English | Telugu

గెలిస్తే 1000 వాలా అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "మాష్టర్ ఫినాలేకి ప్రిపరేషన్ ఎలా ఉంది" అని శ్రీముఖి శేఖర్ మాష్టర్ ని అడిగింది. చూసావు కదా అంటూ అమరదీప్ గట్టిగా అరుస్తూ "1000 వాలా తెచ్చి స్టేజి మీద పెట్టి మాష్టర్ చెప్పండి వెలిగించేస్తాం" అన్నాడు మంచి జోష్ తో. "గెలిస్తే ఇవి అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం" అంటూ విన్నింగ్ కెప్టెన్ ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చాడు. ఇక లేడీస్ సైడ్ నుంచి ప్రియాంక జైన్ వచ్చి కోసేయమంటారా అంటూ కేక్ ని చూపించి అడిగింది.

అష్షు కాళ్ళు పట్టుకున్న హరి..అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు

కాకమ్మ కథలో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి హరి, అష్షు రెడ్డి వచ్చారు. ఇక ఈ షోలో వీళ్ళు మాటలు మాట్లాడుకుంటున్న అవి బూతుల్లానే ఉన్నాయి. హరి ఐతే ఆర్జీవీలా కాసేపు పుష్ప రాజ్ లా కాసేపు ట్రాన్సఫార్మ్ ఐపోయాడు. అష్షు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. "బేసిక్ గా నాకు దేవుడంటే కోపం ఇంత అందాన్ని ముందే ఎందుకు పరిచయం చేయలేదన్న కోపం" అంటూ హరి రామ్ గోపాల్ వర్మలా చెప్పిన డైలాగ్ అష్షు, హోస్ట్ తేజస్విని షాకయ్యారు. ప్రోమో ఫైనల్ లో ఐతే పుష్ప శ్రీవల్లి తగ్గేదెలా ఐతే అష్షు - హరి కూడా తగ్గేదెలా అంటూ అష్షు కళ్ళు పట్టుకుని మరీ డైలాగ్ చెప్పాడు. ఇక హోస్ట్ తేజు ఐతే "నువ్వు చిన్నప్పటి నుంచి రాజుని పెంచుకున్నావ్ మరి హరిని ఎందుకు పెంచుతున్నావ్" అని అడిగింది. "పెంచుకోకపోతే ఉంచుకోమంటారని" అని అష్షు డైలాగ్ వేసింది. "అష్షు పక్కనున్న చాలు ప్రేమించక్కర్లేదు" అన్నాడు హరి.

నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ...

జబర్దస్త్ షో న్యూ ప్రోమో ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఏదైతే చెప్పారో అది ఈ ఎపిసోడ్ లో కనిపించబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఇంత మార్పులు ఈ షోలో వస్తున్నా కూడా సుధీర్ ఎపిసోడ్ కి మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇక జడ్జ్ ఖుషూ వచ్చి అన్నీ డబుల్ గా ఉండబోతున్నాయా అంది. అవును యాంకర్ కూడా డబుల్ కాబోతున్నారు అని చెప్పింది. ఇక రష్మీ  పక్కన బ్రహ్మముడి హీరో మానస్ సెకండ్ యాంకర్ గా వచ్చేసాడు. ఐతే రావడమే ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా ఐతే కళ్ళజోడు తీసి పెట్టి తనదైన మ్యానరిజమ్ ని చేసేవాడో మానస్ కూడా అలాగే చేసాడు. ఇక రష్మీ ఐతే ఉడుక్కుంది. "తెల్ల తోలు కదా స్టైలిష్ గా ఉంటది హలో మాస్ ఇక్కడ మాస్ పిల్ల" అంది.."నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ" అని కౌంటర్ డైలాగ్ వేసాడు. ఇప్పటి వరకు టీం లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది కానీ ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ ఉండబోతోంది అని చెప్పింది ఖుష్భూ. జబర్దస్త్ అమ్మాయి వెర్సెస్ ఖతర్నాక్ అబ్బాయి పేరుతో వీళ్ళ మధ్య పోటీ జరగబోతోంది.

