చిన్న చిరునవ్వు చాలు మనిషి జీవితాన్ని పాజిటివ్ గా మార్చడానికి..

‘ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు. ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు’ అన్నాడు ఓ సినీగేయ రచయిత. ‘‘చిరునవ్వుతో శాంతి మొదలవుతుంది’’ అని చాలా గొప్ప మాట చెప్పారు మదర్ థెరిసా. నవ్వుకు ఉన్న శక్తి అలాంటిది మరి. చిన్న చిరునవ్వు స్నేహ బంధాలకు అంకురార్పణ చేస్తుంది. దూరమైనవారు దగ్గరవుతారు. నవ్వితే నవరత్నాలు అనే మాట ఏమో కానీ హాయిగా నవ్వితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వడం మనిషికి నూతనోత్తేజాన్ని ఇవ్వడమే కాదు రోజంతా ఆహ్లాదకరంగా ఉండేందుకు బాటలు వేస్తుంది. చుట్టుపక్కల ఉన్నవారిలో కూడా పాజిటివ్ శక్తిని నింపే శక్తి నవ్వుకుంది. నవ్వడం మొదలెడితే ఆందోళనలు ఆమడ దూరం పారిపోతాయి. అంతెందుకు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చే సులభమైన ఆయుధమే నవ్వు. అసలు నవ్వు గురించి ఇంతలా ఇప్పుడెందుకు చర్చించాల్సి వచ్చిందో  తెలుసా?  ఎందుకంటే నేడు (శుక్రవారం) ప్రపంచ నవ్వు దినోత్సవం ( World smile day). ప్రతి వ్యక్తి ఆనంద క్షణాల్లో తనతోపాటే ఉండే నవ్వు గురించి,  అక్టోబర్ 6నే ప్రపంచ నవ్వు దినోత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటారు? అనే అంశాలను గురించి ఎంతమందికి తెలుసు??  ఆనందాన్ని, దయను వ్యాపింపజేసే సామర్థ్యమున్న నవ్వు గురించి, ప్రపంచమంతా జరుపుకునే నవ్వు దినోత్సవం గురించి  వివరాలు తెలుసుకుంటే.. అసలు ఎలా మొదలైందంటే.. నవ్వు దినోత్సవం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.  మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌కు చెందిన హార్వే బాల్ అనే కమర్షియల్ ఆర్టిస్ట్ 1963లో స్మైలీ ఫేస్ సింబల్‌ని రూపొందించారు. నవ్వుతూనే దీనిని తయారు చేయడం విశేషం. ప్రజలు ఎల్లప్పుడూ నవ్వుతూ దయ, సంతోషాన్ని మరింత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో 1999లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలలో మొదటి శుక్రవారాన్ని నవ్వు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.  వ్యక్తుల నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతరులకు చిరునవ్వు పంచాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా దీనిని నిర్వహిస్తారు. ప్రాముఖ్యత ఇదే.. ప్రపంచ చిరునవ్వు  దినోత్సవం నిర్వహించుకోవడానికి ఆ నవ్వులో దాగివున్న శక్తే కారణం. చుట్టుపక్కలవారిని చూసి నవ్వడం, నవ్వించడం, దయాగుణంతో కూడిన  చర్యలు. స్నేహపూర్వక, సహకార,  సానుకూలతను ప్రోత్సహించవచ్చు. అంతేకాదు ఎవరి రోజునైనా నవ్వు ప్రకాశవంతం చేయడానికి తోడ్పడుతుందని గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సాధారణ చిరునవ్వు ఎంతోకొంత శక్తినిస్తుందని గమనించాలి. అందుకే ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన మీకు తెలిసినవారిని నవ్వించండి. నవ్వమని చెప్పండి. ఎవరి మీద అయినా కోపాలు, అలకలు ఉంటే వారి ముందు మనస్పూర్తిగా నవ్వి చూడండి. నిజంగా మనుషుల మధ్య అపార్థాలు, అపోహలు, గొడవలు అన్ని మంత్రమేసినట్టు మాయమైపోతాయి.  పసిపిల్లల నవ్వును కల్మషం లేనిది అంటారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా నవ్వడం పిల్లలలో ఉన్న గొప్ప గుణం. ప్రతి మనిషి ఇలా నవ్వగలిగితే ఆ వ్యక్తి ఉన్నతవ్యక్తిత్వం కలిగిన వాడిగా రూపాంతరం చెందుతాడు.  స్నేహితులను, కుటుంబ సభ్యులను హాయిగా  నవ్వించే ప్రయత్నం కుటుంబాన్ని, బంధాలను దృఢంగా మారుస్తుంది. కేవలం కుటుంబంతో ఆగిపోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా  నలుగురిని నవ్వించే ప్రయత్నం చేయవచ్చు. లాఫింగ్ క్లబ్బులు తరహాలో సన్నిహితులు, మిత్రులు అందరూ కలసి సరదాగా నవ్వు దినోత్సవానికి కితకితలు పెట్టొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నవ్వు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను నొప్పించే పద్దతిలో నవ్వు సృష్టించడం వల్ల పెద్ద అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యంగా నవ్వాలి, ఆరోగ్యంగా నవ్వించాలి. ఓ కవి  చెప్పినట్టు "నవ్వడం  భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం". గుర్తుపెట్టుకోండి మరీ..                                               *నిశ్శబ్ద.

పేదరికం ఉంటే జీవితంలో ఎదగలేమనే నిరాశతో ఉన్నారా..

అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలమేమో   కానీ, ఆలోచనలకు వైకల్యం వస్తే దేన్నీ సాధించలేం. కాబట్టి పేదరికం ఒక శాపమని ఊహించుకొని శిలలా మారిపోవడం కన్నా, అదీ ఒక వరమేనని భావించి చైతన్యవంతంగా మారడం ధీరుని లక్షణం. నిజానికి పేదరికం శాపం కాదు. అది  కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం. జీవితంలో మహోన్నత స్థితికి ఎదిగిన మహాత్ముల్లో ఎంతోమంది పేదరికపు కడలిని దాటినవారేనన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఉదాహరణకు గణిత శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి విదేశీయుల్ని సైతం అబ్బురపరిచిన యువకుడు శ్రీనివాస రామానుజం; బాల్యంలో వార్తాపత్రికల్నీ, కిరాణా సామాగ్రినీ అమ్ముతూ చదువు కొనసాగించి గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచిన 'భారతరత్న' అబ్దుల్ కలామ్ - ఆ పేదరికపు కొలనులో వికసించిన కుసుమాలే. అలాగే అబ్రహామ్ లింకన్, టంగుటూరి ప్రకాశం, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ అంబేద్కర్ మొదలైన వారు కూడా పేదరికాన్ని ప్రగతికి సోపానంగా మలచుకొని విజయాలను సాధించినవారే. success, not as a reason for failure. The full scope of our ability and ingenuity is usually only called forth by problems. - R.J. Heathorn 'కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్తపరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురిచేసేవి కావు' అని సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగిపోవడమే సరైన మార్గం.  మనస్సుంటే మార్గాలెన్నో! కాబట్టి ముందు మన మనస్సుకు నిరాశ అనే అంటువ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి.  స్వామి వివేకానంద ఇచ్చిన ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే ధైర్యంగా ముందుకు సాగడానికి తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. Fire and enthusiasm must be in our blood... Think not that you are poor, that you have no friends. Ay. who ever saw money make the man? It is man that always makes money. - Swami Vivekananda పేదరికం వల్ల పస్తులుంటున్న  కుటుంబాలకు  ఆర్థికంగా సహాయపడడం  కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరి  ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ చిన్న పనైనా చేస్తూ డబ్బు సంపాదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. అలా పనిచేస్తూనే యువత చదువు కూడా కొనసాగించవచ్చు. చదివే పిల్లలు డబ్బు సంపాదించకూడదు అనే నియమం ఎక్కడా లేదు. పైన చెప్పుకున్న గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రమిస్తే అప్పుడు శారీరక లోపం అయినా,  పేదరికం అయినా  శాపం కాదనీ, అది మీలో ఉన్న నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ నిరూపించడానికి ఒక అవకాశమనీ అర్థమవుతుంది.  అలాంటివారు జీవితంలో తప్పకుండా విజేతలు అవుతారు.                                          *నిశ్శబ్ద.

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.

భగవద్గీత 1వ అధ్యాయం నుండి ఈ 3 పాఠాలు నేర్చుకోండి..!

భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం మన ఆచరణ జీవితంలో అన్వయించుకోగల మూడు పాఠాలను నేర్చుకోవచ్చు. మనం మంచి జీవితాన్ని గడపడానికి భగవద్గీత ఒక దీపం. భగవద్గీత సూత్రాలను మన జీవితంలో స్వీకరించడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. భగవద్గీత మొదటి అధ్యాయంలో, అర్జునుడు శ్రీకృష్ణునితో, నా స్వంత సోదరులను చంపడం ద్వారా నేను విజయం సాధించినా, అది నాకు సంతోషాన్ని ఇవ్వదు, పశ్చాత్తాపాన్ని మాత్రమే ఇస్తుందని చెబుతాడు. భగవద్గీతలోని ఈ మొదటి అధ్యాయం అన్నదమ్ముల మధ్య ప్రేమ పాఠాన్ని నేర్పుతుందా..? లేక అన్నదమ్ముల మధ్య యుద్ధానికి నాంది పలుకుతోందా..? మరి మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకుంటామో చూద్దాం.. 1. మంచి మూడ్ ఉండాలి: దుర్యోధనుడిని తలచుకున్నప్పుడల్లా అసూయపడే వ్యక్తిగా కనిపిస్తాడు. దుర్యోధనుడిలోనే కాదు మనలో అసూయపడే గుణం కూడా ఉంది. భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని అర్థం చేసుకోవాలి. మనం ఇతరులకు ఎంతగా అసూయపడతామో, అంత ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటాం. భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం ఇతరులపై అసూయపడకూడదని.. స్థిరమైన మనస్సును కలిగి ఉండకూడదని నేర్చుకోవచ్చు. 2. అభ్యాసం నిరంతరంగా ఉంటుంది: మనం ఎంత నేర్చుకున్నా, మనకు తెలిసినది పరిపూర్ణమైనది కాదు. నేర్చుకోవడం ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం ఏమి నేర్చుకున్నా, మరింత తెలుసుకోవడానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. మహాభారతంలో, అర్జునుడు ఎల్లప్పుడూ జీవితం గురించి ఆసక్తిగా ఉండేవాడు. జీవితాంతం విద్యార్థిగా ఉండాలనుకున్నాడు. ఈ కారణంగా అతను శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. శ్రీకృష్ణునికి శరణాగతి చేయడం ద్వారా, అతను అతని నుండి అన్ని రకాల జ్ఞానాలను పొందుతాడు. 3. జీవితంలో విజయం సాధించడానికి అన్ని పనులు చేయండి: మనం విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే, పనిలో ప్రతిష్టను లెక్కించకూడదు. పని పెద్దదైనా చిన్నదైనా దాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం ఉండాలి. ఉదాహరణకు: అర్జునుడు కృష్ణుడిని తన రథసారధిగా ఉండమని కోరినప్పుడు, కృష్ణుడు ఆ ప్రతిపాదనను సంతోషంగా అంగీకరించాడు. “నేనే పరమాత్మను, నేనే భగవంతుడిని. నేనెందుకు రథసారధి పాత్రను ధరించాలి?” అని ఆలోచించినవాడు కాదు, వెనక్కి తగ్గినవాడు కాదు. శ్రీకృష్ణుడు పనిలో విజయం గురించి మాత్రమే ఆలోచించాడు. భగవద్గీత మొదటి అధ్యాయం యుద్ధానికి నాంది పలికింది. యుద్ధం ఎలా ప్రారంభించాలి..? ఇది ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. ఈ అధ్యాయం నుండి మనం పైన పేర్కొన్న మూడు సూత్రాలను లేదా సందేశాలను మన జీవితాల్లో స్వీకరించడం ద్వారా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు.  

అబ్రహం లింకన్ వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత సంఘటన..

అబ్రహామ్ లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కాగానే అమెరికాలోని కోటీశ్వరులు, ప్రముఖులు, అతిగౌరవనీయ కుటుంబాలకు చెందిన వేల మంది లోలోన అతలాకుతలమై పోయారు. ఎందుకంటే లింకన్ తండ్రి వడ్రంగి పనితో పాటు చెప్పులు కుట్టి జీవించాడు. అలాంటి హీనమైన వృత్తి చేసినవాడి కొడుకు తమ దేశానికి అధ్యక్షుడా! అతని హయాంలో తాము జీవించాలా! అది తమకు తలవంపులు అన్నది వారి బాధ. అమెరికా 'సెనేట్'లో అందరూ ప్రముఖ వ్యాపారవేత్తలూ, అత్యంత ధనవంతులూనూ! లింకన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సెనేట్ను ఉద్దేశించి తన తొలి ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి, ఎంతో గర్విష్టి అయిన ఓ కోటీశ్వరుడు లేచి, తన బూట్లను అందరికీ కనిపించే విధంగా చేతితో పట్టుకుని, వాటిని గాలిలో ఊపుతూ, బిగ్గరగా అరుస్తూ లింకన్ ప్రసంగానికి అడ్డు తగిలాడు. "మిస్టర్ లింకన్! నువ్వేదో అనుకోకుండా అధ్యక్షుడవయ్యావు గానీ, నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు! మీ నాన్న మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ చెప్పులూ, బూట్లు కుట్టేవాడనేది వాస్తవం! ఇదిగో! నేనిప్పుడు చూపిస్తున్న బూట్లు ఒకప్పుడు మీ నాన్న కుట్టినవే!" అని అరిచాడు అతడు. అతడి మాటలు విని సెనేట్లో ఉన్న వారంతా ఘల్లున నవ్వారు. అలా నవ్వడం ద్వారా తాము కూడా ఆ కోటిశ్వరుడితో పాటు లింకన్ ను దారుణంగా అవమానించగలిగామని సంతోషించారు. లింకన్ కొన్ని క్షణాలు తన ప్రసంగాన్ని ఆపి, మౌనంగా నిలబడి పోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భావోద్వేగాన్ని అణచుకుని, ప్రశాంత స్వరంలో తన ఉపన్యాసాన్ని ఇలా పునఃప్రారంభించాడు: "ఈ సమయంలో నా తండ్రిని నాకు జ్ఞాపకం తెచ్చినందుకు మీకు నేనెంతైనా కృతజ్ఞుణ్ణి. నా తండ్రి చెప్పులు కుట్టడంలో చాలా నేర్పరి. ఏ రంగంలో చూపించినా ప్రతిభ అనేది గొప్పదే. నేను అధ్యక్షుడిగా, నా తండ్రి తన వృత్తిలో చూపించినంతటి ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తాను!" అన్నాడు. ఒక్క క్షణం ఆగి, తన గంభీర స్వరంతో, "ఇంతకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పినట్లే మా తండ్రి వారి కుటుంబంలోని అందరికీ చెప్పులు కుట్టాడు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళకే కాదు ఇంకా చాలామంది శ్రీమంతుల కుటుంబాలలోని వాళ్ళకు పాదరక్షలు కుట్టాడు. మా నాన్న చెప్పులు కుట్టడం లోని నేర్పును తన వారసత్వంగా నాకు కూడా కొంత ప్రసాదించాడు. ఆయన కుట్టిన చెప్పులు మీకు సరిగ్గా సరిపోక పోయినా, బిగుతుగా ఉన్నా, మీ కాళ్ళకు నొప్పి కలిగిస్తున్నా. నాకు ఇవ్వండి. నేను వాటన్నింటినీ చక్కగా సరిచేసి మళ్ళీ మీకు ఇస్తాను. నేను ఆ తండ్రి కొడుకును. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెప్పులు కుట్టడానికి సిగ్గుపడను" అంటూ ముగించాడు. సభ అంతా నిశ్శబ్దంతో నిండి పోయింది. అంతా నిశ్చేష్ఠులయ్యారు. లింకన్ లాంటి మేరునగధీరుణ్ణి అవమానించడం అతి కష్టమని సెనేటర్లందరికీ అప్పటికి అర్ధం. అయింది.                                            *నిశ్శబ్ద.

