English | Telugu

మ్యూజిక్ డైరెక్టర్ కోటిని కోతి అంటూ కామెడీ చేసిన ఈర్య

సరిగమప లిటిల్ చాంప్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే లిటిల్ ఈర్య వచ్చి కోటి మీద డైలాగ్స్ వర్షం కురిపించింది. వచ్చి రాని తెలుగుతో, సరిగా నోరు తిరగక కోటిని పట్టుకుని కోతి అనేసింది. దాంతో ఆయన కూడా షాకయ్యారు. "అక్కడ ఎవరున్నారో తెలుసా కోటి గారు..తెలుసా అసలు కోటి గారి గురించి నీకు " అని అడిగాడు సుధీర్. "కొంతమందికి ఇష్టం గ్రీన్ టీ, అందరికీ ఇష్టం కోతి" అంది.

"కోటి గారికి ఏమన్నా తీసుకొచ్చావా మరి" అని అడిగాడు సుధీర్. అతని చేతికి ఒక పుస్తకం ఇచ్చింది. ఏంటిది రామ కోటా అని అడిగాడు సుధీర్. "నీలాంటోళ్ళు తలతిక్కగా మాట్లాడినప్పుడు కోతి నమస్కారాలు" అని చెప్పింది. దాంతో కోటి తన పేరును అన్ని సార్లు కోతి అంటూ ఉండేసరికి తలపట్టుకున్నారు. "నా తప్పేముంది కోతి అన్నయ్య" అని అడిగింది ఈర్య. "నువ్వు ఫస్ట్ నా పేరును కరెక్ట్ గా పలకడం కొంచెం నేర్చుకో" అనేసరికి క్యూట్ గా అపాలజీ చెప్తూ "ఐ ఆమ్ వెరీ సారీ" అనే పాట పాడింది. "దయచేసి ఈర్య సారీ చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేసేయండి. మనం యాక్సెప్ట్ చేయకపోతే అది మళ్ళీ పాట పాడి ఇబ్బంది పెట్టొద్దు ఈర్యాని" అంటూ జడ్జ్ అనిల్ రావిపూడి చెప్పాడు. "ఇంకా పాడతా రోజూ" అంటూ రెట్టించి మరీ రిప్లై ఇచ్చింది ఈర్య. "నిజాన్ని కోటిగారిని నువ్వు పిలిచినందుకన్నా కూడా ఈ పాటను పాడినందుకు ఎక్కువగా ఫీలైనట్టున్నారు" అంటూ సుధీర్ అనేసరికి కోటి నవ్వేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.