English | Telugu

Jayam serial : పోటీలో ఓడిపోయి‌న గంగ.. శకుంతల ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam l). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -167 లో.... గంగని ఎమోషనల్ గా చేసి ఓడించడానికి పారు, వీరు, ఇషిక ప్లాన్ చేస్తారు. గంగ పోటీలో గెలవడం చూడాలని రుద్ర ఇంటి నుండి బయల్దేరతాడు. రుద్ర వస్తున్న కార్ బ్రేక్ లు ఫెయిల్ అయ్యేలా చేస్తాడు వీరు. దాంతో రుద్ర ఒక దగ్గర కార్ ఆపుతాడు. అయిన తన వెంట రౌడీలు వచ్చి రుద్రపై ఎటాక్ చేస్తారు.

రుద్ర రౌడీలని కొట్టి అక్కడ నుండి తప్పించుకుంటాడు. అయినా రౌడీలు రుద్రని ఫాలో అవుతారు. మరొకవైపు మొదటి రౌండ్ లో గంగ గెలుస్తుంది. రుద్ర ఇంకా రాలేదని గంగ చుట్టూ చూస్తుంది. తన ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ చేస్తారు. రుద్ర రావడం పారు చూసి అక్కడున్న అతనికి సైగ చెయ్యడంతో అతను వెళ్లి రుద్ర తలపై కొడుతాడు. రుద్ర కింద పడిపోతాడు. గంగ అని పిలుస్తాడు. దాంతో గంగ చూసి బయటకు వస్తుంటే వద్దని రుద్ర అంటాడు. అయిన వినకుండా గంగ వస్తుంది. దాంతో గంగ క్విట్ అవడం తో పారు విన్ అయిందని అనౌన్స్ చేస్తారు. దాంతో రుద్ర కోపంతో గంగ చెంపచెల్లుమనిపిస్తాడు. ఏం చెప్పాను.. వద్దు అన్నాను కదా.. ఎవరి ముందు అయితే నిన్ను విన్నర్ గా నిలబెదామనుకున్న కానీ నువ్వు ఇలా చేసావని కోప్పడుతాడు. నాకు మీ కంటే ఇది ముఖ్యం కాదు సర్ అని గంగ అంటుంది.

అ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. శకుంతల కోపంగా ఉంటుంది. రుద్రకి అలా అయిందని గంగ బయటకు వచ్చింది లేదంటే తనే విన్ అయ్యేది అని ఇంట్లో వాళ్లంతా గంగకి సపోర్ట్ గా మాట్లాడుతారు కానీ శకుంతల మాత్రం గంగని తప్పుపడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.