ఎంపీలకు జీతాల పెంపు అవసరమా!

ఒక సామాన్య మానవుడు తనకు వచ్చే జీత భత్యాలు మీద ఆధారపడి బ్రతకడం ఎంతో కష్టమో అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తోంది. కానీ కోట్లుకు కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు కూడా తమ జీత భత్యాలు పెంచమని అడగటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు పెంచమని, మాజీ ఎంపీల పెన్షన్ లను పెంచమని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. అయితే ఒక పార్లమెంట్ సభ్యుడి జీత భత్యాలు ఎంత.. అతనికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా అనే విషయం పై ఒక లుక్కేద్దాం.     * ఒక పార్లమెంట్ సభ్యుడి జీతం.. 1,20,000 * నెలకు రాజ్యాంగ వ్యయం.. 10,000 * ఆఫీస్ నిర్మాణానికి అయ్యే ఖర్చు.. 14, 000 * ప్రయాణఖర్చులు (Rs. 8 కి.మీ).. 48,000 * పార్లమెంట్ మీటింగ్స్ (రోజుకి).. 500 * రైలు ప్రయాణం ఫస్ట్ క్లాస్ ఏసీ.. ఉచితం * సంవత్సరానికి 40 సార్లు ఉచిత విమాన ప్రయాణం * ఒకవేళ ఢిల్లీలోని ఎంపీ హోటల్ బస చేయాల్సి వస్తే రెంట్ ఉచితం * 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (ఇంటికి) * 1,70,000 ఫ్రీ ఫోన్ కాల్స్ * మొత్తానికి సంవత్సరానికి ఒక ఎంపీకి ప్రభుత్వం చేసే ఖర్చు.. 33,08,000 * 5 సంవత్సరాల పదవికాలంలో అయ్యే ఖర్చు.. 1,60,00,000 అంటే ఒక ఎంపీకి 5 సంవత్సరాలో 1,60,00,000 ఖర్చు అయితే.. మొత్తం 534 ఎంపీలకు ఒక సంవత్సరం కాలంలో అయ్యే ఖర్చు 8,54,40,00,000 అంటే సుమారు 855 కోట్లన్నమాట. అదీ చాలదన్నట్టు పార్లమెంట్ సభ్యులకు అందించే భోజన సదుపాయాలు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. కనీసం బయట పేదవాడికి కూడా అంత చీప్ గా ఎక్కడా దొరకవేమో.. పేద వాడికి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం చేతకాని రాజకీయనేతలు మాత్రం పార్లమెంట్ సభ్యులకు మాత్రం అంత చౌక ధరలకే తిండి పెట్టడం ఎంత మాత్రం కరెక్టో ఆలోచించుకుంటే మంచిది. ఆ లిస్టు కూడా ఒకసారి చూద్దాం. మళ్లీ క్యాంటీన్ లో అందించే భోజనం సరిగా లేదంటూ తమ ఆరోగ్యం చెడిపోతుందంటూ ఫిర్యాదులు కూడా చేశారంట మన ఎంపీలు. ఎంతైనా ఫ్రీగా వచ్చే ఫుడ్డు కదా పాపం మన ఎంపీలకు సరిగా అరగలేదేమో అందుకే ఆరోగ్యం చెడిపోయివుంటుంది. దీనిని బట్టి ఒక ఎంపీకి ఇంకా జీత భత్యాలు పెంచడం అవసరమా? వారికి పెట్టే ఖర్చులో కనీసం కొంతైనా పేదలకు ఖర్చు చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడిఉండేది.