శత్రువులను ఓడించాలంటే..ఇవి అవసరం

ఆచార్య చాణక్యుడు తన నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సమాచారాన్ని అందించాడు. చాణక్యుడు ప్రకారం, ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. చాణక్యుడి నీతి ప్రకారం, ప్రతి వ్యక్తి తన శత్రువును బలహీనుడిగా భావించకూడదు, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ శత్రువులు అవకాశం దొరికిన వెంటనే మిమ్మల్ని దెబ్బతీస్తారు. శత్రువులను ఓడించడానికి ఆచార్య చాణక్యుడు తన నీతిలో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాలు మీకు తెలుసా?  చెడు సహవాసాన్ని నివారించండి: చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు తన స్నేహితులతో, పనిలో ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతాడు. అందువల్ల, ప్రతి వ్యక్తి తన సంస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరు మంచివారో, ఎవరు సహవాసానికి అర్హులో చెక్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు లేదా మన సహవిద్యార్థులు ఎక్కువ సమయం మనకు హాని చేయడానికి వేచి ఉంటారు. అదే సమయంలో, మన సహవాసం చెడ్డవారితో ఉంటే, శత్రువు దానిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అవకాశం వస్తే దాడి చేయడానికి వేచి ఉంటాడు. అందుకే ఎవరితో స్నేహం తీసుకోవాలన్నదానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రసంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి: చాణక్యుడి నీతి ప్రకారం, మనిషి తన ప్రసంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ శత్రువు దానితో మీకు మరింత హాని చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ ప్రసంగం చెడ్డది అయితే, మీ సంబంధం క్షీణించవచ్చు. పేలవమైన ప్రసంగం కారణంగా, మీ మంచి స్నేహితులు, బంధువులు మిమ్మల్ని దూరం చేయడం ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరూ చేదు, కఠినంగా మాట్లాడే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఎప్పుడూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటను మధురంగా ఉంచుకోవాలని, వినయంతో మాట్లాడాలని చాణక్యుడు అంటాడు. చెడు అలవాట్లను వదిలేయండి: ప్రతి వ్యక్తి వ్యసనం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. శత్రువులు మాదకద్రవ్యాల బానిసలను చాలా సులభంగా ఓడిస్తారు. మత్తులో ఉన్న వ్యక్తి తన తెలివితేటలను, విచక్షణను ఈ విధంగా ఉపయోగించుకోలేడు. అటువంటి పరిస్థితిలో, అతను తప్పు చేస్తాడు. ఇది మీ శత్రువులు ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, మీరు మీ శత్రువును ఓడించాలనుకుంటే, మీ శత్రువుకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీరు కలిగి ఉండాలి. ప్రతి మనిషి తన శత్రువుల బలాన్ని తెలుసుకోవాలి. మీ శత్రువు గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే, మీరు వారిని సులభంగా ఓడించగలరు. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, పై విషయాలలో జాగ్రత్తగా ఉంటే శత్రువును సులభంగా ఓడించవచ్చు. మన శత్రువుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలనీ, నిర్లక్ష్యంగా ఉండకూడదనీ చాణక్యుడు చెబుతున్నాడు.   

మీ కష్టాలకు కారణం ఇవే..!!

మన చుట్టూ ఉన్న వ్యక్తులను విభిన్న వ్యక్తిత్వంతో చూస్తాం. కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటే మరికొందరు ఎప్పుడూ విచారంగా ఉంటారు. అలాంటి వారి గురించి చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. మనిషి ఎప్పుడూ విచారంగా ఉండడానికి కారణమేంటో తెలుసా..?  మోసపూరిత వ్యక్తులతో స్నేహం: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మోసపూరిత వ్యక్తితో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే మోసపూరిత వ్యక్తులు తమ స్నేహితులను ఏదో ఒక ఆలోచనతో బాధపెడతారు. జిత్తులమారి తనకు మంచివా, చెడ్డవా అన్నది పట్టించుకోడు. అతను మొదట తన మంచిని దృష్టిలో ఉంచుకుంటాడు. ఈ కారణంగా ఏ వ్యక్తి కూడా మోసగాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడడు. దీనివల్ల వారు నిత్యం కష్టాల్లోనే ఉంటారు. ఒంటరిగా: ఆచార్య చాణక్యుడు ఒంటరివాడు ఎప్పుడూ విచారంగా ఉంటాడని చెప్పాడు.  ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ స్నేహితులందరినీ దూరం చేసుకుంటారు. అయితే, వారికి చాలా మంది శత్రువులు ఉంటారు. ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ బాధలను ఎవరితోనూ పంచుకోరు. తమను తాము అనుభవించడం ద్వారా వారు ఎల్లప్పుడూ దుఃఖపు గుంటలో ఉంటారు. ఇతరులను బాధపెట్టే వ్యక్తి: ఇతరులకు హాని కలిగించే లేదా బాధించే వ్యక్తికి దూరంగా ఉండాలని కోరుకోవడం సాధారణం. మనం చేయలేని వాటితో మనం ఉన్నవారిని బాధపెట్టకూడదు లేదా హాని చేయకూడదు. కానీ, కొందరు అలాంటి తప్పులు చేస్తుంటారు. ఇది వారికి మరింత దుఃఖాన్ని, అసూయను సృష్టిస్తుంది. సమస్యలను గోప్యంగా ఉంచే వ్యక్తి:  కొంతమంది తాము ఏ సమస్యలో ఉన్నా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు దాని నుండి అన్ని బాధలను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. వారి మనసు ఎప్పుడూ దుఃఖంతో బరువెక్కుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పిన ప్రకారం, సత్యవంతులు, జ్ఞానులతో స్నేహం చేసే వ్యక్తి ఏ కారణం చేతనూ దుఃఖపడడు. తనకి ఏదైనా దుఃఖం కలిగితే దాన్ని స్నేహితులతో పంచుకుని తగ్గించుకుంటాడు.

ఈ ఆరుగురి గురించి చెడుగా మాట్లాడకూడదు..!!

ఈ 6 మంది వ్యక్తుల గురించి చెడుగా ఆలోచించకూడదని లేదా చెడుగా మాట్లాడకూడదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ప్రకారం మనం ఏ 6 మందిని అవమానించకూడదో తెలుసా..? శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫలానా వ్యక్తులను అవమానించకూడదని.. వారి గురించి చెడుగా ఆలోచించకూడదని చెప్పాడు. ముఖ్యంగా ఈ 6 మంది గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదని చెప్పాడు. ఈ ఆరుగురు వ్యక్తుల గురించి చెడుగా ఆలోచిస్తే మనల్ని నాశనం చేసే అవకాశం ఉంది. వారిని అవమానించడం ద్వారా మనమే నాశనం చేసుకుంటాం. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మనం ఏ 6 మందిని చెడుగా చూడకూడదో తెలుసా..? వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. దేవతల గురించి: భగవంతునిపై తక్కువ విశ్వాసం ఉన్నవారిని నాస్తికులు అంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ దేవుడి గురించి చెడుగా మాట్లాడతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారం, అటువంటి వ్యక్తులు వీలైనంత త్వరగా నశిస్తారు. కాబట్టి మీరు ఈ తప్పు చేయడం మానేయాలి. ఈ తప్పు చేయడం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది మీరు దేవుని కోపానికి గురి కావచ్చు. వేదాల గురించి: వేదాలు ప్రపంచంలోని పురాతన,  గొప్ప గ్రంథాలలో ఒకటిగా పరిగణిస్తారు. వేదాలలో సనాతన ధర్మం గురించి మాత్రమే కాదు. ఇది మనకు శాస్త్రీయ ఆలోచనలను కూడా చెబుతుంది. మన జ్ఞానాన్ని పెంపొందించే, ఏదైనా విషయాన్ని తెలియజేసే పవిత్ర వేదాలను మనం ఎప్పుడూ అవమానించకూడదు. ఆవు గురించి: మత గ్రంధాల ప్రకారం, గోమాతలో కోట్లాది దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఆవును పూజనీయమైనదిగా భావిస్తారు. గోవులు మానవులకు అన్ని విధాలుగా క్షేమాన్ని కలిగిస్తాయి. అందుకే మనం ఆవులను తల్లిగా గౌరవిస్తాం. బ్రాహ్మణుల గురించి: మత గ్రంధాల ప్రకారం, బ్రహ్మదేవుని నోటి నుండి బ్రాహ్మణులు జన్మించారని నమ్ముతారు. దీనివల్ల బ్రాహ్మణులు గౌరవించబడ్డారు. వారి గురించి చెడుగా మాట్లాడకండి. వారు తప్పు చేసినా మనం వారిని అవమానించకూడదని భగవద్గీతలో పేర్కొన్నారు. మతం గురించి: మతం గురించి అవగాహన లేని లేదా మతం గురించి సరిగా తెలియని వ్యక్తులు మతం గురించి అసంబద్ధంగా ప్రవర్తిస్తారు. మతానికి విశాలమైన అర్థం ఉంది. కాబట్టి సరిగ్గా ఆలోచించకుండా లేదా తెలియకుండా మతం గురించి చెడుగా మాట్లాడకండి. ఋషి గురించి: శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఋషులను ఎప్పుడూ అవమానించకూడదని లేదా వారి గురించి చెడుగా మాట్లాడకూడదని చెప్పాడు. మీకు వీలైతే, మీరు వారికి సహాయం చేయాలి లేదా వారికి అవసరమైన వస్తువులను విరాళంగా ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది.  

శాంతికి మనమే సోపానాలు..