Karthika Deepam2 : జ్యోత్స్నని‌ ఆడుకున్న కార్తీక్, దీప.. డౌట్ మొదలైందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో....దీప, కార్తీక్ కిచెన్ లో ఉంటారు. అప్పుడే పారిజాతం కిచెన్ లోకి వచ్చి.. రెండు ఫిల్టర్ కాఫీ తీసుకొని రా అని చెప్తుంది. సరే అంటూ పారిజాతంతో వెటకారంగా మాట్లాడతాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. ఏంటి కిచెన్ లో మీ సోది అని పని చేయకుండా అని అంటుంది. అంటే ఫిల్టర్ కాఫీ బాగోకపోతే మళ్ళీ కిచెన్ లోకి విసిరేస్తారు కదా అని పారిజాతం అనగానే ఖచ్చితంగా అదే జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. చెప్పుతో కొడుతానని కార్తీక్ అనగానే పారిజాతం జ్యోత్స్న బిత్తెరపోయి చూస్తారు.

బిగ్ బాస్ లోకి సాకేత్ ?

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షూటింగ్ సెట్స్ ఆఫ్ స్క్రీన్ లో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. రీసెంట్ గా అలాంటి ఆఫ్ స్క్రీన్ కంటెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి రెడీ అయ్యి ఈ షోలో ఉన్న గర్ల్స్ ని బాయ్స్ ని ఈ షో మీద అభిప్రాయం అడుగుతూ ఉంది. ఐతే విష్ణు ప్రియా ఈ షో బిగ్ బాస్ కంటే చాలా బెటర్ అని బిగ్ బాస్ కంటే పెద్ద నరకం ఇంకోటి లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. శ్రీముఖి దగ్గరకు సాకేత్ కొమాండూరి వచ్చాడు. అతన్ని కూడా ఈ షో మీద ఒపీనియన్ అడిగింది. "ఈ షో నైస్. చాలా ఫన్ ఉంది..మినీ బిగ్ బాస్ లా అనిపించింది" అంటూ చెప్పాడు.

అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండి వుంటే శ్రీముఖిని పెళ్లి చూసుకునేదాన్ని

బుల్లితెర మీద ఏ షో ఐనా కానీ కెమెరా, లైట్స్, రోల్ అంటే స్టేజి మీద చేసేది ఆడియన్స్ కోసం అన్నట్టు వుంటే ఆఫ్ స్క్రీన్ లో మస్త్ కామెడీ మస్త్ కంటెంట్ దొరుకుతుంది. కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సెట్స్ లో ఆఫ్ స్క్రీన్ లో శ్రీముఖి-తేజస్విని మడివాడ మధ్య అలాంటి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. శ్రీముఖి-తేజు రెడీ అయ్యి వచ్చి కూర్చుని సరదాగా చిట్ చాట్ చేసుకున్నారు. "ఈ వ్లాగ్స్ గిగ్స్ కాకుండా నువ్వు ఇంత అందంగా ఎలా తయారవుతున్నావో చెప్పు" అని శ్రీముఖిని తేజు అడిగింది. వెంటనే శ్రీముఖి "నన్ను చేసుకుంటావా పెళ్లి" అని అడిగేసింది. "నేను నిన్ను చేసుకోగలిగితే ఎప్పుడో చూసుకునేదాన్ని. అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండి వుంటే గనక శ్రీముఖి నా ఫస్ట్ ఆప్షన్. కానీ అవకాశం లేదు కదరా.

మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి..నేను ఫ్రీ..

