English | Telugu

త్రిషకి మంగళసూత్రం ఇస్తానంటున్న అలీ! 

కొన్ని రోజుల క్రితం నుంచి తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సెగలు పుట్టించాయి. మన్సూర్ అలీ ఖాన్ త్రిష కి క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేసారు..ఈ టైంలో మళ్ళీ మన్సూర్ త్రిష గురించి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మన్సూర్ తాజాగా త్రిష కి క్షమాపణ చెప్పాడు. ఆయన మీడియా కి విడుదల చేసిన ఒక లేఖలో నా సహ నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి అలాగే మీ పెళ్లి త్వరలోనే జరగాలి మీ మెడలో మీ భర్త కట్టబోయే మంగళసూత్రాన్ని ఆశీర్వదించే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని మన్సూర్ అలీఖాన్ చెప్పడం జరిగింది.ఇటీవలే త్రిషకి క్షమాపణ అడిగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన మన్సూర్ పై కొన్ని రోజుల నుంచి తమిళనాడు తో సహా పలు ఏరియాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేసు విచారణ నిమిత్తం మన్సూర్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా మన్సూర్ అలీఖాన్‌పై పోలీసు చర్యలని కోరడంతో మన్సూర్ అలీఖాన్ ఇక చేసేది లేక త్రిషకి క్షమాపణలు చెప్పాడు.

కాగా మన్సూర్ తెలుగు సినిమా ప్రేక్షకులకి సుపరిచయమైన నటుడే.1991 లో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాలోని ఆయన విలనిజాన్ని ఎవరు మర్చిపోలేరు. ఆ సినిమాలో గంధపు చెక్క స్మగ్లర్ గా ఆయన పండించిన సరికొత్త విలనిజాన్ని ఎవరు మర్చిపోరు .మూడు దశాబ్దాల పై నుంచి మన్సూర్ తన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు ,తమిళ ,మలయాళ ,హిందీ భాషల్లో కలిపి సుమారు 250 సినిమాలకి పైగానే చేసాడు. లేటెస్ట్ గా విజయ్ లియోలో కూడా నటించాడు. ఆ మూవీకి సంబంధించిన సక్సెస్ మీటింగ్ లోనే మన్సూర్ త్రిష పై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఇంట బయట విమర్శలని ఎదుర్కున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.