యుద్దం ఓ భయానక దృశ్యమైతే.. శాంతి ఓ స్వేచ్చా శ్వాస తరంగం అని చెప్పవచ్చు.  ఏ దేశం అయినా శాంతితో ఉన్నప్పుడే అది  అన్నివిధాలుగా అభివృద్ది సాధించగలుగుతుంది. ఆ దేశ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ శాంతి ఎక్కడా?  ప్రశాంతత ఎక్కడా?  ప్రపంచంలో చాలా దేశాలు, చాలా ప్రాంతాలు అశాంతితో, హింసాకాండలో మండిపోతున్నాయి. ఈ అశాంతిని తగ్గించి, హింసాకాండలు రూపుమారి ప్రజలకు భయరహిత జీవితాన్ని ప్రసాదించడానికి ప్రపంచమంతా శాంతి మార్గంలో ప్రయాణించే దిశగా కృషి చేయడానికి  ప్రతి యేడు సెప్టెంబర్ మూడవ మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర గురించి తెలుసుకుని అందుకోసం సగటు పౌరులుగా పాటుపడటం ప్రతి ఒక్కరి ధర్మం. 1981లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ మూడో మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. ఇది స్థాపించిన రెండు దశాబ్దాల తర్వాత 2001లోసెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా  ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడం ఆ రోజు ముఖ్య  ఉద్దేశ్యం. ఆనాడు ప్రారంభించబడిన ఈ శాంతి దినోత్సవాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.  వివిధ దేశాల మధ్య యుద్దాలు ఉన్నా వాటిని 24గంటలపాటు కాల్పుల విరమణ కూడా ఇందులో భాగంగా ఉంది.  చరిత్రలో, చాలా సమాజాలు ఎక్కువ సమయం శాంతితో జీయి. నిజానికి సాధారణ సమాజంలో నివసించే పౌరులకంటే యుద్దంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారికి  ప్రాణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ రూపొందించినప్పటి నుండి  ప్రభుత్వాలు ఇతరులపై బలవంతంగా ఎలాంటి  నియమాలు ఉపయోగించకూడదు. ఒక ప్రాంతంలో వ్యక్తుల మధ్య గొడవ జరిగితే అది  వారినే కాకుండా ఆ ప్రాంత ప్రజలను అందరినీ ఇబ్బందికి గురిచేస్తుంది. అదే విధంగా రెండు దేశాల మధ్య లేదా పలు దేశాల మద్య ఏదైనా యుద్దం చోటు చేసుకుంటే అది  దేశంలో ఉన్న ప్రజలను అందిరనీ కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సాంకేతికత అభివృద్ది చెందిన నేటికాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంది. దీని నష్టం చాలా ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ అర్థం కావాలంటే శాంతి ప్రాముఖ్యత కేవలం దేశాల మధ్య ఉండే అధికారులకే కాదు, దేశంలో ఉండే ప్రతి పౌరుడికి అర్థం కావాలి. అప్పుడు సహజంగానే పౌరులు శాంతి మార్గంలో వెళతారు. భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాన్నే అహింస, శాంతి మార్గంలో నడిపించిన జాతిపిత గాంధీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. యుద్దంలో కల్లోలం ద్వారా జరిగే ప్రాణ నష్టం కంటే శాంతి ద్వారా సాధించుకునే పోరాటం ఎక్కువ బలమైనదని గాంధీ నమ్మారు. మనిషి కోపం తెచ్చుకుని ఎదుటి వ్యక్తిని కొట్టడం సులువే.. కానీ ఓపికగా ఉండటం మాత్రం చాలా కష్టతరమైన విషయం.  అలాంటి ఓపిక గాంధీ గారు దేశ ప్రజలకు భోదించారు. ఆ మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే ప్రయత్నం చేశారు.  అహింస, శాంతి, మౌనం చాలా గొప్ప ఆయుధాలు. వీటి గురించి పిల్లలకు వివరించాలి. వీటి విలువ పిల్లలకు తెలిస్తే ఈ సమాజం గొప్పగా ఎదుగుతుంది. విలువలతో కూడీన పౌరులతో తులతూగుతుంది. కోపాన్ని జయించాలి. ప్రతి విషయానికి కోపం చేసుకోవడం కంట్రోల్ చేసుకోవాలి. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అహింసను పాటించాలి. ఎవరినీ కొట్టడం, తిట్టడం, హింసించడం చేయకూడదు.  అందరినీ సమాన దృష్టితో చూడాలి. శాంతి అంటే కేవలం ఒక వ్యక్తి  వ్యక్తిత్వం మారడం కాదు. సమాజ స్వరూపాన్ని శాంతియుతంగా మార్చడం. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్గ.  

చదువుకోవడం ఎందుకు ముఖ్యం?

విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే మనం విద్యావంతులం అయితేనే ఇతరులు మనలను గౌరవిస్తారు. విద్యను నేర్చుకోవడం వల్ల సమాజంలో మంచి స్థాయిని సంపాదించుకోవచ్చు. విద్యను బాగా నేర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. విద్యను నేర్చుకోవడం వల్ల డబ్బును బాగా సంపాదించవచ్చు. ప్రస్తుత సమాజంలో విద్య అనేది చాలా అవసరం. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు కావాలంటే చదువు ఉండాల్సిందే! విద్యలేనివాడు వింత పశువు అంటారు. ఇది నిజం! ప్రస్తుత సమాజంలో విద్యలేని వాళ్ళని వింత పశువులకింద భావిస్తారు. వాళ్ళని విలువ లేని వాళ్ళుగా భావిస్తారు. సమాజంలో విద్యలేనివారు గౌరవ మర్యాదలు కోల్పోతారు. అలాగే విలాసవంతంగా జీవితాన్ని గడపలేరు. తగినంత డబ్బును సంపాదించుకోలేరు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోలేరు. డబ్బు లేకపోయినా సమాజంలో జీవించవచ్చేమో కాని విద్య లేకపోతే జీవించడం అనేది కష్టం అవుతుంది. విద్యను నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు దానిని సద్వినియోగపరచు కోవాలి. మనం మన విద్యను సద్వినియోగ పరచు కోలేకపోతున్నామంటే అది నిర్లక్ష్యం అవుతుంది. అలా చెయ్యలేకపోతే ఆ విద్యకు అర్థం, పరమార్ధం రెండూ ఉండవు. విద్యను ఎంతవరకు నేర్చుకున్నా మన్నది ముఖ్యం కాదు, అలాగే ఎన్ని డిగ్రీలు సంపాదించామన్నది ముఖ్యం కాదు దానిని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది ముఖ్యం. బాగా విద్యావంతులైన వారి జీవితాలు డబ్బు, గౌరవ మర్యాదలు, సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఒక తోటలో పువ్వులు లేకపోతే ఆ తోట ఎంత శూన్యంగా కనిపిస్తుందో అలాగే మనిషి జీవితంలో విద్య అనేది లేనప్పుడు జీవితం కూడా అంతే శూన్యంగా కనిపిస్తుంది. విద్యార్ధులు తమ విద్యార్ధి దశలోనే కష్టించి చదివి ఉన్నత ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. ఆ సమయాన్ని వృధా చేసుకొంటే జీవితాంతం విచారించే పరిస్థితి రావచ్చు. మన లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను బట్టి ప్రతి పనీ నెరవేర్చుకోవడానికి సులభమవుతుంది. మనం ఎంచుకున్న లక్ష్యం మన మనస్సుకు నచ్చినదై ఉండాలి. నచ్చినపని అయితే అందరూ మెచ్చేవిధంగా చేస్తాము. లక్ష్యాలను ఎదుర్కోవడంలో వచ్చే అవరోధాలను ధైర్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. మన మనస్సులో సాధించాలనుకునే విషయం తప్ప మరొక విషయం ఉండకూడదు. మనసా వాచా ఆ విషయమే ఆలోచించాలి.  అర్జునుడు చెట్టుమీద పక్షిని గురి చూసి కొట్టడం అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో అర్జునుడు చెట్టును, చెట్టుమీద కొమ్మను చూడడు. కేవలం పక్షిని మాత్రమే చూస్తాడు, దాన్ని మాత్రమే చూడటం వల్ల అర్జునుడికి గురి కుదురుతుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవారు ఆ కథను గుర్తు చేసుకోవాలి. యువకులు లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు కాలేజీలో చేరాము అనే విషయం మర్చిపోకూడదు. పరీక్షలలో ఉన్నత ఫలితాలను సాధించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ అంటారు అంత మార్కులు, ర్యాంకుల మాయం అని. చదువుతున్న విఆహాయలు గురించి పరీక్షలు రాసి తెచ్చుకునే మార్కుల గురించి, ర్యాంకుల గురించి ఎందుకు బాధ. ప్రతి విద్యార్ధి కాలేజికి ఎందుకు వెళుతున్నారో ప్రతి రోజూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కాలేజీలో వారి సమయాన్ని వ్యర్ధం చేసుకోరు. మనలోని కాంక్ష తీవ్రతే మనల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని సాధించడానికి విజువలైజేష్ చేయటం మరొక మంచి పద్ధతి. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి, దాన్ని సాధించుకోవాలి.                                         ◆నిశ్శబ్ద.

