లోపముందని కుంగిపోతున్నరా? ఒక్కసారి ఇది చదవండి! 

మహాభారతంలో ఉన్న ఓ చిన్న పాత్ర అనూరుడు. పుట్టుకతోనే రెండు కాళ్ళూ లేనివాడు. అయితేనేం... ప్రత్యక్ష భగవానుడయిన, లోకానికి వెలుగులు విరజిమ్మే సూర్యుడికి రథసారథిగా ఎదిగినవాడు  అనూరుడు. అంగవైకల్యం బాహ్య శరీరానికే కానీ ఆత్మశక్తికి కాదని నిరూపించిన ధీశాలి అనూరుడు. ఆత్మస్థైర్యం ఉంటే, సంకల్పబలం ఉంటే, మనశ్శక్తిని నమ్ముకొంటే కన్ను, కాలు, చేయి... ఇలా ఏ అవయవం లేకపోయినా జీవితంలో అత్యున్నత స్థితిని చేరుకోవచ్చని చెప్పే కథే అనూరుడి వృత్తాంతం. మనందరం మనలో ఏదో ఒక లోపాన్ని చూసుకొని బాధపడుతూంటాం. ఉద్యోగం లేదని ఒకరు, పెళ్ళికాలేదని ఒకరు, సొంత ఇల్లు లేదని మరొకరు, పదో తరగతి తప్పామని ఇంకొకరు, జ్వరం వచ్చిందని వేరొకరు, డబ్బులు లేవని మరొకరు, అందం లేదని ఇంకొకరు... ఇలా ఏదో ఒక లోపం చూసుకొని కన్నీరవుతాం. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు... ఎవరి కష్టం వారికి మహా ప్రళయంలా, పెనుతుపానులా, యమగండంలా తోస్తుంది. అది సహజం కూడా! అయితే ఇవన్నీ మనం అనుకొంటున్నట్లు నిజంగా లోపాలేనా? ఉద్యోగం, డబ్బు, పదవి, అధికారం, హోదా… ఇవన్నీ నిజంగానే మనిషికి సంతోషాన్ని, విశ్వాసాన్ని ఇస్తాయా? పైపైన చూస్తే నిజమే అనిపిస్తుంది. లౌకిక ప్రపంచంలో భౌతికంగా సుఖంగా ఉండేందుకు ఇవన్నీ అవసరమైతే అవ్వొచ్చేమోగానీ నిజానికి మనిషిని నిలబెట్టేది, మనిషిని అడుగు ముందుకు వేయించేది, మున్ముందుకు నడిపించేది, పెనునిద్దుర వదిలించేది, సమస్య వచ్చినా కన్నీరు కార్చకుండా నిలబెట్టేది, కష్టం వచ్చినా కుంగిపోకుండా కాపాడేది, పాతాళంలోకి పడిపోయినా... తిరిగి పైకి ఎగబాకి... ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహింప చేసేది మాత్రం ఖచ్చితంగా ధనమో, ఉద్యోగమో, అధికారమో మాత్రం కాదు. మరి ఏమిటి? ఆత్మ విశ్వాసం,  మానసికబలం. సందేహంలేదు నిజానికి మనకు మనమే ఓ ఆయుధ భాండాగారం. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువ వుంది.. ఇంతకు మించిన సైన్యమేది? ఆశ మనకు అస్త్రం. శ్వాస మనకు శస్త్రం. ఇంతకన్న ఏం కావాలి? మనకు మనమే... మన శరీరమే మనకు... మన ప్రాణమే మనకు... మన అవయవాలే మనకు... ఆయుధాలు. విచిత్రం ఏమిటంటే... ఖడ్గానికి స్వయంగా యుద్ధంలో పాల్గొనడం తెలీదు. ఖడ్గచాలనం చేసే సైనికుడిదే, వీరుడిదే ఆ నైపుణ్యమంతా! కత్తి తిప్పడం తెలియకుంటే ఎంత గొప్ప ఖడ్గం అయినా శత్రువును ఓడించలేదు. అదే విధంగా మన శరీరం, మన అవయవాలు బాగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆత్మశక్తి లేనప్పుడు, మనపై మనకు విశ్వాసం లేనప్పుడు, సంకల్పబలం లేనప్పుడు, గుండెలోతుల్లో భయం ఉన్నప్పుడు... అవయవాలన్నీ కుదురుగా, అందంగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అంటే... అవయవ శక్తి కన్న బాహ్యబలం కన్న మించినది ఆత్మబలం, మనోబలం.                                           *నిశ్శబ్ద.

తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడితే ఏం జరుగుతుంది…ఈ తప్పులు చేయకండి..!

పిల్లలను పెంచడం అనేది ఒక కళ.  తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో పిల్లలను పెంచాల్సి ఉంటుంది.  తమ బిజీ బతుకుల్లో పడి పిల్లలను పట్టించుకోకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  పిల్లలను పెంచే సమయంలో మీరు చాలా ఓపికతో ఉండాలి ఒక్కోసారి మనం చేసే తప్పులు వారి భవిష్యత్తును పాడుచేస్తాయి.  సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో  కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇవి వారిపై  చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.  తల్లిదండ్రులు  పిల్లల విషయంలో  ఒక్కోసారి  తాము చాలా జాగ్రత్తగా ఉన్నామని భావించి  వారిపై ఒత్తిడి పెంచుతూ ఉంటారు ఇలాంటి పొరపాటున వల్ల పిల్లల మానసిక  ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.  తల్లిదండ్రులు చేసే కొన్ని పనులు పిల్లలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి అలాంటి పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం బిడ్డను వేరొకరితో పోల్చడం: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం తరచుగా కనిపిస్తుంది. అయితే అలా చేయడం తప్పు. ఎవరైనా తప్పు చేస్తే, తల్లిదండ్రులు ఇతర పిల్లలతో పోల్చి, 'నువ్వు ఈ తప్పు చేశావు' అంటారు కానీ అన్నయ్య ఇలా చేయడు. పిల్లవాడిని ఏ విధంగానైనా పోల్చడం చెడ్డది. ఇది పిల్లల మానసిక స్థితిని పాడు చేస్తుంది. తప్పు చేసినప్పుడు తిట్టడం: పిల్లలు ఒక పని నేర్చుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, పిల్లలు చేసిన తప్పును వారికి వివరించాలి. పిల్లల చేసే తప్పులను  వాళ్లకు అర్థమయ్యేలా కాకుండా, తిడితే మాత్రం అది వారి విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఏదైనా తప్పుకు పిల్లవాడిని బాధ్యులను చేస్తే, అది వారి మానసిక స్థితిని పాడు చేస్తుంది.  తల్లిదండ్రులు గొడవ పడటం: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటే, తల్లిదండ్రులు గొడవ చేయడం చూసి అతని మానసిక స్థితి చెడిపోవచ్చు. తల్లిదండ్రుల మధ్య గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పదే పదే తగాదాలు చూసినట్లయితే, అది అతని మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్నేహితుల ముందు ఎగతాళి చేయడం: చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలతో సరదాగా గడుపుతారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎగతాళి చేస్తుంటారు. అయితే, పొరపాటున కూడా వారి స్నేహితుల ముందు పిల్లవాడిని ఎగతాళి చేయకూడదు. ఇది పిల్లల మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇతర పిల్లల ముందు తన పిల్లల గురించి చెడుగా మాట్లాడకూడదు.

కష్టకాలంలో చాణక్యుడు చెప్పిన ఈ సూక్తిని గుర్తు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.!

చాణక్య నీతి ఒక వ్యక్తికి జీవితంలో తప్పొఒప్పుల  గురించి వివరిస్తుంది. చాణక్య నీతిని తెలుసుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ మోసపోడు. జీవితంలో ఎల్లప్పుడూ విజయ శిఖరాలను అధిరోహిస్తాడు.ఆచార్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని గొప్ప పండితుడు, గురువు. చాణక్యుడు నీతి పుస్తకాన్ని రాశాడు, దీనిని చాణక్య నీతి అని పిలుస్తారు. ఒక వ్యక్తి చాణక్యుడి సూత్రాలను పాటిస్తే, అతని జీవితంలో విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు. ఆ సూక్తులు ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్ట సమయాల్లో గొప్ప సవాళ్లు, పరిమిత అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి చేసిన పొరపాటు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ బాధ్యత: చాణక్యుడు ప్రకారం, ప్రతి వ్యక్తి యొక్క మొదటి కర్తవ్యం సంక్షోభ సమయంలో తన కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం. తద్వారా కష్టాల నుంచి తేలికగా బయటపడవచ్చు. కాబట్టి, మీరు మీ కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఆరోగ్యం ఒక వ్యక్తి యొక్క గొప్ప ఆస్తి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందువల్ల, మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. డబ్బు ఆదా చేసుకోండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం , ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సంక్షోభ సమయంలో డబ్బును ఆదా చేయాలి. అటువంటి సమయంలో ఒక వ్యక్తికి తగినంత డబ్బు ఉంటే, మీరు పెద్ద సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. ఆపద సమయంలో మనిషికి డబ్బు నిజమైన తోడు. డబ్బు లేకుంటే కష్టాల నుంచి బయటపడేందుకు కష్టపడాల్సి వస్తుంది.

