English | Telugu

Karthika Deepam2 : కొంపముంచిన దాస్.. నిజం చెప్పి జ్యోత్స్నని రోడ్డున పడేస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -565 లో.. సుమిత్ర పడుకొని ఉంటుంది. తన దగ్గరికి వెళ్లి కాంచన, దశరథ్, శివన్నారాయణ బాధపడుతారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను చిన్నప్పుడు అత్త దగ్గరే పెరిగాను. అత్త కొడుకు లేని లోటు నా ద్వారా తీర్చుకుంది. అలాంటి అత్త ఈ పరిస్థితిలో ఉందంటే నేను తట్టుకోలేకపోతున్నాను కానీ ఈ గుండె అన్నీ తట్టుకుంటుంది. ఇప్పుడు మనం ధైర్యంగా ఉండి అత్తకి ధైర్యం చెప్పాలని వాళ్ళతో కార్తీక్ చెప్తాడు.

మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న దగ్గరకి దాస్ వస్తాడు. ఎందుకు నన్ను రమ్మన్నారని అడుగుతాడు. నువ్వే నీ కూతురుని కాపాడాలిరా అని పారిజాతం అంటుంది. అసలైన వారసురాలు ఎక్కడ ఉందో తీసుకొని రా అని పారిజాతం అంటుంది. అంటే ఇప్పుడు మీ భయం ఏంటి.. సుమిత్ర వదిన చచ్చిపోతుందనా.. లేక జ్యోత్స్న గురించి నిజం తెలిసిపోతుందనా.. అని దాస్ అనగానే రెండు అని పారిజాతం అంటుంది. ఇప్పుడు నిజం తెలిస్తే నీ కూతురు జీవితం రోడ్డున పడుతుందని పారిజాతం అనగానే నేను ఉన్నాను కదా ఏ లోటు లేకుండా చూసుకుంటానని దాస్ అంటాడు. అది ఒక బ్రతుకేనా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఇదొక్క సహాయం చెయ్ రా.. అసలైన కూతురిని వెతికి తీసుకొని రా.. నేను మేనేజ్ చేసి సుమిత్రకి సర్జరీ అయ్యేలా చేస్తానని పారిజాతం అంటుంది. అసలైన కూతురు ఎక్కడ ఉందని పారిజాతం అనగానే ఇక్కడే ఉందని దాస్ అంటాడు.

అప్పుడే దీప కాఫీ తీసుకొని వచ్చి దాస్ కి ఇస్తుంది. దీప వెళ్లి కార్తీక్ తో దాస్ బాబాయ్ వచ్చాడు. వీళ్ళు దాస్ బాబాయ్ ని రప్పించారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుందని కార్తీక్ తో దీప అంటుంది. మరొకవైపు ఈ రోజు ఎలాగైనా శివన్నారాయణ గారితో నిజం చెప్తానని దాస్ అంటుంటే.. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నాతో ఏం చెప్పాలని అడుగుతాడు. అ తర్వాత దాస్ ని ఇంట్లోకి తీసుకొని వెళ్లి అందరి ముందే అడుగుతాడు. నాకు చెప్పు అని దశరథ్ అనగానే.. అన్నయ్య మీకు చాలా ద్రోహం చేసానని దాస్ అంటాడు‌. ఎవరి గురించి మాట్లాడుతున్నావని దశరథ్ అనగానే జ్యోత్స్న గురించి అని దాస్ అంటాడు. వద్దని.. నిజం చెప్పొద్దని దాస్ ని జ్యోత్స్న, పారిజాతం రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.