లెఫ్ట్ హ్యాండెర్స్ ఏ బెస్ట్ అచీవర్స్ అంట!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్….. అంటాడు ఓ కవి. ఓడిపోవడం మాట అటుంచితే ఈ కుడి ఎడమ అయినందుకు అదృష్టమే ఎడమచేతిలో వచ్చి పడ్డట్టు అనిపిస్తుంది వివరాలు అన్నీ తెలిస్తే.  సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా పని చేయాలన్నా ఇతర ఏ విషయాలలో అయినా కుడిచేయి వాడటం సహజం. కనీసం ఎదుటివారు పలకరించినపుడు ఆప్యాయంగా అందుకునే షేక్ హాండ్ అయినా సరే కుడిచేత్తో ఇవ్వడం ఒక సంస్కారం, ఇంకా చెప్పాలంటే అదొక గౌరవం కూడా. భోజనం, పూజలు పునస్కారాలు, దైవకార్యాలు, బట్టలు వేసుకునేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి అనే సెంటిమెంట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అక్షరాలు దిద్దడానికి బలపాన్ని కుడిచేత్తో కాక ఎడమచేత్తో పట్టుకున్నప్పుడు, అక్షరాలు ఎడమచేత్తో దిద్దుతున్నప్పుడు పిల్లలను చాలా వారిస్తారు. వారితో ఎడమచేతి అలవాటు మాన్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.  కానీ అందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే ఎడమచేతి వాటం తప్పేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదొక గొప్ప ప్రత్యేకత, అదొక అదృష్టం అంటున్నారు ప్రపంచ విశ్లేషకులు.  ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 న ఎడమచేతివాటం ప్రజల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు మొదలైన విషయాల మీద చర్చించాల్సిన అవసరం ఉంటుంది. బడిలో పిల్లలు పక్కపక్క కూర్చుని రాసుకునేటప్పుడు కుడి, ఎడమ చేతివాటం కలవారు పక్కపక్కనే ఉంటే చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా ఈ ప్రపంచం మొత్తం మీద 90% మంది కుడిచేతివాటం కలవారు అయితే 10% మంది ఎడమచేతివాటం ఉంటారు. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమచేతి వాటం వారుంటారని సర్వేలు తెలుపుతున్నాయి. కానీ కుడిచేతివాటం అనేది సాధారణం కాబట్టి, ఎడమచేతివాటం వారికి అక్కడక్కడా అవమానాలు, విమర్శలు ఎదురవుతుంటాయి.  అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎడమచేతివాటం వారే భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరుతారని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద ప్రముఖులుగా గుర్తింపబడిన వారిలో ఎడమచేతి వాటం వారు ఎక్కువగా ఉన్నారని చెబుతారు. దాదాపు 10 నుండి 12 శాతం మంది ఎడమచేతివాటం ప్రముఖులు ఉన్నారట. ప్రత్యేకతలు!! ఎడమచేతివాటం వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవే వారిని ఉన్నతమైన వారిగా మలుస్తాయని చెబుతారు.  వీరిలో స్వతంత్ర్యభావాలు ఎక్కువ, జ్ఞాపకశక్తి, ఏదైనా సాధించాలనే పట్టుదల, ముఖ్యంగా గొప్ప సృజనాత్మకత వీరిలో ఉంటుంది. గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకోవడమే కాదు, ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు కూడా ఎంతో పట్టుదలతో చేస్తారు. ఇంకా చెప్పాలంటే కలలు కనడం వాటిని సాకారం చేసుకోవడం వీరిలో ఉన్న గుణం. వీరు బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులను చేయగల సత్తా వీరిలో ఉంటుంది.  కళలు, భాష, సంగీతం వంటి రంగాలలో వీరు ఎక్కువ నైపుణ్యం కలిగిఉంటారట. పైన చెప్పుకున్నవన్నీ వీరిలో ప్రత్యేకలు అయితే వీరు బొమ్మలు గీయడంలో ఎడమవైపు వంపులున్న చిత్రాలు బానే గీస్తారట, కానీ కుడివైపు వంపులున్నవి గీయడానికి కష్టపడతారట. ఎడమచేతివాటం వారిలో మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా వీరు మానసిక రుగ్మతలతో ఎక్కువగా ఇబ్బంది పడుతారట.   వారికున్న మరొక సమస్య ఏదైనా శుభకార్యాలు పండుగలప్పుడు వారు తొందరగా ఎడమచెయ్యి వాడేస్తుంటారు. అందరూ దాన్నేదో అపశకునంగా  భావిస్తారు. ఇదే వారికి పెద్ద సమస్య.  కుడిచేతివాటం వారి కోసం తయారుచేయబడుతున్న ఎన్నో వస్తువులు ఎడమచేతివాటం వార సరిగా ఉపయోగించలేరు. ఈ కారణం వల్ల ప్రతి సంవత్సరం 2500 మంది ఎడమచేతి వాటం వారు మరణిస్తున్నారట.  ఇవీ వీరి ప్రత్యేకతలు వీరు పడే అగచాట్లు. ఇకపోతే ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు.  రాణీ లక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.  అందుకే మరి కుడి ఎడమ అయితే ఖంగారు వద్దు. పిల్లలు ఎడమచేతి వాటంగా తయారయ్యారని బెంగ వద్దు. కుదిరితే వాళ్లకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిపెట్టండి. ఏమో మీ పిల్లల పేరు ఏ ప్రముఖుల మధ్యనో చేర్చబడచ్చు.                                      ◆నిశ్శబ్ద.

ఈ మంచి అలవాట్లు మహిళలను విజయతీరాలవైపు నడిపిస్తాయి..!!

నేటికాలం మహిళలు ఇంటితోపాటు వృత్తిపరమైన పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇళ్లు, ఉద్యోగం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో రాణిస్తున్నారు. అలాంటి ప్రతిభావంతులైన మహిళలు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు  వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వరిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి జీవితాల్లో విజయాలతోపాటు అపజయాలు కూడా ఎదురైనా...వాటిని ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. వారు పెట్టుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తున్నారు. నేటి మహిళ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక మహిళ విజయం సాధించిందంటే ఆమెలో ఖచ్చితంగా ఈ పది మంచి అలవాట్లు ఉంటాయి. అవేంటో చూద్దాం. 1. విజయవంతమైన మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దీని కారణంగా, వారి మనస్సు,మెదడు మధ్య సామరస్యం ఉంటుంది. దీని కోసం, అటువంటి మహిళలు తమ లక్ష్యాల నుండి తప్పుకోరు. 2.విజయవంతమైన మహిళలు సమయపాలన పాటిస్తారు. ప్రతి పనిని సమయానికి చేస్తారు. అలాగే ఆమె రోజూ ఉదయాన్నే నిద్రలేస్తారు.  విజయవంతమైన ప్రతి వ్యక్తి ఉదయాన్నే మేల్కొనే అలవాటు ఉంటుంది.  ఇది సమయాన్ని నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది. 3. విజయవంతమైన స్త్రీకి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా సరిగ్గా నిర్వహించాలో తెలుసు . దీని కోసం మహిళలు తమ కుటుంబానికి పనితో పాటు సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి స్త్రీలు తమ జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. 4. జీవితంలో విజయం అకస్మాత్తుగా రాదు. దీని కోసం చాలాసార్లు విఫలం కావాల్సి వస్తుంది. చాలా మంది విఫలమైనప్పుడు తమ దిశను మార్చుకుంటారు. అయితే, విజయం సాధించిన మహిళలు విఫలమైనా తమ నిర్ణయాలను మార్చుకోరు. దీని కోసం, అలాంటి మహిళలు కూడా వారి జీవితంలో విజయం సాధిస్తారు. 5. విజయవంతమైన మహిళలు తమ జీవితంలో అన్ని సమయాలలో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తెలివిగా కూడా పని చేయగలరు . 6. విజయవంతమైన మహిళలు కూడా పిల్లల మాదిరిగానే ఎప్పటికప్పుడు ప్రశ్నలు అడుగుతారు. ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి ఆమె మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే, ఆమె ఖచ్చితంగా అడుగుతుంది. అలాంటి మహిళల పాదాలను విజయం ముద్దాడుతుంది.   7.  విజయవంతమైన మహిళలు జట్టుకృషిని విశ్వసిస్తారు. దీని కోసం ఆమె ప్రజలతో మమేకమవుతుంది. టీమ్‌తో కలిసి పని చేయడం వల్ల త్వరగా విజయం సాధిస్తారు. అదనంగా, పని కూడా సులభం అవుతుంది. 8. విజయవంతమైన లేదా తెలివైన మహిళలు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు పట్టు వదలరు. అలాగే, ఆమె రిస్క్ తీసుకోవడానికి భయపడదు. 9. తెలివైన మహిళలు దూరదృష్టి గలవారు. వారు ఎక్కువగా ఆలోచిస్తారు. దీని కోసం మహిళలు యోగా, ధ్యానం యొక్క సహాయం తీసుకుంటారు. దార్శనిక ఆలోచనలు జీవితంలో ముందుకు సాగడానికి వారిని ప్రేరేపిస్తాయి. 10. విజయవంతమైన మహిళలు కష్ట సమయాలను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. జీవితంలో సానుకూలంగా ఉండే వ్యక్తులతో కూడా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఇది వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది

గూగుల్ మొదటి అడుగుకు 27వసంతాలు పూర్తీ!

