ఈ విషయాలు తెలుసుకుంటే చాలు.. భార్యాభర్తల మధ్య ఎంత గొడవ జరిగినా పరిష్కారమవుతుంది..!

    రెండు వేర్వేరు కుటుంబాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో ఒక్కటవుతారు. అయితే మూడు ముళ్లు పడినంత సులువుగా ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు కలవవు.  వివాహం తర్వాత భార్యాభర్తలు ఎన్నో విషయాలను సర్దుబాటు చేసుకుంటూ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భిన్న దృవాల్లాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక గొడవ, వాదన రావడం చాలా సహజం. అయితే ఎలాంటి వాదనలు జరిగినా, ఎంత గొడవలు అయినా సరే.. అవి సులువుగా పరిష్కారం కావాలన్నా.. భార్యాభర్తల బంధం ఎప్పటికీ దృఢంగా ఉండాలన్నా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.  ఇవి తెలుసుకుని అర్థం చేసుకుంటే ఆ బంధం ఇక సేఫ్ జోన్ లో ఉన్నట్టే.. భార్యాభర్తలు కొట్టుకునే స్టేజ్ కు వెళ్లినా సరే.. ఆ తర్వాత ఇద్దరూ హాయిగా కలిసిపోతారు.  ఇంతకీ భార్యాభర్తలు ఇద్దరూ తెలుసుకుని, అర్థం చేసుకోవాల్సిన ఆ 5 విషయాలు ఏంటంటే.. మాట్లాడటం ఆపకూడదు.. ఎంత పెద్ద గొడవ జరిగినా భాగస్వామితో మాట్లాడటం మానేయకూడదు. మాట్లాడటం మానేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా భాగస్వామితో మాట్లాడవద్దని సలహా ఇచ్చినా సరే.. వారి మాటలు పట్టించుకోకుండా భాగస్వామితో మాట్లాడాలి.  గొడవ కారణంగా కోపం ఉంటే..  కోపం తగ్గిన వెంటనే.. కూర్చుని  భాగస్వామితో  మాట్లాడాలి.  సమస్య పెరగకుండా ఉంటుంది. తప్పులను ఎత్తి చూపడం మానుకోవాలి.. గొడవ జరిగితే ఒకరినొకరు నిందించుకోవడం ఎక్కువమంది చేసే పని . కానీ ఇలా  నిందించుకుంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. "ముఖ్యంగా నువ్వు ఇలా చేసావు", "నీ వల్లే ఇలా జరిగింది"  లాంటివి గొడవను పెంచుతాయి. కాబట్టి అలాంటి మాటలు అనకూడదు. సమయం తీసుకోవాలి.. చాలా మందికి గొడవ తర్వాత విరామం అవసరం అవుతుంది.  కాబట్టి వారికి సమయం ఇవ్వాలి.  కోపంతో ఎప్పుడూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. కోపంతో తీసుకున్న నిర్ణయం  జీవితంలో చాలా పెద్ద సమస్యలు తెస్తుంది.  గొడవ తర్వాత ఎప్పుడూ టైం తీసుకొని ఆలోచించి, ఆపై మాట్లాడాలి.  విషయం ప్రశాంతమైన తర్వాత మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. పాత విషయాలను పునరావృతం చేయవద్దు.. భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు తరచుగా ఏం చేస్తారంటే..  నువ్వు ఇంతకు ముందు ఇలాగే చేసావు, గతసారి కూడా అదే తప్పు చేశావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు.. ఇలాంటి మాటలను గొడవలో ప్రతిసారీ పాత తప్పులను ఎత్తి చూపడం వల్ల ఒకరి మీద మరొకరికి నమ్మకం  దెబ్బతింటుంది. ప్రస్తుతం ఏం జరిగింది?  దాని గురించి మాత్రమే మాట్లాడాలి. దాని గురించే డిస్కస్ చేయాలి.  పాత విషయాలు ప్రస్తావించి గొడవను పెంచేలా చేయకూడదు. క్షమించడం,  క్షమాపణ చెప్పడం..  అహంకారం భార్యాభర్తల బంధాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అవసరమైనప్పుడు క్షమించడం,  క్షమాపణ చెప్పడం సంబంధంలో బలాన్ని, బంధాన్ని పదిలంగా ఉండేలా చేస్తుంది. క్షమించడం, క్షమాపణ చెప్పడం ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకున్నట్టు కాదు.  ఇది పరిణితి చెందిన వ్యక్తిత్వానికి సంకేతం. కాబట్టి కొన్నిసార్లు తలవంచి క్షమాపణ చెప్పడంలో తప్పు  లేదు.  భాగస్వామి క్షమాపణలు కోరుతుంటే వారిని క్షమించడం కూడా చాలా ముఖ్యం.  మూడవ వ్యక్తి సలహాలతో ఎప్పుడూ భాగస్వామిని దూరం పెట్టడం చేయకూడదు.  ఇది చాలా తప్పు.                                        *రూపశ్రీ 

మీకు ఈ అలవాట్లు ఉంటే ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు..!

  విజయం ప్రతి వ్యక్తి జీవితంలో పెట్టుకునే ఒక లక్ష్యం. అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. కానీ చేసే పనిలో విజయం సాధించాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అయితే చాలా మందికి విజయం అనేది మాటల్లో లేదా కలలో మాత్రమే ఉండిపోతుంది.  ఎంత ప్రయత్నం చేసినా కొందరు విజయం సాధించలేరు. ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నా చాలా కారణాలు కళ్లముందు కనిపిస్తాయి. అయితే విజయం సాధించాలంటే కష్టపడుతూ ప్రయత్నం చేయడం మాత్రమే కాదు.. కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలని చెబుతున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఎంత కష్టపడినా విజయం దక్కకుండా అడ్డుకునే అలవాట్లు ఏమిటి? వాటిని ఎలా మార్చుకోవాలి?తెలుసుకుంటే..   సోమరితనం.. చాలామంది కష్టపడుతూనే ఉన్నాం కానీ విజయం సాధించలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. అయితే కష్టపడేవారిలో కూడా సోమరితనం ఉంటుంది.  సాధారణంగా కష్టపడ్డాం అని చెప్పేవారు కష్టపడిన సమయం గురించి పెద్దగా పట్టించుకోరు. విజయం సాధించాలంటే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అంతేకానీ ప్రయత్నం చేయాల్సిన సమయంలో చేయకుండా ఆ తరువాత ఎంత కష్టపడినా ఫలితం అందదు.   కోపం.. తన కోపమే తన శత్రువు అని అన్నారు పెద్దలు. కోపం విధ్వంసానికి దారితీస్తుంది. కోపం వల్ల వైఫల్యాలు ఎదురైనప్పుడు ఒత్తిడి, నెగెటివ్ ఆలోచనలు, ఓటమిని తీసుకోలేని తనం.. ఇట్లా చాలా మనిషిని డిస్టర్బ్ చేస్తాయి. కోపం మనిషిలో విచక్షణను చంపేస్తుంది. అందుకే కోపం ఉన్నవాడికి విజయం ఆమడ దూరంలో ఉంటుంది.   అహంకారం.. ఒక ఖచ్చితమైన మనిషికి ఉండకూడని గుణం అహంకారం. నేనే కరెక్ట్, నేను చెప్పిందే సబబు,  ఇది ఇలానే జరగాలి అనుకునే వ్యక్తి విజయం సాధించే దిశలో ఎదురయ్యే చాలా విషయాలను ఓర్పుగా అంగీకరించలేడు. ఎప్పుడైతే తన నిర్ణయాలను తప్ప దేన్నీ అంగీకరించలేని స్థితిలో ఉంటారో..అప్పుడు వ్యక్తి ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు.   అబద్దాలు చెప్పడం.. అవసరానికి అబద్దం చెప్పడం తప్పేం కాదు.. అని చాలా మంది అనుకుంటారు. ఈ కాలంలో అబద్దాలు చెప్పకుండా అస్సలు ఒక పని అయినా జరుగుతుందా అనుకునేవారు కూడా ఉంటారు. అయితే అబద్దాలు చెప్పడం వ్యక్తి జీవితంలో నెగిటివ్ దృక్పథాన్ని క్రమంగా పెంచుతుంది.  మనిషిలో నెగెటివ్ కోణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయం సాధించాలన్నా ఆ నెగెటివ్ కోణం అడ్డు పడుతూ ఉంటుంది.     పైన చెప్పుకున్న అలవాట్లను వదిలిపెడితే విజయం సాధించడం  సాధ్యం అవుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా విజయం ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటుంది.   - రూపశ్రీ  

తల్లిదండ్రులు నేర్పలేని.. ఉపాధ్యాయుడు  మాత్రమే నేర్పగల 5 విలువైన జీవిత పాఠాలు ఇవి..!

తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ, విలువలు,  రక్షణ ఇస్తారు.  ప్రతి పిల్లవాడికి మొదటి గురువు తల్లి అని అంటారు. అయితే ఇంటి బయట పిల్లలకు భాద్యతగా విద్య బుద్దులు నేర్పి,  జీవితాన్ని మలుపు తిప్పేది మాత్రం ఉపాధ్యాయులే. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎందరో గొప్ప వ్యక్తులు, ఎన్నో వృత్తులలో నిపుణులుగా గుర్తించబడుతున్నారంటే అదంతా ఉపాధ్యాయుల బోధన ద్వారానే బీజం పడుతుంది. ఉపాధ్యాయులు పుస్తకాల జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంలో జీవించడం,  వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అమూల్యమైన సూత్రాలను కూడా పిల్లలకు బోధిస్తారు. ప్రతి పిల్లవాడి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. పాఠశాల,  ఉపాధ్యాయులు వారికి నిజమైన జీవితానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాయి.   తల్లిదండ్రులు నేర్పలేని,  ఉపాధ్యాయులు బోధించగలిగే 5 జీవిత పాఠాలు ఉన్నాయి.  వాటి గురించి తెలుసుకుంటే.. క్రమశిక్షణ  ప్రాముఖ్యత.. ఇంట్లో పిల్లలు గారాబం  కారణంగా తరచుగా డిసిప్లిన్ తప్పుతారు.  ఇంట్లో పిల్లలు చాలా వరకు వారికి నచ్చినట్టు ఉంటారు. అయితే బడిలో ఉపాధ్యాయులే పిల్లలకు క్రమశిక్షణకు గల  నిజమైన అర్థాన్ని బోధిస్తారు. సమయానికి రావడం, హోంవర్క్ పూర్తి చేయడం, అల్లరిని కంట్రోల్ లో ఉంచడం,  చదువులో స్థిరంగా ఉండటం..  ఈ అలవాట్లు జీవితకాల విజయానికి పునాదిగా నిలుస్తాయి. జట్టుకృషి,  సహకారం.. పాఠశాలలో క్రీడలు, సమూహ ప్రాజెక్టులు,  సాంస్కృతిక కార్యకలాపాలు పిల్లలకు టీం వర్క్   శక్తిని తెలుపుతాయి. ఒంటరిగా కాకుండా కలిసి పనిచేయడం  గొప్ప విజయాలకు దారితీస్తుందని ఉపాధ్యాయుల బోధనలో నేర్చుకుంటారు. వైఫల్యాన్ని అంగీకరించడం.. పిల్లల తప్పులను ఇంట్లో కప్పిపుచ్చుతారు.  కానీ ఉపాధ్యాయులు వారికి వైఫల్యం నుండి పాఠం  నేర్చుకుని మళ్ళీ గెలవడానికి ధృఢంగా ఉండటం  నేర్పుతారు. ఈ గుణం తరువాత జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది. న్యాయం, సమానత్వం.. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని సమానంగా చూస్తారు. కులం, మతం, లింగం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని వారు పిల్లలకు బోధిస్తారు. సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ఈ విలువలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు.. ఉపాధ్యాయులు పిల్లలను తరగతి గదిలో ప్రశ్నలు అడగడానికి, ప్రసంగాలు ఇవ్వడానికి,  వేదికపై ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ప్రోత్సహిస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసం,  కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి దోహదం చేస్తుంది.                               *రూపశ్రీ.

దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!

  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.

అపజయాల పట్ల మనోవైఖరి ఎలా ఉండాలి?

అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.

విడాకులు కాదు.. వివాహ గ్రాడ్యుయేషన్ అంటా.. జపాన్‌లో ఈ వింత పద్దతి తెలుసా?

  భారతదేశంలో వివాహం ఒక పవిత్ర బంధంగా పరిగణించబడుతుంది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లు చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జపాన్ లో కొత్త రిలేషన్ షిప్ ట్రెండ్ పుట్టుకొచ్చింది.  ప్రప్రంచ వ్యాప్తంగా  దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ట్రెండ్ కు వివాహ  గ్రాడ్యుయేషన్ అని పేరు పెట్టారు. దీని గురించి తెలుసుకుంటే.. సంప్రదాయ వివాహ సంబంధాలను కొత్త కోణంలో చూసే ప్రయత్నమే ఈ ధోరణి. ఇది విడాకులకు ఒక ఛాయిస్ గా  పరిగణించబడుతుందట. అయితే ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమైందట. అసలు మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అంటే ఏమిటి? మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ లేదా సోట్సుకాన్ అనేది భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడివిడిగా జీవించాలని నిర్ణయించుకునే సంబంధం. విడాకులు, కోర్టు చికాకులు, మానసిక ఒత్తిడి వంటి బాధపెట్టే అంశాలు ఏవీ ఇందులో ఉండవు. ఇది పరస్పర గౌరవం,  అంగీకారంతో  తీసుకునే నిర్ణయం. తమ కలలు, వ్యక్తిగత లక్ష్యాలు లేదా స్వేచ్ఛను కోరుకునేవారికి  ఇది బాగా సూట్ అవుతుంది. మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ Vs విడాకులు..     విడాకులు, మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ ఈ  రెండూ ఒక బంధాన్ని ముగించడానికి  మార్గాలు. కానీ వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. విడాకులు అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. ఇది తరచుగా చాలా కష్టంతో,  ఒత్తిడితో కూడుకున్నది. దీంతో భార్యాభర్తలు విడిపోయి వారి బంధం పూర్తిగా ముగుస్తుంది. అయితే ఈ బంధం పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏమైనా విబేధాలు వచ్చినా  మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అని కొత్త పేరు పెట్టుకుని ఆ బంధాన్ని మరొక రకంగా మార్చుకున్నారు. మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ లో భార్యాభర్తలు ఎలా ఉంటారు.. మ్యారేజ్ గ్రాడ్యుయేషన్  తరువాత భార్యాభర్తలుగా జీవించరు. వారు   భార్యాభర్తలుగా జీవించకుండా స్నేహితులుగానో, రూమ్ మేట్స్ గానో ఉంటారు. కొందరు ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటూ తమ బాధ్యతలను స్వీకరిస్తారు. కొంతమంది వేర్వేరు ఇళ్లలో నివసిస్తారు. కానీ మ్యారేజ్ గ్రాడ్యుయేట్ అయినా సరే.. ఒకరినొకరు కలుస్తారు, ఒకరికొకరు  సహాయంగా ఉంటారు. మ్యారేజ్ గ్రాడ్యుయేషన్  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దీనికి లాయర్లు,  కోర్టులు  అవసరం లేదు. ఇద్దరి అంగీకారం ఉంటే చాలు.. ఇది చాలా సులభంగా జరిగిపోతుంది. సొంత ఎదుగుదల.. మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ తరువాత అప్పటివరకు భార్యాభర్తలుగా ఉన్నవారు కాస్తా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోతారు. వారు తమ ఎదుగుదలను, స్వేచ్ఛను ఎలాంటి సందేహాలు, ఒత్తిడులు లేకుండా చూసుకోగలుగుతారు. అయితే చట్టం దృష్టిలో మాత్రం వీరు విడిపోలేదని అర్థం.  కానీ తిరిగి మళ్లీ భార్యాభర్తలుగా కలుస్తారా లేదా అనేది మాత్రం తెలియదు.  ఇదీ మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ కహానీ..                                             *రూపశ్రీ.

తల్లిదండ్రుల గురించి గణపతిదేవుడు చెప్పిన మాట ఇదే..!

ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే మన చుట్టూ వృద్ధాశ్రమాలు రోజురోజుకూ పెరుగుతున్నాయా..? తండ్రి - తల్లి గురించి వినాయకుడు ఏమంటాడు..? ఈ జీవిత విలువలన్నీ గణేశుడి దగ్గర నేర్చుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించకుండా ఎన్ని తీర్థయాత్రలు, పూజలు, తపస్సులు చేసినా ఫలితం ఉండదని విశ్వంలో తల్లిదండ్రులను మించిన దేవుడు లేడని లోకానికి చాటి చెప్పిన గణపతిదేవుడు. పురాణాల ప్రకారం, గణపతి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో సంతోషానికి,  విజయానికి లోటు ఉండదని చెబుతారు.  తల్లిదండ్రుల సేవతో సంతృప్తి చెంది, హృదయపూర్వకంగా ఆశీర్వదించినప్పుడు, మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం మాత్రమే కాదు. మీకు భగవంతుని ఆశీస్సులు కూడా లభించాయని అర్థం. తల్లిదండ్రులకు సేవ చేయని, వారిని సంతోషపెట్టని వ్యక్తి తన జీవితంలో ఆనందాన్ని పొందలేడు. తండ్రి,  తల్లి యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి ప్రబోధించిన వినాయకుడి నుండి మనం చాలా జీవిత విలువలను నేర్చుకోవచ్చు. అవి ఏమిటో ఇక్కడ చూడండి. తండ్రి - తల్లి విశ్వం గణేశుడు: పురాణాల ప్రకారం, ఒకసారి దేవతలందరూ కలిసినప్పుడు అక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే సృష్టిలో ముందుగా పూజించే అర్హత ఎవరిది..? ముందుగా ఎవరిని పూజించాలి? అప్పుడు శివుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రతి ఒక్కరికీ ఒక పనిని ఇస్తాడు. ఎవరైతే ముందుగా భూమిని మొత్తం ప్రదక్షిణం చేస్తారో వారికి ఈ గౌరవం లభిస్తుంది. శివుడు ఆజ్ఞను అంగీకరించిన వెంటనే, దేవతలు  తమ తమ వాహనాలను ఎక్కి భూ ప్రదక్షిణ చేశారు. తండ్రి మార్గం - తల్లి విజయం: దేవతలందరూ వెళ్లిపోయిన తర్వాత, వినాయకుడి వంతు వచ్చింది. గణేశుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి, తన తండ్రి శివుడు, తల్లి పార్వతికి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, మూసుకుని వెళ్లిపోతాడు. పరమశివుడు సంతోషించి ఈ లోకంలో నీ కంటే తెలివైనవాడు లేడని వినాయకుడికి చెప్పాడు. గణేశుడు తన తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణ చేయడం మూడు లోకాలను మూడుసార్లు ప్రదక్షిణ చేసినట్లే. గణేశుడి కుటుంబం నుండి ఐక్యత పాఠం:  దేవతలలో, గణేశుని కుటుంబం అతిపెద్దది. అందులో తల్లిదండ్రులు, సోదరుడు కార్తికేయ, గణపతి భార్య రిద్ధి-సిద్ధి, ఇద్దరు కుమారులు సంతోషంగా జీవిస్తున్నారు. గణపతి తల్లిదండ్రులను కుటుంబ పెద్దలుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, అతను చిన్న సవాళ్లకు భయపడతాడని, కానీ కుటుంబం కలిసి ఉన్నప్పుడు, అతను కూడా పెద్ద సమస్యలను ఎదుర్కొంటాడు. ఐక్యతలో బలం ఉందని గణపతి బోధిస్తాడు.  తండ్రి - తల్లి మాటే వేద పద్యము: గణపతి తన తండ్రి, తల్లి తనకు అప్పగించిన పనులన్నింటినీ చిత్తశుద్ధితో పూర్తి అంకితభావంతో పూర్తి చేసేవాడు. తల్లిదండ్రుల ఆదేశాలను నెరవేర్చడం అతనికి చాలా ముఖ్యం. ఒకసారి, శివుడు పౌర్ణమి నాడు యాగం నిర్వహించాలని భావించాడు, దాని కోసం దేవతలు, ఋషులందరినీ ఆహ్వానించాలి, కానీ యాగానికి చాలా తక్కువ సమయం ఉంది, కాబట్టి శివుడు ఈ పనిని గణపతికి అప్పగించాడు. గణేశుడు తన తండ్రి చేసినట్లే మూడు లోకాలలోని దేవతలందరినీ ఒకే రోజులో ఆహ్వానించాడు.  ఈ కష్టమైన పని ఒక్క రోజులో ఎలా పూర్తయింది అని శివుడు అడగగా, గణేశుడు నేను మీ పేరు మీద అంటే శివ మంత్రాలతో, ప్రతి మంత్రంతో హవనాన్ని చేసాను. , నేను ప్రతి దేవుడి పేరును పిలిచాను. అది  దేవతలు, ఋషులు అందరికీ చేరిందని వివరించారు. తల్లిదండ్రుల సూచనలను పాటించడమే పిల్లల ఆఖరి కర్తవ్యమని దీని నుండి మనం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, శ్రద్ధ గణేషుడి నుండి నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. ఈ వ్యాసం నుండి మనం వారి మాటలకు కట్టుబడి ఉండడం నేర్చుకోవచ్చు.

తెలుగు భాష వెలుగులు పూయించిన పుణ్యమూర్తి..గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి..!

    ఆగస్టు 29వ తేదీ ప్రతి తెలుగు పౌరుడు ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన దినం. తెలుగు భాషను తన సహజ శైలిలో, జనజీవనానికి దగ్గరగా తీసుకెళ్లిన మహనీయుడు, గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఈ రోజు. ఆయన తెలుగు బాషకు చేసిన కృషి కారణంగా ఆయన జయంతినే తెలుగు బాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలుగు భాష కొరకు ఇంత పాటుపడిన గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి తెలుసుకుంటే.. వ్యక్తిత్వం.. 1854 ఆగస్టు 29న విశాఖపట్నం జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపంలోని పార్లకిమిడి ప్రాంతంలో జన్మించారు.  ఆయన  చిన్నతనం నుంచే తెలివితేటలతో, నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు.  ఆర్థిక ఇబ్బందులున్నా  చదువు ఆపకుండా, స్వయంగా సాధన చేస్తూ తరువాత ఉపాధ్యాయుడిగా, పండితుడిగా, సాహితీవేత్తగా వెలుగొందారు. పాండిత్యం – ఆచరణ – సాహిత్యం.. ఆ కాలంలో తెలుగు భాష గ్రంథిక భాష ఆధిపత్యంలో ఉండేది. అది సాధారణ జనజీవనానికి దూరమై, పుస్తకాలకే పరిమితమైపోయింది. విద్యార్థులు అర్థం కాని భాషలో పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చేది. గిడుగు పంతులు దీన్ని బలంగా వ్యతిరేకించారు.  పుస్తకాలలో గ్రాంథిక బాష,   వాడుకలో మాతృ భాష ఉండటం వల్ల విద్యార్థులు సరిగా విద్యను అభ్యసించ లేకపోతున్నారని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ఆలోచనలతోనే ఆయన వ్యావహారిక భాషా ఉద్యమం ప్రారంభించారు. తెలుగు మనుషులు తమ నిత్య జీవితంలో మాట్లాడే భాషలోనే పాఠాలు, రచనలు, విద్య జరగాలి అన్నది ఆయన వాదన. ఈ ఆలోచన అప్పట్లో పెద్ద సంచలనమే. భాషా సంస్కరణల పితామహుడు.. వ్యావహారిక భాష ఉద్యమం – తెలుగు పుస్తకాలను, పాఠ్యాంశాలను సులభమైన వ్యావహారిక శైలిలో రాయాలని ఆయన కృషి. “భాషా గిడుగు”.. అనే బిరుదు  ఆయన చేసిన సంస్కరణల వల్లే ఆయనకు ఈ బిరుదు లభించింది. అండమాన్‌లో ఆంధ్రులు – అక్కడి తెలుగు ఖైదీలతో మాట్లాడుతూ వారి జీవన శైలిని, భాషను ఆయన పరిశీలించి రచనలు చేశారు. లాంబాడీల (బంజారా జనజాతి) భాష, సాహిత్యం పై పరిశోధనలు చేసి, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా గిరిజనుల గొంతుకను వినిపించారు. ఆయన కృషి తెలుగు భాషకు తెచ్చిన మార్పు.. గ్రంథిక vs వ్యావహారిక అనే విభేదాన్ని తొలగించి, తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేశారు. విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకోవాలనే హక్కు ఆయన కృషి వల్ల సాధ్యమైంది. ఆ తరువాతి తరాల రచయితలు, కవులు, పండితులు ఆయన మార్గదర్శకత్వంలో సరళమైన తెలుగులో రచనలు చేశారు. తెలుగు భాష గొప్పదనం.. తెలుగు భాష అతి పురాతనమైనది.  దీనికి  2,000 సంవత్సరాలకు పైగా చరత్ర ఉంది. మృదు, మధురమైన ఉచ్ఛారణ తెలుగు భాష సొంతం. వందలాది కవులు, పండితులు, తాత్వికులు ఈ భాషను కీర్తి గగనంలో నిలిపారు. నేటి వరకు 8 కోట్లకుపైగా ప్రజలు ఈ భాషను తమ మాతృభాషగా మాట్లాడుతున్నారు. తెలుగు భాష అందాలు కేవలం సాహిత్యంలోనే కాక, నిత్యజీవనంలో, సంస్కృతిలో, సాంప్రదాయాలలో ప్రతిఫలిస్తాయి. గిడుగు పంతులు నేర్పినదిదే.. గిడుగు పంతులు గారు మనకు నేర్పింది ఒకే ఒక్క విషయం .. భాష అంటే ప్రజల గొంతుక. అది అందరికీ అర్థమయ్యేలా, అందరికీ అందుబాటులో ఉండాలి. తెలుగు కేవలం పుస్తకాల భాష కాదు, అది మన ఊపిరి, మన అనుభూతి, మన గౌరవం. తెలుగు భాషకు ఓ గుర్తింపు తెచ్చి,  ఈనాడు అందరూ ఇంత సరళమైన తెలుగు భాషలో చదువుతూ, రాస్తూ అభివృద్ది వైపు నడుస్తున్నారంటే అది గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి కృషి వల్లే.. అందుకే ఆయన్ను స్మరించుకోవాలి.                                    *రూపశ్రీ.

తొండం లేకుండా పూజలు అందుకునే వినాయకుడి గురించి తెలుసా? లెటర్ లు రాసి మరీ కోరికలు కోరుతారండోయ్!

భారతదేశంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.  ఈ వేడుకలు దేశం యావత్తు ఎంతో గొప్పగా, మరెంతో భక్తిగా జరుపుకుంటారు. ప్రతి పూజలోనూ తొలి పూజలు అందుకునే వినాయకుడిని తొమ్మిది రోజులు కొలువుంచి ఘనంగా పూజ చేయడం,  ఆ తరువాత ఎంతో గొప్పగా ఊరేగింపు చేసి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడం చేస్తారు. అయితే దేశంలో చాలా చోట్ల పండుగలు, దేవుళ్ల విషయంలో చాలా వింతలు       చూస్తుంటాం. అలాంటి వింత ఒకటి ఇప్పుడు తెలుసుకుంటే.. తొండం లేని వినాయకుడు.. దేశ వ్యాప్తంగా గణేశుడి ఆలయాలు వందలాది ఉన్నాయి.  ఆ ఆలయాలలో కొన్ని చాలా ప్రత్యేకం.  వాటిలో ఒకటి రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న గర్ గణేష్ ఆలయం. గర్ గణేష్ ఆలయం  అతి పెద్ద విశేషం ఇక్కడ గణేశుడికి తొండం ఉండదు.   అంటే ఇక్కడ గణేషుడు బాల రూపంలో ఉంటాడట. ఇక్కడ వినాయకుడికి తొండం ఉండదు. వినాయకుడు ఇక్కడ పురుషాకృతి రూపంలో కూర్చుని ఉన్నాడని నమ్ముతారు. . ఆలయ చరిత్ర.. 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జై సింగ్ II ఈ ఘర్ గణేష్ మందిరాన్ని నిర్మించాడు. జైపూర్‌ను స్థాపించే ముందు ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈ ఆలయానికి పునాది వేశారని చెబుతారు. సిటీ ప్యాలెస్‌లోని చంద్ర మహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో కనిపించే విధంగా ఆయన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ప్రత్యేకమైన ప్రణాళిక నుండి మహారాజా భక్తి,  నిర్మాణ దృష్టిని అంచనా వేయవచ్చు. బారి చౌపాడ్‌లో ఉన్న ధ్వజాధీష్ గణేష్ మందిరం ఘర్ గణేష్ మందిరంతో కనెక్ట్ చేసి  ఉంది, దీనిని దానిలో భాగంగా భావిస్తారు. కష్టాల ఏకరువు.. ఘన్ గణేష్ ఆలయం చాలా చారిత్రకమైనదే కాకుండా పూజా పద్ధతి కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ గణేశుడి విగ్రహం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఆలయ ప్రాంగణంలో రెండు భారీ ఎలుకలు ఉంటాయి.   భక్తులు తమ సమస్యలను,  కోరికలను ఈ ఎలుకల చెవులలో చెబుతారట. ఈ ఎలుకలు భక్తులు చెప్పుకునే బాధు, కోరికలను  నేరుగా వినాకుడికి  తెలియజేస్తాయని  వినాయకుడు  వారి కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. ఉత్తరంతో వినతులు.. ఘర్ గణేష్ మందిరంలో   అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..  భక్తులు తమ కోరికలను లేఖలు లేదా ఆహ్వాన పత్రాల రూపంలో స్వామికి సమర్పిస్తారు.  మొదట్లో  పెళ్లి కావాలని, బిడ్డలు కావాలని, ఉద్యోగ కావాలని ఇట్లా ఏదైనా కోరికలు ఉంటే వాటి కోసం  ప్రతిరోజూ వందలాది లేఖలు  స్వామి వారికి వచ్చేవి.  వాటిని చదివి భగవంతుని పాదాల వద్ద ఉంచుతారట. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.  వినాయకుడు భక్తుల గోడు వెంటాడని తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. మెట్ల దారి.. తిరుమల వెంకన్నను దర్మించుకోవడానికి చాలామంది మెట్ల దారి గుండా నడిచి కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుందని, స్వామి అనుగ్రహానికి దగ్గర చేస్తుందని చెబుతారు. అయితే ఇదే విధంగా ఘర్ గణేషుడి ఆలయానికి కూడా ఇట్లాగే వెళ్లవచ్చు. కాకపోతే ఇక్కడ మెట్ల సంఖ్య 365.  ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 మెట్లు ఎక్కాలి. ఈ ఎక్కడం కొంచెం అలసిపోయేలా ఉంటుంది, కానీ ఆలయానికి చేరుకున్న వెంటనే లభించే ప్రశాంతత అన్ని అలసటలను దూరం చేస్తుంది. ఇక్కడి నుండి, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో, మొత్తం జైపూర్ నగరం వ్యూ అద్భుతంగా కనిపిస్తుందని చెబుతారు.  ఇదీ ఘర్ గణేషుడి ఆలయ ప్రత్యేకత.                                    *రూపశ్రీ.

పెళ్లి తర్వాత భాగస్వామితో ప్రేమ, స్నేహం ఎంతవరకు సాధ్యం?

నేటికాలంలో పెళ్ళి ఫిక్స్ అయిందంటే చాలు.. అమ్మాయి అబ్బాయి ఫోన్ నంబర్లు మార్చుకుని ఎంచక్కా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ వివాహం అయితే చెప్పక్కర్లేదు.  అయితే పెళ్లికి ముందు ఉండే స్నేహం, ప్రేమ అనేవి పెళ్లి తర్వాత కూడా ఉంటాయా అంటే.. చాలామంది అవి లేవనే సమాధానం చెబుతారు. అంటే.. పెళ్లికి ముందు ఉండే ప్రేమ,  స్నేహం వంటివి పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండటం లేదు.  ఎందుకని?  వివాహం తర్వాత కూడా ప్రేమ అలాగే ఉంటుందని అనుకుంటారు.  కానీ స్నేహానికి స్థలం తగ్గకూడదు. నిజం ఏమిటంటే.. వివాహంలో, స్నేహం,  ప్రేమ రెండూ ఉంటే బంధం మరింత బలపడుతుంది.కానీ ఇవి రెండూ ఉండగలవా? పెళ్లి తర్వాత ప్రేమ, స్నేహం రెండూ భార్యాభర్తల మధ్య ఉండగలవా? భార్యాభర్తల బంధంలో ప్రేమ, స్నేహం రెండూ ఉంటే ఏం జరుగుతుంది? స్నేహం.. సంబంధానికి పునాది.. ఏ సంబంధానికైనా స్నేహం బలమైన పునాది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు స్నేహితులుగా ఉంటే వారి మధ్య బంధం ఓపెన్ గా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్నేహం వల్ల ఎక్కువ అవగాహన,  సాన్నిహిత్యం ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలకు తగాదాలు తక్కువగా ఉంటాయి. ప్రేమకు స్నేహమే సపోర్ట్.. వివాహం తర్వాత ప్రేమ  అంటే భార్యాభర్తలు సరదాగా ఉండటం కాదు.. జీవితంలోని బాధ్యతలు, కష్టాల గుండా కూడా ప్రయాణం చేయడం. అటువంటి పరిస్థితిలో ఆ ప్రేమను సజీవంగా ఉంచేది ప్రేమ మాత్రమే. కష్ట సమయాల్లో  మద్దతు ఇచ్చేవాడు మంచి స్నేహితుడు.  ఈ లక్షణాలు వైవాహిక జీవితంలో కూడా ఉపయోగపడతాయి. స్నేహం, ప్రేమ బ్యాలెన్సింగ్.. చాలా సార్లు భార్యాభర్తలు తమ జీవితంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అయోమయంలో పడుతుంటారు.  పరిస్థితి మొత్తం చెయ్యి దాటాక.. అయ్యో.. ఈ సందర్బంలో ఫ్రెండ్ గా మాట్లాడి ఉంటే బాగుండు.. ఫలానా సందర్భంలో ఒక లవర్ లాగా ప్రేమను ఎక్ప్స్రెస్ చేసి ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు.  అయితే పరిస్థితి ఎలాంటిది అయినా కనీసం స్నేహం, ప్రేమ.. ఏదో ఒకటి ప్రెజెంట్ చేస్తూ ఉంటే అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. క్రమంగా ఈ స్నేహం, ప్రేమ కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటాయి. అపార్థాలు.. భార్యాభర్తలు కేవలం భార్యాభర్తల్లా కాకుండా పైన చెప్పుకున్నట్టు స్నేహం, ప్రేమను ప్రెజెంట్ చేస్తుంటే.. భార్యాభర్తల మధ్య అపార్థాలు అనే మాటకు అసలు తావే ఉండదు.  ఒకవేళ అపార్థాలు వచ్చినా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వారికి ఇట్టే అర్థం అవుతుంది. వివాహం తర్వాత ప్రేమ, స్నేహం ఉండే జంటలు సమప్రయాణాన్ని చాలా సంతోషంగా చేయగలుగుతారు.                                *రూపశ్రీ.  

మనస్సు స్వాధీనంలో ఉండటం ఎందుకు అవసరమో తెలుసా?

మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనసు నియంత్రణలో లేకపోతే ఏ పనినీ సంపూర్ణంగా చేయలేరు. అదే మనసు నియంత్రణలో ఉంటే గొప్ప కార్యాలను కూడా సులువుగా చేసే శక్తి వస్తుంది.  మనస్సు స్వాధీనంలో లేనివాడు మనశ్శాంతిని పొందలేడు. మనశ్శాంతి లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలడు? బలమైన కోరికలు, ఉద్రేకాలు, ఒత్తిళ్ళతో బాధపడే వ్యక్తి దీర్ఘ మానసిక వ్యాధులకు గురవుతాడు. మనస్సు స్వాధీనమైతే కలిగే ఫలితమే.. సమగ్ర వ్యక్తిత్వ వికాసం. అలాంటి వ్యక్తి ప్రతికూల పరిస్థితులలో కూడా  విజయం సాధిస్తాడు. ప్రశాంతంగా ఉండేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతాడు. సంతోషంగా ఉండేవారు చేపట్టిన పనిలో నాణ్యతను ప్రదర్శిస్తారు. అయితే, దీనికి అర్థం  అలాంటి వారి జీవితంలో ఎలాంటి చీకూచింతలూ ఉండవని కాదు. కానీ అలాంటి వారు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. ఎదురైన కష్టాల్నీ, సమస్యల్నీ విజయానికి సోపానాలుగా మలచుకుంటాడు. వాటివల్ల జీవితంలో  మరింత గొప్పగా రాణించగలుగుతారు. అలాంటి వ్యక్తిని, వ్యక్తులను సమాజం ఒక ఆదర్శపురుషునిగా కొనియాడుతుంది. ఇకపోతే.. 'ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు? అనే ప్రశ్న చాలామందిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. మనస్సును ఎవరు జయిస్తారో వారే! ప్రపంచాన్ని జయించగల సామర్థ్యం కలిగి ఉంటారు.  ప్రగతి, అభివృద్ధి, ప్రశాంతత వీటిని  ఏ రంగంలో  సాధించాలన్నా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం. మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేని జాతి తన అభివృద్ధిని నిలుపుకోలేదు. మనిషి మనసును నియంత్రణలో పెట్టుకోవడం అనే గొప్ప స్థాయిని చేరగలడు. అందుకే మనిషి అన్ని జీవజాతులలోకి గొప్ప వాడిగా ఉండగలుగుతున్నాడు.  అయితే మన ప్రగతికి అవసరమైనది బలమైన సంకల్పశక్తి కలిగి ఉండడమే. ఆ శక్తిని సాధించ లేకపోతే అధోగతి పాలవుతామన్న విషయాన్ని మన మనస్సుకు పదేపదే చెప్పాలి. మనస్సుని స్వాధీనపరుచుకున్నామా లేదా అన్న ఒక్క సత్యం మీదే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని మనకు మనమే స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. కనీస అవసరాలు తీరిన తరువాత మనిషికి ఇతర విషయాలు ముఖ్యంగా అనిపించే అవకాశం ఉంది. చాలామంది విషయంలో జరిగేది ఇదే. అవసరాలు ఒక్కొక్కటిగా పెరుగుతూ పోతుంటాయి. అవసరం లేనివి కూడా అవసరమే ఉద్దేశ్యంలోకి జారుకుంటారు. కానీ జీవితపు సర్వోత్కృష్ట లక్ష్యమైన జ్ఞానోదయాన్నీ, దైవ సాక్షాత్కారాన్నీ పొందాలనుకుంటే మనస్సును స్వాధీనపరుచుకోవడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. ఒకసారి  ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుని, దృఢంగా నమ్మగలిగితే మనిషి సంకల్పశక్తి అవసరమైనంత బలాన్ని పుంజుకుంటుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాంటి ప్రశాంత మనసుతో ఏ కార్యాన్నైనా సాధించవచ్చు.                                           *నిశ్శబ్ద.

ఉత్సాహం.. విశ్వాసం జీవితంలో ఎందుకు ముఖ్యమంటే!

ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకుండా, సాహసోపేతంగా జీవిస్తూ ముఖంపై చిరునవ్వులు చెదరనీయకుండా ఉండగలుగుతున్నామంటే మన వ్యక్తిత్వం వికసించిందన్నమాటే! దృఢమైన వ్యక్తిత్వం కలిగినవాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, అలా అని అతిజాగ్రత్తను ప్రదర్శించరు. కచ్చితంగా ఉంటారు, అలా అని మూర్ఖంగా ఆలోచించరు. పట్టుదలగా ఉంటారు, అలా అని మొండిపట్టుగా ఉండరు. సరదాగా ఉంటారు, అలా అని చౌకబారుగా ప్రవర్తించరు. ఏ స్థానంలో ఉన్నా ఇలాంటి కొన్ని మౌలికలక్షణాలను అలవరచుకుంటే మన నడవడిక నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. మూడు మాటల్లో చెప్పాలంటే ఉల్లాసం... ఉత్సాహం... విశ్వాసం ముప్పేటలా అల్లుకున్నదే జీవనసూత్రం! నిజమైన జీవనసూత్రం.. ఉల్లాసం...   నిరంతరం దీర్ఘాలోచనలతో, ముభావంగా ఉండేవారు జీవితంలో ఏమీ సాధించలేరు. ముఖ్యంగా యుక్తవయస్సులో భవిష్యత్తుకు ఒక ప్రణాళిక రచించుకునే కాలంలో శారీరకంగా, మానసికంగా ఉల్లాసం తొణికిసలాడాలి. నలుగురితో సరదాగా, కలివిడిగా కలసిపోవాలి. అందుకే "ఆధ్యాత్మికంగా పరిణతిని సాధించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆహ్లాదంగా, ఆనందంగా కనిపిస్తాడు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లే!" అంటారు స్వామి వివేకానంద. నేడు సమాజంలో కూడా గొప్పగొప్ప విజయాలు సాధించినవారందరూ తమతో పాటు తమ పరిసరాల్ని కూడా ఆహ్లాదభరితంగా ఉంచుకుంటారు. అలాగని నలుగురిలో వెకిలిగా ప్రవర్తించడం సమంజసం కాదు. హుందాగా ఉంటూనే, చిరునవ్వును ఆభరణంగా ధరిస్తూ కనిపించాలి. ఫలితంగా ఎంతటి ఒత్తిళ్ళనైనా సునాయాసంగా అధిగమించవచ్చు. ఎదుటివారితో సామరస్యంగా పని చేయించుకోవచ్చు. ఉత్సాహం...  విద్యార్థి దశలో కానీ, ఉద్యోగిగా బాధ్యత నిర్వహణలో కానీ, ఉత్సాహంగా ఉపక్రమించకపోతే ఉత్తమ ఫలితాలు రావు. ఉత్సాహంగా ఉండేవ్యక్తులే సమాజాన్ని ఆకర్షించగలరు. నలుగురితో  సంబంధాలను కొనసాగించగలరు. Sportive Attitude పెంపొందించుకోగలరు. అలాంటివారు ఎలాంటి పని ఒత్తిళ్ళకూ లోనుకారు. అందుకే ఆస్కార్ వైల్డ్ 'కొందరు ఎక్కడికి వెళితే అక్కడ ఆనందాన్ని కలిగిస్తారు, మరికొందరు అక్కడి నుండి ఎప్పుడు వెళితే అప్పుడు ఆనందం కలుగుతుంది' అంటారు. అందుకే ఉత్సాహంతో, సంతోషంతో మొదటి రకం వ్యక్తుల్లా ఉండేందుకు ప్రయత్నించాలి. విశ్వాసం…  ఒక ఊరిలో ఓ ఏడాది తీవ్ర కరవుకాటకాలు సంభవించాయి. గ్రామస్థులంతా కలసి సమీప ఆలయంలో సాధనలు చేస్తున్న సాధువును ఆశ్రయించారు. తమ గ్రామాన్ని వరుణుడు కరుణించేట్లు ప్రార్థించమని ఊరి ప్రజలంతా ఆ సాధువుని వేడుకున్నారు. వారి వేడుకోలుకు స్పందించిన సాధువు "మీ గ్రామం కోసం తప్పకుండా ప్రార్థనలు చేస్తాను. రేపు ఉదయం అందరూ ఈ ఆలయానికి రండి ప్రార్థనలతో వర్షం కురిపిస్తాను” అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి జనమంతా తండోపతండాలుగా ఆలయ ప్రాంగణంలో ఆసీనులయ్యారు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ 'నేను చెప్పిన ప్రకారం మీరంతా ఇక్కడికి వచ్చారు మంచిదే! కానీ మీలో ఎవరికీ నా మాటపై విశ్వాసం లేదు. ఒక్క బాలుడికి తప్ప!' అని అన్నాడు.  'ఎవరా బాలుడు? అతడిలో ప్రత్యేకత ఏమిటి?' అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా ఆ సాధువు వైపు చూశారు. అప్పుడు ఆ సాధువు, గొడుగుపట్టుకొని గుంపులో ఉన్న ఓ ఏడేళ్ళ బాలుణ్ణి చూపించాడు. 'ఆ బాలునికి గల విశ్వాసంతో ఇప్పుడు వర్షం కురుస్తుంది' అంటూ దేవుణ్ణి ప్రార్థించి వాన కురిపించాడు. మనలో కూడా చాలామందిలో ఈ ప్రగాఢవిశ్వాసమే కొరవడుతోంది. మనపై మనకు విశ్వాసం, మన చుట్టూ ఉన్న సమాజంపై విశ్వాసం ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. 