భారతీయులకు స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవీ..!

భారతదేశ యువతకు ఆధ్యాత్మికతను, స్వాతంత్ర్య పోరాట పటిమను, దేశభక్తిని సమపాళ్లలో రగిలించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన భారతదేశాన్ని, భారతీయులను గూర్చి ఇలా చెప్పారు.. వివేకి స్వాతంత్ర్యాన్ని కోరుతాడు. ఇంద్రియ సుఖాలన్నీ నిస్సారాలని అతడు గుర్తిస్తాడు. సుఖదుఃఖాలకు అంతు లేదని తెలుసుకొంటాడు. ఎందరో ధనికులు క్రొత్త క్రొత్త సుఖాలు కావాలని ఆత్రపడుతున్నారు? ఉన్న సుఖాలన్నీ పాతబడి పోయాయి. కాబట్టి వారికి క్రొత్తరకమైన సుఖాలు కావాలి. క్షణకాలం పాటు పొందే తృప్తి కోసం వారెన్నెన్ని పిచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారో? ఆ తృప్తి కలిగిన వెంటనే దానికి విపరీత ఫలం కూడా ఎలా కలుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు.   ప్రజలలో అధిక సంఖ్యలో  గొఱ్ఱెల మంద లాంటివారు ఉన్నారు. ముందుపోతున్న గొఱ్ఱె గోతిలో పడితే, వెనుక వస్తున్న గొఱ్ఱెల కూడా ఆ గోతిలోకే దూకుతాయి. అదేవిధంగా సంఘంలోని ఒక పెద్ద, ఏ పని చేస్తాడో ఆ పనినే తక్కిన వారంతా గుడ్డిగా చేస్తారు. తాము ఏం చేస్తున్నదీ వారు ఆలోచించరు. ప్రాపంచిక విషయాలు అసారాలని గుర్తించడం ప్రారంభించగానే, తాను మాయ చేతి ఆటబొమ్మగా గానీ, మాయాకర్షణలకు లోబడి గానీ ఉండకూడదన్న భావం మనిషికి కలుగుతుంది. దయతో నాలుగు మాటలు చెప్పగానే, మానవుడు నవ్వడం ప్రారంభిస్తాడు. కటువైన మాటలు నాలుగు చెవిన పడగానే ఏడవడం మొదలు పెడతారు. పేరుకూ, ప్రతిష్టకూ బానిస అవుతారు. ఈ బానిసతనానికి లోపల యథార్థమైన మనిషి  పూడుకొనిపోయి ఉంటాడు.  ఈ బానిసతనాన్ని గుర్తించినప్పుడు స్వాతంత్ర్యం కావాలన్న తీవ్రమైన కోరిక కలుగుతుంది.  నిప్పు కణికను నెత్తి మీద పెట్టినప్పుడు దాన్ని తోసివేయడానికి మనిషెంత అల్లాడిపోతాడో..  మాయకు తాను బానిసగా ఉన్నానని నిజం తెలుసుకొన్నవాడు కూడా బంధ విముక్తుడు కావడానికి అంతగా ఆత్రపడతాడు. ముముక్షత్వం పొందాలన్న కోరికను మనుషులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అన్ని విషయాలలో  వివేకంగా ఉండటం. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది తాత్కాలికమో ఆలోచించడం. దేవుడొక్కడే నిజం, ఆయనే శాశ్వతం.. మిగిలినదంతా క్షణభంగురమే! అంతా నశించి పోతుంది. మనుషులు  మరణిస్తారు. పశువులు, భూములు అంతరిస్తాయి. సూర్యచంద్రులు, నక్షత్రాలు, ప్రతి వస్తువు. అనుక్షణం మారిపోతూ ఉంటుంది. ఈరోజు పర్వతాలుగా ఉన్నవి  నిన్న సముద్రాలుగా ఉన్నాయి. మళ్ళీ అవి రేపు సముద్రాలవుతాయి. సమస్త విశ్వం మార్పుల కుప్ప, కానీ ఏనాటికీ మార్పు చెందని వాడొకడున్నాడు. అతడే భగవంతుడు! మనం ఆయనను ఎంతగా సమీపిస్తే, మన మీది మాయ ప్రభావమంత తగ్గిపోతుంది. మనం ఆయనను సమీపించినప్పుడు, ఆయనతో కూడా నిలిచినప్పుడు మాయను జయిస్తాం. ఈ దృశ్యమాన ప్రకృతి మన అధీనమవుతుంది. మనపై దాని ప్రభావం ఉండదు. ఇదీ వివేకానందుడు భారతీయులకు చెప్పిన మాట.                                 *నిశ్శబ్ద.

మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే మీ భార్యకు విసుగుతెప్పిస్తాయి..!

వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉండి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్నగొడవలు జరుగుతుంటూనే ఆ సంసారం సాఫీగా ముందుకు సాగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న గొడవలే భాగస్వాముల మధ్య బంధానికి బీటలు వారేలా చేస్తుంది.  అందుకే తమ రిలేషన్ షిప్ లో సంతోషాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలిద్దరూ సమాన ప్రయత్నాలు చేయాలి. ఎవరైనా తన బాధ్యత నుండి తప్పుకుంటే ఆ బంధం ఖచ్చితంగా మధ్యలోనే చెడిపోతుంది. పురుషుల చెడు అలవాట్లు: తమ బంధాన్ని నిలబెట్టుకోవల్సిన బాధత్య భార్యభర్తలు ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు వారి మధ్య బంధాన్ని బలహీనపరుస్తాయి. దీంతో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. పురుషుల చెడు అలవాట్లతో ఎప్పటికీ మంచి భర్తగా నిరూపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. అవేంటో చూద్దాం. భార్య మాటలు పట్టించుకోకపోవడం: ప్రతి బంధానికి పునాది బలమైన కమ్యూనికేషన్. మీ సంబంధం ఎలా ఉంటుంది అనేది మీరు ఒకరితో ఒకరు ఎంతగా మాట్లాడుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకరి మాటలను ఒకరు ఎంతవరకు అర్థం చేసుకుంటారనేదే ముఖ్యం. కానీ వివాహ సంబంధాలలో కమ్యూనికేషన్ చాలా అరుదు. చాలా మంది భార్యలు తమ భర్తలు తాము చెప్పినా వినడం లేదని వాపోతున్నారు. మీ భర్త మీ కోసం సమయం కేటాయించనప్పుడు, సంబంధంలో చీలికలు వస్తాయనడంలో సందేహం లేదు. భార్యను గౌరవించకపోవడం: చాలా మంది భర్తలు తమ భర్యాలను ఇతరుల ముందు చులకనగా  చేసి మాట్లాడుతుంటారు.ఇలా చేయడం సరికాదు. మీ భార్యను దూషించే పదాలు ఉపయోగించడం ఆమెను అవమానిస్తుంది.ఇతరుల ముందు ఆమెను దూషించడం సరికాదు. మీరు ఇలాగే ప్రవర్తించడం కొనసాగిస్తే, మీరు మీ భాగస్వామిని గౌరవించడం లేదని అర్థం చేసుకోండి. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకాన్ని కొనసాగించడానికి, మీ భాగస్వామిని గౌరవించడం నేర్చుకోండి. మీ భార్యతో ప్రేమగా ఉండండి: భార్యాభర్తలు కారుకు రెండు చక్రాలు. ఇద్దరికీ ఒకరికొకరు కావాలి. ఇద్దరూ ఒకరినొకరు లేకుండా జీవించడం కష్టం. కానీ భర్తలు పని ఒత్తిడి వల్ల లేదా వారితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల భార్యలపై కోపం తెప్పించడం చాలా తప్పు.మీ భార్య మీ కోసం రోజంతా ఎదురుచూస్తుందని తెలుసుకోండి. అటువంటి పరిస్థితిలో, వారితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి.

కష్టసమయంలో కూడా నవ్వుతూ ఉండాలంటే ఇలా చేయండి!

