English | Telugu

బిగ్‌బాస్ : మాన‌స్‌.. కాజ‌ల్ మైండ్‌గేమ్‌.. చిట‌ప‌ట‌లాడిన ఆనీ

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ గేమ్ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఇంటి స‌భ్యుల మ‌ధ్మ‌య వున్న అస‌లైన బంధాలు.. ప్రేమ‌లు.. త్యాగాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అంతే కాకుండా కంటెస్టెంట్‌ల మ‌ధ్య దూరం.. రోజు రోజుకీ పెరిగిపోతూ గొడ‌వ‌లు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి బిగ్‌బాస్ పెడుతున్న టాస్క్‌లు కూడా ఇంటి స‌భ్యుల మ‌ధ్య దూరాన్ని పెంచుతున్నాయి.

నిన్న‌టి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల మ‌ధ్య పెద్ద చిచ్చే పెట్టాడు. 75వ ఎపిసోడ్ లోకి ఎంట‌రైన హౌస్ మేట్స్ త‌మ‌ని తాము కాపాడుకోవ‌డానికి .. పోటీలో గెల‌వ‌డానికి ఆస‌క్తిక‌ర ప్లాన్‌ల‌ని సిద్ధం చేసుకున్నారు. యాంక‌ర్ ర‌వి .. శ్రీ‌రామ‌చంద్ర అండ్ కోని క‌లుపుకుంటూ కొత్త ఎత్తులు వేయ‌డం గ‌మ‌నార్హం. ఇది గ‌మ‌నించిన స‌న్నీ, కాజ‌ల్‌, మాన‌స్స, ప్రియాంక‌లు కూడా త‌మ ప్లాన్‌ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. ఈ నేప‌థ్యంలోనే మాన‌స్ ఇంటి కెప్టెన్ కావ‌డంతో స‌న్నీ, కాజ‌ల్ హ్యాపీగా ఫీల‌య్యారు.

`నిప్పులే శ్వాస‌గా గుండెలో ఆశ‌గా` అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మొద‌టి సైర‌న్ మోగిన వెంట‌నే ముందు ఎవ‌రైతే ఫైర్ ఇంజిన్‌లోకి ఇద్ద‌రు వ్య‌క్తులు ఎక్కాల్సి వుంటుంది. ఆ ఇద్ద‌రు ఒక ఇంటి స‌భ్యుడిని కాపాడాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి ఫ్రీ ఎవిక్ష‌న్ పాస్ సొంతం అవుతుంది. దీంతో కంటెస్టెంట్‌లు అంతా త‌మ పూర్తి ఎఫ‌ర్ట్‌ని పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఇక్క‌డే మాన‌స్, కాజ‌ల్ మైండ్ గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో సిరి, ఆనీ ఫొటోల్లో ఒక్క‌రి ఫొటో కాల‌కుండా చూడాలి.

అయితే ఈ ఇద్ద‌రి ఫొటోల‌ని తెలివిగా కాలిస్తే స‌న్నీ సేవ్ అవుతాడు ఈ విష‌యాన్ని ముందు ప‌సిగ‌ట్టిన మాన‌స్‌, కాజ‌ల్ ఒకు సిరి అంటే మ‌రొక‌రు ఆనీ అంటూ చివ‌రి వ‌ర‌కు గేమ్ ఆడీ ఇద్ద‌రి ఫోటోలు కాలిపోయేలా చేశారు. చివ‌రికి స‌న్నీని అనుకున్న‌ట్టే సేవ్ చేసుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆనీ మాస్ట‌ర్ కాజ‌ల్ ఆడిన గేమ్‌ని త‌ప్పుబ‌డుతూ మండి ప‌డింది. తొండిగేమ్ అంటూ ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.