English | Telugu

Jayam serial : గాయాలతో రుద్ర.. పోటీలో గంగ గెలుస్తుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -166 లో... గంగ అకాడమీలో పడుకుంటుంది. తన గదిలో ఒక లెటర్ ఉంటుంది. అది చూసి చదివిన గంగ షాక్ అవుతుంది. అందులో రుద్ర చనిపోతాడని రాసి ఉంటుంది. అది పారు రాసిన ఉత్తరమే అని అనుకున్న గంగ.. తన గదికి వెళ్ళి చూస్తుంది. అక్కడ పారు పడుకొని ఉంటుంది. మరి పారు రాయకపోతే ఇంకెవరు రాసారని గంగ టెన్షన్ పడుతూ రాత్రి అంతా పడుకోదు.

మరోవైపు గంగ పోటీలో గెలవాలని ఇంట్లో ఉన్న దేవుడికి మొక్కుకుంటాడు రుద్ర. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళంతా రుద్రకి సపోర్ట్ గా మాట్లాడతారు. గంగ గెలవాలని కోరుకుంటారు. అదే సమయంలో రుద్రతో శకుంతల మాట్లాడుతుంది. గంగ గెలిస్తే మంచిదే కానీ గెలవకపోతే.. ఇంకెప్పుడు తన నోటి వెంట బాక్సింగ్ అనే పేరు వినపడకూడదు.. బాక్సింగ్ చేయకూడదని.. అలాగని నాకు మాటివ్వమని రుద్రని శకుంతల అడుగుతుంది. అలా ఆటలో గెలుపు ఓటములు సహజం ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇలా కెరీర్ ఆపేయాలా అని శకుంతలతో పెద్దసారు అంటాడు. అవన్నీ నాకు తెలియదు.. నువ్వు మాటివ్వు రుద్ర అని శకుంతల అడుగుతుంది. దాంతో రుద్ర మాటిస్తాడు. గంగ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది.. అందుకే మాటిస్తున్నానని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోతాడు. ఇక వీరుతో ఇషిక మాట్లాడుతుంది. రుద్రని భలే లాక్ చేసావని రుద్రతో ఇషిక అంటుంది.

మరోవైపు బాక్సింగ్ పోటీ మొదలవుతుంది. రుద్ర ఇంకా రాలేదని గంగ టెన్షన్ పడుతుంది. అదే సమయంలో రుద్ర వస్తున్న కారువి బ్రేకులో తీపించేస్తాడు వీరు. అది తెలియక ఫాస్ట్ గా వస్తుంటాడు రుద్ర. అలా వస్తున్న రుద్రకి ఎదురుగా ఒక కార్ రావడంతో అతను చెట్టుకి డ్యాష్ ఇచ్చి స్పృహ కోల్పోతాడు. అతను అలా పడిపోవడం వీరు మనిషి చూసి వీరుకి కాల్ చేస్తాడు. రుద్ర ఈజ్ నో మోర్ అని అతడు చెప్పగానే వీరు సంతోషిస్తాడు. అదే సమయంలో రుద్ర కోసం గంగ ఎదురుచూస్తుంది. ఇక ఫైనల్ రౌండ్ లో పారు వర్సెస్ గంగకి బాక్సింగ్ ఉంటుంది. అదే సమయంలో రుద్ర స్పృహలోకి వస్తాడు. మరి ఆ పోటికి రుద్ర వెళ్తాడా.. గంగ గెలుస్తుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.