గూగుల్ మనిషి రోజువారీ ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. హిస్టరీ గురించి వెతకాలా?  గూగుల్ లో సెర్చ్ చేస్తే వికీపీడియా వొస్తుంది. సినిమా సమాచారం కావాలా? గూగుల్ లో సెర్చ్ చేస్తే బోలెడు అప్డేట్స్ ఉంటాయి. అనారోగ్యానికి ఏవైనా చిట్కాలు కావాలా? గూగుల్ తల్లి మంచి మందులేవో చక్కగా చూపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, సినిమా, జోకులు, ప్రత్యేక దినాలు, చరిత్ర, చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు, గొప్ప వ్యక్తులు.. ఆఖరికి ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలి?  వంటి ప్రశ్నల నుండి.. ఎలా చచ్చిపోవాలి అనే పిచ్చి సమాధానాల వరకు అన్ని గూగులమ్మ చెబుతుంది. అయితే ఈ రోజు ప్రజలు ఇంతగా గూగులమ్మ మీద ఆధారపడటం అనేది ఒక ఏడాది, ఒక ప్రయత్నంతో జరిగింది కాదు. గూగులమ్మ ఇప్పుడు 27ఏళ్లు పూర్తీ చేసుకుంది. అసలు గూగుల్ ప్రయాణం ఏంటి? ఇది ఎలా మొదలైంది? వివరంగా తెలుసుకుంటే.. Google.com దినోత్సవం సెప్టెంబర్ 15న జరుపుకుంటారు.  గూగుల్ డాట్ కామ్ ను   ప్రారంభించిన మాతృ సంస్థ గురించి తెలుసుకుంటే గూగుల్ ప్రయాణం బాగా అర్థమవుతుంది.  గూగుల్ ప్రజల జీవితంలో పెద్ద భాగం. మొదట్లో ఇది  కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందించే బహుళజాతి సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందింది. 'గూగుల్' అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. గూగుల్ డాట్ కామ్ జనవరి 1996లో ప్రారంభమైంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని Ph.D విద్యార్థులైన  లారీ పేజ్,  సెర్గీ బ్రిన్ మెరుగైన సెర్చ్  ఇంజిన్‌ను రూపొందించడానికి పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వారు వెబ్‌సైట్‌ల మధ్య సంబంధాలను విశ్లేషించే పేజ్‌ర్యాంక్ అనే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇతర సైట్‌లకు లింక్‌ల సంఖ్య ఆధారంగా వాటి ఔచిత్యాన్ని నిర్ణయించింది. సెర్చ్  ఇంజిన్ మొదట డవలప్  చేయబడినప్పుడు దాని పేరు  “బ్యాక్‌రబ్”. ఈ పేరు ఆ తరువాత  Google గా మార్చబడింది, నిజానికి గూగుల్ అనేది  'గూగోల్' అనే పదాన్ని అక్షరదోషంలో పలకడం ద్వారా ఆవిష్కారమైంది.   గూగోల్ అనేది అతిపెద్ద సంఖ్య. ఒకటి తరువాత   100 సున్నాలను రాస్తే అది గూగోల్ అవుతుంది. ఇక Google చాలా సమాచారాన్ని అందిస్తుంది, ప్రస్తుతం   ఇంటర్నెట్‌లోని సమాచారం అంతులేనిదని. సెప్టెంబర్ 15, 1997న, పేజ్,  బ్రిన్ “ google.com ” డొమైన్‌ను నమోదు చేసుకున్నారు . 1998లో, పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించిన తర్వాత పేజ్,  బ్రిన్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని స్నేహితుని గ్యారేజీకి అనుబంధంగా ఉన్న గదిలో అధికారికంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. డిసెంబరు 1999 నాటికి Google బీటా మోడ్‌లో ఉంది.  రోజుకు దాదాపు 10,000 సెర్చింగ్  ప్రశ్నలకు సమాధానాలు లభించేవి.  2003లో, గూగుల్ తన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడు గూగుల్‌ప్లెక్స్ అని పిలవబడే చోటుకు మార్చబడింది. వాస్తవానికి ఇది కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో 40 ఎకరాల క్యాంపస్. కాలక్రమేణా వారు సైట్‌లో అనేక భవనాలను కొనుగోలు చేశారు,  వాటికి అనధికారిక పేర్లను ఇచ్చారు. క్యాంపస్‌లో క్యూబికల్స్ లేకుండా ఓపెన్ కాన్సెప్ట్ ఉంది,  ఇక్కడ  బంతులను కుర్చీలుగా ఉపయోగించారు. మెరియం-వెబ్‌స్టర్ 2006లో దాని కాలేజియేట్ డిక్షనరీకి 'గూగుల్' అనే పదాన్ని జోడించారు.  "ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందడానికి Google సెర్చ్  ఇంజిన్‌ను ఉపయోగించడం." అని ఈ డిక్షనరీలో ప్రస్థావించారు.  కంపెనీ సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందిస్తుంది. 2015లో కంపెనీ పునర్నిర్మించబడింది.  ఆల్ఫాబెట్ ఇంక్.గా మారింది.  గూగుల్ దాని అతిపెద్ద అనుబంధ సంస్థగా మారింది. ఇదీ గూగుల్ తల్లి చరిత్ర.                                                      *నిశ్శబ్ద.

డబ్బు సంపాదించే ఉపాయం చెప్పిన చాణక్యుడు..!!

చాణక్యుడి పేర్కొన్న అనేక అంశాల్లో డబ్బు ఒకటి. మన జీవితంలో డబ్బు ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు. చాణక్యుడి విధానంలో, 'ధనమే మతాన్ని అనుసరించేవాడు'. ఎవరైతే డబ్బును సరైన మార్గంలో వినియోగిస్తారో...వారు మతాన్ని కూడా మంచి మార్గంలో అనుస్తారిస్తారని తెలిపారు. చాణక్యుడు చెప్పినట్లుగా మనం డబ్బును ఎలా ఉపయోగించాలి? సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం పొందగలము. ధనం జనం పరిత్రయ: మనం సరైన మార్గంలో ధనాన్ని ఉపయోగించినప్పుడే..అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినట్లు అర్థం. తప్పుడు పనులు చేయడానికి లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి మాత్రమే ఇబ్బంది లేదు. దీనితో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మంచి మార్గంలో సంపాదించడం: మనం మంచి మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. చెడు లేదా హింసాత్మక మార్గాల ద్వారా సంపాదించిన లేదా సంపాదించిన డబ్బు మనకు సంతోషాన్ని లేదా సంతృప్తిని ఇవ్వదు. మీరు స్వచ్ఛమైన మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించాలి. కష్టపడి సంపాదించాలి: మనం ఎప్పుడూ కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించిన లేదా కష్టపడి సంపాదించిన డబ్బుతో మనం ఏ పని చేసినా, దాని నుండి మనకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి డబ్బు మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు తప్పుడు మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ, ఇది ఈరోజు కాదు రేపు మీకు సమస్య తీసుకురావడం ఖాయం. ధనభావానాం అపి స్వధర్మ నాశః మితిమీరిన కోరికలు, సంపాద...మీ స్వధర్మాన్ని నాశనం చేస్తుంది. డబ్బు సంపాదించాలన్న మితిమీరిన కోరిక అధర్మం వైపు నడిపిస్తుంది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలు తప్పవు. కాబట్టి.., డబ్బు సంపాదించాలనే మితిమీరిన కోరికను వదిలివేయడం మంచిది. ధనాని పూజ్య నరః వంటిది: అంటే ధనవంతులకు సమాజంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. డబ్బు లేదా సంపద ఉన్నవారిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తులు చాలా సులభంగా గౌరవం మరియు కీర్తి పొందుతారు. దానేన విత్తం వినీతం: వినయంతో డబ్బు సంపాదించండి. తెలివిగా ఉపయోగించుకోండి. ఇలా డబ్బును వినియోగించినప్పుడే దానికి అర్థం ఉంటుంది.  ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయడం మానేయండి.

