English | Telugu

ఓంకార్ కాళ్ళ మీద పడిన అమర్

ఇష్మార్ట్ జోడి సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. ఇక గ్రాండ్ ఫినాలేకి కొన్ని జోడీస్ సెలెక్ట్ అయ్యాయి. అమర్ - తేజు, ప్రదీప్ - సరస్వతి, ఆదిరెడ్డి - కవిత, రాకేష్ - సుజాత, ప్రేరణ - శ్రీపధ్, సోనియా - యష్ జంటలు గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో లాస్య-మంజునాథ్, అభయ్ - భవాని ఓడిపోయారు. ఐతే అపోజిట్ టీమ్ వాళ్ళు గెలిచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండగా అమర్ ఫుల్ ఫైర్ అయ్యాడు.

గెలిచినప్పుడే కాదు ఓడిపోయినప్పుడు వాళ్లను చూసి పలకరించాలి అంటూ మండిపడ్డాడు. దానికి యాంకర్ ఓంకార్ కూడా ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. "అందరూ రండి అన్నప్పుడు నువ్వు ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఆదిరెడ్డి బాగా ఆడాడు అంటూ ఎందుకు అతని దగ్గరకు వెళ్ళావ్ మరి" అంటూ ఓంకార్ అడిగాడు. "ఇండియా వాళ్ళు గెలిచినప్పుడు వెళ్లి పాకిస్తాన్ వాళ్ళను కావలించుకుంటామా మన ప్లేయర్స్ ని కావలించుకుంటామా" అంటూ సీనియర్ నటుడు ప్రదీప్ కూడా అమర్ మీద ఫైర్ అయ్యాడు. తర్వాత ఎదురుగా ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నా కూడా "కొట్టు కొట్టు కొట్టు" అంటూ అమర్ కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. దాంతో ఓంకార్ కూడా "ఏమిటి అమర్ వాళ్ళను సెలెబ్రేట్ చేసుకోవద్దు అంటావ్, అభిమానులను క్లాప్స్ కొట్టద్దు అంటావ్..మరి ఎం చేయాలి...మీరు ఒక స్ట్రాటజీతో ఉన్నారు " అని అడిగాడు. "అన్నా ఈశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నా ఏ స్ట్రాటజీ లేదు అన్నా..." అన్నాడు అమర్.."ఎవరి సెలబ్రేషన్ ని ఆపే హక్కు నాతో సహా ఎవరికీ లేదు...ఇష్మార్ట్ జోడిలో లాస్ట్ లో ఇలా ప్రీ-ఫైనల్ లో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకే బాధగా ఉంది. ఇలా మాట్లాడుకుంటామని అనుకోలేదు. నేను కూడా నీ వల్ల ఈరోజు కోప్పడాల్సి వచ్చింది. నేను కోపాన్ని ఎవరి మీద చూపించలేదు..తప్పు చేస్తే నేను తట్టుకోలేను..అందులోనూ నా తమ్ముడి లాంటి అమర్ తప్పు చేసాడని అరిచాను...నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా క్షమించు" అన్నాడు ఓంకార్. వెంటనే అమర్ వెళ్లి "అన్నా ఊరుకో..ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు...తిట్టినా, కొట్టినా నువ్వే ..ప్రేమగా ఉండేది నువ్వు, ప్రేమగా మాట్లాడేది నువ్వే" అంటూ ఓంకార్ కాళ్ళ మీద పడ్డాడు. ప్రదీప్ గారు అమర్ మనవాడు రండి అందరూ కలిసి మాట్లాడుకోండి అంటూ ఓంకార్ అందరినీ కలిపేసాడు. ఈ గొడవ కూడా ఒకందుకు మంచిదే...ఇలా ఎన్ని గొడవలు వచ్చినా బంధం తెగేవరకు లాక్కోకూడదు..అంటూ చెప్పాడు ఓంకార్. ఎవరో ఒకరు తగ్గి క్షమాపణ అడిగితే ఆ ప్రేమ మళ్ళీ కొనసాగుతుంది అంటూ చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.