English | Telugu

ముకుందని విసిగించకుండా వెళ్ళమని చెప్పిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -149 లో.. కృష్ణ మోకాళ్ళపై గుడిమెట్లు ఎక్కుతుంటే.. అక్కడి పూజారి చూసి మురారికి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు వెంటనే మురారి గుడికి వస్తాడు. తనని అలా మోకాళ్ళపై నడవడం చూసిన మురారి.. ఆగు కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఇంత కఠినమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావ్ అని అడుగుతాడు. కృష్ణ సమాధానమేం చెప్పకుండా.. తను ఇన్ని రోజులు మురారిని అపార్థం చేసుకొని తప్పు చేశానని తన కాళ్లకి మొక్కుతుంది. కృష్ణ ఏం చేస్తుందో అర్థం కాని మురారి మాత్రం ఆశ్చర్యంగా చూస్తాడు.

వీళ్లంతా నా పిల్లలు కారు స్టార్ మా పిల్లలు అన్న శ్రీముఖి

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ఇప్పటివరకు సీరియల్స్ లో సెలబ్రిటీస్ తో గేమ్స్ ఆడిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అసలే సమ్మర్ సీజన్.. పిల్లలందరికీ స్కూల్, కాలేజీ హాలిడేస్ ఇచ్చేసారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాంటి చిల్డ్రన్స్ కోసం స్టార్ మా పరివారం టీం అంతా కలిసి "కిడ్స్ స్పెషల్" అంటూ ఒక ప్రోగ్రాంని రూపొందించారు. ఇందులో స్టార్ మా సీరియల్స్ లో నటించే చిన్నారులందరినీ తీసుకొచ్చి ఈ షోలో గేమ్స్ ఆడించారు. ఇక హోస్ట్ శ్రీముఖి ప్రతీ వారం కలర్ ఫుల్ గా కనిపించే పొట్టి డ్రెస్సుల్లో వచ్చేది. కానీ ఈ వారం చాలా పద్దతిగా కాటన్ శారీలో కనిపించి అలరించింది. "ఎప్పుడూ పాలేరులను వాళ్లనేనా పిలిచేది మాలాంటి కిడ్స్ ని పిలవకుండా సమ్మర్ స్పెషల్ షో ఎలా చేస్తావ్" అని అడిగారు. ఇక మధురానగరిలో కనిపించే బుడ్డోడు కూడా ఈ షోలో కళ్ళఅద్దాలు పెట్టుకుని వచ్చాడు. "అరే బుడ్డోడా కళ్లద్దాలు తీసి నాకు కన్ను కొట్టు" అని అడిగింది శ్రీముఖి.

మీలో ఎప్పుడూ ఫైర్ రగలాలి అంటూ కుందేలుతో ముచ్చట్లాడుతున్న కౌశల్

కౌశల్ మందా బిగ్ బాస్ సెకండ్ సీజన్ ను ఒక ఊపు ఊపేసిన స్టార్. విశేషమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుని ఆ సీజన్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక అతని రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు. అందుకే సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తన పిల్లల్ని స్కూల్ కి దింపుతూ, వాళ్ళను తీసుకొస్తూ, రెస్టారెంట్స్ కి వెళ్లి వెరైటీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా బీబీ జోడిలో కనిపించాడు. ఇలా కౌశల్ తన స్టయిల్లో తానూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపిస్తున్నాడు. ఇప్పుడు తాను పెంచుకునే బన్నీని చేతుల్లోకి తీసుకుని వాటికి ఫ్రూప్ట్స్ తినిపిస్తూ ఆ కుందేలుని బాడీ మీదకు ఎక్కించుకుని ఎంజాయ్ చేసాడు.