మనిషి జీవితానికి, కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే   రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిలాగా.. మనిషి జీవితంలో కూడా  సంతోషం, పోరాటం, కష్టం, దుఃఖం అన్నీ ఉంటాయి. వీటి నుండి విజయం, అపజయం అనే చీకటి, వెలుగులు దోబూచులాడతాయి. అయితే చాలా మందికి రెండింటిని ఒక్కటిగా తీసుకోవడం రాదు.  కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోవడం, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోవడం చేస్తారు.  విజయం సాధించినప్పుడు, అనుకున్నవి జరిగినప్పుడు సంతోషపడతారు. అయితే కష్టం  వచ్చినా, సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉండాలంటే మాత్రం ఈ కింద చెప్పుకున్న పనులు పాటించాలి. చాలామంది సంతోషాన్ని బయటి నుండి వెతుకుతారు. అయితే సంతోషం అనేది అంతర్గతమైనది.  ఆనందం అనేది కేవలం పరిస్థితులు లేదా వ్యక్తి ద్వారా సృష్టించబడదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే దీన్ని కొన్ని పనులు చేయడం ద్వారా అనుభూతి చెందవచ్చు. శారీరక శ్రమ.. శారీరక శ్రమ సహజంగానే మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే కనీసం 10 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇందులో  ఫాస్ట్ వాకింగ్, జంపింగ్ జాక్స్, స్ట్రెచింగ్ వంటివి  చేర్చవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ ఏడు గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా  చాలా ఆందోళనగా ఉన్నప్పుడు సరైన నిద్ర చాలా అవసరం. ప్రకృతికి దగ్గరగా.. గందరగోళంగా ఉన్న మనస్సును శాంతపరచడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం పచ్చని వాతావరణంలో నడవడం. దీని కోసం  అడవులకు  వెళ్లవలసిన అవసరం లేదు. పార్క్ లు, తోటలలో  నడవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు  మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది సంతోషాన్ని పెంచుతుంది.  ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వాలి.. ఎంత  కష్టమైన సమయాలు ఉన్నా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని  నవ్వడానికి ప్రయత్నించాలి.   ఇది చాలా అద్భుతమైన ట్రిక్.  దీన్ని అలవాటు చేసుకుంటే ఎంత క్లిష్టం పరిస్థితులలో ఉన్నా కూడా ఒత్తిడి, ఆందోళనకు గురి చేయనివ్వదు. ఆలోచన.. కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని గుర్తుచేసుకుని  నిరంతరం ఆలోచించే బదులు దాని పరిష్కారం లేదా దాని ప్రభావం తగ్గించడం దిశగా  ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మొదట మీరు డిప్రెషన్ నుండి  మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు.   రెండవది పరిస్థితిని మెరుగైన మార్గంలో ఎదుర్కోవడానికి మీ మనస్సు సిద్ధమవుతుంది.                                 *నిశ్శబ్ద.      

కుటుంబం సంతోషంగా ఉండాలంటే.. మీరిద్దరూ ఇలాగే ఉండాలి!

మీరు కొన్ని జంటలను చూస్తే, వారు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఎలా అనే ప్రశ్న మనలో తలెత్తుతుంది. మీ  వైవాహిక జీవితంలో ఇంత సంతోషంగా ఎలా  ఉన్నారు అని అడిగేవారూ ఉన్నారు. కానీ సంతోషకరమైన జంట అది పెద్ద విషయం కాదని మీకు చెప్పగలదు. ఎందుకంటే ప్రతి బంధంలోనూ గొడవలు ఉంటాయి. ఆ గొడవలను ఎలా పరిష్కరించుకున్నామన్నదే ముఖ్యం. కొంతమంది జంటలు తరచుగా గొడవ పడుతుంటారు. కానీ ఆ సమస్యకు పరిష్కారం వెతకడంతో మాత్రం విఫలమవుతుంటారు. తప్పులు, ఒప్పులు అనేవి జీవితంలో సర్వసాధారణం. వాటిని పరిష్కరించుకుంటూ..ఒకరిపై ఒకరు గౌరవం, నమ్మకం, ప్రేమతో ముందుకు సాగుతుంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడే జంటలు..ఈ చిన్న చిన్న విషయాలను సరిదిద్దుకుంటే సంతోషంగా ఉంటారు. అవేంటో చూద్దామా? వారు నిజంగా సంతోషంగా ఉన్నారా? కొంతమంది జంటలు పబ్లిక్‌గా చేతులు పట్టుకోవడం, పార్టీలో కౌగిలించుకోవడం వంటివి చూస్తే.. ఇది కేవలం షోలా అనిపించవచ్చు.కానీ సంతోషకరమైన జంట ఎప్పుడూ కలిసి ఉండకపోయినా, వారు సన్నిహితంగా ఉన్నారనే భావనను పొందుతారు. వాగ్వాదం జరిగినా సరిహద్దు దాటరు: గీతను ఎక్కడ గీయాలి..ఎప్పుడు దాటకూడదో సంతోషంగా ఉండే  జంటకు ఖచ్చితంగా తెలుసు.ఎంత వాగ్వాదం జరిగినా సరిహద్దు దాటరు. ఇక్కడ ఒకరు నిశ్శబ్దానికి లొంగిపోతారు. మరొకరు చర్చను అలా వదిలివేస్తారు. మనస్పూర్తిగా మాట్లాడటం: ఒకరి భావాలకు..ఒకరు విలువనివ్వాలి. కొన్నిసార్లు మీరు దానిని ఒకరిపై విధించాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని మాటలు సానుకూలంగా మాట్లాడితే, అది మీ ప్రియమైనవారి పట్ల మీకు అనుభూతిని కలిగిస్తుంది.నిద్రపోయే ముందు, మీరు మీ భాగస్వామికి కొన్ని సానుకూల పదాలు చెప్పాలి. ఇది సానుకూల గమనికతో రోజును ముగించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది మొత్తం మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ఆ రోజు జరిగిన ఆలోచనలన్నింటినీ మరచిపోయి సమస్యలను, చింతలను పడకగదికి దూరంగా ఉంచండి. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు నిజాయితీగా, గంభీరంగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్తలు: భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే డబ్బు వెచ్చించి ప్లాన్ చేసుకుంటారు. తమ సంపాదనకు, పొదుపుకు ఎంత స్వేచ్ఛ ఉందో తెలిసిపోతుంది.చాలా బంధాలు డబ్బు కారణంగా విడిపోతాయి . కానీ సంతోషంగా వివాహం చేసుకున్న జంట దీని కోసం సరిగ్గా ప్లాన్ చేస్తారు. గోప్యతకు గౌరవం: మీరు ఎల్లప్పుడూ మీ భాగస్వామి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలి. ప్రతీది భూతద్ధంలో పెట్టిచూడకూడదు. మీ భాగస్వామికి కూడా గోప్యత ఉంటుంది. దానికి మీరు గౌరవించాలి.  వారు ఒంటరిగా లేదా స్నేహితులతో వెళ్ళవచ్చు. వీటన్నింటినీ గౌరవించాలి. ఓపిక: ఎవరి సంసారంలోనైనా తుఫాన్ ను లాంటి సమస్యలు వచ్చిపోతుంటాయి. వాటన్నింటిని ప్రశాంతంగా ఆలోచించి ఓపికతో పరిష్కరించుకోవాలి. ఇలాంటి  చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటూ మీ వైవాహిక జీవితం, సంతోషంగా ఉంటుంది.

మీరు రోజూ నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నారా..ఐతే  ఇది మీ కోసమే ?

తలనొప్పి వచ్చినా, శరీరంలో నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. చాలా మంది తలనొప్పి వస్తే డిస్ప్రిన్, ఒళ్లు నొప్పులకు  కాంబిఫ్లామ్ వంటి మందులు తీసుకుంటారు. ఈ ఔషధాల ప్రభావం త్వరగా కనిపిస్తుంది.  కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం కూడా లభిస్తుంది. కొంతమంది  నొప్పి తగ్గే వరకు వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులను తీసుకుంటారు.కొన్నిసార్లు రోజులో  చాలా సార్లు తీసుకుంటారు. ఇలా చేస్తే తొందరగా తగ్గిపోతుందనేది వారి అభిప్రాయం. అయితే  ఇలా నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో  వైద్యులు కింది విధంగా తెలిపారు. నొప్పి నివారణ మందులు వాడటం తప్పనిసరి అయితే ఎటువంటి సలహా లేకుండా రోజుకు చాలా సార్లు తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ తో సేఫ్ అనేదేమీ లేదని అంటున్నారు. ప్రతి పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తుంది.  ఎటువంటి సలహా లేకుండా మందులు తీసుకోవడం తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.   రోజుకు ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం నొప్పికి ఎక్కువగా ఉపయోగించే ఔషధం పారాసెటమాల్. నొప్పులు వస్తే పారాసెటమాల్ వాడాలని పిల్లలకు కూడా తెలుసు. 8 గంటల వ్యవధిలో 500 ఎంజీ మాత్రలు రోజుకు 3-4 రోజులు  తీసుకోవచ్చని అది కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.  3-4 రోజుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. సమస్య తెలియకుండా తీసుకోకూడదు.. శరీరంలో ఉన్న సమస్య ఏంటో తెలియకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం హానికరం. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు ప్రతి మందుకూ సానుకూల ప్రభావాలే కాదు వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా చాలామందిలో మెడిసిన్ రియాక్షన్ కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి దీనివల్ల ప్రాణాలమీదకు రావచ్చు కూడా.                                        *నిశ్శబ్ద

ప్రేమ, ఆకర్షణ.. రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం ఎలాగంటే..!