అధికారమనే అహంకారంతో రాజకీయ నేతలు

  అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు కొంతమంది నేతలు కానీ దానికి పర్యవసానంగా లేని పోని చిక్కుల్లో పడుతున్నారు. గత వారం రోజులలోనే ఇలాంటి ఘటనలు రెండు మూడు చూశాం. మొన్నటికి మొన్న కేంద్రమంత్రి రిజిజూ కోసం విమానాన్ని గంటసేపు నిలిపివేయడమే కాకుండా అతను ఎక్కడానికి ఖాళీ లేకపోతే అప్పటికే దానిలో కూర్చొని ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి కుటుంబసభ్యలు ముగ్గురిని విమానం నుంచి దించేశారు. అయితే ఈ వ్యవహారం గురించి మాత్రం రిజిజూ తనకేం సంబంధంలేదని, ప్రయాణికులను దింపిన విషయం తెలియదని చెప్పి తప్పించుకున్నారు.     మరో ఉదంతం డీఎంకే నేత స్టాలిన్ ది.. ఈయన చైన్నై లో కొత్తగా ప్రారంభించిన మెట్రోరైలు ప్రారంభంలో పాల్గొన్నారు. అనంతరం మెట్రో రైల్లో ప్రయాణిస్తుండగా తన పక్కన ఉన్న ఒక ప్రయాణికడిని పక్కకి జరగమంటూ చెంప మీద ఒకటి కొట్టారు. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో తేరుకున్న మన నేత తాను కావాలని కొట్టలేదని.. మహిళ ప్రయాణికురాలికి ఇబ్బంది కలిగిస్తున్నాడని అందుకే కొట్టానని చెప్పారు.     ఇది జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ గారి ఉందంతం.. ఈయన కూడా ఓ లేడి డాక్టర్ గారి కాలర్ సరిచేసి వార్తల్లోకి ఎక్కారు. దీంతో అక్కడి నెటిజన్లు మంత్రి చేసిన పనికి మండిపడి ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.     ఇప్పుడు ఏకంగా ఒక మహిళను కౌగిలించుకొని తన పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్న మంత్రిగారి ఉదంతం.. నేపాల్ మంత్రి హరిప్రసాద్ పరాజులి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం నేపాల్‌లో వరినాట్ల వేడుకలను వ్యవసాయశాఖ నిర్వహించడం ఆనవాయితీ. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మంత్రిగారు అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చిన ఓ మహిళను కౌగిలించుకొని సంచలనం సృష్టించారు. ఇంకేముంది మంత్రిగారు చేసిన ఈ నిర్వాకానికి ముందు ఎలా ఉన్నా ఒక్కసారి పదవి వచ్చిన తరువాత వారి దర్పాన్ని చూపించడానికి ప్రయత్నించి చివరికి పదవిపోయేలా చేసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో తివ్రమైన విమర్శలు వచ్చాయి. ఆఖరికి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.  

ఎసిబి కోర్టు చేతిలో ఫోరెన్సిక్ తుది నివేదిక

  ఓటుకి నోటు కేసులో ఎసిబి అధికారులు ఫోరెన్సిక్ సంస్థకు అందించిన ఆడియో వీడియో టేపులపై తుది నివేదికను ఆ సంస్థ అధికారులు నిన్న సాయంత్రం ఎసిబి కోర్టుకి సమర్పించారు. కనుక ఆ నివేదికను కోరుతూ ఎసిబి అధికారులు ఈరోజు కోర్టులో ఒక మెమో దాఖలు చేయనున్నారు. అది చేతికి అందిన తరువాత ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తను ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు సిద్దమని ఎసిబి అధికారుఅలకు లేఖ వ్రాసినా వారు ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే, వారు తదుపరి చర్యలు చేప్పట్టడానికి తొందరపడక పోవచ్చునని స్పష్టమవుతోంది. ఏమయినప్పటికీ ఇప్పుడు ఈ కేసు చాలా కీలక దశకు చేరుకోన్నట్లే భావించవచ్చును.

జగన్ కు మరో సాకు దొరికింది

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంకో సాకు దొరికింది. ఎప్పుడు తెదేపాను విమర్శిద్దామా అని చూసే జగన్ కు మొన్నటి వరకూ నోటుకు ఓటు కేసు గురించి తెగ హంగామా చేసి.. కేసీఆర్ కు మద్దతు పలకడంతో ఆంధ్రా నుండి వ్యతిరేకత రావడంతో అక్కడ తన ఉనికి తగ్గిపోతుందని భయపడి కొంచెం హడావిడి తగ్గించారు. తరువాత ఢిల్లీ ప్రయాణాలు, టూర్ లకు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఏలా తెదేపా ను విమర్శించాలా అని బాగా ఆలోచించినట్టున్నారు. అందుకే ఇప్పుడు సడెన్ గా ధవళేశ్వరం లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ధవళేశ్వరం ప్రమాదం జరిగిన కుంటుంబాలను పరామర్శించడానికి ఇప్పటి వరకూ చంద్రబాబు రాలేదని విమర్శించారు. అయినా ఏదో ఒక కారణంగా టీడీపీ ని విమర్శించాలని చూడటమే తప్ప అదే సహాయం జగన్ కూడా చేయోచ్చు కదా. బాధితుల కుంటుంబాలను తను పరామర్శించ వచ్చు కదా అని తెదేపా నేతలు అనుకుంటున్నారు.