గుప్పెడంత మనసులోకి బ్రహ్మముడి కవి గారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్స్ కి ఉండే క్రేజ్ మాములుగా లేదు. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. కొత్తగా వస్తున్న సీరియల్ కోసం గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ మార్చొద్దని ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రెండింగ్ క్రియేట్ చేసి.. స్టార్ మా యాజమాన్యానికి మెసెజ్, కాల్స్ చేస్తున్నారు. బ్రహ్మముడికి, గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిమ ఎందుకంటే రెండింటలోను కథ బాగుంటుంది. అందులో రిషి,-వసుధార, ఇందులో రాజ్-కావ్య .. ఆన్ స్క్రీన్ పై ఈ రెండు జంటల మధ్య బాండింగ్, లవ్ వల్లే ఈ రెండింటికి అంత క్రేజ్ లభిస్తోంది.

ముగిసిన అమెరికా టూర్.. ధన్యవాదాలు చెప్పిన సునీత

టాలీవుడ్‌ టాప్ సింగర్స్ లో సునీత ఫుల్ ఫేమస్. తన అద్భుతమైన గాత్రంతో వందల పాటలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. గాత్రమే కాక హీరోయిన్స్ కి పోటీగా  తన అందంతో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.  తన ఫోటోలు, పాటలు, తన కుమారుడి వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీత ఫేమస్ బిజినెస్ పర్సన్ రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే నెల రోజుల నుంచి అమెరికాలో సునీత మ్యూజిక్ కన్సర్ట్స్ లో పాల్గొని తిరిగి వస్తున్న సందర్భాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది.

బ్రహ్మముడి ‌కలిపింది ఆ ఇద్దరిని.. ఇందిరాదేవి పూజ ఫలించినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -87 లో.. రాజ్, కావ్యలు ఒకే గదిలో నిద్రపోతుండగా..  రాజ్ బెడ్ మీద నుండి దొర్లుతూ కావ్యపై పడతాడు. అలా రాజ్ పడడంతో కావ్య భయపడుతూ.. నన్నేం చెయ్యొద్దంటూ గట్టిగా అరుస్తుంది. మీరు డీసెంట్ అనుకున్నాను.. మీరు ఒక విలన్ అని అంటూ అరుస్తూ డోర్ దగ్గరికి వెళ్తుంది. నేను విలన్ అయితే నువ్వు హీరోయిన్ వా అని రాజ్ అంటాడు. కావ్య అరుపులు విని ఇందిరాదేవి, కళ్యాణ్, రాజ్ బాబాయ్ వస్తారు. ఏమైందని అడుగుతుంది రుద్రాణి. అమ్మమ్మ గారు అంటూ ఇందిరాదేవి మీద పడి ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తుంది కావ్య. ఏం చెప్పను అమ్మమ్మ.. బోరున ఏడువాలని ఉందని కావ్య అంటుంది. ఏం అన్నావ్ రా.. మొరటోడా.. నా మనవరాలిని అలా బయపెడతవా.. అయినా నువ్వు నచ్చ చెప్పుకోవాలి కానీ అలా బయపెడతారా అని ఇందిరాదేవి కావ్యను అంటుంది.

మెడికల్ కాలేజ్ ప్లాన్ ని కనిపెట్టిన ‌శైలేంద్ర.. రిషి పసిగట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -754 లో.. రిషి మెడికల్ కాలేజీ గురించి అందరితో మాట్లాడుతాడు. డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే కాప్షన్ తో.. మన కాలేజీ ద్వారా ఫ్రీగా నాణ్యమైన విద్యని అందించాలని, చదవాలని కోరిక ఉండి చదవలేకపోయేవారికి మన కాలేజీలో విద్యనందించాలి.. దీనికి సంబంధించి కొంతమంది డాక్టర్స్ తో నేను మాట్లాడాను. ఒక్కొక్కరు ఒక్కో స్టూడెంట్స్ కి అయ్యే ఖర్చుని భరిస్తానన్నారు అని రిషి చెప్పగానే.. మంచి ఆలోచన అంటూ ఫణింద్ర, మహేంద్రలు రిషిని పొగుడుతారు.. ఇదంతా చూస్తున్న శైలేంద్ర కుళ్ళుకుంటాడు.