English | Telugu

రోహిణికి తగ్గ వరుడు దొరికేసాడోచ్..!

బుల్లితెర మీద లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రోహిణి. ఆమె లేని షో లేదు. ఐతే బుల్లితెర మీద పెళ్లి కావలిసిన వాళ్ళల్లో ఆది, సుధీర్, ప్రదీప్, శ్రీముఖి తర్వాత రోహిణి ఉంటుంది. ఇక శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అని చెప్తోంది. ఇప్పుడు రోహిణి తనకు నచ్చిన వరుడు దొరికేసాడు అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఒక క్యూట్ గా ఉన్న అబ్బాయితో కలిసి ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది.

"ఫైనల్లీ నాకు కావాల్సిన వ్యక్తిని కలుసుకున్నా" అంటూ కూడా పెట్టుకుంది. ఈ పోస్ట్ కి ఆరియానా, సమీరా భరద్వాజ్, ప్రియా, సురేఖావాణి, గీతామాధురి, యాట నవీన వంటి వాళ్లంతా రియాక్ట్ అయ్యారు. "అక్క సీరియస్లి ఒక్క క్షణం చూసి నిజమే అనుకుని సంతోషపడ్డా." అని ఆరియానా పెట్టిన కామెంట్ కి "నిజం ఐతే బాగుణ్ణు" అంటూ రోహిణి రిప్లై ఇచ్చింది.

ఇక సమీరా ఐతే "డిస్క్రిప్షన్ చదవని వాళ్ళు ఎర్రిపప్పలు . పోనిలే ఇలాంటి హ్యాండ్సమ్ హజ్బెండ్ ప్రాప్తిరస్తూ" అంటూ దీవించేసింది. "నీకు ఇంతకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు ఇన్ అండ్ అవుట్" అంటూ ప్రియా కామెంట్ చేసింది. "కంగ్రాట్స్ రా..గాడ్ బ్లేస్ యు" అంటూ సురేఖావాణి చెప్పింది. "సరే ఇప్పుడు ఇతని కోసం వెతుకుదాం" అంటూ గీతామాధురి కామెంట్ చేసింది. "తధాస్తు ఇంకేంటి ఇంతకంటే హ్యాండ్సమ్ అండ్ గుడ్ పర్సన్ రావాలి" అంటూ యాట నవీన్ విష్ మెసేజ్ పెట్టింది.

ఇలా ప్రతీ ఒక్కరు రోహిణికి మంచి అబ్బాయి రావాలని కోరుకుంటున్నారు. ఐతే డిస్క్రిప్షన్ చూస్తే మాత్రం అది ఒక ఏఐ జెనెరేటెడ్ పిక్ అన్నమాట. ఇక రోహిణి ఐతే ఇలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ ని చూపించినందుకు చాట్ జిపిటికి థ్యాంక్స్ కూడా చెప్పుకుంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.