ప్రేమ,  ఆకర్షణ రెండు వేర్వేరు విషయాలు కాదు.  ప్రేమను,  ఆకర్షణను సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రేమ అనేది  మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణతోనే మొదలవుతుందని అర్థమవుతుంది.  ఇది ఒకే దారిలో రెండు స్టాపింగ్ పాయింట్స్ లాంటిది. ఈ దారిలో వెళ్లే   కొందరు వ్యక్తులు ప్రేమను చేరుకుంటే, కొందరు తమ సంబంధాన్ని కేవలం ఆకర్షణకే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆకర్షణ నుండి ప్రేమకు వెళ్ళడం సులభం కాదు. అందుకే రెండింటి మధ్య  తేడాను గుర్తించాలి.  ఎవరైనా.. ఎవరినైనా ప్రేమిస్తున్నట్టైతే ప్రేమలో ఉన్నారా లేదా ఆకర్షణలో ఉన్నారా అనే విషయం తరచి చూసుకోవడం ముఖ్యం. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే.. ఇతర విషయాల ప్రాధాన్యత.. ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు.  తన భాగస్వామిని కలిసిన ప్రతిసారీ తను మొదటి సారి కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీలవుతారు. కానీ సంబంధం కేవలం ఆకర్షణపై మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడు కలిసి సమయాన్ని గడపడానికి కాస్త పరధ్యానం చూపిస్తారు.   భవిష్యత్తు విషయాలు.. ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నవారు  తమ భవిష్యత్తును మరొకరితో గడపాలని అనుకుంటారు. ఎప్పుడూ కలిసి ఉండేందుకు,  కలిసి తమ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు.   దాని కోసం కష్టపడతారు. కానీ ఆకర్షణలో ఉన్నవారు ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలు వేయరు. వారు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ అలాంటి సందర్భం తీసుకుని వస్తే.. ఇప్పుడే అవన్నీ అవసరమా అంటూ సిల్లీగా వాటిని కొట్టేపడేస్తారు.  సరళంగా చెప్పాలంటే వారి భవిష్యత్తులో మీకు చోటు ఉండదు. శారీరక సంబంధం.. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం  అవసరాన్ని కలిగి ఉండదు. దీనిలో వ్యక్తులు ఒకరికొకరు మానసికంగా దగ్గరగా ఉంటారు. అయితే శారీరక సంబంధమే ఆకర్షణకు కేంద్ర బిందువు. ఒక  వ్యక్తి తన భాగస్వామి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా,   ఏమి కావాలో కూడా తెలుసుకోకుండా కేవలం వారి అవసరం కోసం మాత్రమే శారీరక సంబంధం గురించి మాట్లాడుతున్నట్టైతై వారు మీతో ఎక్కువ కాలం ఉండరు అనేది నిజం. వ్యక్తిగత జీవితం గురించి రహస్యాలు.. ప్రేమలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి ముందు అద్దంలా మారతాడు. అతని తప్పులు, లోపాలు  లక్షణాలు, ఏదీ దాచరు. కానీ ఆకర్షణలో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయానికి అందరమైన కథలు అల్లి మభ్యపెడతారు.                                         *నిశ్శబ్ద.

తల్లిదండ్రులు పొరపాటున కూడా ఈ విషయాలు మగపిల్లలతో చెప్పకూడదట..!

పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాల్. లింగ సమానత్వం అనే మాటను ఎంత సీరియస్ గా తీసుకున్నా సరే.. ఆడపిల్లలను, మగపిల్లలను పెంచే విధానంలో ఎంతో కొంత తేడా ఉండనే ఉంటుంది. ముఖ్యంగా జెండర్ కారణంగా తల్లిదండ్రులు మగపిల్లలకు కొన్ని విషయాలు చెబుతుంటారు. తల్లిదండ్రులు మంచి కోసమని చెప్పే ఆ విషయాలు  పిల్లల భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పిల్లల వ్యక్తిత్వాన్ని ఊహించని విధంగా మార్చేస్తాయి. తల్లిదండ్రులు మగపిల్లలకు చెప్పకూడని విషయాలేంటో తెలుసుకుంటే.. మగపిల్లాడు ఏడవకూడదని చెప్పొద్దు.. అబ్బాయిలు ఏడవకూడదని, ఏడవడం తప్పు అని చాలా మంది తల్లిదండ్రులు తమ కొడుకులకు చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. ఎప్పుడైనా మగపిల్లాడు ఏడుస్తుంటే అదేంటి అలా ఏడుస్తున్నావు ఆడపిల్లలాగా అని ఎగతాళి కూడా చేస్తారు.  కానీ నిజమేంటంటే ఈ విషయం మగపిల్లలకు అస్సలు చెప్పకూడాదు. ఇవి పిల్లల మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనితో పిల్లలు తన ఆలోచనలను, భావోద్వేగాలను  తమలోనే ఉంచుకోవడం మొదలుపెడతారు. మగపిల్లలను వెక్కిరిచకూడదు.. పిల్లలు ఎదిగేకొద్ది వారి వ్యక్తిత్వం కూడా మెరుగవుతూ వస్తుంది. తల్లిదండ్రులు అయినంతమాత్రాన మగపిల్లలు పెద్దవారు అయినా సరే వారిని  ఏదైనా అనేయవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులు మానుకోవాలి. ఓ వయసుకు వచ్చాక మగపిల్లలు ఇంట్లో ఉంటే చాలామంది తల్లిదండ్రులు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇంకెన్నాళ్లు ఇంట్లోనే కూర్చుని తింటావు అని అంటూ ఉంటారు. కానీ ఈ మాటలు  మగపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అనుమానించకూడదు.. చాలామంది తల్లిదండ్రులకు కొడుకుల మీద అనుమానం ఉంటుంది. దీనికి కారణం మగపిల్లల స్నేహాలు, పరిచయాల లిస్ట్ పెద్దది. అవసరాల కోసం మగపిల్లలు తల్లిదండ్రులతో అబద్దాలు కూడా చెబుతారని అనుకుంటారు. పొరపాటున ఇంట్లో ఏదైనా వస్తువు మిస్ అయినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురైనా వెంటనే కొడుకునే అంటూ ఉంటారు. ఇది మగపిల్లల దృష్టిలో తల్లిదండ్రును చెడ్డగా మారుస్తుంది. పోలికలు పెట్టకూడదు.. మగపిల్లలు చదువు, ఉద్యోగంలో ఏమాత్రం సెటిల్ కాకపోయినా వారిమీద పోలికల యుద్దం చాలా దారుణంగా ఉంటుంది. కేవలం కొడుకులు అనే కాదు, కూతుర్లను కూడా ఈ విషయాలలో పోల్చి చూస్తారు. వాడు ఎంత బాగా చదువుతాడో, ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడో, మీకు తల్లిదండ్రులంటే భయం గౌరవం లేదు.. వాళ్లు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో.. ఇలాంటి మాటలు తరచుగా అంటూ ఉంటారు. కానీ ఇవి అస్సలు అనకూడదు.  తల్లిదండ్రుల మీద పిల్లలకు ద్వేషం పెరగడానికి కారణమవుతుంది.                                             *నిశ్శబ్ద.

ఈ 4 విషయాలు శాంతికి, సంతోషానికి మార్గం వంటివి.!

