English | Telugu

'సలార్'ను డిస్ట్రిబ్యూటర్స్ పట్టించుకోవటం లేదా.. కారణమదేనా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో 'సలార్' సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్ధమవుతోంది. కర్ణాటకలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సరే!.. మేకర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో ఓ లెక్కకు రావటం లేదు. ముందు డిస్ట్రిబ్యూటర్స్ సలార్ రైట్స్ ను సొంతం చేసుకోవటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. అందుకు కారణం.. నిర్మాణ సంస్థ ఒక్కో ఏరియా కళ్లు తిరిగేలా రేట్స్ ను చెబుతుందట.

నైజాం ఏరియాకు రూ.70 కోట్లు చెప్పారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్ అంత మొత్తంలో చెల్లించటానికి రెడీ అయ్యారు. అలాగే సీడెడ్ ఏరియాకు రూ.40 కోట్లు కోట్ చేశారు. అయితే మన డిస్ట్రిబ్యూటర్స్ అందుకు ఆసక్తి చూపలేదు. దాంతో మేకర్స్ చివరకు దాన్ని రూ.27 కోట్లకు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు. కానీ అందుకు కూడా మనోళ్లు రెడీగా లేరట. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే కెజియఫ్ 2, కాంతారా చిత్రాలను రిలీజ్ చేసుకున్నట్లు సలార్ ను ఓన్ రిలీజ్ చేసుకోవటానికి హోంబలే ఫిలిమ్స్ రెడీ అవుతోందట.

కె.జి.యఫ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమా. ప్రభాస్ నటిస్తోన్న పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్ కు చేరుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటించింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి రాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ సలార్ పైనే హోప్స్ పెట్టుకున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.