English | Telugu

లైన్‌లోకి వచ్చిన చలాకీ చంటి... సర్వనాశనం ఐపోతారు!

సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ఈ యుగాలన్నిటిలో స్నేహం, ధర్మం, నీతినిజాయితీ అనీ నాలుగు పాదాలా నడిచాయి కానీ ఇది కలియుగం ఈ యుగంలో డబ్బు మాత్రమే నడుస్తుంది..సో డబ్బుంటే బతుకు లేదంటే చచ్చిపో అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసాడు చలాకి చంటి. చంటి అంటే చాలు ఒకప్పుడు జబర్దస్త్ షోలో చేసిన కామెడీ గుర్తు రాక మానదు. అలాంటి చంటి కొంతకాలం క్రితం గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి తర్వాత కొంత రికవరీ అయ్యి మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. కానీ ఇంకా ఏ షోస్ లో కూడా కనిపించడం లేదు. అలాంటి చంటి ఒక ఇంటర్వ్యూలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరూ సాయం చేయరు అని చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చాడు.

ఇక యూట్యూబర్స్ మీద కూడా ఫైర్ అయ్యాడు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ తాను అలా కూడా వాళ్లందరికీ ఉపయోగపడ్డానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు ఇగో అని తాను కోరుకున్నది జరగాలని తనకు జరగాల్సిన సమయాల్లో కొన్ని జరగకుండా అడ్డు పడినవాళ్లంతా సర్వనాశనం ఐపోవాలని ఆ దేవుడిని రోజూ కోరుకుంటున్నానని ఇదే తన శాపం అని మనసులో బాధను వెళ్లగక్కాడు. మనం నాశనం ఐపోవాలని ఎదుటి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళు నాశనం ఐపోవాలని ఎందుకు కోరుకోకూడదు.. మనం ఏమీ దేవుళ్ళం కాదు కదా...అందుకే తనను నాశనం చేసిన వాళ్ళను నాశనమయ్యేలా చూడాలని అది కూడా బతికుండగానే చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.