English | Telugu

Brahmamudi : ఆస్తిలో వాటా కోసం ధాన్యలక్ష్మి తాపత్రయం.. కన్నకొడుకే తిరస్కరించాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -631 లో... సుభాష్ దగ్గరికి కావ్య వచ్చి.. మీరేదో ఒకటి చేసి చిన్న మావయ్యని కోర్ట్ కి వెళ్లకుండా ఆపండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని అపర్ణ కావ్యపై విరుచుకుపడుతుంది. ఏం అడిగినా ఈ కుటుంబం కోసం అంటావ్ కానీ అసలు ఏంటని చెప్పవని అడుగుతుంది. ఏది అయితే అది అవుద్ది ఇక్కడ నుండి వెళ్ళమని అపర్ణ కఠినంగా మాట్లాడడంతో కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పరిస్థితి మన చెయ్ జరిపోయిందని కావ్యతో రాజ్ అంటాడు. ఇంట్లో జరుగుతున్న వాటికి ఇద్దరు బాధపడతారు.

ఇంట్లో ఇక చిచ్చు రాజుకుంది.. ఆస్తులలో మనకి వాటా వస్తుందంటూ రాహుల్ , రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి.. ఏం చేసిన మీకు ఆస్తులలో వాటా రాదంటూ డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది‌. అయినా వాళ్ళు అదేం పట్టించుకోకుండా చిల్ అవుతారు. ప్రకాష్ ఇంట్లో వాళ్ళని ఎదిరించానని బాధపడుతుంటే ధాన్యలక్ష్మి వస్తుంది. కాసేపట్లో లాయర్ వస్తున్నాడని చెప్తుంది. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు వద్దని ప్రకాష్ అంటాడు. అలా ఏం ఆలోచించకండి అని ప్రకాష్ ని కిందకి తీసుకొని వెళ్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడే లాయర్ వస్తాడు. మేమే లాయర్ ని పిలిపించామని ధాన్యలక్ష్మి చెప్తుంది. తాత సంపాదించిన ఆస్తులలో వారసులుగా మనవళ్ళకి హక్కు ఉంటుంది కానీ వీళ్ళు కేసు వేస్తే మీరు ఎలా తీసుకున్నారని లాయర్ ని కావ్య అడుగుతుంది. అవును తన మనవళ్ళు వెయ్యాలని లాయర్ అంటాడు.

మేమ్ వేసింది చెల్లకపోతే నా కొడుకు చేత వేయిస్తానని ధాన్యలక్ష్మి అనగానే అప్పుడే కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. నేను వెయ్యనంటూ ముక్కుసూటిగా చెప్పేస్తాడు. తాతయ్య ఆ పరిస్థితి లో ఉంటే మీరు ఇలా చేస్తున్నారంటూ కోప్పడతాడు. నాన్న నీ బాధకి తప్పక ఒప్పుకున్నాడని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. నాకు ఆస్తులపై ఇష్టం లేదు.. నన్ను బలవంతం చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కళ్యాణ్ తన తల్లిని నిలదీస్తాడు. తరువాయి భాగంలో రాజ్ ఎవరితోనో కావ్య వీసా గురించి మాట్లాడతాడు. అది రుద్రాణి విని ధాన్యలక్ష్మికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.