English | Telugu

గోవాలో బట్టల్లేకుండా క్లిప్స్ తీసిన రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్" పేరుతో షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ ప్రసాద్, వాళ్ళ వైఫ్ సునీత, రాంప్రసాద్ మధ్య జరిగిన కామెడీ కన్వర్జేషన్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. "బాబాయ్ గా మొన్న మీ రీల్స్ చూసాను ఇంకొన్ని రీల్స్ చేయొచ్చుగా" అని రాంప్రసాద్ పంచ్ ప్రసాద్ ని అడిగాడు. "చేద్దామనుకున్నాను ఎక్కడా ఉత్తినే నీరసపడిపోతేనూ" అంటూ వాళ్ళావిడ సునీత మీద కౌంటర్లు వేసాడు పంచ్ ప్రసాద్. "అబ్బో సర్ శక్తిమాన్ 3 డి మరి" అని సునీత డైలాగ్ వేసేసరికి స్టేజి మీద ఉన్న అందరూ నవ్వేశారు. "చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్" అంటూ ప్రసాద్ మళ్ళీ సీరియస్ అయ్యాడు. "నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా" అని రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది. అంతే అందరూ నవ్వేశారు. ఇక తర్వాత సింగర్ లిప్సిక వచ్చి అదిరిపోయే సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. తర్వాత ఒక సెగ్మెంట్ చేశారు. పెద్ద పెద్ద రోలింగ్ డ్రమ్స్ మీద ఒక ఫ్లాట్ గా ఉన్న చెక్కతో చేసిన మ్యాట్ వేశారు. ఆ డ్రమ్స్ రోల్ అవుతూ ఉంటె అటు ఇటు ఆ మ్యాట్ మీద పండు "ఇటుక మీద ఇటుక" సాంగ్ ని చేసాడు. ముందు చేసిన పంచ్ ప్రసాద్ మాత్రం సరిగా చేయలేకపోయాడు.

అలాగే ఇంకో ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ కూడా పెట్టారు. ఒక ఎక్వేరియంలో వాటర్ పోసి ఒక నిమ్మకాయ వేసి ఆ తేలే నిమ్మకాయ మీద కాయిన్ ని బాలన్స్ చేయాలనీ చెప్పింది రష్మీ. సుహాసిని, ఆదర్శ్, పంచ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ వంటి వాళ్లంతా ట్రై చేశారు. తర్వాత వైరల్ వంటలక్క ధరణి - ఆదర్శ్ కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక నాటీ నరేష్ వచ్చి "మొన్న గోవా వెళ్ళావ్ కదా ఏవన్నా ఫొటోస్ తీసావా" అంటూ నాటీ నరేష్ రాంప్రసాద్ ని అడిగాడు. "బట్టల్లేకుండా క్లిప్స్ తీసా కొన్ని" అంటూ రాంప్రసాద్ చెప్పాడు. "మరి చూపించవా.. నేనెవరికీ చెప్పా" అన్నాడు నరేష్. "అసలు బట్టల్లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం తెలుసా" అంటూ రాంప్రసాద్ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ తీసి చూపించాడు అంతే నరేష్ పడీ పడీ నవ్వుకున్నాడు. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్"లో అంతా రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.