English | Telugu

అవినాష్ ముక్కు ప‌గ‌ల‌గొట్టిన యాద‌మ్మ రాజు

స్టార్ మాలో హాస్య ప్రియుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో కామెడీ స్టార్స్‌. మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అందిస్తున్న `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు పోటీగా `స్టార్ మా`లో ఓంకార్ స్టార్ట్ చేసిన ఈ షో గ‌త కొన్ని నెల‌లుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్‌తో కొన‌సాగుతోంది. ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1: 30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఈ షో కు సంబంధంచిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు.

ఈ ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే షోలో హ‌రి, యాద‌మ్మ రాజు, ముక్కు అవినాష్‌, యాద‌మ్మ రాజులు క‌లిసి చేసే కామెడీ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. హ‌రితో క‌లిసి యాద‌మ్మ రాజు లేడీ గెట‌ప్‌లో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే `నా బిల్డ‌ప్ అంతా చూసి వ‌చ్చింది అషురెడ్డి అనుకున్నార్రా ` అన్నాడు హ‌రి. దానికి యాదమ్మ రాజు `నా గ్లామ‌ర్ ఎక్క‌డ అషు గ్లామ‌ర్ ఎక్క‌డ‌` అన్నాడు. నిజ‌మే నీకు, అషుకు ఆటోకీ ఆడీ కార్‌కి వున్న తేడా వుంద‌ని హ‌రి అన‌డం.. ఓ అషుని ఆటోతో పోల్చావా అని యాద‌మ్మ రాజు అన‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఇక ముక్కు అవినాష్‌తో క‌లిసి యాద‌మ్మ రాజు చేసిన స్కిట్ కూడా ఓ రేంజ్‌లో పేలనున్న‌ట్టుగా తెలుస్తోంది. ముక్కు అవినాష్ ముక్కు గుర్తుతో పోటీకి దిగ‌డం.. అత‌ని అనుచ‌రుడిగా యాద‌మ్మ రాజు గుద్దాలే గుద్దాలే ముక్కునే గుద్దాలే అంటూ ప్ర‌చారం చేస్తూ ముక్కు అవినాష్ ముక్కు ప‌గ‌ల‌గొట్ట‌డం హిలేరియ‌స్‌గా వుంది. క‌డుపుబ్బా నవ్వించే ఈ కామెడీ స్కిట్ లు వ‌చ్చే ఆదివారం బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.