ఢీ జోడి ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షో గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. ఈ టైటిల్ ఇవ్వడానికి యంగ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేష్ వచ్చాడు. కార్ లో దిగి గన్ ని హ్యాండిల్ చేస్తూ ఇచ్చిన పోజ్ చాలా యూనిక్ గా ఉంది. తర్వాత స్టేజి మీద టైటిల్ ని తీసుకొచ్చాడు. ఇక అడివి శేష్ ని చూసేసరికి అశ్విని చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. "మా సిస్టర్ కి మీరంటే చాలా ఇష్టం అండి" అని అశ్విని చెప్పేసరికి "నాక్కూడా మీ మొత్తం ఫామిలీ అంటే ఇష్టమండి" అని చెప్పాడు అడివి శేష్. "అయ్యయ్యో ఒక వేళా మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి మీకు 1 + 1 ఆఫర్ వస్తది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేను కూడా వస్తాను. ఎలా వస్తానో కూడా చెప్తాను" అంది అశ్విని. "ఎలాగో చెప్పండి ప్లీజ్ " అన్నాడు అడివి శేష్. "సినిమాల్లో కంటే పెద్ద ట్విస్టుల్లా ఉన్నాయి నీవి" అన్నాడు ఆది పక్కనుంచి. "నేను ఆది కామెడీకి బిగ్ ఫ్యాన్ కానీ డాన్స్ ఐతే అంత కాదు" అన్నాడు. జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ గురించి చెప్తూ "విజయ్ మాష్టర్ కానీ నాకు బ్రదర్ ఫస్ట్.. ఒక చిన్న చరిత్ర కూడా ఉంది కదా బ్రో. మరి అప్పట్లో " అంటూ ఒక సస్పెన్సు ని క్రియేట్ చేసాడు అడివి శేష్. ఇక సోనియా సింగ్, సిద్ధుని ఆది పరిచయం చేసాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ప్రియాంక జైన్ ని పెళ్లి చేసేసుకున్న శివ్

బుల్లితెర మీద స్క్రీన్ మీద కనిపించే ఆన్ స్క్రీన్ ప్రేమలు ఆ స్టేజి దిగాక కనిపించవు అని చాల మంది అంటూ ఉంటారు. అది నిజమైనా కాకపోయినా బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ జోడీస్ కొన్ని బాగా హిట్ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్నాయి. అందులో సుధీర్ - రష్మీ జంట ఒకటైతే వీళ్ళు జస్ట్ స్క్రీన్ వరకే అంటారు. అలాగే రాకేష్ - సుజాతా ..వీళ్లది ఆన్ స్క్రీన్ జోడి కానీ రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఇమ్మానుయేల్ - వర్ష జోడి...వీళ్ళు మొదట్లో అలరించారు...పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వేరే వేరే షోస్ లో చేస్తున్నారు. అలాగే ప్రియాంక జైన్ - శివ్ వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళు పెళ్లి చేసుకుంటాం అని చెప్తూనే ఉన్నారు.

Illu illalu pillalu : కోడళ్ళపై నిప్పులు కక్కిన రామరాజు.. నర్మద ఏడ్చేసిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -186 లో..   నర్మద, ప్రేమ ఇద్దరు డ్యాన్స్ క్లాస్ ముగించుకొని ఇంటికొస్తారు. ఇక అప్పటికే విషయం తెలుసుకున్న రామరాజు ఫుల్ కోపం మీద ఉంటాడు. మామయ్యా అంటూ ప్రేమ ఏదో చెప్పబోతుంటే..వద్దూ .. ఏం చెప్పొద్దని రామరాజు ఆపేస్తాడు. మీరిద్దరూ ఒకరికొకరు చేసుకునే సపోర్ట్ అద్భుతం, అమోఘం. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి.. తెలివితేటలు ఉండటం సహజం అనుకున్నా.. కానీ మీ ఇద్దరిలో ఎదుటి వాళ్లని పిచ్చోళ్లను చేసే తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియలేదంటూ ఫుల్ ఫైర్ అవుతాడు.

Brahmamudi : ఎంగేజ్ మెంట్ రింగ్ దాచేసిన కనకం.. యామిని ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -749 లో ఇందిరాదేవి, కనకం, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి ఆపాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తారు. యామిని పూజ చేసి హారతి ఇస్తుంది. హారతి గాలికి పోవాలని కనకం ఫ్యాన్ అటుగా తిప్పుతుంది. దాంతో ఆ  దీపం ఆగిపోతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇన్ని జరుగుతున్నాయి. పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని పంతులు యామినికి ఫేవర్ గా మాట్లాడతాడు. పంతులు ఫోన్ మాట్లాడుతుంటే.. యామిని వింటుంది. ఎవరు నిన్ను పెళ్లి ఆపమని అంటుందని అడుగుతుంది. దాంతో పంతులు జరిగింది యామినికి చెప్తాడు.