English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న మాటలకు అత్త షాక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -170 లో.....జ్యోత్స్న కాంచన దగ్గరికి వెళ్తుంది. రా జ్యోత్స్న అని కాంచన అనగానే.. మనుషులే అనుకున్నా పిలుపులు కూడా దూరం అయ్యాయన్నమాట అని జ్యోత్స్న అనగానే.. ఏం దూరం అయిందని కాంచన అంటుంది. ఎప్పుడు వచ్చిన.. రా మేనకోడలా అని పిలిచేదానివి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎందుకు నన్ను వద్దనుకున్నావని జ్యోత్స్న అనగానే.. నేను అనుకోలేదు.. మీరే నన్ను వద్దని అనుకోలేదా అని కాంచన అంటుంది.

మీరు వచ్చి తాతయ్య వాళ్ళని అడగొచ్చు కదా అని జ్యోత్స్న అనగానే.. తన గౌరవం తగ్గించే పని చెయ్యలేనని కాంచన అంటుంది. నువ్వు అంత గౌరవంగా ఫీల్ అయితే అక్రమ సంతానం దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. నీ సవతి కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. అది గౌరవమైనా పనా.. దిగజరిపోయి చేసావని జ్యోత్స్న అనగానే.. మర్యాదగా మాట్లాడు అంటూ జ్యోత్స్నపై కార్తీక్ కోప్పడుతారు. నువ్వు ముందు వెళ్లి మీ తాతయ్య, డాడీలని ఒప్పించూ నాకేం అభ్యoతరం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప ఆలోచిస్తుంటే.. మనకి ఏదో చొరవ ఇచ్చారని మాట్లాడకూడదు. వాళ్లకు నచ్చింది మాత్రమే చేస్తారని దీపతో అనసూయ అంటుంది. అప్పుడే కాంచన ఫోన్ చేసి.. శౌర్యని తీసుకొని రా.. అది ఇక్కడే రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పగానే.. దీప సరే అంటుంది.

ఆ తర్వాత ఇప్పుడే తీసుకొని వెళ్ళాలిసింది. తనకి ఒంటరిగా ఉన్నా అనిపిస్తుందేమోనని అనసూయ అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ వాళ్ళు భోజనం చేస్తుంటారు.‌జ్యోత్స ఎక్కడా అని అడుగగా.. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాని అంది అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని శివన్నారాయణ అనగానే.. అత్త వాళ్ళింటికి వెళ్ళానని చెప్తుంది. దాంతో శివన్నారాయణ‌ కోప్పడతాడు. రేపు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళదాం.. తన మనవడితో జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడడానికి అని చెప్పి శివన్నారాయణ‌ వెళ్ళిపోతాడు. వేరే పెళ్లి జరిగితే నీ కూతురు ఉండదని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నీ కూతురు జీవితం నీ చేతిలో ఉందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత సుమిత్ర బయట కూర్చొని ఏడుస్తుంటే.. దీప వచ్చి ఏమైందని అడుగుతుంది జ్యోత్స్నకి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.