English | Telugu

లాస్ట్ మినిట్ లో ఫిట్టింగ్ పెట్టిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేస్తాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటిఎపిసోడ్ -436 లో..... సుమిత్రని దీప, కార్తీక్ ల పెళ్లి జరగడానికి ఒప్పిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత అందరు గదిలో నుండి బయటకు వస్తారు. పెళ్లికి రెండు రోజుల్లో ముహూర్తం పెడతారు. అందరు హ్యాపీగా ఉన్న టైమ్ లో.. ఇప్పుడు అసలు మొదలు అయింది ఇంకా మాట్లాడుకోవాలి కదా అని జ్యోత్స్న అంటుంది.

ఇంకా ఏంటని అందరు అడుగుతారు. దీపకి అమ్మనాన్న లేరు కాబట్టి వాళ్ళ అమ్మనాన్న ప్లేస్ లో మా అమ్మ నాన్న కూర్చొని చేస్తున్నారు. అక్కడ తాంబూలం ఎవరికి ఇస్తారు కార్తీక్ అమ్మ నాన్న అయిన అత్తయ్య మావయ్య కి ఇస్తారు కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు జరిగిన గొడవలు అన్ని తెలిసే ఇలా అడుగుతున్నావా అని కార్తీక్ కోప్పడుతాడు. అదేం లేదు వాళ్ళు లేకుంటే పెళ్లి ఎలా జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. దాన్ని శివన్నారాయణ సమర్దిస్తాడు. మీరు పిలుచుకోండి అని శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత ఈ పెళ్లి ఇష్టం లేక జ్యోత్స్న ని ఇలా ముందు పంపి ఇలా అడిగేలా చేసారని అనసూయ అంటుంది. వద్దు బావ వెళ్లి గుళ్లో పెళ్లి చేసుకుందామని దీప అనగానే తనపై కార్తీక్ కోప్పడతాడు. కాసేపటికి నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళమని చెప్పి దీపని పంపిస్తాడు. ఆ తర్వాత దీప ఒక్కతే శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది. దీపని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.