English | Telugu

Guppedantha Manasu : ఎండీగా రిషి.. మరోసారి శైలేంద్రని ఫూల్ చేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1155 లో ... ఫణీంద్రకి దేవయాని ఫోన్ చేసి.. మీటింగ్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎండీగా నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది.ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర ఏం చేస్తున్నాడని దేవయాని అడుగగా.. వాడు ఇక్కడ లేడు.. ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నాడో వాడికే ఫోన్ చేసి కనుక్కోమని ఫణీంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నేను అనుకున్నదే కరెక్ట్.. శైలేంద్ర ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని దేవయాని అనుకుంటుంది. వెంటనే తన రూమ్ లోకి వచ్చి మనుకి వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి శైలేంద్రకి పంపిస్తుంది.

అదంతా దూరం నుండి ధరణి చూస్తుంటుంది. మరొకవైపు మీటింగ్ లో అందరూ రిషిని ఎండీ గా ఉండాలని అంటారు. వసుధార గారు అన్నట్లు మీరు ఉండగా వేరొకరు ఎండీ పదవికీ తగరని బోర్డు మెంబర్స్ అంటారు. అందరు అనడంతో రిషి ఎండీగా ఉండడానికి ఒప్పుకుంటాడు. మరొకవైపు శైలేంద్ర ఫోన్ కి దేవయాని పంపిన లెటర్ ని మను చదివి షాక్ అవుతాడు. అది నిజం..వసుధార వెళ్లిపోయినప్పుడు నీకు ఆ లెటర్ రాసింది .. నేనే మార్చేసా అని శైలేంద్ర చెప్తాడు. మను ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. అప్పుడే దేవయాని ఫోన్ చేసి.. నువ్వు శైలేంద్రని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు శైలేంద్రని వదిలిపెట్టు.. మా కల నిజమయ్యే టైమ్.. నువ్వు ఏదైనా ఉంటే ఆ మహేంద్ర, అనుపమలతో తేల్చుకోమని దేవయాని అంటుంది. ఈ విషయం ఎవరితో చెప్పనంటేనే నేను వదిలి పెడతానని మను అనగానే.. ఎవరితో చెప్పమని దేవయాని అంటుంది. ఆ తర్వాత శైలేంద్రని మను వదిలిపెడతాడు.

అ తర్వాత శైలేంద్ర కాలేజీకీ వెళ్లి.. నేనొచ్చాను కదా ఇక ఎండీని ప్రకటించండి అని అనగానే ఆల్రెడీ ఎండీగా రిషి అని నిర్ణయం తీసుకున్నామని ఫణీంద్ర అనగానే.. అలా ఎలా అవుతాడని శైలేంద్ర అనగానే తనపై ఫణీంద్ర కోప్పడతాడు. ఇంత మోసం చేస్తాడా అని రిషిపై శైలేంద్ర కోపంగా ఉంటాడు. కాని రిషి నే రివర్స్ గా.. టైమ్ కి ఎక్కడికి వెళ్ళావ్ .. ఆ మేడమ్ నా పేరు చెప్పింది. అయినా నేను వద్దనన్నానంటూ శైలేంద్రని ఫూల్ ని చేస్తాడు రిషి. నువ్వు అయితే రేపు అయిన నన్ను చేస్తావ్ గా అంటూ శైలేంద్ర ధీమాగా ఉంటాడు. మరొకవైపు మహేంద్రనే నీ కన్నతండ్రి అని శైలేంద్ర చెప్పిన విషయాన్ని మను గుర్తుకుచేసుకుంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.