English | Telugu

ఆది అంత పెద్ద విలనా?

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం కొత్త కొత్తగా అలరిస్తూనే ఉంది. రాబోయే వారం మాత్రం కాస్త స్పెషల్ గా ఉండబోతోందనే విషయం రీసెంట్ గా రిలీజ్ ఐన ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. ఈ షోలో అప్పు మీద స్కిట్స్ , గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్ కి తీస్ మార్ ఖాన్ మూవీ త్వరలో రీలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ హీరో ఆది, హీరోయిన్ పాయల్ రాజపుత్ వచ్చారు. పాయల్ ని చూసేసరికి నాటీ నరేష్ వాట్ ఆ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అంటూ కంప్లిమెంట్ ఇస్తాడు. వెంటనే పాయల్ కూడా నరేష్ ని ముద్దు పెట్టుకుంటుంది. వెంటనే ఆది లైన్ లోకి వచ్చి "సేమ్ అదే ఇచ్చేరా మనకి కూడా" అంటూ పాయల్ ని అడిగేసరికి "యు ఆర్ మై బ్రో" అంటుంది. అంతే ఆదికి ఏం మాట్లాడాలో అర్థంకాక సైలెంటైపోతాడు. ఇక ప్రోమో ఫైనల్ ని చూస్తే గనక మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నామా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ రౌండ్ ని ఈ షోలో ప్రవేశపెట్టారు.

ఇందులో రష్మీ, ఆటో రాంప్రసాద్, పూర్ణ, బులెట్ భాస్కర్, ఆది, పంచ్ ప్రసాద్ ఈ ఆరుగురు ఫోటోలు చూపించి ఈ ఫొటోస్ లో మీకు నచ్చని వాళ్ళు ఉంటె ఆ ఫోటోని చింపేయొచ్చు లేదా కాల్చేయొచ్చు అని చెప్తుంది. ఫస్ట్ రాంప్రసాద్ వచ్చి ఆది విషయంలో నేనొకసారి హర్ట్ అయ్యాను అంటూ ఆది ఫోటోని కాల్చి చెత్తబుట్టలో వేసేస్తాడు. తర్వాత పరదేశి వచ్చి ఆది అన్న అంటే అన్నీ ఆయనే అని చెప్తారు కానీ ఒక కారణం వలన ఇలా చేయాల్సి వస్తోంది అంటూ ఫోటోను ముక్కలు ముక్కలుగా చింపి చెత్తబుట్టలో వేస్తాడు. మరో పక్క ఆది బాధపడుతూ ఉన్నట్టు చూపిస్తారు. తర్వాత రష్మీ కూడా ఆది ఫోటోని చింపేస్తుంది. తాను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిననప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లో "ఎప్పుడొచ్చావు రష్మీ అని అడగలేదు..ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్" అని ఆది అడిగారు.

ఆ విషయంలో బాధపడ్డాను అని చెప్పింది. ఇక తర్వాత ఆదిని పిలిచి మీరు ఏ ఫోటోని కాల్చుతారు అని అడిగేసరికి సీరియస్ గా స్టేజి మీదకు వస్తాడు. ఐతే ఆది ఎవరి ఫోటోని తీసాడో చూపించకుండా ప్రోమో కట్ చేశారు. ఇంతకు ఆది ఎవరిని టార్గెట్ చేసాడు ? పోనీ అందరూ తన మీద వ్యతిరేకత చూపిస్తున్నారని తన ఫోటోని తానే కాల్చుకుంటాడా ? ఏ విషయం తెలియాలంటే 14 వ తేదీన ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.