ప్రతి ఒక్కరూ ఆనందం, శాంతి  కూడిన జీవితం కోసం  ప్రయత్నిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో డబ్బు అనే తోకలేని గుర్రం వెనుక పరుగులు తీయడంలో ఆనందం, శాంతి, సంతోషం మర్చిపోతున్నారు. డబ్బుతోనే  సుఖం, శాంతి, సంతోషం అనే కాలం వచ్చేసింది. ఆచార్య చాణక్యుడు ప్రశాంతమైన,  సంతోషకరమైన జీవితం కోసం కొన్ని సూత్రాలను అందించాడు. ఆ సూత్రాలు ఏమిటో తెలుసా? ఆచార్య చాణక్యుడి అనుభవాలు,  నీతి సమాహారమైన 'చాణక్య నీతి'లో సరైన జీవన విధానాల గురించి సమాచారం ఉంది. మీరు జీవితంలో విజయం, ఆనందాన్ని పొందాలనుకుంటే, ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలను ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే వారు మీ ఇంటిని స్వర్గంగా మార్చే సంతోషకరమైన జీవితం కోసం కొన్ని ప్రాథమిక మంత్రాలను చెప్పారు. ఇవి పాటిస్తే ప్రతిఒక్కరూ జీవితంతో ఆనందాన్ని పొందగలరు. సంతోషకరమైన జీవితానికి అత్యంత ముఖ్యమైన చాణక్యుడి తత్వశాస్త్రంలోని ఆ నాలుగు అంశాల గురించి తెలుసుకుందాం. 1. శాంతి: ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా మానవ జీవితంలోని ప్రతి మలుపులోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. చాలా సార్లు ఇలాంటి సమస్యలు మనల్ని మానసికంగా బలహీనపరుస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు శాంతియుతంగా పని చేస్తే, అన్ని సమస్యలకు పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఎందుకంటే అయోమయమైన మనస్సుతో మనిషి ఏ సమస్యను ఎదుర్కోలేడు లేదా దాని నుండి బయటపడలేడు. కాబట్టి మీరు మీ ఇంట్లో సంతోషాన్ని కోరుకుంటే, ఏదైనా సమస్యను సులభంగా ఎదుర్కోవటానికి మీరు శాంతితో నడవాలి. 2. ఆత్మసంతృప్తి:  ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నడుస్తున్న జీవితంలో ఒకరికొకరు ముందుండాలని కోరుకుంటారు. దీని కోసం రాత్రింబవళ్లు శ్రమించినా మనకు కావాల్సిన డబ్బు సంపాదించడం కష్టం. దీంతో వారు తమ ప్రియమైన వారికి సమయం కేటాయించలేకపోతున్నారు. మన జీవితం సంతోషంగా ముందుకు సాగాలంటే సంతృప్తి అనేది చాలా ముఖ్యమని చాణ్యకుడు చెబుతున్నారు.  మీరు జీవితంలో సంతృప్తిగా ఉంటే, మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు. తృప్తి చెందాలంటే ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తృప్తి చెందే వ్యక్తి కంటే సంతోషించే వ్యక్తి మరొకడు లేడు. 3. కరుణ: మనిషిలో కరుణ చాలా ముఖ్యం. కానీ నేడు, డబ్బు, పేరు సంపాదించాలనే ఈ హడావిడిలో, మనం తరచుగా పేదలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము. మనపై ఇలాంటి వైఖరి సరికాదని చాణక్యుడు అంటున్నాడు. ఆచార్య చాణక్యుడు తనలో కరుణ ఉన్న వ్యక్తి అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని చెప్పారు. ఎందుకంటే దయ అనేది మీ మనస్సులో ఇతర లోపాలు తలెత్తకుండా నిరోధించే లక్షణం. 4. ఆశయం: చాణక్యుడి నీతి ప్రకారం, దురాశ ఒక శాపం, అది ఒకరి మనస్సులోకి ప్రవేశించిన తర్వాత, అది తప్పుఒప్పులను అవగాహనను మరచిపోయేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ దురాశకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే అది మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది.  ఆ తర్వాత మీ ఆనందాన్ని, శాంతిని దూరం చేస్తుంది. మీకు సంతోషకరమైన జీవితం కావాలంటే, దురాశను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ప్రస్తుతం ఉన్నదానితో సంతృప్తి చెందండి అని చాణక్యుడు తన తత్వశాస్త్రంలో చెప్పాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, పైన పేర్కొన్న 4 అంశాలను తన జీవితంలో స్వీకరించిన వ్యక్తి శాశ్వతంగా శాంతి, ఆనందంతో జీవిస్తాడు. మీ జీవితంలో శాంతి, సంతోషం కావాలంటే వీటిని స్వీకరించండి.

స్నేక్ ప్లాంట్ మొక్క పెంచుతుంటారా? ఈ నిజాలు తెలుసా?

సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా మొక్కలు పెంచుకోవడం చాలా మంది చేసే పని. కళ్లెదురుగా  మొక్కలు ఎదుగుతూ పువ్వులు, కాయలు కాస్తుంటే అదొక చెప్పలేని ప్రశాంతత మనసును హాయిగా ఉంచుతుంది. చాలామంది ఇంటిముందు జాగా లేకపోయినా కుండీలలో పెరిగే అవకాశం ఉన్న చాలా మొక్కలను పెంచుతుంటారు. వీటిలో కలబంద, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, గులాబీ, పీస్ లిల్లీ మొదలైనవి పెంచుతుంటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే స్నేక్ ప్లాంట్ గురించి చాలామందికి తెలియదు. ఈ స్నేక్ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే పాములు రావనే మాట తప్పితే దీని గురించి నిజానిజాలు తెలిసినవాళ్లు తక్కువ. ఈ మొక్క గురించి నిజాలేంటంటే.. స్నేక్ ప్లాంట్ గురించి చైనా వాస్తుశాస్త్రం చాలా గొప్పగా చెప్పింది. ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అదృష్టం కలసివస్తుందని పేర్కొంది. అందుకే స్నేక్ ప్లాంట్ ను అదృష్టం తెచ్చి పెట్టే మొక్కగా చైనీయులు భావిస్తారు. సైన్స్ ప్రకారంగా చూస్తే స్నేక్ ప్లాంట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి... స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ప్రాంతంలో ఉండే గాలిని స్వచ్చంగా ఉంచుతుంది.  గాలి శుద్ది చేయడంలో ఈ మొక్క ప్రభావవంతంగా ఉంటుంది. స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే మొక్క. చాలా మొక్కలు పగటి సమయంలో ఆక్సిజన్ గ్రహించి కార్భన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంటాయి. కానీ స్నేక్ ప్లాంట్ మాత్రం పగటి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. వాతావరణంలోని మలినాలను, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఇది అలెర్జీలను, అలెర్జీకి కారణమయ్యే వాతావరణాన్ని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలున్నవారు, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. స్నేక్ ప్లాంట్ పెంపకంలో  అంత ఇబ్బందులేమీ ఉండవు. ఈ ఇండోర్ మొక్కకు నీరు ప్రతిరోజూ పెట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ గాలి, తక్కవ నీరు, తక్కువ వెలుతురులో చాలా ఆరోగ్యంగా పెరుగుతాయివి. స్నేక్ ప్లాంట్ మొక్క  ఇంట్లో తేమను నియంత్రించడంలో ముందుంటాయి. ఇవి పెరిగే కొద్దీ తేమను విడుదల చేస్తాయి. దీని వల్ల ఇంటిలోపల వాతావరణం చలిగానూ లేకుండా, వేడిగానూ లేకుండా  సమతుల్యంగా ఉంటుంది. ఇకపోతే స్నేక్ ప్లాంట్ ఆకులతో కూడిన మొక్క. దీని ఆకులు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. ఈ మొక్క చూడ్డానికి చాలా ఆకర్షణగా ఉంటుంది. పైపెచ్చు ఈ ఆకులు ఆకుపచ్చ రంగులో కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటాయి.                                           *నిశ్శబ్ద.

కొత్త సంవత్సరంలో  కలల జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి?

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరం కలల జీవితాన్ని ఎందుకు సృష్టించుకోకూడదు? ఆలోచన ఏదో బాగుంది. అయితే అది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. కేవలం ఒక సంవత్సరంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకునే మార్గం ఇక్కడ ఉంది. మీరు వృత్తిపరమైన విజయం, వ్యక్తిగత ఎదుగుదల, మెరుగైన ఆరోగ్యం లేదా మెరుగైన సంబంధాలను లక్ష్యంగా చేసుకున్నా, ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా ఏడాది చివరి వరకు విజయం సాధించవచ్చు. మీ జీవితాన్ని ఆడిట్ చేయండి: మీ కలల జీవితాన్ని సృష్టించే ముందు, మీరు మీ ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా పరిశీలించాలి. కెరీర్, సంబంధాలు, ఆరోగ్యం, వ్యక్తిగత ఎదుగుదల , పర్యావరణం - జీవితంలోని వివిధ అంశాలలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. ఏది బాగా పని చేస్తుందో, ఏది మెరుగుపడాలో అంచనా వేయండి. మార్పు కోసం ఈ పరిశీలన కీలకం. శ్రద్ధ అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించండి.  భవిష్యత్తు కోసం మీ దృష్టితో వాటిని సమలేఖనం చేయండి. ఇది మీ కలకి పునాది వేస్తుంది.   మీరు మీ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి: మీ కలల జీవితాన్ని సృష్టించడానికి మనస్తత్వంలో మార్పు అవసరం. సమృద్ధి, అవకాశం, పెరుగుదల యొక్క మనస్తత్వాన్ని స్వీకరించండి. అన్ని విషయాల గురించి సానుకూలంగా ఆలోచించండి, సమస్యలపై దృష్టి పెట్టకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి. ఇది కష్టంగా ఉంటుంది కానీ మీ పురోగతికి ఏది అడ్డుగా ఉంది. దానిని ఎలా అధిగమించాలో అది మీకు తెలియజేస్తుంది. నేను చేయగలననే విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. భవిష్యత్తును చిత్రించండి: మీ కలల జీవితం ఎలా ఉంటుందో మీరు వివరంగా ఊహించుకోవాలి. మీ జీవితంలోని అన్ని అంశాలను పరిగణించండి. ఒక సంవత్సరంలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఊహించుకోండి. మీ ఆదర్శ కెరీర్, సంబంధాలు, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధి గురించి ఒక దృష్టి పెట్టండి. ఈ చిత్రం మీ ఎదుగుదలకు ఒక దారి చూపుతుంది. మీ అభిప్రాయాన్ని వ్రాయండి. అలా జరిగితే కల నెరవేరుతుంది. మీ ఎదుగుదల కోసం పనులు చేయండి : వ్యక్తిగత అభివృద్ధి, అభివృద్ధికి కట్టుబడి ఉండండి. మీ మనస్సు, శరీరం, ఆత్మను పోషించే కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించండి. ఇందులో చదవడం, ధ్యానం, వ్యాయామం, దినచర్యలు లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివి ఉండవచ్చు. స్వీయ-అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడూ కలలుగన్న జీవితం మీకు కావాలంటే నిరంతర అభ్యాసం ముఖ్యం. వృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించండి. మీ బలాన్ని పెంచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. పాత వాటిని అభివృద్ధి చేయండి: మీరు ఎంచుకున్న జీవితంలో అభివృద్ధి చెందడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచండి. మీ ఆకాంక్షలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించండి. వాటిని పొందేందుకు లేదా మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించండి. ఇందులో కోర్సులు తీసుకోవడం, మెంటర్‌ని కనుగొనడం లేదా స్థిరంగా సాధన చేయడం వంటివి ఉండవచ్చు. వేగంగా మారుతున్న ప్రపంచంలో అనుకూలత కీలకం. ఒక భాష నేర్చుకోండి. దానిని మెరుగుపరచండి. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు సహాయపడుతుంది.

