English | Telugu

Karthika Deepam : కార్తిక్ కి సపోర్ట్ గా దీప.. జ్యోత్స్నతో పెళ్ళి అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -148 లో.....తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండొద్దంటే దీప తప్పు చేసిన తననికి ఇంట్లో ఎందుకు ఉంచారని సుమిత్రని‌ జ్యోత్స్న అడుగుతుంది. దీప ఏ తప్పు చేయలేదని సుమిత్ర అంటుంది. బావకి ఆ పరిస్థితి రావడానికి కారణం దీప అని జ్యోత్స్న వాదిస్తుంది. అసలు తనని కాపాడబోయి ఈ సిచువేషన్ తెచ్చుకున్నాడని జ్యోత్స్న అనగానే మరి దీప నన్ను కూడా కాపాడింది కదా దానికేం అంటావని సుమిత్ర అడుగుతుంది. అసలు ఆ నర్సింహా దీపల వల్లే నీ కూతురు ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని పారిజాతం అంటుంటే.. శివన్నారాయణ వచ్చి తనపై కోప్పడతాడు.

నా కూతురు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నా అల్లుడికి అలా అయింది. నీ కంటే ఎక్కువ బాధ నాకే ఉందని దశరత్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం లు ఇద్దరు కార్తీక్ దగ్గరికి బయలుదేర్తారు. నువు జ్యోత్స్న వచ్చాక ఒకసారి తనతో మాట్లాడమని సుమిత్రతో శివన్నారాయణ‌ అంటాడు. దాని పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలని చిన్నప్పటి నుండి బావనే నీ భర్త అని చెప్పామని సుమిత్ర అంటుంది. మరొకవైపు నరసింహా అలా చేసాడని అనసూయ బాధపడుతుంది. నేను ఇక ఇక్కడ ఉండలేను.. వాడు చేసిన పనికి వీళ్ళు ఏదో ఒకటి అంటుంటే.. నేను భరించలేనని అనసూయ అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. నన్ను కార్తీక్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని శౌర్య అనగానే.. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు.. మనం వెళ్ళకూడదని దీప అంటుంది. టాబ్లెట్ వేసుకున్నానని చెప్పాలి కదా అని శౌర్య అంటుంది.

మరొకవైపు ఆ దీప విషయంలో కలుగజేసుకోకని చెప్పాను కదా ఇప్పుడు చూడు అసలు ఆ దీపని ఈ రెండు కుటుంబాల నుండి తరిమెయ్యాలి. ఆ దీప ఎదురు పడనివ్వు తన సంగతి చెప్తానని శ్రీధర్ అంటుండగా.. అప్పుడే దీప వస్తుంది. దీపపై శ్రీధర్ కోప్పడతాడు. కోపంగా హాల్లోకి వెళ్లి కూర్చొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న పారిజాతంలు వస్తారు. గుడ్ మార్నింగ్ అని జ్యోత్స్న అనగానే బ్యాడ్ మార్నింగ్ అంటూ శ్రీధర్ అనగానే.. ఏమైందని జ్యోత్స్న అడుగుతుంది. విజిటర్స్ వచ్చారని కోపంగా చెప్తాడు. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మమ్మల్ని రాకని చెప్పావ్ దీపకి చెప్పలేదా బావ అని జ్యోత్స్న అంటుంది.‌ వద్దని చెప్పినా నేను వస్తాను. ఇప్పుడు ఇంట్లో సాయం చెయ్యడానికి అని దీప అంటుంది. అంటే వంటమనిషిగానా, పనిమనిషిగానా అని పారిజాతం అంటుంది. మనిషిగా వచ్చిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.