English | Telugu

సాయిపల్లవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వేసవికి ఫుల్ మీల్స్ గ్యారంటీ

-ఏంటి ఆ గుడ్ న్యూస్
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-వేసవిలో ఖాయం


సిల్వర్ స్క్రీన్ కి అందం, గౌరవాన్ని తెచ్చే అరుదైన సహజ నటీమణుల్లో 'సాయిపల్లవి'(Sai Pallavi)కూడా ఒకరు. అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించడమే నిజమైన అందమని కూడా నిరూపించింది. అందుకే సహజ సిద్దమైన అభిమాన ఘనాన్ని భారీ స్థాయిలోనే పొందింది. ప్రస్తుతం తన హవాని బాలీవుడ్ యవనిక పై కూడా చాటబోతు ప్రపంచ సినిమాకి ధీటుగా భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత హై బడ్జెట్ లో తెరకెక్కుతున్న 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లిగా చేస్తుంది. తన ఖాతాలో ఉన్న మరో బాలీవుడ్ మూవీ 'మేరే రహో'(Mere Raho). ఇదే ఆమె తొలి బాలీవడ్ మూవీ కూడా.అగ్ర హీరో అమీర్ ఖాన్(Aamir Khan)నట వారసుడు జునైద్ ఖాన్(JUnaid Khan)హీరో.

షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా గత నవంబర్ 7 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని భారీ సినిమాల రాకతో రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీ వేసవికి వెండితెరని పలకరించబోతున్నట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ అధికారకంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారనే టాక్ కూడా బి టౌన్ లో వినపడుతుంది. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత సెల్యులాయిడ్ పై సాయి పల్లవి మ్యాజిక్ ని అభిమానులు 'మేరే రహో' ద్వారా చూడబోతున్నారు.

Also Read: సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

మేరే రహో పక్కా లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. మరి ప్రేమ కథా చిత్రాల్లో సాయి పల్లవి ఎంత బాగా పెర్ ఫార్మ్ చేస్తుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీలో కూడా సాయి పల్లవి కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంది. అమీర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న మేరే రహో 2016 లో థాయ్ లాండ్ దేశంలో రిలీజైన 'వన్ డే' అనే మూవీకి రీమేక్. నిషా గా సాయి పల్లవి రోహన్ గా జునైద్ ఖాన్ కనిపించబోతున్నారు. శ్వేతా తివారి, అమ్రితా సింగ్ కీలకమైన క్యారక్టర్ లలో కనిపిస్తుండగా సునీల్ పాండే దర్శకుడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.