English | Telugu

Brahmamudi : గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేయడానికి కోయిలి ప్లాన్.. ఒకే చెప్పిన రంజిత్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 870 లో..క్లయింట్ కి ఇవ్వాల్సిన కొటేషన్ సిస్టమ్ లో లేదని సుభాష్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సుభాష్ టెన్షన్ పడతాడు. ఒకవేళ క్లయింట్ వెళ్ళిపోతే యాభై కోట్ల లాస్ వస్తుందని రాజ్ కి సుభాష్ కాల్ చేసి చెప్తాడు. వెంటనే అక్కడ నుండి బయల్దేరండి అని సుభాష్ చెప్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యకి విషయం చెప్పి మనం ఇప్పుడు బయల్దేరాలని చెప్తాడు. అవసరం లేదు ఆ కొటేషన్ నా సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టానని కావ్య చెప్తుంది. దాంతో రాజ్ రిలాక్స్ అవుతాడు.

ఆ తర్వాత ప్రకాష్ కి కావ్య ఫోన్ చేసి కొటేషన్ తన సిస్టమ్ లో ఉన్న విషయం చెప్తుంది. దాంతో అందరు రిలాక్స్ అవుతారు. రుద్రాణి మాత్రం ప్లాన్ ఫెయిల్ అయిందని డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు గోల్డ్ బాబూ దగ్గరికి కొయిలి వస్తుంది. ఈ టైమ్ కి పార్టీలో ఉండి ఎంజాయ్ చేసేవాడిని అని గోల్డ్ బాబూ అంటాడు. మీరెందుకు టెన్షన్ పడుతారు. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు పార్టీ అరెంజ్ చేస్తానని కోయిలి చెప్తుంది. రంజిత్ దగ్గరికి వెళ్లి అర్జెంట్ గా ఒక లక్ష కావాలి గోల్డ్ బాబుకి పార్టీ కావాలట అని చెప్తుంది. ఇప్పటికే అప్పు చాలా చేసామని రంజిత్ అంటాడు. ఆ గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేసి వాడి బంగారం మొత్తం లాగేసుకుందామని కోయిలి అనగానే రంజిత్ సరే అంటాడు.

ఆ తర్వాత రాజ్, కావ్యకి ఇందిరాదేవి, అపర్ణ వీడియో కాల్ చేస్తారు. వాళ్ళ గెటప్ చూసి ఇందిరాదేవి వాళ్ళు నవ్వుకుంటారు. ఎలాగైనా రాహుల్ కి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొని వస్తామని స్వప్నకి కావ్య ధైర్యం చెప్తుంది. మరొకవైపు పార్టీకి అన్నీ రెడీ చేసి కోయిలి ఫ్యాషన్ డ్రెస్ లో వస్తుంది. తనని చూసి రాహుల్ షాక్ అవుతాడు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసావని అడుగుతాడు. నీకు ఇలాగే ఇష్టం కదా అని కోయిలి అంటుంది. నేను ఒక్కడే ఉన్నప్పుడు వేసుకోవాలి.. ఇలా అందరున్నప్పుడు కాదని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.