Read more!

English | Telugu

ఇదే ఆఖరి రోజైతే ఎవరితో స్పెండ్ చేస్తారన్న అనిల్ రావిపూడి..ఏడ్చేసిన సుష్మ

మిస్టర్ అండ్ మిస్సెస్ షో ఎట్టకేలకు ఎండింగ్ కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే లోకి అడుగుపెట్టింది. ఇందులో ఫోర్ పెయిర్స్ ఈ గ్రాండ్ ఫినాలేలో తలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ లో ఆట సందీప్ వైఫ్ జ్యోతిరాజ్ ని స్టేజి మీదకు పిలిచింది శ్రీముఖి. " లాఖ్ స్టార్ అనే అవార్డుని ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ఈ అవార్డు తర్వాత ఎంత లాక్స్ చేస్తుందా అని " అనేసరికి జ్యోతి మస్త్ గా నవ్వేసింది. తర్వాత బుల్లితెర నటుడు రవికిరణ్ ని స్టేజి మీదకు పిలిచింది.

"ఈ వ్యక్తి కామన్ గా మాట్లాడినా క్లాస్ పీకినట్టే ఉంటుంది కాబట్టి మేము మీకు ఇస్తుంది ఇదే" అంటూ ఒక స్ట్రెస్ బస్టర్ బాల్ ని ఇచ్చింది. "ఎనీవే మీకు తెలుసుగా ఈ బాల్ తో ఎం చేయాలో" అనేసరికి "పిసుక్కోవాలి" అన్నాడు ఫన్నీగా రవికిరణ్. తర్వాత శ్రీవాణి హస్బెండ్ విక్రమ్ ని స్టేజి మీదకు పిలిచింది శ్రీముఖి "మీరు వచ్చిన ప్రతీసారి వనభోజనాలేమైనా జరుగుతున్నాయా అనిపిస్తుంది..అంటే తడి బట్టేసుకుని కూర్చుకుంటారు కదా అలా అనిపిస్తుంది" అంది "కాబట్టి మేము మీకు ఇస్తున్న అవార్డు కూడా తడి బట్టే" అని అదే అతని చేతిలో పెట్టింది. "వెట్ క్లాత్ వేసుకుని వీడియోకాల్ చెయ్యి" అని అనిల్ రావిపూడి పంచ్ డైలాగ్ వేశారు. రాకేష్-సుజాతను పిలిచి "భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకరి ఇష్టాలు మార్చుకోవడం కరెక్టా కాదా" అని అనిల్ రావిపూడి అడిగారు "లేదు సర్ నేను మాట మీద ఉండే మగాణ్ణి" అంటూ తొడ కొట్టాడు రాకేష్.

తరిత్వా సుష్మ-రవికిరణ్ ని పిలిచి "ఇదే మీ జీవితంలో ఆఖరి రోజైతే మీ పేరెంట్స్ తో స్పెండ్ చేస్తారా, మీ భర్తతో స్పెండ్ చేస్తారా" అని అడిగేసరికి సుష్మ కిరణ్ ఏడ్చేసింది. ఇక ఫైనల్ లో విన్నర్ ఎవరు ? టైటిల్ గెలుచుకునేది ఎవరు ? 3 లక్షలు గెలుచుకునే జంట ఎవరు అనే విషయాలు తెలియాలి అంటే 21 వ తేదీ రాత్రి 9 .30 కి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.