English | Telugu

భోలే షావలికి నూకరాజుకు మధ్య బిగ్ ఫైట్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో భోలే షావలికి నూకరాజుకు మధ్య బిగ్ ఫైట్ అయ్యింది. ఐతే షో పేరుతో ఒక అందమైన కేక్ ని తీసుకొచ్చి అందులో ఒక గోల్డ్ రింగ్ ని పెట్టారు అని రష్మీ చెప్పింది. ఐతే ఆ కేక్ ని పీసెస్ గా కట్ చేసి అందరికీ పంచింది. ఆ రింగ్ ఎవరికీ వస్తే వాళ్ళు లక్కీ అని చెప్పింది. నూకరాజుకు బోలీ షావలిని చూస్తే ఏమనిపించిందో కానీ బాగా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి కేక్ పీస్ నోట్లో పెట్టకుండా అతని ముఖానికి పూసేసాడు.

దాంతో భోలే ఫుల్ ఫైర్ అయ్యాడు. కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం. "ఏంటిది ఇలా ముఖానికి కేక్ పూస్తావా" అని సీరియస్ గా అడిగాడు. "అది చాలా చిన్న విషయం..నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్" అంటూ నూకరాజు భోలేని రివర్స్ లో మళ్ళీ ఏడిపించాడు. దాంతో అక్కడ సీన్ కాస్తా ఇంకా హాట్ అయ్యింది. ఇక ఈ వారం జానపద పాటల స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. అలాగే యూట్యూబ్ లో ఫేమస్ ఐనా అవుతున్న వాళ్ళను తీసుకొచ్చారు. ఇక భోలే ఐతే "భోలే అంటే హీరో..హీరో అంటే భోలే" అనే సాంగ్ పాడి అందరినీ అలరించాడు. ఐతే నెటిజన్స్ మాత్రం అటు భోలేని ఇటు నూకరాజును తిడుతున్నారు. ఇదంతా హిప్ కోసం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.