English | Telugu

వృషభ ఎండింగ్ కలెక్షన్స్ ఇవేనా! ఫస్ట్ వీక్ ఎంత

-ఇప్పటి వరకు ఎంత
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-క్లోజింగ్ కి వచ్చినట్టేనా!


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో మోహన్ లాల్(Mohanlal)కూడా ఒకరని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 80 వ దశకం నుంచే సదరు సౌత్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి 'క్రిస్ మస్'(Christmas)కానుకుగా 'వృషభ'(Vrusshabha)తో అడుగుపెట్టాడు. కానీ వృషభ అభిమానులతో పాటు అందరి అంచనాలని తలకిందులు చేస్తు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సదరు డిజాస్టర్ టాక్ కి ఫలితం ఎలా ఉందంటే మోహన్ లాల్ కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా ఆవిష్కృతమైంది . దీంతో ట్రేడ్ వర్గాల వారు వృషభ ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్స్ కి సంబంధించి వెల్లడి చేసిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.


వృషభ ఇప్పటి వరకు కేవలం రెండు కోట్ల రూపాయల నెట్ ని మాత్రమే రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు కోట్లలో మొదటి రోజే డెబ్భై లక్షలు వచ్చాయని వెల్లడి చేసాయి. అంటే ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ఊహించుకోవచ్చు. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ రావడంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా చాలా థియేటర్స్ లో ప్రెజెంట్ వృషభ రన్ అవ్వడం లేదు. కేరళలో కూడా చాలా థియేటర్స్ నుంచి తప్పించడంతో రెండు కోట్ల రూపాయలని ఎండింగ్ కలెక్షన్స్ గా భావించవచ్చు. ఇక మోహన్ లాల్ అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు వరుస విజయాలతో దూసుకుపోతున్న తమ అభిమాన హీరో సినిమాకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కనీస స్థాయి కలెక్షన్స్ రాబట్టలేకపోవడం తమని ఆవేదనకి గురి చేస్తుందని అంటున్నారు.


Also Read: సంక్రాంతికి గెలిచేది ఈ చిత్రమే.. పేరు ఇదే


పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన వృషభ లో రాజా విజయేంద్ర వృషభ అనే మహారాజుగా, అది దేవవర్మ అనే బిజినెస్ గా మోహన్ లాల్ భిన్న పార్శ్యాలు ఉన్న క్యారక్టర్ లలో కనిపించాడు. తన పెర్ ఫార్మెన్స్ తో కట్టిపడేసినా కూడా కథ, కథనాల్లోని లోపాలు, నంద కిషోర్(Nanda Kishore)పసలేని దర్శకత్వం బాక్స్ ఆఫీస్ వద్ద వృషభ ని ముందుకు తీసుకెళ్లలేకపోయాయి.నయన్ సారిక, రాగిణి ద్వివేది హీరోయిన్ లుగా చేసారు. కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.