English | Telugu

Illu illalu pillalu : ప్రేమకి సారీ చెప్పిన ధీరజ్.. అమూల్య నిశ్చితార్థం జరుగుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో...... ధీరజ్ టీ షర్ట్ పై DP అని లవ్ సింబల్ వెయ్యడంతో అందరు తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులని రామరాజు పిలుస్తాడు. నిశ్చితార్థంలో ఎలాంటి లోపాలు జరగద్దు.. ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా చందు, శ్రీవల్లి చూసుకోండి.. ఎంగేజ్ మెంట్ రింగ్స్ మీరు తీసుకొని రండి అని ధీరజ్, ప్రేమలకి రామరాజు చెప్తాడు. దాంతో ధీరజ్ కి ఇష్టం లేకున్నా
సరే అంటాడు.

అ తర్వాత ఒరేయ్ సాగర్ మొన్న సేట్ కి డబ్బులు ఇవ్వమంటే ఒక లక్ష అపావంట ఎందుకని రామరాజు అడుగుతాడు. సాగర్ టెన్షన్ పడుతాడు. అప్పుడే వేదవతి వచ్చి వాడిని అలా అడుగుతారు ఏంటని టాపిక్ డైవర్ట్ చెస్తుంది. అమూల్యకి పెళ్లి ఇష్టం లేనట్లుందని రామరాజుతో వేదవతి అంటుంది. అదేం లేదు.. తను నా కూతురు అని రామరాజు చాలా నమ్మకంగా చెప్తాడు. అ తర్వాత సాగర్ టెన్షన్ పడుతుంటే.. ఏమైందని నర్మద అడుగుతుంది. నా ఫ్రెండ్ కి అర్జంట్ అని డబ్బు ఇచ్చానని సాగర్ అంటాడు. ఆ విషయం మరి మావయ్యకి చెప్పాలి కదా అర్జెంట్ గా వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చేయమని నర్మద అనగానే నాన్న వేరే పని చెప్పాడు కదా ఇప్పుడు ఎలా అని సాగర్ అంటాడు. సరే ఈ పని అయ్యాక వెళ్ళు అని నర్మద అంటుంది. హమ్మయ్య తప్పించుకున్నానని సాగర్ అనుకుంటాడు.

అ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. ఏంటె.. నా టీ షర్ట్ పై ఎందుకు అలా రాసావని కోప్పడతాడు. నువ్వు మన పేర్లు పేపర్ పై రాస్తే చింపేశావ్.. కానీ మనల్ని ఎవరు వేరు చేయలేరని చెప్పడానికి అలా చేశానని ప్రేమ అంటుంది.అ తర్వాత నాన్న మనల్ని బయటకు వెళ్లి రింగ్స్ తీసుకొని రమ్మన్నారని ధీరజ్ అనగానే నాకు సారీ చెప్తేనే వస్తానని ప్రేమ అంటుంది. ధీరజ్ కి వేరే ఆప్షన్ లేక ప్రేమకి సారీ చెప్తాడు. ఇద్దరు కలిసి గోల్డ్ షాప్ కి బయల్దేరతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.