English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్నకి కార్తీక్ గుణపాఠం.. ఇంట్లోకొచ్చిన శౌర్య!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -379 లో..... దశరథ్ పడిపోతుంటే నాన్న అంటూ దీప పట్టుకుంటుంది. మా డాడ్ ని నాన్న అని పిలుస్తావా అని దీపని జ్యోత్స్న కొట్టబోతుంటే కార్తీక్ అపుతాడు. నా భార్య చేసిన తప్పేంటి? ఎందుకు కొడతావని కార్తీక్ అడుగుతాడు. ఇంట్లో పెద్దవాళ్ళున్నారు.. వాళ్ళేం న్యాయం చేస్తారో చూస్తానని కార్తీక్ అంటాడు. దీప నాన్న అని పిలవడం తప్పే అయినా కానీ దీప చేసింది మంచి పని.. జ్యోత్స్న కొట్టాలి అనుకోవడం తప్పు అని శివన్నారాయణ అంటాడు.

అయితే ఇప్పుడు నా భార్యకు జ్యోత్స్న సారి చెప్పాలని కార్తీక్ అడుగుతాడు. దానికి శివన్ననారాయణ సరే అనడంతో దీపకి జ్యోత్స్న సారీ చెప్తుంది. అందరు లోపలికి వెళ్ళిపోతారు. సుమిత్ర మాత్రం దీప బాధపడేలా మాట్లాడుతుంది. మీ నాన్నని నాన్న అని పిలిచి కాపాడావ్.. ఇంకేంటి హ్యాపీనా అని దీపని కార్తీక్ అడుగుతాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి అనసూయ,కాంచన, శౌర్య వస్తారు. ఇప్పుడు వీళ్ళని తాత చుస్తే తిడుతాడని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. కానీ పిల్లల ముందు గొడవలెందుకని శౌర్యతో బాగా మాట్లాడుతాడు శివన్నారాయణ.

సుమిత్ర కూడ శౌర్యతో నవ్వుతు మాట్లాడుతుంది. అందుకే వీళ్ళని రప్పించానని దీపతో కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శౌర్యని సుమిత్ర తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. నేను నాన్నతో మాట్లాడాలని శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది కాంచన. శౌర్యతో దశరథ్, సుమిత్ర కబుర్లు చెప్తుంటారు. ఈ బొమ్మ ఎక్కడిది బాగుందని శౌర్య అనగానే జ్యోత్స్న చిన్నప్పటిదని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలన్నీ సుమిత్ర చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.