పాజిటివ్ థింకింగ్ పవర్ ఇదే..

సానుకూలంగా ఆలోచించడం చాలామందికి చేతకాదు. ఎంతోమంది పనులు మొదలు పెట్టడం నుండి ఒకటే అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే సానుకూలంగా ఉండటం లేదా పాజిటివ్ ఆలోచనలతో ఉండటం అనేది మనిషిని కొత్తగా ఆవిష్కరిస్తుంది. కౌరవుల సైన్యం చాలా పెద్దది మేము అస్సలు యుద్దం చెయ్యము అని పాండవులు వెనకడుగు వేసి ఉంటే మహాభారత యుద్దమనేది జరిగి ఉండేది కాదు.  నాకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి, ఇక నేను ఏమీ చెయ్యలేను అనుకుని ఉంటే అంతరిక్షంలో రహస్యంగా ఉన్న కృష్ణబిళాల గురించి స్టీఫెన్ హకింగ్ పరిశోధనలు చేసేవాడు కాదు. ఇలా చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు అనుమానాలతో, సందేహాలతో  అలా గొప్పగా మారలేదు. దీని వెనుక సానుకూల ఆలోచన అని చెప్పబడే పాజిటివ్ థింకింగ్ చాలా ఉంది. పాజిటివ్ థింకింగ్ గురించి, దాని గొప్పదనం గురించి, అది మనుషుల జీవితాల్లో కలిగించే మార్పుల గురించి తెలియజెప్పే ఉద్దేశంతో ప్రతి యేడు సెప్టెంబర్ 13న పాజిటివ్ థింకింగ్  డే జరుపుకుంటారు. ఈ రోజున ఏం చేయవచ్చో, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, దీని వల్ల  కలిగే లాభాలేంటో  పూర్తీగా తెలుసుకుంటే.. పాజిటివ్ థింకింగ్.. పాజిటివ్ థింకింగ్ అనే పేరులోనే ఒకానొక సానుకూల భావన ఉంది. ఇది మనిషికి ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను కలిగించదు. చేసేపని ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించి చేస్తే ఆ ఆలోచనతోనే సగం విజయం సాధించినట్టు. పాజిటివ్ గా ఆలోచిస్తూ మనిషి చేసే ప్రయత్నాలలో మనిషి పనితీరు పరిపూర్ణంగా ఉంటుంది. వ్యక్తి తన పూర్తీ సామర్థ్యాన్ని  పనిని పూర్తీ చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి చేసేపనులలో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. అయితే ఎవరో చెప్పారని కొందరు, ఆ పని వల్ల లాభం  ఉంటుంది కాబట్టి చేయడం మంచిదని మరికొందరు,  గొప్పలు చెప్పుకోవడానికి అయిష్టంగానే మరికొందరు  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనసులో ఏ మూలో ఇష్ఠం ఉండదు కాబట్టి ఆ పనిని అంత సమర్థవంతంగా పూర్తీ చెయ్యలేరు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందు ఎలాంటి ప్రభావానికి, మరేవిధమైనా ప్రలోభాలకు లోను కాకుండా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం.. పాజిటివ్ ఆలోచన అనేది గొప్ప ఔషదమే అనుకోవచ్చు. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవారు కూడా పాజిటివ్ థింకింగ్ కారణంగా  వాటిని చాలా సులువుగా జయించగలుగుతారు. ఎంతో మంది  మృత్యు ఒడి దాకా వెళ్లి తిరిగి బయటపడుతున్నారు అంటే అది వారి సానుకూల ఆలోచన ప్రభావమే.  మనిషిని మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా దృఢంగా ఉండేలా చేయడంలో సానుకూల ఆలోచన ఎంతో గొప్పది. పాజిటివ్ గా ఉంటూ మంచినీరు తీసుకున్నా అది గొప్ప ఔషదంలా పనిచేస్తుంది. గొప్ప ఔషదాన్ని అయినా చాలా నెగిటివ్ గా తీసుకుంటే అది అస్సలు శరీరం మీద ప్రభావం చూపించదు. ఇదీ పాజిటివ్ ఆలోచనలో ఉన్న గొప్పదనం. సానుకూలమే విజయానికి  సోపానం.. ఎంత బాగా చదివినా సరే చాలామంది పరీక్ష హాలులో వెళ్లేసరికి అన్నీ మరచిపోయాం అంటుంటారు. మరికొంతమంది నేను చదివినవే వచ్చాయి కానీ అక్కడ సమాధానాలు గుర్తురాలేదు అంటారు. వీటన్నింటికి కారణం ఒకటే.. అదే పరీక్షలలో నేను చదివినవి రావేమో అనే నెగిటివ్ ఆలోచన. మనిషి మెదడు పదే పదే ఏ విషయాన్ని అయినా పదిసార్లు మననం చేసుకుంటే ఆ వలయంలో పడిపోతుంది. పరీక్షలు రాసేవారు ఎంత చదివినా, ఎంతబాగా సన్నద్దం అయినా మనసులో ఏ మూలో  నేను చదివినవి రావేమో నా అదృష్ణం ఎలాగుందో అనుకుంటే చివరికి ఆ అదృష్టం ప్రశ్నార్థకమే అవుతుంది. ఇది కేవలం పరీక్షలకు మాత్రమే కాదు. ఉద్యోగం కోసమయినా, బంధాలలో అయినా, సమాజ పరమైన విషయాలు అయినా పాజిటివ్ గా ఉన్నప్పుడే సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి.                                                         *నిశ్శబ్ద.

ప్రోత్సాహానికి కేరాఫ్ అడ్రస్ మీరే కావచ్చు…

అరేయ్ నువ్వు చేయగలవురా నీ వల్ల అవుతుంది. నీ గురించి నీకు అర్థం కావడం లేదు, హనుమంతుడికి తన బలం తనకే తెలియనట్టు.. నువ్వు కూడా ఇంతే.. ఊరికే ఎలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా నువ్వు అనుకున్నది చెయ్యి.. నీ వెంట నేనుంటా కదా… ఇలాంటి మాటలు ప్రతి మనిషి జీవితంలో ఉంటే బహుశా ఓటమి  ఎదురవ్వడం అనే సందర్భం రాదేమో.  ఓ మనిషిని ప్రోత్సహించాలన్నా, వెనక్కు లాగాలన్నా అదంతా ఇంకొక మనిషి చేతిలో ఉంటుంది. ప్రతిభ ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి కూడా ఒక్కో సందర్భంలో ఇతరులు నిరాశ పరచడం ద్వారా విఫలం అయ్యేవారు చాలామందే ఉంటారు. అందుకే ప్రోత్సాహం గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.  బద్దకస్తుడిని కూడా పరుగులు పెట్టిస్తుంది. ప్రోత్సాహంలో ఉన్న గొప్పదనాన్ని, ప్రోత్సాహం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఏడు సెప్టెంబర్ 12 ను నేషనల్ ఎంకరేజ్మెంట్ డే ని జరుపుకుంటారు. దీన్ని జాతీయ ప్రోత్సాహ దినోత్సవం అని తెలుగులో పిలుస్తారు. ఈరోజు ఏం చేయవచ్చంటే.. పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం.. ప్రతి మనిషి మొదట తన ఇంటిని బాగు చేసుకుంటే ఆ తరువాత సమాజాన్ని బాగు చేయడానికి అర్హుడు అవుతాడు అని అంటారు. దానికి అనుగుణంగానే… కుటుంబ సభ్యులు, పిల్లలు, తోడబుట్టిన వారు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరూ ఏవైనా పనులలో కానీ, మరేదైనా విషయంలో కానీ జంకుతున్నా, సందిగ్ధంలో ఉన్నా వారికి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి.  దీనివల్ల వారికి ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కుటుంబ సభ్యులు విజేతలు అయినా, ఎదైనా సాధించినా పరోక్షంగా అధి ఆ ఇంటి విజయం అవుతుంది. కాబట్టి పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. పేదవారిని, స్నేహితులను వదలొద్దు.. పేదరికం కారణంగా ప్రతిభ ఉన్నా మరుగున ఉంటున్న పిల్లలు, యువత ఎంతోమంది ఉన్నారు. అందరినీ భుజాన వేసుకోకపోయినా వారికి కాస్త ఆర్థిక సాయం, మరికాస్త ధైర్యం చెబితే ఊహించని విధంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే  తల్లిదండ్రులలో కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితులను వైఫల్యం బాటలో వదిలేయకుండా వారిని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందు తోయాలి. అప్పుడు వారి విజయంలో మీరు భాగమవుతారు. కళాకారులు,  ప్రతిభ గలవారిని ప్రోత్సహించాలి.. కళను తమలో నింపుకున్నవారు కళాకారులు. కానీ చాలావరకు కళలు కడుపు నింపవు అనే మాట వాస్తవ చిత్రంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తుంటుంది. ప్రతిభ కలిగిన కళాకారులను ఎంకరేజ్ చెయ్యాలి. ఏ వర్గంలో అయినా ప్రతిభ ఉంటే వారిని చేతనైన విధంగా మాటలతోనూ, ఆర్థికంగానూ సహాయం అందించాలి.  