కొత్త ఏడాదిలో అయినా ఇవి అలవాటు చేసుకోండి.. జీవితం సంతోషంగా ఉంటుంది!

డిసెంబర్ నెల ముగింపుకు వచ్చేస్తోంది. కొత్త అనే పదంలోనే ఒకానొక ఆశాభావం ఉంటుంది.  చాలామంది పుట్టినరోజు సందర్బంగానో, పండుగల సందర్భంగానో, కొత్త ఏడాది సందర్బంగానో  ఈ సారి అయినా నా జీవితం మెరుగ్గా ఉండాలి, నేను ఇంకా బాగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే  కొత్త ఏడాదిలో ఈ కింద చెప్పుకునే అలవాట్లు జీవితంలో భాగం చేసుకుంటే జీవితం సంతోషమయమవుతుంది. అవేంటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం. జీవితంలో సానుకూల అంశాల అంశాలను గుర్తుచేసుకుని  ఆయా సందర్బాలకు కృతజ్ఞత చెప్పుకోవడం, సానుకూల జీవతానికి సహకరిస్తున్నవారికి కృతజ్ఞతన చెప్పడం, ప్రపంచంలో ఎంతో మందితో పోలిస్తే తమకు మెరుగైన జీవతమే లభించిందని తృప్తిగా ఉండటం, జివితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల  మనిషిలో సంతృప్తి పెరుగుతుంది. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆప్తులతో అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన సంబంధాలు జీవితంలో గొప్ప సంతోషానికి కారణమవుతాయి. కష్ట సుఖాలను పంచుకోవడం, విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం మొదలైన సందర్బాలకు ఆత్మీయ సంబంధాల తోడు ఎంతో అవసరం. మీకోసం మీరు.. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, బంధువులు ఇలా అందరూ  ఉండి ఉండవచ్చు. అందరితో సంతోషమూ లభించవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత సమయం ఉండాలి.  చదవడం, నడవడం, అభిరుచి కలిగిన పనులు చేయడం. ఆనందాన్ని ఇచ్చే పనులు చేయడం ద్వారా మానసికంగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సమయం ఆత్మ విమర్శ చేసుకోవడానికి, తమను తాము తరచి చూసుకోవడానికి కూడా సహాయపడుతుంది. చురుగ్గా ఉండాలి.. ప్రస్తుతకాలంలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధులు, అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని నిశ్చలమైన జీవనశైలి వదిలిపెట్టాలి. శారరక  శ్రమ, మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ధ్యానం, యోగా వంటిని ఫాలో కావాలి. ఆరోగ్యకమైన ఆహారపు అలవాట్లు.. నేటికాలం ప్రజల ఆహారపు అలవాట్లు చాలా దారుణంగా తయారయ్యాయి.  పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్నని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. సెలబ్రేషన్.. చిన్న విజయం అయినా సరే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది  తదుపరి  పనులను మరింత ఉత్సాహంతో చేసేలా ప్రేరేపిస్తుంది. పాజిటివ్ గా ఉండాలి.. పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్యలు అయినా అధిగమించవచ్చు. అవి వ్యక్తిగతం అయినా, వృత్తి సంబంధ విషయాలు అయినా సానుకూలతతో ముందుకు వెళితే ఫలితాలు కూడా సానుకూలంగానే ఉంటాయి.                                                   *నిశ్శబ్ద.  

ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నారా? అసలు కారణాలివే!

బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించి, ఒక బంధాన్ని వెతుక్కుని, పెళ్లి పిల్లలు అంటూ ఒక కుటుంబాన్ని సృష్టించుకుని మనిషి తన జీవితాన్ని విస్తారం చేసుకుంటాడు. కానీ జీవితం అయితే విస్తారం అవుతుంది. కానీ మనిషి మాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, మెరుగైన వసతులు ఉన్నా సరే.. జీవితంలో సంతోషాన్ని పొందలేకపోతున్నాడు. దీనికి కారణం వసతుల లేమి కాదు.. సమాజంలో  కలుగుతున్న మార్పులు, వ్యాధులు, ఆందోళన, అనిశ్ఛితి మొదలైనవి  అని వైద్యులు, మనస్తత్త్వ శాస్ర్తవేత్తలు అంటున్నారు. కానీ వీటన్నింటికంటే మనిషి సంతోషంగా లేకపోవడానికి ఆ వ్యక్తి దినచర్య కూడా కారణమవుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. చాలా అలవాట్ల వల్ల ప్రజలు సంతోషంగా ఉండడం కష్టంగా మారింది.  నిద్ర లేకపోవడం  ఈ కారణాలలో  ఒకటి. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్ర లేకపోవడం  మానసిక,  భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా ఒత్తిడి-ఆందోళన పెరుగుతుంది. ఇది ఇలానే ఉంటే వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా సరే సంతోషంగా ఉండలేరు. మనిషిపై నిద్ర ప్రభావం ఎలా ఉంటుంది.. పరిశోధకుల అధ్యయనాలలో  నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తేలింది. అందుకే ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన యువత  కూడా మునుపటి కంటే ఎక్కువ చిరాకు, కోపం, అసంతృప్తి,  అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇప్పట్లో సమాజంలో నిద్ర రుగ్మతల సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తుంది, ఇది వ్యక్తుల్ని మానసికంగా బలహీనపరుస్తుంది. నిద్రలేమి కారణంగా నిద్రపొయిన సమయంలో కూడా  కలత నిద్ర,  భావోద్వేగ పనితీరుపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. భావోద్వేగాల విషయంలో బలహీనంగా ఉండటం వల్లే  ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నాం. నేటికాలంలో యువత రాత్రిళ్లు నెట్ బ్రౌజింగ్, బయట పార్టీలు, నైట్ టైమ్ బయటకు వెళ్లడం, అర్థరాత్రుల వరకు చాటింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. వీరు ఏ రెండు లేదా మూడు గంటలకు పడుకుని ఉదయం 8 గంటలకు నిద్ర లేస్తారు. దీని వల్ల నిద్రా చక్రం దెబ్బతింటుంది. అది మానసిక సమస్యలకు, మెదడు మీద ఒత్తిడికి కారణం అవుతుంది. అస్తవ్యస్థమైన పనితీరు, వేళకాని వేళలో ఆహారం తినడం, తీసుకునే ఆహారం అనారోగ్యకమైనది కావడం వంటి కారణాల వల్ల మొత్తం లైప్ స్టైల్ దెబ్బతింటుంది. అందుకే నిద్ర అలవాటు మార్చుకుంటే మొత్తం జీవనశైలి కూడా మెల్లగా ఓ కొలిక్కి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. సంతోషం కోసం ఈ అలవాట్లు తప్పక మార్చుకోవాలి.                                               *నిశ్శబ్ద.  

గణితంతో ప్రపంచాన్ని విస్మయపరిచిన శీనివాస రామానుజన్..!

