English | Telugu

రష్మిని అసలు నువ్వెవరు ? అని అడిగిన బులెట్ భాస్కర్ నాన్న

బుల్లితెరపై మస్త్ పాపులర్ ఐన షో జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ. స్టార్ట్ చేసిన కొంత కాలానికే మంచి పేరు తెచ్చుకుంది. సుధీర్ హోస్ట్ గా స్టార్ట్ ఐన షో ఇప్పుడు రష్మీతో కంటిన్యూ అవుతోంది. మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాదు అప్పుడప్పుడు ఎమోషషనల్ సబ్జక్ట్స్ తో ఆడియన్స్ ని కంటి తడి పెట్టిస్తూ ఉంది ఈ షో. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ప్రతీ ఇంటిని పలకరిస్తూ అలరిస్తోంది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ వారం పెళ్ళాం చెబితే వినాలి థీమ్ తో స్కిట్స్ ప్లాన్ చేశారు కమెడియన్స్. ఈ ప్రోమోలో ఐతే ఆది మిగతా కమెడియన్స్ వచ్చి సందడి చేసినట్టు కనిపిస్తుంది. ఈ స్టేజి మీద భార్యలకు, భర్తలకు కబడ్డీ పోటీ పెడతారు. ఈ గేమ్ లో బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న కూడా పార్టిసిపేట్ చేస్తారు. అప్పటివరకు సరదాగా రష్మీ ని ఆట పట్టిస్తూ పంచ్ డైలాగ్స్ తో కాస్త ఎక్కువ చేస్తాడు.

బులెట్ భాస్కర్ ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ లో వాళ్ళ నాన్నను స్టేజి మీదకు తీసుకొచ్చి కామెడీ స్కిట్స్ చేయిస్తున్నారు. ఆయన టైమింగ్ ఉన్న కామెడీ చేస్తున్నారు కానీ కొన్ని పేలుతున్నాయి కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఆయన రష్మీ మీద కూడా ఇలాంటి డైలాగ్స్ వేస్తుంటే ఏమనాలో అర్ధం కాక తెల్లమొహం వేసుకుని నిలబడుతుంది. ప్రతీ కాంపిటీషన్ లో లేడీస్ గెలుస్తున్నారు, మగవాళ్ళు ఓడిపోతున్నారు అంటూ రష్మీ అనేసరికి మైక్ అందుకున్న బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న అసలు మీరు ఎవరు ? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.. అని కామెంట్ కం అవమానం చేసేసరికి రష్మీ ఒక్కసారిగా షాక్ ఐపోతుంది.

ఇక కబడ్డీ గేమ్ లో ఈయన కూతకు వెళ్లి స్టేజి మీద జారిపోయే పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా కాస్త టెన్షన్ అవుతారు. భాస్కర్ వాళ్ళ నాన్న పట్టు తప్పి పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.