English | Telugu

బిగ్ బాస్ సీజన్ 8 లో‌‌ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు?

బిగ్ బాస్ హౌస్ లో అసలేం జరుగుతుంది. కంటెస్టెంట్స్ ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్ లేదు‌. హౌస్ లో ది బెస్ట్ , వీరికి మనం సపోర్ట్ చేద్దాం అని అనిపించే కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా.. అంటే ఆలోచించాల్సిందే.

ఫుడ్ కోసం కంటెస్టెంట్స్ కి టాస్క్ లు, కామెడీ లేదు.‌.‌ఇవన్నీ‌ చూస్తుంటే సీజన్-6 గుర్తొస్తుంది.‌ ఈ సీజన్ లో హౌస్ లో‌ జెన్యున్ గా ఉండి, టాస్క్ లలో‌ బాగా ఆడి, రూల్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కరువయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, కిర్రాక్ సీత, అభినయ్‌ నవీన్ ల ఏవీ చూసి.. ఈ సీజన్ లో ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ పక్కా అనిపించింది కానీ హౌస్ లోకి వెళ్ళాక కథ మారిపోయింది. ఎంతలా అంటే బేబక్క ఫైర్ ని పప్పు ఉడకలేదంటూ సోనియాతో సహా హౌస్ మేట్స్ అంతా నామినేట్ చేయడంతో తను సైలెంట్ అయ్యింది. ఇక శేఖర్ బాషా తన నాన్ సింక్ జోకులతో అప్పుడప్పుడు నవ్వించే వాడు.. కానీ ‌నాగమణికంఠ అలా జోకులు వేస్తే నాకు చిరాకు అని చెప్పడంతో అతను కామెడీ చేయడమే మర్చిపోయినట్టున్నాడు. ఇక ఆదిత్య ఓం.. ఆయితే ఇంటి పెద్దలా ఆలోచించలేకపోతున్నాడు. టాస్క్ లలో పర్ఫామెన్స్ లేదు.. ఏదైనా గొడవ జరిగితే అక్కడ కనపడడు.. అసలు హౌస్ లో ఉన్నాడా అంటే ఏదో హౌస్ అంతా క్లీన్ చేయడానికి, హౌస్ లో పనులు చేసేవారికి సహాయం చేయడానికి వచ్చినట్టుంది.

ఇక‌‌ కిర్రాక్ సీత జెన్యున్ గా ఉంటూ తన టర్న్ వస్తే ఫైర్ అవుతుంది. కానీ టాస్క్ లలో తను ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతుంది. విష్ణుప్రియ ఇన్నోసెంట్ గా ఉండటంతో మిగతావారి చేత మాటలనిపించుకుంటుంది. ఇక సోనియా మొదట కన్నడ బ్యాచ్ అందరిని శత్రువులుగా చూసి వారందరు తన బాల్య మిత్రులుగా భావిస్తోంది. రతిక మాదిరి హౌస్ లో పర్ఫామెన్స్ ఇస్తోంది. ఇక యష్మీని చూస్తే శోభాశెట్టిలా అనిపిస్తోంది. ఎంత సైకోయిజం ఉండాలో అంతా ఉంది. ఇక పృథ్వీ అనగానే అందరికి గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి.. లేజీ ఫెలో, బద్ధకం, పని చేయడు, పనికి రాడు, ఆటలో‌ అరటిపండు, తిండి దండగ.. ఈ కోవకి చెందినవారు హౌస్ లో ఎవరైన ఉన్నారా అంటే అది పృథ్వీనే అని బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరు చెప్తారు. ఇక నబీల్ టాస్క్ లో కండబలం చూపిస్తున్నాడు కానీ బుద్ధి బలం చూపించలేక గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇక సింపథీ స్టార్ నాగ మణికంఠని చూస్తే... ఎందుకు ఉన్నాడో అర్థం కానీ పరిస్థితి. ‌అభయ్‌ నవీన్ కాస్తో‌ కూస్తో కామెడీ జనరేట్ చేయాలని చూస్తున్నాడు కానీ ఫుల్ లెంత్ ఇవ్వలేకపోతున్నాడు. ప్రేరణ , నిఖిల్, యష్మీ, సోనియా వీళ్ళంతా కలిసి ఓ గ్రూప్ గా ఉంటున్నారు. వీళ్లు గత సీజన్ సీరియల్ బ్యాచ్ ని గుర్తుచేస్తున్నారు. కన్నింగ్, సైకోయిజం, కమాండింగ్, ఇవన్నీ వారి‌ మాటలతోనే చూపిస్తున్నారు. హౌస్ లో మొత్తంగా పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉండగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో? ఎందుకో చెప్తూ ఓ కామెంట్ చేయండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.