English | Telugu

బాబోయ్ ఏంటి రీతూ.. బిగ్ బాస్ హౌస్ లో చంద్రముఖి 

చంద్రముఖిలో "వర్ధిల్లండి వర్ధిల్లండి" అనే సాంగ్ అందరికీ గుర్తుంది కదా. దాంతో పాటు "తోమ్ తోమ్ తోమ్ ..వారాయ్.." సాంగ్ కూడా తెలుసుకు కదా..ఇప్పుడు ఈ పాటే అన్ని చోట్లా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో చంద్రముఖి రీతూ అంటూ ఒక రీల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సాంగ్స్ లో అందరి ముఖాలు మార్చి పెట్టారు. డీమన్ పవన్ , పవన్ కుమార్, మనీష్, మాస్క్ మాన్, శ్రీజ, సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, శ్రీముఖి, అభిజిత్, నవదీప్, బిందుమాధవి, ఆదిరెడ్డి, సంజన, ప్రిద్వి శెట్టి, విష్ణు ప్రియా ఇలా పాతా కొత్త బిగ్ బాస్ స్టార్స్ అందరినీ ఈ వీడియోలో చూపించారు.


ఈ వీడియో చూసిన ఆదిరెడ్డి, కిర్రాక్ సీత, గీతూ రాయల్, సుష్మ కిరణ్ వంటి వాళ్లంతా ఫన్నీ ఇలాంటి వీడియో చేశారేంటి అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక చంద్రముఖి రూమ్ లో మంచం మీద రాము రాథోడ్ మంచి పడుకుని చూస్తున్నాడు అంటూ కూడా కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో బిగ్ బాస్ వీకెండ్ ప్లే చేయాలి. అసలు రీతూ ఆ నవ్వులు, ఆ అరుపులు ఏంటి లాస్ట్ సీజన్ లో విష్ణు ప్రియా అలా అరిచి ట్రెండ్ సెట్ చేసినట్టు రీతూ అలా చేయాలని చూస్తోందా అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఈ సీజన్ లో సంజన, రీతూ, తనూజా కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలీకుండా పోయింది ఆడియన్స్ కి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.