English | Telugu

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

-ఈ కలెక్షన్స్ నిజమేనా!
-ఎంత వచ్చాయి.
-సినిమా పరిస్థితి ఏంటి


శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.


ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు యాభై లక్షల రూపాయలు గ్రాస్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అయితే కలెక్షన్స్ వివరాలని ఇంకా అధికారంగా వెల్లడి చేయలేదు.ఇక మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు సిద్దార్ధ గా నందు తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడని, సదరు క్యారెక్టర్ ని చూస్తుంటే పగ వాడికి కూడా సిద్ధార్ధ కి వచ్చిన బాధ రాకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక శంబాల, ఛాంపియన్ చిత్రాలు స్టిల్ ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. దీంతో వీకెండ్ లో సైక్ సిద్దార్ధ్ ఏ మేర కలెక్షన్స్ ని రాబడతాడో చూడాలి.


Also Read:ఇరవై ఇదే వేలు ఇస్తే ఏమైనా చేస్తుందా! అసలు ఆట అప్పుడే అయిపోలేదు


సుమారు ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్న సైక్ సిద్ధార్ధ 800 స్క్రీన్స్ లో విడుదలైంది. శ్రావ్య క్యారక్టర్ లో యామిని భాస్కర్(Yamini Bhaskar)త్రిష గా చేసిన ప్రియాంక రెబకా(Priyanka Rebekah)కూడా నందుకి దీటుగా మంచి పెర్ ఫార్మ్ ప్రదర్శించారు. వరుణ్ రెడ్డి(Varun Reddy)దర్శక ప్రతిభ, సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైక్ సిద్దార్ధ కి ప్రధాన బలంగా నిలిచాయి. స్పిరిట్ మీడియా తో కలిసి నందు నే నిర్మించగా, రానా దగ్గుబాటి థియేటర్స్ లో తీసుకు రావడం జరిగింది.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.