English | Telugu

మహిళ ఆత్మహత్య.. 'పుష్ప-2' వాయిదా?

పుష్ప రెండో భాగంగా రానున్న 'పుష్ప: ది రూల్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆ తేదీకి విడుదలవుతుందా అనే అనుమానం కలుగుతోంది. దానికి కారణం ఓ మహిళ ఆత్మహత్య కేసులో పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్ కావడం.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. బన్నీ పాత్రకి సమానంగా, నిడివి ఎక్కువగల పాత్ర కావడంతో ఒక్క సినిమాతోనే జగదీష్ కి ఎంతో పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఓ మహిళ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప నటుడు జగదీష్ కి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. అయితే జగదీష్ తనని కాదని మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో.. ఆ మహిళ అతన్ని పక్కన పెట్టింది. ఈ క్రమంలో ఆమెకి మరో యువకుడు పరిచయమయ్యాడు. ఆ యువకుడితో మహిళ సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్ గా ఫొటోలు తీసిన జగదీష్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ వేధింపులు తట్టుకోలేక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు.

జగదీష్ అరెస్ట్ కారణంగా 'పుష్ప-2' షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే అతను అరెస్ట్ అయింది చిన్న కేసులో కాదు. బెయిల్ రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు. అదే ఇప్పుడు పుష్ప టీంకి తలనొప్పిగా మారొచ్చు. పుష్పలో జగదీష్ ది చిన్న పాత్ర కాదు. ఎప్పుడూ హీరో వెన్నంటే ఉండే పాత్ర. కీలక సన్నివేశాలలో జగదీష్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మెజారిటీ సన్నివేశాల్లో అతను కనిపిస్తాడు. అలాంటిది జగదీష్ జైలులో ఉంటే షూటింగ్ కి దాదాపు బ్రేక్ పడినట్లే. ఒకవేళ కొద్దిరోజుల తర్వాత అతను బెయిల్ మీద విడుదలైనా.. అప్పటికి ఇతర ముఖ్య నటీనటుల డేట్స్ అందుబాటులో ఉంటాయా అనేది సందేహం. ఎందుకంటే ఈ మూవీలో ఎందరో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వారు పుష్ప-2 తో పాటు పలు సినిమాలు అంగీకరించి ఉన్నారు. ఇప్పుడు జగదీష్ అరెస్ట్ కారణంగా పుష్ప-2 కోసం వారు ఇచ్చిన డేట్స్ వేస్ట్ అవుతాయి. తరువాత ఇతర సినిమాల డేట్స్ తో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గందరగోళం నడుమ పుష్ప-2 షూటింగ్ బాగా ఆలస్యమైతే.. ఆగస్టు 15 కి విడుదల కావడం అనుమానమే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.