English | Telugu

చిరంజీవి, ఏఆర్ రెహ్మాన్, చిత్రమ్మకు క్షమాపణలు చెప్పిన రాకేష్....


ఇష్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మొత్తం కూడా రాకేష్ కబ్జా చేసేసాడు. అత్తా-కోడళ్ళు అదేనండి రాకేష్ వాళ్ళ అమ్మ - భార్య సుజాత కలిసి రాకేష్ ని టార్చెర్ పెట్టారు. దాంతో చిరంజీవికి, సారీ చెప్పాల్సి వచ్చింది. అదేంటో చూద్దాం...రాకేష్ వాళ్ళ అమ్మ స్టేజి మీద వచ్చి చిరు సాంగ్ "దాయి దాయి దామ్మా"కి డాన్స్ చేసారు. దాంతో రాకేష్ ఆపండి అంటూ అరిచాడు. "చిరంజీవి గారు క్షమించాలి..మా ఫ్యామిలీ మీకు తెలుసు. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి బ్లేసింగ్స్ తీసుకున్నా..మళ్ళీ వచ్చి తీసుకుంటా." అన్నాడు..తర్వాత సుజాత మాములుగా ఏడిపించలేదు. రోజా మూవీ నుంచి "నా చెలి రోజావే" సాంగ్ కి ముందు వచ్చే గాత్రాన్ని ఇమిటేట్ చేయమని సుజాతకు ఓంకార్ చెప్పేసరికి రాకేష్ షాకయ్యాడు.

వెంటనే నిలబడి "ఏఆర్ రెహ్మాన్ సర్ ..నేను మీకు తెలీదు. ఇలాంటి తప్పు మళ్ళీ జరక్కుండా చూసుకోవడానికి మాక్స్ ట్రై చేస్తున్నా సర్ ..చిత్రమ్మా నేను మీకు తెలుసు. అమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని.. మీ కోడలు ఇంత దారుణం చేస్తుంటే చూడలేకపోయానమ్మా " అంటూ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక రాకేష్ చెప్పిన ఫన్నీ క్షమాపణలకు అందరూ నవ్వేశారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో పార్టిసిపేట్ చేసిన జోడీస్ అందరికీ రకరకాల టాస్కులు ఇచ్చాడు ఓంకార్. ఇక అమర్ మాట్లాడుతూ "ఇష్మార్ట్ జోడి ఈజ్ ది బెస్ట్ ఇన్ మై లైఫ్ ..ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబర్స్ ఐ లవ్ యు ఆల్" అంటూ అరిచి మరీ గట్టిగా చెప్పాడు. తర్వాత సీనియర్ నటుడు ప్రదీప్ కూడా మాట్లాడారు "36 ఏళ్ళ నుంచి ప్రేమ ఉంటుంది కాబట్టి టెక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉంటాం. నా భార్యే కదా అర్ధం చేసుకుంటుందిలే అనుకుంటాం. ఇలాంటి వేదిక ఉంటే ఐ లవ్ యు సరస్ "అని చెప్పడం ఆనందంగా ఉంది అని చెప్పారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.