సెఫోరా కిడ్ సిండ్రోమ్.. పిల్లలపై దారుణమైన ప్రభావం చూపే ఈ సమస్య ఏంటంటే..!

   టీవి షోలు, ప్రోగ్రామ్ లలో చిన్న పిల్లలు స్కిట్ లు వేస్తుంటారు.  వీరికి పెద్దలతో సమానంగా మేకప్ వేయడం చూడవచ్చు. అలాగే పిల్లలు టీవీ సిరియల్స్ లో కూడా పిల్లలు అతిగా అలంకరించుకోవడం,  పెద్ద మాటలు మట్లాడటం చేస్తుంటారు.  ఇవన్న చూసి 10 నుండి 17 సంవత్సరాల పిల్లలు తాము కూడా వారిని అనుసరించడం మొదలు పెడతారు. ఇదంతా సెఫోరా కిడ్ సిండ్రోమ్ లో బాగం. సెఫోరా కిడ్ సిండ్రోమ్ అంటే..  'సెఫోరా కిడ్' అనే పదం 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలకు మేకప్,  బ్యూటీ ఉత్పత్తుల పట్ల పిచ్చి అని అర్థం. సెఫోరా వంటి బ్యూటీ స్టోర్ల ప్రభావంతో చిన్న వయస్సులోనే చర్మ సంరక్షణ, మేకప్,  ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరించడం ప్రారంభిస్తారు. సోషల్ మీడియా, యూట్యూబ్,  రియాలిటీ షోల నుండి బ్యూటీ టిప్స్ ను, ఫ్యాషన్ అనుసరణలను  తీసుకొని వాటిని  ఫాలో అవుతూ గ్లామరస్‌గా కనిపించాలని కోరుకుంటారు. సెఫోరా కిడ్ సిండ్రోమ్ లో ఉండే తరం.. జెన్-ఆల్ఫా  డేటా గురించి చెప్పాలంటే, సెఫోరా కిడ్స్ జెన్-ఆల్ఫాకు చెందినవారు. అంటే 2010 తర్వాత జన్మించిన పిల్లలు. ఈ పిల్లలు డిజిటల్ యుగంలో పెరిగారు.  సోషల్ మీడియా ద్వారా ప్రభావితమవుతున్నారు. కాబట్టి వారికి అందం,  ఫ్యాషన్ పట్ల ఆసక్తి చిన్న వయస్సులోనే పెరుగుతోంది. తల్లిదండ్రుల అనుమతి, ఆన్‌లైన్ ట్రెండ్‌లు,  బ్రాండ్‌ల  మార్కెటింగ్ ఈ ట్రెండ్‌కు ఆజ్యం పోస్తున్నాయి. దీనివల్ల  మేకప్,  చర్మ సంరక్షణపై అతిగా ఆసక్తి చూపుతుంటారు. సెఫోరా కిడ్ సిండ్రోమ్ ప్రమాదమా..  సెఫోరా కిడ్ సిండ్రోమ్ పిల్లలకు మేకప్,  ఖరీదైన యాంటీ-ఏజింగ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులంటే పిచ్చి.  నిజానికి ఈ వయసు పిల్లలకు  అవి నిజంగా అవసరం లేదు. మేకప్ ఉత్పత్తులు అన్నీ పెద్దల కోసం తయారు చేయబడతాయి.  పిల్లల సున్నితమైన చర్మానికి అవన్నీ హానికరం. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  కాబట్టి రెటినోల్,  బలమైన ఆమ్లాలు వంటి రసాయనాల నుండి పిల్లలను  దూరంగా ఉంచడం పెద్దల బాధ్యత. మొదట పిల్లల వయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి అవగాహన కలిగించే విధంగా అర్థమయ్యేలా చెప్పాలి.  చర్మ సంరక్షణ,  మేకప్ ఉత్పత్తులు పెద్దల కోసం తయారు చేయబడతాయని,  పిల్లల చర్మం సున్నితమైనదని  చెప్పాలి. సోషల్ మీడియాలో కనిపించేది ఎప్పుడూ  నిజం కాదని వివరించాలి. ఇలా చేస్తేనే పిల్లలను ఈ సెఫోరా కిడ్ సిండ్రోమ్ నుండి కాపాడుకోగలుగుతారు.                                *రూపశ్రీ.

మూడు జనరేషన్ల బంధం బలంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయాలి..!

  తల్లిదండ్రులు పిల్లలకు గైడ్లు, టీచర్లు, మార్గదర్శకులు. వారు పిల్లలకు ప్రేమపూర్వకమైన, సురక్షితమైన,  ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా జీవితాన్ని ఆశాజనకంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు.  అయితే తల్లిదండ్రులకు,  పిల్లలకు మధ్య బంధం జనరేషన్ మారగానే బంధం కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది.  పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు పుట్టిన తరువాత చాలామంది తమ తల్లిదండ్రులకు దూరంగా జరుగుతూ ఉంటారు. ఇది కావాలని చేసేది కాకపోయినా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మార్పులు జరుగుతాయి. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు,  అవ్వ తాతలు.. ఇలా మూడు తరాల మధ్య బంధం బలంగా ఉంటే ఆ కుటుంబాలు చాలా గొప్ప సంపదను పోగేసుకున్నట్టే.. అయితే ఇలా మూడు తరాల బంధం బలంగా మారడానికి చేయాల్సిందేమిటి? తెలుసుకుంటే..  కృతజ్ఞత.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే వాటికి మాటల్లో థాంక్స్ చెబితే సరిపోదు. కానీ మానసికంగా బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి,  భవిష్యత్ తరాలను పోషించడానికి ఇది ఒక మార్గం.  కుటుంబంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు  తల్లిదండ్రులతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం,  కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. ఇది చూస్తే మీ పిల్లలు కూడా తమ అవ్వతాతలు ఎంత గొప్పవారు, వారిని గౌరవించాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు. ఇది పెద్దవారి పట్ల పిల్లలలో మంచి అభిప్రాయం,  మంచి నడవడికను పెంపొందిస్తుంది.  పిల్లల ముందు ఎట్టి పరిస్థితులలోనూ పెద్దలను దూషించడం,  గేళి చేసి మాట్లాడటం చేయరాదు.   పిల్లలు వారుకళ్లతో చూసే దాన్నే  నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులు తమ పెద్దలను జాగ్రత్తగా చూసుకోడం, గౌరవించడం వంటివి చేస్తే  పిల్లలు కూడా కరుణ, సున్నితత్వం వంటివి నేర్చుకుంటారు.   పెద్దలను చూసుకోవడం తమ భాద్యత అనే భావాన్ని మనసులో పెంపొందించుకుంటారు. ఇది పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రుల పట్ల మాత్రమే కాకుండా, సమాజంలోని ఇతరుల  పట్ల కూడా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది. వృద్ధులకు సేవ చేయడం భారం కాదని.. సేవ అనేది  ప్రేమ, కృతజ్ఞత చూపించే అవకాశం అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పాఠశాల లేదా పుస్తకాల నుండి పిల్లలకు లభించే గుణం కాదు.. కేవలం తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారానే సాధ్యమవుతుంది.  మందులు ఇవ్వడం, మాట్లాడటం, సమయం గడపడం వంటివి పిల్లల మనస్సుల్లో లోతైన ముద్ర వేస్తాయి. ఈ కారణంగానే పెద్దలకు ఏదైనా సేవ చేసేటప్పుడు తప్పనిసరిగా పిల్లలను కూడా వెంట ఉంచుకోవడం మంచిది. తల్లిదండ్రులకు కూడా ప్రేమ అవసరం.  తల్లిదండ్రుల కోసం ఏదైనా చేసినప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు.చుట్టూ ఉన్న నలుగురికి తమ పిల్లలు తమకు ఏం చేశారు అనే విషయాన్ని చెప్పుకుని మరీ చాలా గర్వంగా ఫీలవుతూ సంతోషిస్తారు.  అందుకే తల్లిదండ్రుల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అటు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే కాకుండా.. ఇటు పిల్లలకు కూడా ఒక అభ్యసనం అవుతుంది. ఇది మూడు తరాల బంధాన్ని చాలా ఆరోగ్యంగా,  బలంగా  ఉంచుతుంది.                                 *రూపశ్రీ

పెళ్లి చేసుకోబోయే వారికి ముఖ్యమైన చిట్కాలు.. ఇలా చేస్తే మీ బంధం పదిలం..!

  వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన,  ముఖ్యమైన సంబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక కూడా. వివాహం జరిగిన మొదట్లో  కొత్త అలవాట్లు, కొత్త బాధ్యతలు,  బంధంలో అంచనాలు వంటి అనేక  పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఆ సంబంధాన్ని బలంగా, సంతోషంగా,  దీర్ఘకాలం కొనసాగించవచ్చు. వివాహం తర్వాత సంబంధాన్ని బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుంటే..  కమ్యూనికేషన్.. కొత్తగా పెళ్లైన వారు  సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఒకరితో ఒకరు స్పష్టంగా,  నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు ఓపెన్ గా  మాట్లాడాలి.  మనసులో ఏవైనా సందేహాలు, సందిగ్ధాలు, అనుమానాలు ఉంటే వాటిని ఓపెన్ గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇది మనసులో పెద్ద అగాధాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది.   చిన్న చిన్న విషయాలను కూడా పంచుకోవడం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది.  గౌరవం.. పెళ్లి చేసుకుంటే ఇద్దరూ తమ ఇష్టాలను కోల్పోయి ఇద్దరికి కలిపి కొన్ని ఉమ్మడి ఇష్టాలు పెట్టుకోవాలని కాదు.. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొన్ని వదులుకోవాలనే విదంగా ఇంట్లో పరిస్థితులు,  ఒత్తిడులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తప్పు..   వివాహం తర్వాత కూడా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి.  ఒకరి కెరీర్ లక్ష్యాలను మరొకరు ప్రోత్సహించాలి.  ఎవరి గుర్తింపు వారికి ఉండనివ్వాలి. ప్రాధాన్యత.. వివాహం తర్వాత అత్తమామలు,  తల్లిదండ్రులిద్దరికీ సమ ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. కుటుంబం, బంధువులు,  భాగస్వామి మధ్య సమన్వయం సంబంధంలో సామరస్యాన్ని తెస్తుంది. డబ్బు విషయాలు.. వివాహం తర్వాత బాధ్యతలు ఖర్చులు రెండూ పెరుగుతాయి.  ఖర్చులు, పొదుపులను కలిపి ప్లాన్ చేసుకోవాలి. డబ్బు విషయాలను బహిరంగంగా చర్చించడం ముఖ్యం. అలాగే డబ్బు విషయాలలో ఒకరి మాటే నెగ్గాలి అనే మనస్తత్వం ఉండకూడదు.  డబ్బు కారణంగా గొడవలు పెరిగే పరిస్థితులు ఉంటే.. ఆ డబ్బు గురించి కొన్ని రోజులు మాట్లాడకుండా వదిలేయడం మంచిది.  డబ్బు  ఎప్పుడూ భార్యాభర్తలను విడదీసే అంశం కాకూడదు. పర్సనల్ స్పేస్.. ప్రతి వ్యక్తికి తమకంటూ స్పేస్ లేదా కొంత స్వేచ్ఛ అవసరం. నువ్వు నా సొంతం అయిపోయావు అనే మెంటాలిటీని మితిమీరి  ప్రదర్శించకూడదు. భాగస్వామి  తమ స్వంత ఇష్టాల ప్రకారం జీవించగలిగేలా వారికి కొంత స్పేస్ ఇవ్వాలి. అన్నీ తాము కంట్రోల్ చేయాలని చూడకూడదు.  అధిక నియంత్రణ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సెలబ్రేట్స్.. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు లేదా చిన్న విజయాలను కూడా కలిసి జరుపుకోవాలి. ఇది సంబంధాన్ని తాజాగా,  ప్రేమగా ఉంచుతుంది. కలిసికట్టుగా.. ఏ సమస్యనైనా "ఇద్దరు"గానే పరిష్కరించుకోవడం మంచిది. ఒకరినొకరు నిందించుకోవడం, వాదనలు చేసుకోవడం మానుకోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు కొద్దిసేపు సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత ఇద్దరూ ఒక చోట కూర్చుని ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది?  ఎవరు ఎవరి వల్ల బాధపడ్డారు? తప్పు ఎవరిది?  వంటి విషయాలను నిజాయితీగా,  ఓపెన్ గా మాట్లాడుకుంటే సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. అయితే.. తప్పును ఒప్పుకోకుండా ఇగో ప్రదర్శించడం వంటివి చేస్తే బంధం నిలబడటం కష్టం అవుతుంది.  బంధంలో ఇగో ఎప్పుడూ ఉండరాదు.                                    *రూపశ్రీ.

మీ బడ్జెట్ మీ చేతుల్లో ఉందా?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి తేదీ వచ్చిందంటే దేశం మొత్తం అసక్తిగానూ అంతకు మించి ఆందోళన, అసంతృప్తులతోనూ మూల్గుతుంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే.. ఈ బడ్జెట్ పుణ్యమా అని కొన్ని వస్తువుల ధరలు తగ్గితే.. మరికొన్ని వస్తువుల ధరలు రయ్యిమని పైకి ఎగిసిపడతాయి. ఇదంతా దేశానికి, ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినది అయితే ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ప్రతి నెలా బడ్జెట్ బేజార్… బాబోయ్.. అనిపించేలా ఉంటుంది. కారణం ఏమిటంటే మార్కెట్ లో పద్దులు మారిపోవడం. అనుకోకుండా పెరిగే ధరలు సగటు మధ్యతరగతి జీవికి కొరివితో వా తలు పెట్టిన చందంగా ఉంటుంది. అయితే కాస్త అవగాహన ఉండాలి ఎలాంటి పరిస్థితిలో అయినా మీకున్న సంపాదనతోనే మంచి ప్రణాళిక వేసుకుని హాయిగా కాలం వెళ్లదీయచ్చు. ఇంతకూ ఎలాంటి పద్దులు వేస్తే లెక్కల చిట్టా సద్దుమనుగుతుందంటే… అవసరానికి అలవాటుకు తేడా తెలుసుకోవాలి!! చాలా మందికి కొన్ని ఖర్చులు ఓ అలవాటుగా మారిపోయి ఉంటాయి. సాయంత్రం అలా బయటకు వెళ్లి టీ తాగడం, ఆదివారం అవ్వగానే స్నేహితులతో మందు కొట్టడం, వీధి అమ్మలక్కలు అందరూ కలసి కిట్టీ పార్టీ చేసుకోడం. మొహమాటం కొద్దీ లేని బరువులు నెత్తిన వేసుకోవడం వంటివి చేస్తుంటారు. అవన్నీ అవసరాలు కాదు కేవలం అలవాట్లు అనే విషయం గుర్తించాలి. ఇది లేకపోతే పని జరగదు, ఇది చేయకపోతే సమస్య పరిష్కారం కాదు అనేలా ఉండేవి అవసరాలు. అలాంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని సమయాన్ని, డబ్బును వృధా చేసే అలవాట్లను మానుకోవాలి. తృప్తితోనే సంతోషం!! తృప్తి పడటం నేర్చుకుంటే ఏమి లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు. చాలామంది ఏదో లేదు అనుకుంటూ ఉన్న దాన్ని పట్టించుకోకుండా ఉన్న సుఖాన్ని అనుభవించి అనుభూతి చెందకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు తృప్తి విలువ తెలియాలి. ఒక మనిషి వేల రూపాయలు పెట్టి బయట ఎంత ఎంజాయ్ చేసినా ఇంట్లో వారితో 100 రూపాయలతో సరదాగా గడిపే వ్యక్తి తృప్తి ముందు దిగదుడుపే.. కాబట్టి తృప్తి అనేది పెట్టె ఖర్చులో కాదు కలసి పంచుకోవడంలో ఉంటుంది. పొదుపే.. రేపటి బంగారు భవిత!! పొదుపు చేయడం కూడా ఒక విద్య అని చెప్పవచ్చు. ఈ విషయంలో చాలామంది ఆడవాళ్ళను ఉదాహరిస్తారు. కానీ పొదుపుకు జెండర్ తో సంబంధం లేదు. చక్కగా ప్రణాళికలు వేసి డబ్బు ఆదా చేసే మగవారు ఉన్నారు, పోపుల డబ్బా నుండి పాలసీలు వరకు ఎన్నో రూపాల్లో పొదుపు మార్గంలోకి పైసాలను మళ్లించే ఆడవారు ఉన్నారు. కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. పైన చెప్పుకున్నట్టు అవసరమైనవి ఏవి అలవాట్లు ఏవి అనేది గుర్తిస్తే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు. ఆ తరువాత దుబారా ఖర్చులు వదిలి తృప్తిగా బ్రతకడం తెలుసుకుంటే డబ్బు పోగేయడం ఇంత ఈసీ నా అని కూడా అనిపిస్తుంది.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే.. మీ నెలసరి సంపాదన ఎంతైనా కావచ్చు. దానికి తగినట్టు మీ ఖర్చులు, పొదుపు, మదుపు ఉండేలా మీరే చక్కగా ప్రణాళికలు వేసుకోవచ్చు. అలా చేస్తే మీ బడ్జెట్ భలేగా హిట్టయ్యి టెన్షన్ లేని జీవితాన్ని మీకు అందిస్తుంది. మరి నిర్మలా సీతారామన్ కంటే మేటిగా, దేశ బడ్జెట్ కు ధీటుగా మీరూ వేయండి మీ ఇంటి కోసం బడ్జెట్ ప్లాన్..                                     ◆నిశ్శబ్ద.  

