగేసరికి ఈ తండ్రైనా తమ పిల్లలు తమని డామినేట్ చేస్తే చూడాలని అనుకుంటారు కదా నేను అంతే అని నవ్వేశారు అశ్వని దత్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.