అనాథలకు ఆపన్న హస్తం అందించిన లోకేశ్

తెదేపా పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త, పార్టీ యువనేత నారా లోకేశ్ ఇద్దరు అనాథ పిల్లలకు ఆపన్న హస్తం అందించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లె గ్రామానికి చెందిన శిరష, మణి అనే పిల్లలకు ఉచిత విద్య అందించడానికి ముందుకొచ్చారు. శిరష, మణిల తల్లిదండ్రుల మరణించడంతో వారు అనాథలయ్యారు. అయితే వారి తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీకోసం ఎంతో పాటుపడ్డారని ఓ కార్యకర్త లోకేశ్ కు మెయిల్ పంపడంతో వెంటనే స్పందించిన లోకేశ్ అనాథ పిల్లలు గురించి వారి తరపు బంధువులు గురించి వివరాలు తెలుసుకొని ఎన్టీఆర్ భవన్ కు పిలిపించారు. శిరిషకు ఎన్టీఆర్ మహిళా జూనియర్ కాలేజ్ లో, మణికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఉచిత విద్య అందించేలా పత్రాలు అందజేశారు.

డిఎస్ వల్ల ఒరిగేదమన్నా ఉందా

  పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని విడదీసి పాపం కట్టుకున్న ఒక్క కారణంగా దానికి శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి అసలు లేదు.. అసలు అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఉంది అంతే. అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అది కూడా గుర్తొస్తుంది. అందుకే పార్టీలోని నాయకులు చిన్నచిన్నగా పార్టీ మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది పార్టీ ఫిరాయించారు. ఆ జంపింగ్ లిస్టులో కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కూడా చేరిపోయాడు. ఇప్పుడు డిఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబి రంగు పూసుకోనున్నారు. కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన పీసీసీ బొత్స సత్యనారాయణ ఈ మధ్యనే వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. వాళ్లు మారారు నేను మారలేనా అని అనుకున్నారేమో డిఎస్ కూడా పార్టీ ఫిరాయించేశారు. పైగా తాను పదవులు కోసం కాదు పార్టీ మారింది.. బంగారు తెలంగాణ కోసం అని..మాటలు చెప్పడం. అంటే సంవత్సరం నుండి గుర్తుకురాని బంగారు తెలంగాణ ఇప్పుడు ఇంత సడెన్ గా ఎందుకు గుర్తొచ్చిందో డిఎస్ కి అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. పైగా ఇంకా గులాబీ నీళ్లు తాగకముందే అప్పుడే కేసీఆర్ ను పొగడటం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అప్పుడే భజన చేసేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ తనకు అన్ని రకాలుగా తోడుండి 9 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినా 3 సార్లు మాత్రమే గెలిచారు డిఎస్. కాంగ్రెస్ పార్టీ అంత సపోర్టు ఇచ్చినా నెగ్గుకురాలేని డిఎస్ ఇప్పుడు పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరడం వల్ల టీఆర్ఎస్ కు ఎమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమో అది కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఇప్పటివరకైతే ఎలాంటి ఢోకా లేదు.. ఇప్పుడు డిఎస్ చేరడం వల్ల ఆపార్టీకి కొత్తగా ఒరిగేది కూడా ఏంలేదు. ఏదేమైనా పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన డీఎస్ కేవలం ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే పార్టీ మారడం ఎంత మాత్రం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఏసీబీకి సహకరిస్తా.. సండ్ర

నోటుకు ఓటు కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాలని తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్య నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని పదిరోజులు గడువు కావాలని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇచ్చిన గడువు ముగియడంతో సండ్ర ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను డిశ్చార్జయ్యానని.. ఇక నుండి ఖమ్మంలోని తన ఇంట్లోనే ఉంటానని.. ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏసీబీకి లేఖ రాసిన తరువాత తనను ఎవరూ కలవలేదని కూడా సండ్ర తెలిపారు. సండ్ర తోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయగా.. వేం అప్పుడే విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ లోనే నెగ్గుకు రాలేనివాడు తెరాసలో నెగ్గగలడా?

  మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇంతకాలం తనకు ఎంతో గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి తెరాస కండువా కప్పుకోవడానికి సిద్దమయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి తొమ్మిదిసార్లు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తే కేవలం మూడు సార్లే గెలిచారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు పార్టీ అన్ని అవకాశాలు కల్పించినా ఆయన వాటిని వినియోగించుకొని తన సత్తా నిరూపించుకోలేక చతికిలపడ్డారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం.   అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తన సత్తాని నిరూపించుకోలేకపోయిన డి.శ్రీనివాస్ తెరాసలో చేరినెగ్గుకు రాగలరా? ఆయన చేరికతో తెరాస ఏమయినా బలపడుతుందా? అంటే రాజకీయ దురందరుడయిన కేసీఆర్ అటువంటి వెర్రి భ్రమలో ఉంటారని అనుకోలేము. డి.శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలకు మంచి పదవులు ఆఫర్ చేసి ఏదోవిధంగా తెరాసలోకి ఆకర్షించగలిగితే అది చూసి కాంగ్రెస్, తెదేపా పార్టీలలో సీనియర్, జూనియర్ నేతలు కూడా తెరాసలో చేరేందుకు సిద్దపడతారని కేసీఆర్ భావిస్తుండవచ్చును. ఆ విధంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలను బలహీనపరచాలనేది ఆయన వ్యూహం కావచ్చును. కానీ పార్టీలోకి కొత్తగా వచ్చిన అటువంటి వ్యక్తి కోసం పార్టీని నమ్ముకొన్న వారిని పక్కనబెట్టి ఆయనకు రాజ్యసభ సీటో లేక ఎమ్మెల్సీ సీటో కట్టబెడితే పార్టీలో అసంతృప్తి మొదలవదా? మొదలయితే ఆ సమస్యని ఏవిధంగా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలకు వలసలను ప్రోత్సహిస్తున్న తెరాస అధ్యక్షుడు కేసేఆరే సమాధానం కనుగొనవలసి ఉంటుంది.

కేసీఆర్ ను తిట్లతో ఏకిపారేసిన రేవంత్

ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫుల్లు ఫైర్ మీద ఉన్నట్టు నిన్న ఆయన ప్రసంగం వింటేనే తెలుస్తోంది. ఆయన చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్ తోపాటు కేటీఆర్ ను, హరీశ్ రావు, పార్టీ నేతలందర్ని కలిపి తిట్లతో ఏకిపారేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి తన కుటుంబానికే పదవులు కట్టబెట్టి కుటుంబ పరిపాలన చేస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించినందుకే ఈ కేసులో ఇరికించారని అన్నారు. "ఈ కేసులో నన్ను ఇరికించడం వల్ల ఇప్పుడున్న దానికంటే ఎక్కువ పేరొచ్చిందని.. కానీ కేసీఆర్ కు నేను బయటకు రావడం వల్ల జ్వరం వచ్చిందని" రేవంత్ ఎద్దేవ చేశారు. ఇకనుండి కేసీఆర్ ను గద్దె దించడం కోసమే పనిచేస్తానని.. కేసీఆర్ కు రాజకీయ జీవితం లేకుండా చేస్తానని అన్నారు. కేసీఆర్ కనుక తెలంగాణ ముద్దుబిడ్డ అయితే.. కేసీఆర్ లో ప్రవహించేది తెలంగాణ రక్తం అయితే ఇతర పార్టీలో నుంచి తమ పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించమని.. వాళ్లు కనుక గెలిస్తే తన ముక్కును నేలకు రాసుకుంటానని మీసం మెలేస్తూ.. తొడ గొడుతూ మరీ సవాళ్లు మీద సవాళ్లు విసిరారు. కేసీఆర్ నే కాదు మేనల్లుడు హరీశ్ రావును పై కూడా తిట్ల వర్షం కురిపించారు. హరీశ్ రావుకు మెదడు మోకాళ్లలో ఉందని.. మామ చేసిన బ్రోకర్ దందాలు ఆయనకు తెలియవా? అని ప్రశ్నించారు.   తెలంగాణలో తెదేపాని దెబ్బతీయాలని ఈ రకంగా కుట్రలు చేశారని.. తెలంగాణలో టీడీపీ జెండాని టచ్ చేసే మగాడే లేడని ఉండే రండి చూసుకుందాం అని సవాల్ విసిరారు. తెలంగాణ టీడీపీలో పవర్ ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్ని ఈకేసులో ఇరికించారు. ఇప్పుడు బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఊరికే ఉంటాడా.. అసలే ఎంతోకొంత రేవంత్ రెడ్డి అంటే అటు కేసీఆర్ కైనా ఇటు మిగతా నాయకులకైన కొంచెం భయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి. మొత్తానికి దెబ్బ తిన్న పులిలా ఉన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై తన దెబ్బని చూపే వరకూ నిద్రపోయేలా లేరనిపిస్తుంది.