సనాతన హిందూమతం ఎప్పుడు ఉద్భవించిందో తెలుసా...

పవిత్ర హిందూ మతం ఎప్పుడు ఉద్భవించిందో నేటికీ చాలా మందికి తెలియదు. మీకూ తెలియకపోతే ఖచ్చితంగా ఈ కథనాన్ని చదవండి.. ప్రతి మతానికి దాని స్వంత మూలం ఉంది. కానీ హిందూ మతం మూలం లేదా ప్రారంభం గురించి ప్రజలలో చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, నేటికీ, హిందూ మతం  మూలం ఎలా జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ నేప‌థ్యంలో స‌నాత‌న హిందూమ‌తం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. గురునానక్: సిక్కు మత స్థాపకుడు గురునానక్ 1469 ఏప్రిల్ 15న జన్మించారు. సెప్టెంబర్ 22, 1539 న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. భారతదేశం, హిందూమతం గురు సంప్రదాయానికి చెందిన మొత్తం 10 మంది గురువులచే రక్షించాయి. గురునానక్ కాలాన్ని తీసుకుంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే హిందూ మతం ఉందని చెప్పవచ్చు. జులేలాల్: సింధ్ ప్రావిన్స్‌లోని హిందువులను రక్షించడానికి వరుండేవ్ జులేలాల్‌గా అవతరించాడు. పాకిస్థాన్‌లో జులేలాల్జీని జింద్ పీర్, లాల్షా అని పిలుస్తారు. ఇతడు క్రీ.శ.1007లో జన్మించాడు. ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హిందూ మతానికి 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో హిందువులు నివసించేవారు. చక్రవర్తి హర్షవర్ధన: 1,400 సంవత్సరాల క్రితం హిందూమతం: గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు 590 AD లో జన్మించాడు. 647 AD లో మరణించాడు. హర్షవర్ధన్ అరేబియాపై దాడి చేసినట్టు ప్రస్తావనలు ఉన్నాయి. కానీ అతను ఎడారి ప్రాంతంలో పట్టుబడ్డాడు. భైవపురాణంలో ప్రస్తావన ఉంది. హర్ష హయాంలో చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ వచ్చాడు. గురు గోరఖ్‌నాథ్: 1,100 సంవత్సరాల క్రితం హిందూ మతం: రాహుల్ సాంకృత్యాయన్ ప్రకారం, గొప్ప యోగి గురు గోరఖ్నాథ్ లేదా గోరఖ్నాథ్ 845 ADలో జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని గురు గోరఖ్‌నాథ్ ఆలయం 9వ శతాబ్దంలో పునరుద్ధరించబడిందని పేర్కొన్నారు. గోరఖ్‌నాథ్ చాలా కాలం జీవించాడు. అతను హిందూ మతంలోని శైవ శాఖకు చెందిన ముఖ్యమైన సాధువు. ఆదిశంకరాచార్య: 2531 సంవత్సరాల క్రితం హిందూమతం: ఆదిశంకరాచార్య హిందూమతాన్ని పునర్వ్యవస్థీకరించారు. క్రీ.శ.788లో జన్మించిన అతడు క్రీ.శ.820లో 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టాడు. కేరళలో జన్మించిన అతనిని కేదార్‌నాథ్‌లో ఖననం చేశారు. అతను హిందూ మతానికి చెందిన గొప్ప సాధువు. 2వ చంద్రగుప్తుడు : 1,650 సంవత్సరాల క్రితం హిందూమతం: చంద్రగుప్త II చక్రవర్తికి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. అతని పాలన 380 AD నుండి 412 AD వరకు కొనసాగింది. మహాకవి కాళిదాసు అతని ఆస్థాన కవి సలహాదారు.  

ఆత్మహత్యలు వద్దే వద్దు!

మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు, కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజేతలుగా నిలిచినప్పుడు మనిషిగా పుట్టినందుకు చాలా సంతోషపడతాం. కేవలం అవి మాత్రమే కాదు జీవితంలో ఎంతో సంతోషకరమైన క్షణాలలో ఉన్నప్పుడు ఫలానా వారికి పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉన్నామనో, ఈ జీవితం ఇలా సాగుతున్నందుకు మనం అదృష్టవంతులమనో అనుకుంటాం ఖచ్చితంగా. కానీ జీవితంలో చెప్పలేనంత విరక్తి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే?? ఎంతో గొప్పగా జీవించాల్సిన వాళ్ళు అర్థాంతరంగా జీవితానికి ముగింపు ఇస్తే!! ప్రస్తుత సమాజాన్ని ఎంతో భయపెడుతున్న విషయం ఇదే!! ఏ విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు. ఈ ఆత్మహత్యల మీద దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఆత్మహత్య చేసుకోవడం రాను రాను పెరుగుతున్న సమస్య. వీటి నమోదు సంఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమైన కథనాలు చెబుతాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8,00,000(ఎనిమిది లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు.  కొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య పది లక్షలకు దగ్గరగా ఉంది.   మరీ ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారి మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణం అనే విషయం కలవరపెడుతోంది.  ప్రయత్నించే ప్రతి 40 మందిలో కనీసం ఒక్కరు అయినా చనిపోతున్నారు. మనిషి జీవించడానికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు, మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఎందుకు?? ఆత్మహత్యలకు ప్రధాన కారణం!! ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే. మందులతో బాగు చేయలేని, ఇదీ అని నిర్ధారించలేని సమస్య అది. ఏమిటా సమస్య అంటే?? మానసిక అనారోగ్యం. మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునే ఆలోచనా స్థాయిలు తక్కువ. అతిగా ఆలోచించడం ఎక్కువ. ఈ కారణంగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి.  ఏం చెయ్యాలి?? కౌన్సెలింగ్ ఇవ్వడం, సపోర్ట్ గా ఉండటం వల్ల  ఆత్మహత్యలను నివారించవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారికున్న సమస్యలను చెప్పుకునే స్నేహాభావాన్ని కలిగిస్తే దాదాపుగా ఆత్మహత్య అనే భావనను రానివ్వకుండా చేయచ్చు.   ఇతరులకు వారి జీవితాలకు బాధ్యత వహించడానికి, వారి జీవితానికి వారు ఇచ్చుకోవలసిన ప్రాధాన్యత, వారి మీద వారికి ఉండాల్సిన బాధ్యత మొదలైనవి గుర్తుచేయడం కూడా వారిలో ఆత్మహత్య ఆలోచనను రానివ్వకుండా చేయడానికి ఒక గొప్ప మార్గం. ఆత్మహత్య అనేది అన్ని వయసుల వారిని సమానంగా ప్రభావితం చేస్తుంది.  అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి చర్చలు జరపడం చాలా ముఖ్యం, ఇతరులు వారు ఎదుర్కొంటున్న కష్ట సమయాల గురించి మాట్లాడటం వల్ల అవసరమైతే వృత్తిపరమైన లేదా మానసిక ఆలోచనలకు సంబంధించిన సహాయం పొందడం సులభం చేస్తుంది. 'టేక్ ఎ మినిట్, చేంజ్ ఎ లైఫ్' ఒక్క నిమిషం ఆగండి జీవితాన్ని మార్చుకోండి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసిన ఒక గొప్ప వాక్యం. ఆత్మహత్యలు ఎప్పుడూ తొందరపాటుగా జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్క నిమిషం ఆగి, జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బ్రతకాల్సిన ఆవశ్యకత, జీవితానికి ముఖ్యమైన మార్గాలు వంటివి ఆలోచిస్తే జీవితం చెయ్యిజారిపోదనే విషయం అర్థమవుతుంది. ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్‌లు చర్చా వేదికలను నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణకు కొత్త విధానాలను రూపొందిస్తారు.  వ్యక్తులలో జీవితం పట్ల అవగాహనను కలిగించడానికి సాధనంగా మీడియాను ఉపయోగించవచ్చు.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కుటుంబం, డాక్టర్ల కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది.  సమాజ పౌరులుగా మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సాయం చేయడం అనుసరించాల్సిన విషయమే!! కాబట్టి మీ వంతు మీరూ కృషి చేయండి. ఆత్మహత్యల నివారణకు తోడ్పాటు అందించండి.                                   ◆నిశ్శబ్ద.

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.