English | Telugu

ప్రభాస్ ఆ హీరోయిన్ తో డ్యూయట్ కి రెడీ అవుతున్నాడా! 

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్(prabhas)కెరీర్ ని ఒక్కసారి గమనిస్తే 'ఈశ్వర్ నుంచి మిర్చి' వరకు కూడా,హీరోయిన్స్ తో ప్రభాస్ చేసే డ్యూయట్ సాంగ్స్ ఒక రేంజ్ లో ఉండేవి.అందులో ప్రభాస్ వేసే స్టెప్స్ కూడా అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకునేవి.కానీ మిర్చి తర్వాత ఆ రేంజ్ డ్యూయట్ గాని, డాన్స్ గాని ప్రభాస్ కి రాలేదనే చెప్పాలి.అభిమానులు కూడా ఈ విషయంలో ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.

కానీ ఇప్పుడు ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ది రాజాసాబ్(the raja saab)లో ఒక అధ్బుతమైన డ్యూయట్ తెరకెక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఆ సాంగ్ లో మాళవిక మోహన్(malavika mohanan)తో కలిసి ప్రభాస్ చేసే రొమాన్స్ సూపర్ గా ఉండబోతుందని,డాన్సుల్లో కూడా వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతున్నాయి.యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఆ సాంగ్ చిత్రీకరించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని,త్వరలోనే యూనిట్ యూరప్ బయలుదేరి వెళ్తుందని కూడా చెప్తున్నారు.మరి ఈ విషయంలో మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇక ప్రభాస్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం రాజాసాబ్ తో హర్రర్ ఎంటర్ టైనర్ జోనర్ ని టచ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన రాజాసాబ్ మోషన్ టీజర్ అయితే సినిమా మీద అందరిలో అంచనాలని పెంచింది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న విడుదల కాబోతున్న ఈ మూవీకి మారుతీ(maruthi)దర్శకుడు కాగా, ప్రభాస్ సరసన మాళవిక మోహన్(malavika mohanan)తో పాటు నిధి అగర్వాల్ జత కడుతున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజె విశ్వ ప్రసాద్(tj viswa prasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.