మనిషి జీవితం మొత్తం గణితం పై ఆధారపడింది. ఉదయం లేచింది మొదలు సమయం చూడటం నుండి ప్రతి పనిలోనూ గణితాన్ని ఉపయోగిస్తాము. ఈ గణిత శాస్త్రానికి సంబంధించి భారతీయులు గర్వంగా చెప్పుకోదగినవారు శ్రీనివాస రామానుజన్.  భారతదేశంలో గణిత దినోత్సవాన్ని శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్బంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్   రచనలు దేశవ్యాప్తంగా,  ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేశాయి. శ్రీనివాస రామానుజన్  1887, డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మదినం అయిన డిసెంబర్ 22వ తేదీను గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకుంటే.. 1887, డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస రామానుడన్ తన 12 సంవత్సరాల వయస్సులో అధికారిక విద్య లేకపోయినా త్రికోణమితిలో రాణించాడు. ఆయనే సొంతంగా   అనేక సిద్ధాంతాలను అభివృద్ధి చేశాడు. 1904లో మాధ్యమిక పాఠశాలను పూర్తి చేసిన తర్వాత, రామానుజన్ కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదవడానికి స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించాడు.  కాని అతను ఇతర సబ్జెక్టులలో రాణించలేకపోవడం వల్ల స్కాలర్షిప్ కోల్పోయాడు.  14 సంవత్సరాల వయస్సులో రామానుజన్ ఇంటి నుండి పారిపోయాడు. ఆయన  మద్రాసుకు చేరుకుని, మద్రాసులోని  పచ్చయ్యప్ప కాలేజీలో చేరాడు.  అక్కడ  కూడా ఇతర సబ్జెక్టులలో కాకుండా  గణితంలో మాత్రమే రాణించాడు. తన చదువును  ఫెలో ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పూర్తి చేయలేకపోయాడు. దీంతో ఆయన అధికారిక చదువు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే  భయంకరమైన పేదరికంలో ఉన్న శ్రీనివాస  రామానుజన్  గణితంలో తనకున్న అభిరుచి కారణంగా  స్వతంత్ర పరిశోధనను కొనసాగించారు. తన పరిశోధనల ఫలితంగా తొందరలోనే  వర్ధమాన గణిత శాస్త్రజ్ఞుడిగా  చెన్నైలోని గణిత శాస్త్ర వర్గాల్లో ఒకరిగా  గుర్తించబడ్డాడు. 1912లో  ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు  అయిన రామస్వామి అయ్యర్  శ్రీనివాస రామానుజన్ కు  మద్రాసు పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్క్ ఉద్యోగం రావడంలో   సహాయం చేశాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు గణిత శాస్త్రానికి చెందిన తన పరిశోధన ఫలితాలను   బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞులకు పంపేవాడు.  1913లో కేంబ్రిడ్జ్‌కు చెందిన GH హార్డీ రామానుజన్ సిద్ధాంతాలకు ముగ్ధుడై అతనిని లండన్‌కు పిలిపించాడు. అప్పుడే శ్రీనివాస రామానుజన్ జీవితంలోనూ,  శాస్త్రవేత్తగానూ  పురోగతిని అందుకున్నాడు. రామానుజన్ 1914లో బ్రిటన్‌కు వెళ్లాడు. అక్కడ హార్డీ అతన్ని కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చేర్చాడు. 1917లో రామానుజన్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి సభ్యునిగా ఎన్నికైన తర్వాత విజయపథంలో దూసుకెళ్లాడు.   1918లో రాయల్ సొసైటీకి ఫెలో అయ్యాడు. ఇలా  రాయల్ సొసైటీలో గౌరవనీయమైన స్థానాన్ని సాధించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు. తన పరిశోధనలు, తన జీవితం అభివృద్ది చెందుతున్న సమయంలోనే  రామానుజన్ 1919లో బ్రిటన్‌లో ఆహారాన్ని అలవాటు చేసుకోలేక భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది.  1920లో 32 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అయినప్పటికీ, గణిత శాస్త్ర రంగంలో ఆయన విజయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవించబడుతున్నాయి.  1729 సంఖ్య ప్రత్యేకత కావచ్చు, మ్యాక్స్- తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు కావచ్చు, నంబర్ థియరీ పరిశోధనలు కావచ్చు.. ప్రతి ఒక్కటీ ప్రపంచానికి విస్మయాన్ని కలిగించాయి. ఎంతో టెక్నాలజీ అభివృద్ది చెందినా ఇప్పటికీ రామానుజన్ సూత్రాలు, ఫలితాలను చూసి విస్మయం చెందాల్సిందే.  రామానుజన్ ప్రచురించని ఫలితాలను కలిగి ఉన్న  మూడు నోట్‌బుక్‌లను విడిచిపెట్టాడు.  గణిత శాస్త్రజ్ఞులు వీటికోసం పని చేస్తూనే ఉన్నారు. రామానుజన్ గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2012లో, అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22ని - రామానుజన్ పుట్టిన రోజును  దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.                                                *నిశ్శబ్ద.

ధనవంతులైనా సరే.. ఈ అలవాట్లు మానకపోతే కటిక  పేదవాడిగా మారిపోతాడట.!

ధనవంతులు, పేదవారు అనే వర్గాలు  ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అలాగే ఈ రోజు ధనవంతుడిగా ఉన్నవాడు రేపు పేదవాడిగా కూడా మారవచ్చు. చిన్న ఉద్యోగాలలో చేరి, వ్యాపారాలు మొదలు పెట్టి ఈ రోజు అపర కుభేరులుగా మారినవారున్నారు. అలాగే ఒకప్పుడు భవంతులలో నివసించి అన్నీ పోగొట్టుకుని పేదలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మనిషి తన దగ్గరున్న డబ్బును నిలుపుకోవడం అనేది అతని వ్యక్తిత్వం, అతని అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం కింది అలవాట్లున్నవారు ఎంత ధనవంతులైనా సరే పేదవాడిగా మారడం ఖాయమంటున్నారు.  అపరిశుభ్రంగా ఉండేవారు.. అపరిశుభ్రంగా మురికి బట్టలతోనూ, ఇల్లంచా అస్తవ్యస్తంగానూ ఉండే వారు ఎప్పటికీ పేదరికంతోనే జీవిస్తారట. దీనికి కారణం డబ్బున్నా బయటకు తీయకపోవడం, దాన్ని అలాగే దాచడం, తనూ సుఖపడక, డబ్బును సరైన అవసరాలకు వినియోగించక పేదవాడిగానే ఉండిపోవడం. చెడుగా మాట్లాడేవారు మాటతీరు మంచిగా లేని వ్యక్తులు ఎప్పటికీ డబ్బును  నిలుపుకోలేరు. అబద్దాలు చెప్పడం, చెడుగా మాట్లాడటం చేస్తుంటే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఎప్పటికి మెరుగుపడదు. లక్ష్మీదేవి కూడా ఇలాంటి వ్యక్తుల వద్ద ఉండటానికి ఇష్టపడదట. సూర్యాస్తమయం తరువాత నిద్రపోవడం చాలామంది సాయంత్రం సూర్యుడు అస్తమించగానే నిద్రపోతుంటారు. అయితే ఈ సమయాన్ని లక్ష్మీదేవికి పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని అంటారు. సోమరితనం సోమరితనం ఉన్నవారు ఏ పనులను సరిగా చేయరు. పనులను వాయిదా వేడయం, ఏవో ఒక సాకులు చెప్పడం,  తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎదగలేరు. తమ దగ్గరున్న డబ్బును మెల్లిగా కరిగించి చివరికి పేదవాడిగా మారిపోతాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది అని డాంబికాలు పలికేది ఇలాంటి వారే. ఇలాంటి వారు తమ ముందు తరాలను పేదరికంలోకి చాలా సులువుగా నెట్టేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త లేకుంటే.. డబ్బు సంపాదించడం  ఒక కళ. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనేది కూడా కళే. ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపుకు కొంత కేటాయించడం, ఎమర్జెన్సీ ఫండ్స్ అరెంజ్ చేసుకోవడం వంటి మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ లేకుండా పేదవాడిగానే ఉండిపోతాడు.                                        *నిశ్శబ్ద.  

పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారా? సద్గురు ఏం చెప్పారో తెలుసుకోండి.!

పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ.  ఒకప్పుడు అమ్మాయిలకు, అబ్బాయిలకు 20ఏళ్ళలోపే పెళ్లి చేసేవారు.. ఆ తరువాత కాలంతో పాటు మార్పులు వచ్చాయి. నిర్ణీత పెళ్లి వయసులో మార్పులు వచ్చాయి. అయితే అమ్మాయిలు కూడా  చదువు, ఉద్యోగం  సెటిల్మెంట్ మొదలైన విషయాల గురించి ఆలోచిస్తూ పెళ్లికి అంత తొందరగా సిద్దం కావడం లేదు. అబ్బాయిలు కూడా చాలానే గోల్స్ పెట్టుకుంటున్నారు. ఈ కారణంగా పెళ్లి విషయంలో  జాప్యం    జరుగుతూ వస్తోంది. చదువులు, ఉద్యోగం ఇతర విషయాలలో సెటిల్ అయ్యాక చాలామంది ఇక పెళ్లి అవసరమా అని  అంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు సమాజం మాత్రం వదిలిపెట్టదదు. పెళ్లి గురించి బోలెడు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. అందుకే కొందరు ఏదో ఒకటి అని పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ గారు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే విషయం గురించి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఆయనేం చెప్పారో తెలుసుకుంటే.. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. వివాహం కేవలం ఒక సంస్థ.  దానిని విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి అనేది సమాజం పెట్టిన లేబుల్ మాత్రమే. కానీ  పెళ్లి అవసరం లేనప్పుడు కూడా   చేసుకుంటే అది నేరమవుతుంది.  ఎందుకంటే మీరు మీ జీవితంలో పెళ్లి చేసుకుని  మరొకరిని బాధపెడతారు. పెళ్ళి చేసుకోవాలి అని అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పెళ్లి చేసుకోవడం వెనుక  అవసరాలను అర్థం చేసుకోవాలి.  అవసరాలు చాలా బలంగా ఉంటే నిజంగానే  వివాహం చేసుకోవాలి. అదే  అవసరాలను నియంత్రించగలిగితే, పెళ్లి ఆలోచనను వదులుకోవాలి. ఎందుకంటే సంతోషంగా లేని వివాహం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటమే మేలు. సమాజం చెప్పే మాటల వల్లనో, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనో పెళ్లి చేసుకోకూడదు. ఎంపిక.. పెళ్లి అంటే  జీవిత భాగస్వామి మద్దతు పొందడం అనడంలో సందేహం లేదు. నేటి కాలంలో, ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామితో తన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. గౌరవించడమే కాకుండా  అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వివాహం అనేది జీవితకాల ప్రయాణం. అందుకే మద్దతు తెలిపే భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యం. శారీరక అవసరాలకు వివాహం అవసరం మన సమాజంలో స్త్రీ పురుషులు వివాహానంతరం ఒకరికొకరు దగ్గరవ్వడం సరైనది,   సముచితమైనదిగా పరిగణించబడుతుంది. లైంగిక సాన్నిహిత్యం కోసం  వివాహం అవసరమని ప్రజలు భావించడానికి ఇది కూడా ఒక కారణం. అయితే, వివాహం  స్వంత అవసరాలకు అనుగుణంగా ఉండాలి.  అవసరాలు భౌతికంగా,  మానసికంగా ఉండవచ్చు. అయితే  సామాజిక లేదా ఆర్థిక కారణాల కోసం మాత్రమే వివాహం చేసుకోకూడదు. ఫర్పెక్ట్ మ్యాచ్ కోసం చూస్తున్నారా? ఈ రోజుల్లో జీవిత భాగస్వామికి సంబంధించి ప్రజల ఉద్దేశాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇలాంటి  పరిస్థితిలో  ఆదర్శవంతమైన పురుషుడు లేదా స్త్రీ కోసం వెతకకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు.  భాగస్వామి అవసరమని భావిస్తే,  కావలసినది  అందించే   వ్యక్తిని ఎంచుకోవాలి. మీరిద్దరూ ఒకరినొకరు అంగీకరించవచ్చు. ప్రేమించవచ్చు. ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. ఒకరితో ఒకరు నడవగలరు కూడా.                                                 *నిశ్శబ్ద.

ఆలోచనా మార్పులు సబబేనా??

మనిషి జీవితం ఒక నది లాంటిది. నది ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా దారి సహకరించకపోతే అది తన దారి మార్చుకుని ప్రయాణం చేస్తుంది. అలాగే మనిషి కూడా తన దారి మార్చుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ దారి మారడాన్ని ఆలోచనల్లో మార్పుగా కూడా చెప్పవచ్చు. అయితే చాలామంది ఇలా ఆలోచనలు మారిపోవడం గూర్చి మాట్లాడుతూ అలా ఎలా మారిపోతారు మనుషులు అని అంటూ ఉంటారు. ఇలా ఆలోచనలు మార్చుకోవడం, వాటి ద్వారా జీవితంలోనూ మార్పు చోటుచేసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న వేసుకుంటూ ఎంతో మంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కూడా. మరి ఆలోచనల మార్పు సబబేనా?? ఆలోచనా…. మూలం!! ప్రతి ఆలోచన వెనుక కొన్ని పరిస్థితుల ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాలే మనిషి మార్పుకు కారణం అవుతాయి. అలా మార్పులు జరుగుతూ ఉన్నపుడు జీవితము మార్పుకు లోనవుతుంది. కానీ మనుషులు అనేస్తారు ఎలా మారిపోతారు వీళ్ళు అని. అందరికీ మార్పు ఉండకూడదు, ఎప్పుడూ తమనే అంటిపెట్టుకుని ఉండాలనే ఆలోచన ఉండటం సహజమే కానీ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వాస్తవ జీవితంలో  ఎదురవుతున్న ఎన్నో సందర్భాలను డీల్ చెయ్యాలి అంటే ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా కలిగే మార్పులు ఎంతో అవసరం అని అనిపిస్తుంది.  వాస్తవాలు…. విస్తారాలు!! పైన చెప్పుకున్నట్టు వాస్తవ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సందర్భాలను డీల్ చేయాలంటే మనిషి ఒకే చోట ఆగిపోకూడదు. గడియారంలో ముల్లు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే మనిషి జీవితంలో ముందుకు పోతూనే ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ తెలియని ఒక అమాయక జీవిగా, ఎన్నో అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిగా మిగిలిపోతారు.  అందుకనే వాస్తవ జీవితంలో మనిషి ఏదో ఒకరకంగా ఎదగాలి అంటే ఆలోచనాపరమైన మార్పులు తప్పనిసరి అనిపిస్తుంది. అంగీకారం…. అవసరం!! జీవితంలో ఎదురయ్యే మార్పులను అంగీకరించగలిగితే చాలా వరకు జీవితం ఎంతో ఆహ్లాదంగానే ఉంటుంది. ఈ అంగీకరించడం అనేది పూర్తిగా మనసుపై ఆధారపడినప్పటికి అది పూర్తిగా భౌతిక పరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తల్లి బిడ్డను కన్నప్పుడు మూరెడు కూడా ఉండడు, తరువాత శారీరకంగా ఎదుగుతూ అయిదు నుండి ఆరడుగుల(కొందరు ఇంకా ఎక్కువ, తక్కువ ఎత్తు ఉంటారనుకోండి) ఎత్తయ్యి, చివరికి వివాహ బంధం ద్వారా మరొక వ్యక్తికి జీవిత భాగస్వామి అవుతారు. ఎంతో మార్పుకు లోనైన మనిషి ప్రయాణం ఎన్నో సంఘటనలతో  నిండిపోయి ఉంటుంది. ఆ సంఘటనలలో ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించామా?? ఈ ప్రశ్న వేసుకుంటే సంఘటనను బట్టి ఆలోచన, ఆలోచనను బట్టి నిర్ణయాలు, నిర్ణయాలను బట్టి మార్పులు, మార్పులను బట్టి భౌతిక జీవితంలో తగ్గే అలజడులు అన్నీ ఒక సైకిల్ లాగా ఉంటాయి. అంతేకానీ ఏ సమస్య వచ్చినా ఒకే నిర్ణయం తీసుకోరు కదా!! ఆ విషయాన్ని గ్రహించగిలితే సంఘటనలను బట్టి, అప్పటి అవసరాలను బట్టి మనిషి ఆలోచనా పరమైన మార్పు చేయడం నేరమేమి కాదు.  దృష్టి కోణం!! చూసే విధానంలోనే అంతా ఉందని అందరూ అంటుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. మన ఆత్మీయులకో, స్నేహితులకో ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు వాస్తవంగా ఆలోచించమని, నిజాన్ని గ్రహించమని, పరిస్థితులను అంగీకరించమని చెబుతుంటాము. అయితే అలా చెప్పినవాళ్ళు అలాంటి పరిస్థితులు ఏవైనా తమకు ఎదురైతే మాత్రం వాటిని అంత సులువుగా ఎదుర్కోలేరు. కాబట్టి దృష్టి కోణం మాత్రమే కాదు, ఒకానొక స్పోర్టివ్ నెస్ మనిషి జీవితంలో ఉండాలి. అలా ఉంటే అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఎదుటివారు మూవ్ అయిపోవడాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు కూడా. కాబట్టి ఆలోచనా పరమైన మార్పులు సబబేనా అంటే సబబే అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. కొన్ని నిజాలు నచ్చకపోవచ్చు కానీ ఎ ఏమి చేస్తాం అబద్ధంతో బతికితే అవి భరించరాని బాధల కోటల్ని కట్టేస్తాయి.                                                                                                                 ◆ వెంకటేష్ పువ్వాడ.