కష్టసమయాల్లో పాటించాల్సిన ఐదు నియమాలు ఇవే!

కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు. తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరైతే భయాందోళనకు గురవుతారు. ప్రతివ్యక్తి జీవితంలో ఏదొక సమయంలో కష్టాలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు. అలాంటివారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి: ఏవ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు..అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే..ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం..ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు చుట్టిముట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందని ముందే ఊహించాలి. అందుకు తగ్గట్లుగానే సిద్ధపడాలి. సమస్య నుంచి పారిపోవడం కంటేనూ దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఓపిక పట్టాలి: చాణక్య విధానం ప్రకారం...ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనంకోల్పోకూడదు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు. మీకు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి. కుటుంబ సభ్యులతో బాధ్యతగా: చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాలి. డబ్బు ఆదా చేయాలి: ఎప్పుడూ డబ్బు ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.  

పెళ్లి తర్వాత గొడవలు, అపార్థాలు రాకూడదంటే.. ముందే ఈ ప్రశ్నలు క్లియర్ చేసుకోండి..!

  వివాహం అనేది జీవితాంతం కొనసాగే సంబంధం. ఇది ఒక వ్యక్తితో జీవితాన్ని గడపడానికి వేసే పెద్ద అడుగు.  అందువల్ల వివాహానికి ముందు  భావాల గురించి కాబోయే  భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  అంతేకాదు.. వివాహం తర్వాత వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.  వివాహానికి ముందే కొన్నిప్రశ్నలకు సమాధానాలు, సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతే.. వివాహం తర్వాత తగాదాలు, అపార్థాలు.. దారితీసి.. అది కాస్తా  విడాకులకు కారణం అవుతుంది. వివాహానికి ముందు కాబోయే  భాగస్వామితో  ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయాలేంటో తెలుసుకుంటే.. పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా? నేటి కాలంలో చాలామంది అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా   సమాజం,  కుటుంబం నుండి ఎదురయ్యే  ఒత్తిడితో  పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ  ఉంటారు. ఇలా పెళ్లికి సిద్దపడేవారు మనస్ఫూర్తిగా వైవాహిక జీవితాన్ని అస్వాదించరు. దీని కారణంగా వారిని వివాహం చేసుకున్నందుకు ఇవతలి వ్యక్తి జీవితం కూడా ఎలాంటి సంతోషం లేకుండా సాగుతుంది. అందుకే   వివాహానికి ముందు కాబోయే భాగస్వామిని  పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఖచ్చితంగా అడగాలి.  అవతలి వ్యక్తి ఒత్తిడిలో పెళ్లికి సిద్దపడుతున్నట్టు తెలిస్తే..ఆ సంబంధాన్ని తిరస్కరించడం మంచిది. భవిష్యత్తు ప్రణాళిక.. వివాహం తర్వాత ఇద్దరూ కలిసి  ఇంటిని నడపాలి, బాధ్యతలు పంచుకోవాలి.  అటువంటి పరిస్థితిలో వివాహానికి ముందు భవిష్యత్తు ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాల గురించి ఒకరితో ఒకరు ఖచ్చితంగా చర్చించుకోవాలి.  ఒకరి భవిష్యత్తు ప్రణాళిక, పొదుపు, ఖర్చు అలవాట్లను మరొకరు అర్థం చేసుకోవాలి. లేకపోతే వివాహం తర్వాత దీని గురించి వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల కారణంగా విబేధాలు ఎక్కువగా వస్తాయి. పిల్లల కోసం ప్రణాళిక.. వివాహం తర్వాత భాగస్వామితో కలిసి పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఈ విషయాన్ని చర్చించడానికి సిగ్గుపడతారు,  అదేదో మాట్లాడకూడని విషయం అన్నట్టు ఫీలవుతారు. ఎంత మంది పిల్లలు కావాలి, ఎప్పుడు కావాలి, పెళ్లైన వెంటనే ప్రయత్నం చేయాలా లేక కొంత గ్యాప్ తీసుకోవాలా  అనేది కాబోయే భాగస్వామితో ముందుగానే చర్చించాలి. పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం గురించి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఆలోచనలను కలిగి ఉండవచ్చు. కానీ ఇద్దరూ ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒక అవగాహన ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పిల్లల గురించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆర్థిక లక్ష్యాలు,  ఆర్థిక భద్రత కూడా ఒక అవగాహన వస్తుంది. ఇష్టాలు,  అయిష్టాలు.. ఒకరి ఇష్టాలు,  అయిష్టాలు వారి జీవనశైలి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరు వ్యక్తుల జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరి ఇష్టాఇష్టాలు, జీవనశైలి గురించి తెలుసుకున్న తర్వాత  ఒకరిని ఒకరు  అర్థం చేసుకుంటూ,  ఒకరిని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగవచ్చు.                             *రూపశ్రీ.

ఈ 5 సందర్బాలలో మొహమాటం, సిగ్గుతో ఉంటే చాలా నష్టపోతారట..!

  ఆచార్య చాణక్యుడు ప్రతి మనిషికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిని చాణక్య నీతి అని పిలుస్తారు.  చాణక్య నీతిలో చెప్పిన ఎన్నో విషయాలు  జీవితంలోని అనేక అంశాలను ఆచరణాత్మకంగా, సరళంగా ఉంచుతాయి. మతం, న్యాయం, సంస్కృతి, పాలన, ఆర్థిక శాస్త్రం, విద్య.. మానవ సంబంధాలు.. ఇలా ఆయన చెప్పని విషయమంటూ ఏదీ లేదు.  ఆయన బ్రతికిన కాలంలో చెప్పిన ఈ విషయాలు నేటికీ అంతే ప్రాముఖ్యంగా ఉన్నాయి. తాను చెప్పిన సూత్రాలను పాటించడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించి విజయపథంలో ముందుకు సాగవచ్చని చాణక్యుడు విశ్వసించాడు. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గుపడకూడని ఐదు సందర్భాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలేవో తెలుసుకుంటే.. జీవితంలో ఎంతో గొప్ప మార్పు చూడవచ్చు.  ఇంతకూ చాణక్యుడు చెప్పిన ఆ ఐదు సందర్భాలేవో తెలుసుకుంటే.. ధనం, ధాన్యం లావాదేవీలు, జ్ఞానం సంపాదించడం, తినడం, పరస్పర వ్యవహారాల్లో సిగ్గుపడని వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ఈ ఐదు విషయాల దగ్గర మొహమాటం పడటం,  సిగ్గు పడటం మానేయాలట. దాని గురించి వివరణ కూడా ఇచ్చారు.. మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడని 5 విషయాలు ధనం, ఆహార లావాదేవీలు.. డబ్బు, ధాన్యం విషయంలో సంకోచించకూడదట.  లావాదేవీల్లో సంకోచం ప్రదర్శిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడగడం..  ఎవరికైనా ఇచ్చిన డబ్బును అడగడానికి సిగ్గుపడటం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని  చాణక్యుడు చెబుతాడు.  ఇలా మొహమాటానికి, సిగ్గుకు పోతే  దగ్గర డబ్బు కొరత ఏర్పడి చివరికి ఏమీ లేని వ్యక్తిగా మారతాడట. జ్ఞానం.. చాణక్యుడి ప్రకారం విద్యను పొందేటప్పుడు ప్రశ్నలు అడగడానికి సంకోచించడం జ్ఞానం సంపాదించడంలో ఆటంకం కలిగిస్తుందట.  నేర్చుకోవడం అనే ప్రక్రియను  అసంపూర్ణంగా చేస్తుందట.  టీచర్ ని నిర్భయంగా ప్రశ్నలు అడగాలి, సందేహ నివృత్తి చేసుకోవాలి అంటున్నారు. అలా చేస్తేనే అభ్యసనం సంపూర్ణంగా ఉంటుంది. జ్ఞానార్జన కూడా సజావుగా జరుగుతుంది.   ఆహారం తినడం.. ఆచార్య చాణక్యుడి ప్రకారం తినడానికి సంకోచించిస్తే కడుపు నింపుకోలేరు. ఎప్పటికీ ఆకలితో ఉన్నట్లేనట. అవసరమైనప్పుడు అంటే ఆకలి వేసినప్పుడు ,  ఎక్కడైనా మంచి భోజనం చేసే అవకాశం వచ్చినప్పుడు మొహమాటం లేకుండా   తినాలట. ఇది మనిషిని సంతోషంగా ఉంచుతుందట. సంభాషణ,  ప్రవర్తన..  చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పరస్పర కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం,  సంబంధాలలో సంకోచం ఉండటం వల్ల  సంబంధాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. స్పష్టంగా, మర్యాదగా,  ఓపెన్ గా మాట్లాడటం,  ఓపెన్ గా అభిప్రాయాలు చెప్పడం,  ఇతరులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం   వల్ల  సంబంధాలు బలంగా ఉంటాయట.                           *రూపశ్రీ.