English | Telugu

తెలుగు బిగ్ బాస్ లో కన్నడ బ్యాచ్ సైకోయిజం...


బిగ్ బాస్ హౌస్ లో గురువారం నాటి ఎపిసోడ్ లో కన్నడ బ్యాచ్ సైకోయిజం బయటపడింది. ప్రైజ్ మనీ కోసం హౌస్ లో‌ బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తుంటే యష్మీ, పృథ్వీ, సోనియా, నిఖిల్ , ప్రేరణ తమ గ్రూప్ గేమ్ తో మిగిలిన హౌస్ మేట్స్ ని తొక్కేస్తున్నారు.

ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒక కంటెస్టెంట్ ఆడియన్స్‌ని బాగా విసిగిస్తూ, ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. గత సీజన్‌లో అయితే శోభాశెట్టి దెబ్బకి కంటెస్టెంట్లు దండాలు పెడితే ఆడియన్స్ పెద్ద నమస్కారమే పెట్టారు. ఇక ఈ సీజన్‌లో శోభాశెట్టి నా ముందు జుజుబీ అన్నట్లుగా అంతకుమించి సైకోయిజం చూపిస్తుంది యష్మీ. ఇక యష్మీ తానా అంటే తందనా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వీ. ఇక వీళ్లద్దరికీ శాడిజంలో సూపర్ పోటీ ఇస్తుంది సోనియా. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన ప్రతీ టాస్క్ లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, సోనియా ఒకే వైపు‌ ఉండి ఆడారని తెలుస్తోంది. లాస్ట్ టాస్క్ అయినటువంటి సాక్స్ రిమూవింగ్ టాస్క్ లో భాగంగా కిర్రాక్ సీత, నైనిక, నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ, అభయ్ నవీన్, నిఖిల్ పాల్గొనగా ప్రేరణ సంఛాలక్ గా వ్యవహరించింది. దాంతో గేమ్ మొత్తం ఏకపక్షంగా ‌మారింది. పృథ్వీ ఆడినంత సేపు ఫౌల్ గేమ్ ఆడాడు.

ఇక ప్రేరణ అది గుర్తించి పృథ్వీని బయటకు పంపించింది. అయితే బయటకొచ్చిన పృథ్వీ, యష్మీ అక్కడే ఉన్న సోనియాతో కలిసి బాక్స్ లోపల ఉన్న నిఖిల్ , అభయ్ లకి సపోర్ట్ చేశారు. ఇక విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, కిర్రాక్ సీత లాంటి వాళ్లని అలగేషన్ చేసి బయటకు పంపించేశారు. ఇక చివరి వరకు నిఖిల్, అభయ్ ఉండగా బజర్ మోగింది. ఇక ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు. ఇక ఈ ఎపిసోడ్ లో పృథ్వీ, యష్మీ చేసిన వెక్కిలి చేష్టలు చిరాకు తెప్పించాయి. గత సీజన్ లో శోభా శెట్టిని ఆడియన్స్ ఎంత తిట్టుకున్నారో ఇప్పుడు యష్మీని అదే రేంజ్ లో‌ తిట్టుకుంటున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.