పుష్కరాలకు రండి.. సెల్ఫీలు పెట్టండి.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ లో గోదావరి నిత్యహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు తెలుగు ప్రజలకు చాలా ముఖ్యమైనవని, ఇది గోదావరి ప్రాంతానికి మాత్రమే చెందినవి కావని.. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికి చెందినవని అన్నారు. ఇకనుండి ప్రతిరోజు గోదావరి హారతిని నిర్వహిస్తామని అన్నారు. ఇంకా గోదావరి పుష్కరాలు 13 రోజుల్లో ప్రారంభమవుతాయని.. కుంభమేళా కన్నా గొప్పగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని అన్నారు. అంతేకాదు గోదావరి పుష్కరాలు కుటుంబ సభ్యులతో వచ్చి పుణ్యస్నానాలు చేసి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో ఉంచాలని, దీనికోసం ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పుష్కరాలకు వచ్చిన వాళ్లు కూడా చెత్తాచెదారం ఎలా పడితే అలా పడేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో వేయాలని సూచించారు.

నేటి నుండి విశాఖ, తూ.గో.జిల్లాలలో జగన్ ఓదార్పు యాత్ర

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజుల పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో ఓదార్పు యాత్ర చేస్తారు. కానీ ఈయాత్ర తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి కాదు. వివిధ ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతారు.   ఆయన ఈరోజు ఉదయం 11.30 గంటలకి విశాఖకు వస్తారు. అక్కడి నుండి అచ్యుతాపురం వెళ్తారు. అక్కడ ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ మూడు రోజులలో ఓదార్పు యాత్రలో తూర్పు గోదావరి జిల్లాలో పెరుమల్లాపురం, హుకుంపేట గ్రామాలలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలను, ఆ తరువాత కొత్తపట్నం, రామన్నపాలెం, పరాడపేట, ఉప్పలంక, పగడాలపేట గ్రామాలలో మత్య్సకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రంపచోడవరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 9మందికి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. జూలై 4న గోపాలపురం నియోజకవర్గంలోని దేవరాపల్లి పొగాకు రైతులతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు.

నేటి నుండి గోదావరి నిత్య హారతి

  కాశీ పుణ్యక్షేత్రంలో రోజూ సాయంత్రం జరిగే గంగా (నది) హారతిని చూసి తరించేందుకు దేశంలో నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. ఆ ప్రేరణతోనే ఆంధ్రులకు పరమ పవిత్రమయిన గోదావరి నదికి నిత్య హారతి కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి చిన్న రాజప్ప, మంత్రులు దేవేనేని ఉమామహేశ్వర రావు, పి. సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్. కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, రాజమండ్రి యం.పి. మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి

బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరిచేసి వార్తల్లో కెక్కారు. ఆయన వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంత్రి చౌదరీ లాల్ సింగ్ లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళా వైద్యురాలు కాలర్ సరిగా పెట్టుకోలేదు. దీన్ని గమనించిన మంత్రి 'బైటియా నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనించిన మరో మహిళా డాక్టర్ మళ్లీ తన కాలర్ ఎక్కడ సరిచేస్తారు అని అనుకుందో ఏమో తనంతట తానే కాలర్‌ను సరి చేసుకుంది. అయితే ఇప్పుడు మంత్రి గారు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.

ఎవరూ పార్టీ వీడట్లేదు.. ఉత్తమ్

ఒకవైపు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేశారని.. త్వరలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏం లేదని.. కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడటం లేదని.. డీఎస్ లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడరని అని బుధవారం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే డీఎస్ కూడా సీఎం కేసీఆర్ ను కలిశారు.. కానీ తాను కూడా కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదని అందుకే కలిశానని చెప్పారు కానీ పార్టీ మార్పు పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలవల్ల ఇప్పుడు అందరూ సందిగ్ధంలో పడ్డారు.