English | Telugu

నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?.. యాంకర్ రష్మీ

జబర్దస్త్ ఇక కొత్త ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ న్యూ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కృష్ణ భగవాన్, ఖుష్బూ ఇద్దరూ కూడా కొత్తగా కనిపించబోతున్నారు. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఈ షో కొత్తగా రాబోతోందన్న విషయం తెలుస్తోంది. "ఇక నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండబోతోంది..ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్. ఎవ్రిథింగ్ డబుల్ " అంటూ ఖుష్బూ మంచి ఎలివేషన్ ఇచ్చింది. "ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది. ఇప్పుడు జబర్దస్త్ లో ఆడియన్స్ ఉన్నారు" అంటూ కృష్ణ భగవాన్ చెప్పారు.

"అన్ని డబులా" అని రష్మీ అనుమానంతో అడిగేసరికి "అన్ని డబుల్ ఐతే యాంకర్ కూడా డబుల్ అవ్వాలిగా" అంది జడ్జ్ ఖుష్బూ. " నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా" అని రష్మీ అడిగింది. ఐతే ప్రోమో లాస్ట్ లో కొత్త జెంట్ యాంకర్ ని సైడ్ లుక్ లో చూపించారు. ఐతే ఆ కొత్త యాంకర్ సుధీర్ ఆ, మానస్ ఆ అన్నది చూపించలేదు. ఐతే నెటిజన్స్ మాత్రం కొంతమంది సుధీర్ అంటుంటే కొందరు మానస్ అంటూ మెసేజెస్ చేస్తున్నారు. ఐతే ఈ సీరియల్స్ టైమింగ్స్ ని మాత్రం మార్చలేదు. ఇక రష్మీకి జోడీ ఉండే కో-యాంకర్ ఎవరు అన్నది ఈ శుక్రవారం షోలో తెలిసిపోతుంది. మానస్ కళ్ళజోడు తీసి పెట్టే మ్యానరిజంతో సుధీర్ అన్న ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫాన్స్. ఇక జడ్జ్ గా శివాజీ వెళ్లిపోవడంతో ఈ కామెడీ షోకి జడ్జ్ గా కృష్ణ భగవాన్ గారే కరెక్ట్ అంటూ కూడా మెసేజ్ పెడుతున్నారు నెటిజన్స్.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.